#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #BRS party 📣 రావల్కోల్ భూముల్లో 5 వేల కోట్ల బిగ్ దందా❗🚨 పచ్చిక బయళ్లలో కాంగ్రెస్ 'పెద్దల' మేత 🤑
💰 నంబర్-2 మంత్రి పేషీ కేంద్రంగా సాగిన భారీ భూస్కామ్
📢 తెరవెనుక 'ముఖ్యనేత' బంధువులు, ఇద్దరు మంత్రులు
⛔ 1954-55 ఖాస్రా పహాణీలో పచ్చిక బయళ్లుగా నమోదు. ఉమ్మడి రాష్ట్రంలో భూములకు ఓఆర్సీలు.. 2003లో రద్దు
♦️ సాగుకు అనువుగాలేని కంచ- గ్రేజింగ్ ల్యాండ్స్ గా నిర్ధారణ
⚠️ భూముల క్లియరెన్స్ కోసమే 'ప్రత్యేకం'గా ఆర్డీవోకు పోస్టింగ్
👨🏻⚖️ హైకోర్టు, 2003 ఉత్తర్వులను వక్రీకరించి ఇనామ్ దారులకు ఓఆర్పీలు
ప్రభుత్వ భూమి ఎక్కడున్నా రాబందుల్లా వాలిపోయి గుటుక్కున మింగడం కాంగ్రెస్ పెద్దలకు అలవాటుగా మారిపోయింది. కేసీఆర్ గారు తన హయాంలో న్యాయ వివాదాల్లో ఉన్న రూ.లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల భూముల్ని కాపాడి ప్రభుత్వ భూ బ్యాంక్లో జమ చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపి సర్కారు భూ బ్యాంక్కు కన్నం వేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న వివాదాలను అడ్డుపెట్టుకొని.. నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి, పక్కా ప్లాన్ ప్రకారం, ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో ప్రజల ఆస్తులను కొట్టేస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాలకు సంబంధించి దశాబ్దాలుగా వివాదం కొనసాగుతున్నది. గతంలో రెవెన్యూ అధికారులు ఆ భూములు ప్రభుత్వానికే చెందినవంటూ పోరాడారు. కేసీఆర్ హయాంలోనూ ఆ భూములు ప్రభుత్వానివేనని కాపాడగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొందరు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యనేత బంధువులు కలిసి వాటిని కాజేసేందుకు ప్లాన్ వేశారు. ఉద్యోగ విరమణకు మూడురోజుల ముందే ఒక ఆర్డీవో ద్వారా ప్రొసీడింగ్స్ ఇప్పించి, భూములు కాజేసారు. 275.23 ఎకరాల్లో ప్రభుత్వ పెద్దలు తలా 50 ఎకరాల చొప్పున పంచుకున్నరు. ఇక్కడ ఎకరా విలువ రూ.20 కోట్ల వరకు పలుకుతుండగా ఒక్కో సర్కార్ పెద్దకు రూ.1000 కోట్ల విలువైన భూములు వాటాగా వచ్చాయి.


