నైస్... గుడ్... గ్రేట్-రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై గేట్స్ ప్రశంసలు
#బిల్_గేట్స్ అమరావతి పర్యటన హైలైట్స్
• గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటన ఆసక్తికరంగా సాగింది.
• గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ... భవిష్యత్ ప్రణాళికలపై చర్చించకునేలా బిల్ గేట్స్ పర్యటన జరిగింది.
• గేట్స్ పై ఉన్న అపారగౌరవంతో నారా లోకేష్ సహా నలుగురు మంత్రులను గన్నవరం విమానాశ్రయానికి పంపి స్వాగతం పలికారు.
• సచివాలయంలో మొదటి బ్లాకులో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ కు ఆత్మీయ స్వాగతం పలికారు.
• మొదటి బ్లాక్ వద్ద తనకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబును చూడగానే కారు దిగుతూనే హలో ఫ్రెండ్...! హౌ ఆర్ యూ.. అంటూ గేట్స్ ముఖ్యమంత్రిని అప్యాయంగా పలకరించారు.
• ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సహా ఇతర కెబినెట్ మంత్రులను బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు పేరు పేరునా పరిచయం చేశారు.
• బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా తన ఛాంబర్లోకి వచ్చిన బిల్ గేట్స్ కు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నిలువెత్తు చిత్రపటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించారు.
• శ్రీవారి ప్రాసస్త్యాన్ని.. తిరుమల క్షేత్రం గొప్పదనాన్ని బిల్ గేట్స్ కు సీఎం వివరించారు.
• గేట్స్ ఫౌండేషన్ బృందంతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ అనంతరం ఆర్టీజీ సెంటర్ కు గేట్స్ ను తీసుకెళ్లిన ముఖ్యమంత్రి.. ఆ విభాగం పనితీరును వివరించారు.
• పాలనా వ్యవహరాల్లో, విపత్తుల్లో, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విషయంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకుంటున్నామనే అంశాన్ని ఉదాహరణలతో సహా ముఖ్యమంత్రి వివరించారు.
• గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కుప్పంలో చేపట్టిన సంజీవని ప్రాజెక్టు ప్రోగ్రస్ ను ముఖ్యమంత్రి వివరించగా... దట్స్ నైస్ అంటూ మెచ్చుకున్నారు.
• ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగం గురించి గ్రేట్ అంటూ గేట్స్ అభినందించారు.
• డేటా లేక్, వాట్సాప్ గవర్నన్స్ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడాన్ని అభినందించారు.
• వ్యాధి నిర్ధారణ పరీక్షలు తక్కువ ధరకే అందించగలిగితే... పేద వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడిన గేట్స్
• అమరావతి రాజధాని ప్రణాళికలను.. బ్లూ-గ్రీన్ కాన్సెప్టును, అత్యాధునిక పద్దతుల్లో ఫ్యూచర్ సిటీగా నిర్మిస్తున్న విధానాన్ని తెలుసుకున్న బిల్ గేట్స్ గ్రేట్ వర్క్ అంటూ రాజధాని మాస్టర్ ప్లాన్ ను మెచ్చుకున్నారు.
• భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎటువంటి వ్రణాళికలతో రాజధాని నిర్మిస్తున్నామనే విషయాన్ని సీఎం చంద్రబాబు వివరించారు.
• రాజధాని ప్రాంతంలో మొత్తంగా గ్రీన్ ఎనర్జీనే వినియోగించే దిశగా... ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్టు గేట్స్ కు సీఎం చెప్పారు.
• అనంతరం మంత్రులు, సెక్రటరీల సమావేశానికి గేట్స్ ను తీసుకు వచ్చిన చంద్రబాబు... ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలు, లక్ష్యాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
• ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ హైదరాబాద్ కు రావడానికి దారి తీసిన పరిస్థితులపై కొద్దిసేపు చర్చ జరిగింది.
• ముఖ్యమంత్రితోపాటు.. గేట్స్ కూడా నాటి ఢిల్లీ సమావేశం... సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు, అమెరికా వెలుపల తొలి డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు కావడం గురించి సమావేశంలో ఉన్న మంత్రులు, సెక్రటరీలకు వివరించారు.
