13-04-2026
గోకవరం మండలం, కొత్తపల్లి గ్రామం
నవ భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గోకవరం మండలం, కొత్తపల్లి గ్రామంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హల్ నందు
మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది...
ఈ సందర్భంగా మన బాధ్యత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ,
ఫౌండేషన్ ద్వారా అన్ని ప్రాంతాల్లో నిరంతరం సేవా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం అని, ఈ రోజూ పోతల విజయ్ గారి సారథ్యంలో,
కొత్తపల్లి అంబేద్కర్ యూత్ సహకారంతో, రాజమండ్రి సంజీవని బ్లడ్ సెంటర్ ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం అన్నారు.
పోతల విజయ్ గారు మాట్లాడుతూ, రక్త కొరత తీవ్రంగా ఉన్న సమయంలో అందరికీ స్ఫూర్తిని ఇచ్చేలా అంబేద్కర్ జయంతి నాడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది అన్నారు. రక్తదాతలను అభినంధించి,సర్టిఫికెట్స్ అందించారు...
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి అంబేద్కర్ యూత్ సభ్యులు శ్రీనివాస్ కళ్యాణ్ గారు , కార్తీక్ గారు, పండు గారు, సూరిబాబు గారు, సంజీవని బ్లడ్ బ్యాంక్ మేనేజర్ ప్రకాష్ గారు, సిబ్బంది మేఘన గారు, పాల్ గారు తదితరులు పాల్గొన్నారు... #MBFSummerBloodDrive-2026