#డిప్యూటీ_సీఎం_పవన్_కళ్యాణ్_గారిని_కలిసిన_గిద్దలూరు_ఎమ్మెల్యే_ముత్తుముల
#అమరావతి: #వెలగపూడి సచివాలయం లో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు ఏపీ డిప్యూటీ సీఎం Pawan Kalyan గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఛాంబర్లో కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. ముఖ్యంగా రేపు వచ్చే #శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయాలకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వస్తున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తకుండా గిద్దలూరు నియోజకవర్గనికి నిధులు కేటాయించి, ట్యాంకర్ల ద్వారా అవసరమైన ప్రదేశాలలో నీటిని తరలించి ప్రజలకు అందించేందుకు నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం గారికి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం నియోజకవర్గ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి తెలిపారు.
#IdhiManchiPrabhutvam
#NaraChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #NDAGovernment #NDAkutami #GiddalurMLA #MuthumulaAshokReddy
#మనగిద్దలూరుమనముత్తుముల
#🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
ప్రజలకు అవగాహన కోసం మాత్రమే ఇది...
ఆరోగ్య శ్రీ లో అవ్వని కొన్ని సర్జరీ ల కోసం ప్రభుత్వం ఇచ్చే #LOC (Letter of Commitment) ఒక వరంలా పనిచేస్తుంది.
దీని గురించి పూర్తి అవగాహన కోసం ఈ క్రింది విషయాలు తెలుసుకోండి:
❓ LOC అంటే ఏమిటి?
LOC అంటే ఒక రకమైన హామీ పత్రం. "ఫలానా రోగికి అయ్యే చికిత్స ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది" అని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఆసుపత్రికి ఇచ్చే నమ్మక పత్రం. ఇది ఉంటే రూపాయి ఖర్చు లేకుండా ఆసుపత్రి వారు సర్జరీ చేస్తారు. కొన్ని చోట్ల కొద్దిగా రిమైనింగ్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది
📋 స్టెప్ 1: ఆసుపత్రి నుండి ఎస్టిమేషన్ లెటర్ (Estimation Letter)
ముందుగా రోగిని ప్రభుత్వం గుర్తించిన (Empaneled) నెట్వర్క్ ఆసుపత్రిలో చేర్పించాలి.
వైద్యులు పరీక్షించి, సర్జరీ అవసరమని నిర్ధారించాక, దానికి ఎంత ఖర్చవుతుందో వివరిస్తూ ఒక ఎస్టిమేషన్ లెటర్ (దీనినే చాలామంది LOC లెటర్ అంటారు) ఇస్తారు.
🏛️ స్టెప్ 2: ఎమ్మెల్యే (MLA) గారి సిఫార్సు
ఆసుపత్రి ఇచ్చిన ఎస్టిమేషన్ లెటర్తో పాటు రోగి యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ (బియ్యం కార్డు) ఫోటోకాపీలను తీసుకుని మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లాలి.
అక్కడ ఎమ్మెల్యే గారి చేత సిఫార్సు లేఖ (Recommendation Letter) తీసుకోవాలి.
🖥️ స్టెప్ 3: సీఎం ఆఫీస్ నుండి కమిట్మెంట్ లెటర్
ఈ పత్రాలన్నింటినీ ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఆన్లైన్లో సీఎం రిలీఫ్ ఫండ్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు లేదా మీరు నేరుగా సచివాలయంలో అందజేయవచ్చు.
వివరాలను పరిశీలించాక, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆసుపత్రికి నేరుగా LOC (కమిట్మెంట్ లెటర్) అందుతుంది.
💉 స్టెప్ 4: సర్జరీ ప్రారంభం
ఆసుపత్రికి ఈ లెటర్ అందగానే, వారు రోగికి అవసరమైన ఆపరేషన్ లేదా చికిత్సను ప్రారంభిస్తారు. దీని కోసం మీరు ఆసుపత్రికి నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని చోట్ల కొంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది
💡 గమనిక: అత్యవసర సమయాల్లో ఈ ప్రక్రియ వేగంగా జరిగేలా స్థానిక ప్రజాప్రతినిధులు సహకరిస్తారు.
ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. ఎవరికైనా ఆపద సమయంలో ఇది ప్రాణాలను కాపాడవచ్చు. 🤝
ఇంకా ఏమైనా డౌట్ లు ఉంటే సంబందించినన హాస్పిటల్లో, లేదా స్థానిక #MLA కార్యాలయంలో తెలుసుకోవచ్చు...
#CMRF #AndhraPradesh #HealthCare #LOC #PublicAwareness #SocialService
#IdhiManchiPrabhutvam
#✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
బిగ్ టీవీ న్యూస్ ఛానల్ చైర్మన్ వెన్నం విజయ్ రెడ్డి తండ్రి వెన్నం రాఘవేంద్ర రెడ్డి గారి మృతి బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు... #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
ముస్లిం ఉద్యోగులకు తీపికబురు అందించిన కూటమి సర్కారు
#ChandrababuNaidu
#✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు
#కాశిరెడ్డికుంటకు_మహర్దశ
» అభివృద్ధికి రూ. #2కోట్లు మంజూరు
» మరో రూ.#2కోట్లకు ప్రతిపాదనలు
» ఫలిస్తున్న ఎమ్మెల్యే Muthumula AshokReddy గారి కృషి
వైసీపీ ప్రభుత్వంలో తూతూమంత్రంగా జరిగిన కట్ట పనులు
గత ప్రభుత్వంలో నిరుపయోగంగా ఉన్న ఎక్సర్సైజ్ యంత్రాలు
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని #నరవ రోడ్డు లోని కాశిరెడ్డికుంటకు మహర్ణవ పట్టింది. కుంటను అభివృద్ధి చేసి కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు, చిన్నపిల్లల పార్కు కుంట కట్టపై ఏర్పాటు చేసేందుకు పూడికతీత పనులు, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు బీపీఎస్, ఎస్ఆర్ ఎస్ నిధుల నుంచి రూ.2కోట్లు మంజూరు చేయించారు. ఈ మొత్తం కుంట అభివృద్ధికి సరిపోదని ఇంజనీరింగ్ అధికారులు చెప్పడంతో మరో రూ.2కోట్ల నిధులు మంజూరుకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదనంగా కావలసిన రూ.2కోట్ల నిధులకు సంబందించి పనుల ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. ఈలోగా మంజూరైన నిధులకు సంబంధించి ముందుగా ఏఏ పనులు చేయాలి అనే విషయంపై ఇంజనీరింగ్ అధికారులు డీపీఆర్ ను తయారు చేస్తున్నారు. డీపీఆర్ చివరి దశలో ఉండగా ఇది పూర్తయితే అంచనాల ఆమోదం తీసుకుని టెండర్కు వెళ్తుంది. ఈలోగా రెండోసారి పంపించిన రూ.2కోట్ల ప్రతిపాదనలకు కూడా నిధులు మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం రూ.4కోట్లు మంజూరైతే ఇప్పటికే పూడిపోయి ఉన్న కాశిరెడ్డికుంటలో నీటిని మొత్తం తోడివేసి పూర్తిగా పూడికతీత పనులు చేపట్టి కుంట చుట్లూ వాకింగ్ ట్రాక్, ఒక వైపు చిన్నపిల్లల పార్కు, ట్రాక్పై చెట్ల పెంపకం, బెంచీల ఏర్పాటు, ఎక్సర్సైజ్ చేసుకునే పరికరాల ఏర్పాటు చేస్తారు. కుంట చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించి వాకింగ్ ట్రాక్కు ఇ బ్బంది లేకుండా చేస్తారు. గిద్దలూరు పట్టణంలో ఇప్పటివరకు ఎక్కడా వాకింగ్ ట్రాక్ లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్ల మార్జిన్లలో వాకింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ పనులు కార్యరూపం దాల్చితే పట్టణవాసులకు మంచి వాకింగ్ ట్రాక్ అందుబా టులోకి రానున్నది. కాశిరెడ్డికుంట అభివృద్ధిపై ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వ హించి నిధుల మంజూరుపై ప్రత్యేకంగా శ్రద్ధచూపుతున్నారు.