• తొలి మీటింగ్ లోనే చంద్రబాబు విజనరీ ఆలోచనలను తాను గమనించానని బిల్ గేట్స్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
• మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు బిల్ గేట్స్ ను వివిధ అంశాలపై ప్రశ్నల ద్వారా బిల్ గేట్స్ అభిప్రాయాలు తెలుసుకున్నారు.
• అక్కడి నుంచి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన బిల్ గేట్స్ బృందం సాగులో టెక్నాలజీ అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించి... ప్రశంసించారు.
• ప్రకృతి సాగు గురించి రైతులు అధికారులతో చర్చించిన బిల్ గేట్స్... ఆ పంట ఉత్పత్తులను పరిశీలించారు.
• చీడపీడలకు సంబంధించే వివరాలు అందించే AP-AIMS (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం) మొబైల్ యాప్ పనితీరును బిల్ గేట్స్ పరిశీలించారు.
• రైతు ఫోన్ ద్వారా ఈ యాప్ ను ఉపయోగించి పంటకు వచ్చిన తెగులును గుర్తించడమే కాకుండా... డ్రోన్ ద్వారా మందుల పిచికారి చేసే విధానాన్ని కూడా గేట్స్ పరిశీలించారు.
• వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన బిల్ గేట్స్ కు రైతులు స్థానిక వంటకాలను రుచి చూపించారు. #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు
#శ్రీ_రామలింగేశ్వర_స్వామిని_దర్శించుకున్న_ఎమ్మెల్యేలు
#మార్కాపురంజిల్లా : #అర్థవీడు మండలం #యాచవరం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని #గిద్దలూరు ఎమ్మెల్యే గౌ శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు, #మార్కాపురం ఎమ్మెల్యే గౌ శ్రీ #కందుల_నారాయణరెడ్డి గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, గ్రామ ప్రజలు ఎమ్మెల్యేలను సంప్రదాయబద్ధంగా స్వాగతించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేలు ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని ప్రార్థించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈసందర్బంగా గ్రామస్థులు ఇరువురి ఎమ్మెల్యేలను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు
ఈకార్యక్రమంలో స్థానిక మండల , గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
*ట్రై సైకిల్స్, డస్ట్ బిన్ల పంపిణీ కార్యక్రమానికి పచ్చ జెండా ఊపిన ఎమ్మెల్యే ముత్తుముల*
*మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ మరియు డస్ట్ బిన్ల పంపిణీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొని పచ్చ జెండా ఊపి ట్రై సైకిల్స్ మరియు డస్ట్ బిన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు*.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని తెలిపారు. మన గిద్దలూరు మండలానికి 35 రిక్షాలు, గ్రీన్ అంబాసిడరెస్ అయిన మీరు మీకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రతి ఒక్కరూ 250 గృహాల నుండి చెత్త సేకరించి పరిశుభ్రం గా ఉంచడంలో మీది ముఖ్య పాత్ర పోషిస్తున్నారు కావున గ్రామాలు, పట్టణాలు శుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ట్రై సైకిల్స్, డస్ట్ బిన్ల పంపిణీతో చెత్త సేకరణ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని కూటమి ప్రభుత్వం అభివృద్ధి లో ముందు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.*
*ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, సిబ్బంది మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు* #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ శ్రీ పాతాళ నాగేశ్వరస్వామి దేవాలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన బండలాగుడు పోటీలను గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రారంభించారు ఈసందర్భంగా దేవాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఆలయ కమిటీ సభ్యులు, మండల, పట్టణ నాయకులు భక్తులు ఘన స్వాగతం పలికి శాలువా పూల మాలతో ఘనంగా సన్మానించారు
అనంతరం బండలాగుడు పోటీలను ప్రారంభిస్తూ, గ్రామీణ క్రీడలు మరియు సంప్రదాయాలను పరిరక్షించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు యువత ఇలాంటి సాంప్రదాయ క్రీడల్లో పాల్గొని గ్రామ సంస్కృతిని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.పోటీలు ఉత్సాహభరితంగా సాగుతూ ప్రేక్షకులను అలరించాయి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, మండల , పట్టణ నాయకులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు
రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ గారికి మంత్రులను పరిచయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.
