#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు #కాళేశ్వరం 📢 కాళేశ్వరంపై కాంగ్రెస్ నిందలు నీళ్లపాలు ✅
🎯 కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనడం అంతా కపట నాటకం
📌 ఇది రేవంత్ రెడ్డి సర్కారే తేల్చిచెప్పిన సత్యం
📣 ఒకవైపు ప్రాజెక్టు కాంపోనెంట్లన్నీ వినియోగం
🔸 బరాజ్ ల పునరుద్ధరణకు దిగడమే నిదర్శనం
👨🏻⚖️ హైకోర్టు తాజా తీర్పు అందుకు మరో సాక్ష్యం
తరతరాల తెలంగాణ రైతుల కరువుకాటకాల తలరాత మార్చేందుకు, చెక్కుచెదరని జలసంకల్ప దీక్షతో పనులను ఉరకలెత్తించి, చరిత్ర ఎరుగని అసాధారణ కాల పరిమితిలో ఆగమేఘాల మీద ఒక ప్రాజెక్టు కడితే; అందులో అవినీతి జరిగిందని నిందలు వేశారు. భారీ జలప్రవాహ వేగంలో ఒక బ్యారేజిలోని రెండు పిల్లర్లు కుంగిపోతే.. ప్రాజెక్టే కూలిపోయిందని గావుకేకలు పెట్టారు. 83వేల కోట్లు ఖర్చయిన ప్రాజెక్టును పట్టుకొని లక్షకోట్ల అవినీతి జరిగిందని కాకిగోల చేశారు. కండ్లముందు కాళేశ్వరం నీళ్లు పారుతుంటే గుండెలు జారి, నిద్రలు కరువై రాజకీయంగా పుట్టగతులుండవనే భయంతో కాంగ్రేస్, బీజేపీతో పాటు తెలిసినోడు, తెలువనోడు.. ఎవడి నోటికి వచ్చిన.. ఎవడి బుర్రకు తోచిన అడ్డగోలు ఆరోపణలన్నీ గుప్పించారు.
ప్రాజెక్టే పనికిరాదు అన్న నోళ్లే ఇప్పుడు పునరుద్ధరణ మాటలు మాట్లాడడంతో ఆ ఆరోపణలు బూటకమని తేలిపోయింది. ఇక తాజాగా హైకోర్టు తీర్పుతో లక్షకోట్ల అవినీతి అన్న ఆరోపణలు గాల్లో కలిసిపోయాయి. దీనికితోడు ‘ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు. మూడు బ్యారేజీలు పనికిరావు’ అన్న నోళ్లే ఇప్పుడు తమ్మిడిహట్టి నీళ్లు సుందిళ్ల బ్యారేజ్లో పోస్తామంటూ చెప్పడంతో కాంగ్రెస్ నేతలు, వారి తోడు దొంగలు బీజేపీ నాయకులు చేసిన ప్రచారమంతా బూటకమని, దురుద్దేశపూర్వకమని తేలిపోయింది.
#KaleshwaramProject