#తూతూ_మంత్రంగా_పనులు
గత వైసీపీ పాలనలో కాశిరెడ్డికుంట అభివృద్ధికి స్వచ్ఛ ఆంధ్ర పథకం కింద కొంతమేర నిధులు మంజూరయ్యాయి. అప్పటి కాంట్రా క్టర్ తూతూ మంత్రంగా కొద్దిమేర పనులు చేసి అర్ధాంతరంగా పనులను నిలిపివేశారు. కొన్ని జిమ్ పరికరాలను పనులు పూర్తికాక ముం దే కుంటపై ఏర్పాటు చేయగా అవి నిరుపయోగంగా ఉన్నాయి. కుంట స్థలం ఆక్రమణలకు గురికాకుండా కాంపౌండ్వాల్ను నిర్మించడం కొం తలోకొంత మేలు చేసింది. చేసిన పనులు కూడా నాసిరకంగా ఉండ దంతో పలువురు ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ అధికారులు పను లను తనిఖీ చేశారు. మొత్తం మీద పనులన్నీ ఆగిపోవడంతో ప్రజాప్ర భుత్వం అధికారంలోకి రాగానే కుంట అభివృద్ధిపై ఎమ్మెల్యే #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇప్పటికే రూ.2కోట్లు మంజూరు చేయించి మరో రూ.2కోట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తు న్నారు. కుంట నీటి మధ్యలో జాతీయ పతాకాన్ని రెపరెప లాడించేం దుకు వీలుగా ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తున్నారు. మొత్తమ్మీద కాశిరెడ్డి కుంటకు మహర్దశ పట్టనున్నది. ఈ విషయమై మున్సిపల్ కమిష సర్ రమణబాబును వివరణ కోరగా.. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కృషి ఫలితంగా రూ.2కోట్ల నిధులు మంజూరు కాగా డీపీఆర్ ను సిద్ధం చేస్తున్నామని, అది పూర్తికాగానే అంచనాలను ఆమోదించి టెండర్ పిలుస్తామని, మరో 3 నెలల్లో పనులు మొదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరో రూ.2కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, అవి కూడా మంజూరైతే పూర్తి స్థాయిలో కాశిరెడ్డికుంట అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
#NaraChandrababuNaidu #NaraLokesh
#MuthumulaAshokReddy #GiddalurMLA
#IdhiManchiPrabhutvam #NDAGovernment #GiddalurTelugudesamparty #NDAkutami
#మనగిద్దలూరుమనముత్తుముల
#ThankYouCMsir
#ThankyouMlaMuthumulaAshokReddySir
#జైతెలుగుదేశం #జైముత్తుముల #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
అసెంబ్లీ కమిటీ హాలులో నిర్వహించిన ఎన్డీఏ పక్షాల శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యుల సమావేశంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు హాజరయ్యారు.
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh
#✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు. సభకు హాజరైన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు.
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh
#GiddalurMLA
#GiddalurTelugudesamparty
#📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు శ్రీశైలంలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు టీడీపీ నాయకులు గౌ శ్రీ Krishna Kishore Muthumula గారిని శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబెర్ శ్రీమతి బోనేని రవణమ్మ గారు వారి భర్త కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ బోనేని వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సన్మానించి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు... #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించిన బోర్డు మెంబెర్ రవణమ్మ
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు శ్రీశైలంలో నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారిని శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబెర్ బోనేని రవణమ్మ గారు వారి భర్త కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సన్మానించి, బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యతను వివరిస్తూ, కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆశీర్వచనాలు అందించాలని కోరారు.ఎమ్మెల్యే గారు ఆహ్వానాన్ని స్వీకరించి, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో తప్పక పాల్గొని భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొంటానని తెలిపారు.
మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం దేవస్థానం వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండనుందని, అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు సూచించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియచేయాలని ఎమ్మెల్యే గారు రవణమ్మ గారికి తెలిపారు.
ఈకార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు... #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు
#రూపు_మారనున్న_మున్సిపల్_కార్యాలయం
మొదటి 3 ఫ్లోర్లు కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్
పై రెండు అంతస్తుల్లో ఆఫీస్ ఏర్పాటు
ఎమ్మెల్యే #ముత్తుముల అదేశాలతో 3కోట్లతో అనుమతుల కోసం ప్రతిపాదనలు
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణం నడిబొడ్డున ఉన్న మున్సిపల్ కార్యాలయం స్థానంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. మొదటి 3 అంతస్తుల్లో షాపింగ్ కాంప్లెక్స్. పై రెండు అంతస్తులలో మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మిస్తారు. ఇందుకు అవసరమయ్యే నిధుల మంజూరు కోసం Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు రాష్ట్ర ప్రభుత్వంలోని మున్సిపల్ శాఖ ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారు. పట్టణంలోని వీధులన్నీ చిన్నవిగా ఉండడంతో చిరువ్యాపారులు రోడ్లపైనే వ్యాపారాలు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దానికితోడు ఒక మాదిరి వ్యాపారం చేయాలన్నా గదుల కొరత వేదిస్తున్నది. వీటన్నింటికీ పరిష్కారం కోసం ఎమ్మెల్యే #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణ నడిబొడ్డున ఉన్న మున్సిపల్ కార్యాలయం ఇరుకుగా ఉండడంతో కొత్త భవన నిర్మాణానికి రూ.#3కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కార్యాలయ ప్రాంగణం, చుట్టూ ఉన్న స్థలం సుమారు 56 సెంట్లు ఉండగా పక్కనే ఉన్న కూరగాయల మార్కెట్ స్థలం కూడా మున్సిపాలిటీదే. అదీ ఇదీ కలుపుకుంటే సుమారు 65 సెంట్లు వస్తుంది. కార్యాలయ భవనం, చుట్టూ ఖాళీ స్థలంలో 5 అంతస్తుల భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి అందులో మొదటి 3 అంతస్తులు వ్యాపారుల కోసం, పైన ఉన్న 2 అంతస్తులు మున్సిపల్ కార్యాలయం కోసం వినియోగించే విధంగా తాత్కాలిక ప్లాన్ను రూపొందించారు. వ్యాపారులకు ఒక లిఫ్ట్, కార్యాలయానికి వెళ్లే ఉద్యోగులు, ప్రజల కోసం మరో లిప్ట్ను ఏర్పాటు చేస్తే ప్రతినెలా అద్దెల రూపంలో మున్సిపాలిటీకి లక్షల రూపాయల ఆదాయం లభిస్తుంది. దానికితోడు వందలాది మంది చిరు, మధ్యతరగతి వ్యాపారులకు తక్కువ అద్దెతో వ్యాపారాలు చేసుకునే వెసలుబాటు కూడా కలుగుతుంది. ఈప్రాంతం పట్టణ నడిబొడ్డున ఉండడంతో వ్యాపారాలకు కూడా డోకా ఉండదు. పీపీపీ పద్ధతిలో షాపింగ్ కాంప్లెక్స్, కార్యాలయ భవనం నిర్మిస్తే నిర్మాణ వ్యయానికి ప్రభుత్వంపై కూడా పెద్దగా భారం ఉండదు. బ్యాంకర్ల నుంచి సులభంగా రుణం పొందే అవకాశం ఉంటుంది. మున్సిపల్ అధికారులు ఆమేరకు ప్రాథమిక అంచనాలతో ప్రభుత్వానికి నివేదిక పంపగా వీటి మంజూరు కోసం స్థానిక ఎమ్మెల్యే #MuthumulaAshokReddy గారు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. కార్యరూపం దాల్చితే వందలాది మంది వ్యాపారులకు తక్కువ అద్దెతో వ్యాపారాలు చేసుకునే అవకాశం కలుగుతుంది. దీనికితోడు స్టేషన్ రోడ్డులో గల పాత మహిళ బ్యాంక్ స్థలంలో కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు నిధుల మంజూరు కోసం కూడా ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. Copy to #AndhraJyothinewspepar
Nara Chandrababu Naidu
Lokesh Nara
Telugu Desam Party (TDP)
#IdhiManchiPrabhutvam
#NDAGovernment
#NDAkutami
#ThankYouCMsir
#ThankyouMlaMuthumulaAshokReddySir
#మగిద్దలూరుమనముత్తుముల
#జైతెలుగుదేశం #జైముత్తుముల #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్