#APWelcomeBillGates
#BillGates
#ChandrababuNaidu
#🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్
అమరావతి పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ ఛైర్మెన్ బిల్ గేట్స్ గారికి స్వాగతం పలికిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్య శాఖ మంత్రి సత్య కుమార్, అధికారులు.
#APWelcomeBillGates
#BillGates
#NaraLokesh
#📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
ధర్మం మంటగలిస్తే... ఆ త్రికూటేశ్వరుడు కన్నెర్ర చేయడా?
ఆధ్యాత్మికతకు నిలువుటద్దం కోటప్పకొండ. ఏటా మహాశివరాత్రి వేళ, లక్షలాది మంది భక్తులు తమ గ్రామాల గౌరవాన్ని 'ప్రభలు'గా మలచి ఆ త్రికూటేశ్వరుని పాదాల చెంతకు చేరుస్తారు. కానీ, ఈ ఏడాది ఆ సంబరాల్లో ఒక విషాద ఛాయ, ఒక భయంకరమైన అపశృతి చోటుచేసుకుంది.
వైకాపా రాజకీయ రంగు పూసుకున్న ఒక భారీ ప్రభ, ధర్మం తప్పిన రీతిలో కుప్పకూలి కాలిబూడిదవ్వడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది.
తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలను గాయపరిచిన సంగతి తెలిసిందే. అయితే, తాజా మీడియా రిపోర్ట్స్ మరియు సిట్ (SIT) విచారణలో బయటపడుతున్న నిజాలు అంతకంటే దారుణంగా ఉన్నాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ నెయ్యి కల్తీ కేవలం తిరుమలకే పరిమితం కాలేదని, శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి పవిత్ర శైవ క్షేత్రాలకు కూడా ఇది విస్తరించిందని సిట్ నిర్ధారించింది.
మే 2022 నుండి మార్చి 2023 వరకు శ్రీశైలం మల్లన్న ఆలయానికి దాదాపు 3.25 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయిందని విచారణలో తేలింది.
శ్రీకాళహస్తి ఆలయంలో కూడా నాణ్యత లేని, రసాయనాలతో కూడిన నెయ్యిని ప్రసాదాల తయారీలో వాడారనే ఆరోపణలు భక్తులను కలవరపెడుతున్నాయి.
నిప్పులు కురిపించిన త్రినేత్రుడు!
కోటప్పకొండలో వైకాపా ప్రభ కుప్పకూలి, అగ్నికి ఆహుతి కావడం కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదని... అది ఆ శివయ్య ఆగ్రహానికి నిదర్శనమని సామాన్య భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు.
"దేవుడి నైవేద్యాన్ని అపవిత్రం చేసి, భక్తుల విశ్వాసంతో ఆడుకున్న వారికి ఆ త్రికూటేశ్వరుడే ఒక హెచ్చరిక పంపుతున్నాడు" అనే చర్చ ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తోంది.
ఎత్తైన ప్రభలు... భక్తుల ఆశలకు, ఆచారాలకు చిహ్నాలు. అటువంటిది, వైకాపా రాజకీయ పార్టీకి చెందిన ప్రభ ఇలా బూడిదవ్వడం వెనుక దైవ నిర్ణయం ఉందనే భావన భక్తుల్లో వ్యక్తమవుతోంది. లడ్డూ ప్రసాదంలో టాయిలెట్ క్లీనర్లలో వాడే రసాయనాలు కలిశాయన్న వార్తలు, సాక్షాత్తు శివుడి క్షేత్రాల్లోనే అపవిత్రత చోటుచేసుకోవడం వల్లే ఆ భోళాశంకరుడు కన్నెర్ర చేశాడని ప్రజలు విశ్వసిస్తున్నారు.
రాజకీయం ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ, దైవ సన్నిధిలో మాత్రం ధర్మమే గెలవాలి. ధర్మాన్ని రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే, ఆ కాలభైరవుడు తన త్రినేత్రాన్ని తెరుస్తాడని చెప్పడానికి కోటప్పకొండ ఘటనే ఒక నిదర్శనం.
భక్తుల కన్నీరు, దైవ ద్రోహం ఎన్నటికీ ఊరికే పోవు. #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు
విద్యారంగం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక కార్యక్రమాలు చేపట్టాం. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఏపీ విద్యార్థులు ఎప్పుడూ ముందుంటారు. ఈ మధ్య క్వాంటమ్ వ్యాలీ కోసం అల్గారిథమ్స్ రాసేందుకు కోర్సులు పెడితే ఇక్కడ ఏపీలో కానీ, అక్కడ చెన్నైలో కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు లక్షల్లో దరఖాస్తు చేసుకున్నారు. అదీ ఏపీ విద్యార్థుల్లో ఉండే పోజిటివిటీ. #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్
ఒక పేదవాడు పొట్టకూటి కోసం రోడ్డుపైన బన్ అమ్ముకుండే అతని మీద ప్రతాపం చూపించిన యూట్యూబ్ ఛానల్స్...
అదే యూట్యూబ్ ఛానల్స్ వారికి చెప్తున్న దేశంలో ఎన్నో కోట్లు అవినీతి, అక్రమాలు, దంధాలు,దోపిడీలు జరుగుతుంటే వాటిని మాత్రం పట్టించుకోరు ఎందుకంటే వాళ్లు తంతే ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు కాబట్టి...
Lokesh Nara గారు అతనికి మీరు అతనికి అండగా నిలబడినందుకు మీకు ధన్యవాదములు సార్... 🙏💛
A street vendor from Kurnool, Andhra Pradesh, was made to eat his own food to prove he was not committing “food jihad” before a group of YouTubers during the Medaram Jatara in Telangana.
After being publicly harassed by the YouTubers, he received support not only from residents in his town but also from influencers and political parties, who slammed the YouTube journalists for making videos for “views and likes.”
Read full story here: siasat.com/support-pours-…
తెలంగాణలోని మేడారం జాతర సందర్భంగా యూట్యూబర్ల బృందం ముందు తాను “ఫుడ్ జిహాద్” చేయడం లేదని నిరూపించడానికి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన ఒక వీధి వ్యాపారి తన ఆహారాన్ని తానే తినేలా చేశాడు.
యూట్యూబర్లచే బహిరంగంగా వేధించబడిన తరువాత, అతను తన పట్టణంలోని నివాసితుల నుండి మాత్రమే కాకుండా ప్రభావశీలులు మరియు రాజకీయ పార్టీల నుండి కూడా మద్దతు పొందాడు, వారు "వీక్షణలు మరియు ఇష్టాల" కోసం వీడియోలను రూపొందించినందుకు YouTube జర్నలిస్టులను నిందించారు.
Dear Brother Vali, I am deeply sorry that you had to endure this. Such divisive and communal behavior has no place in our Telugu society, which has always stood for harmony, mutual respect, and brotherhood. I will meet you soon and look forward to tasting your famous Khoya bun!
We stand together.
ప్రియమైన సోదరుడు వలి, మీరు దీన్ని భరించవలసి వచ్చినందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. సామరస్యానికి, పరస్పర గౌరవానికి, సౌభ్రాతృత్వానికి ఎల్లవేళలా నిలిచే మన తెలుగు సమాజంలో ఇలాంటి విభజన, మతతత్వ ప్రవర్తనకు చోటు లేదు. నేను త్వరలో మిమ్మల్ని కలుస్తాను మరియు మీ ప్రసిద్ధ ఖోయా బన్ను రుచి చూడటానికి ఎదురు చూస్తున్నాను!
మేము కలిసి నిలబడతాము.
#📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు
ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చాం. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలు అమలులోకి వస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఐదేళ్ళలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, ఉద్యోగాలు పొందిన వారి పేర్లను కూడా పేర్కొంటూ జాబితాలు విడుదల చేస్తాం. #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు









