Madhubabu to
ShareChat
click to see wallet page
@2214663664
2214663664
Madhubabu to
@2214663664
ఐ లవ్ షేర్ చాట్
#📀యేసయ్య కీర్తనలు🎙
📀యేసయ్య కీర్తనలు🎙 - ShareChat
#📀యేసయ్య కీర్తనలు🎙 FRIDAY MESSAGE* 01-05-2026 *శుక్రవారపు సందేశం* 〰️〰️〰️〰️〰️〰️〰️〰️ *అంశం* : *కృప* *వాక్య భాగం* : యెషయా54:10 ➖➖➖➖➖➖➖➖ *2026 మేనేల వాగ్దానం* ➖➖➖➖➖➖➖➖ *పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు.* 〰️〰️〰️〰️〰️〰️〰️〰️ *కీర్తనలు 48:9 - దేవా, మేము నీ ఆలయము నందు నీ కృపను ధ్యానించితిమి.* 🔜🔜🔜🔜🔜🔜 *ఆయన కృప మనలను విడిచి పోకుండా ఉండేందుకు ఏం చేయాలి..??* ➖➖➖➖➖➖➖➖ 1️⃣ *ఆయన ఆజ్ఞలను అనుసరించాలి వారికె కృప* - ద్వితియో 7:9 *ఉదా: దావీదు* 1రాజులు 15:4 2సముయొలు 7:15 -------------------+++----------------- 2️⃣ *ఆయన యుందు భయభక్తులు కలిగి ఉండాలి -వారికె కృప* - కీర్తన 103:17 *ఉదా :యోబు* యోబు 1:1 -------------------+++-------------- 3️⃣ *ఆయన దృష్టికి అనుకూలంగా ఉండాలి -వారి కెకృప* - 1 రాజులు 3:6 *ఉదా : దావిదు* ------------------+++---------------- 4️⃣ *యెహోవా యందు నమ్మికఉంచేవారికె - కృప* - కీర్తన 32:10 కీర్తన 52:8 *ఉదా : అబ్రహము* రోమా 4:3 ----------------++++------------- 5️⃣ *ఆయనను శాశ్వతంగా ప్రేమించేవారికె - కృప* - ఎఫెస్సీ 6:24 *ఉదా: దావీదు* కీర్తన 116:1 అందుకే గోర్రెల కాపరైన దావీదు కుటుంబం లో నుండి రాజ్యానిఎలె రాజులు వచ్చారు. కారణం దేవుని కృప -------------++++----------------- 6️⃣ *దీనులుగా ఉండేవారికె - కృప* - యాకోబు 4:6 - 1పేతురు 5:5 ఉదా :*అయన దీనులనె లక్ష్య ను* కీర్తన 138:6 యెషయ 57:15 -------------++++----------------- 7️⃣ *పరిశుద్ధులుగా ఉండేవారికె -కృప* - ప్రకటన 22:21 అనగా మనలందరిని యేసు ప్రభు సరిశుద్దులగా చేసి మనకు కృపనిచ్చును 1థెస్సలోనిక 3:12 -------------------+++-------------- 🟪 *GOD BLESS YOU* 🟪 ----------------+++-----------------
#📀యేసయ్య కీర్తనలు🎙 ‘𝟑‘ పనులుచేస్తే నీ జీవితం ధన్యం!* 〰️〰️➖➖➖➖〰️〰️ 🔴 *1. క్షమించబడ్డారా - ఇతరులను క్షమించండి :* ఒకరోజు ఓ సహోదరి దగ్గరకి సాతాను వెళ్ళి, నువ్వు పరమ పవిత్రరాలు అని అనుకుంటున్నావా, నీవు చేసిన పాపిష్టి పనులన్ని నాకు జ్ఞాపకం ఉన్నాయి, మరి నీకు జ్ఞాపకం లేవా అని ప్రశ్నిస్తూ ఆమె గతంలో చేసిన పాపాలను గూర్చి సైతాను జ్ఞాపకం చేయడం మొదలుపెట్టాడు. అందుకామే; నీవు నా పాపాలను గూర్చి మాట్లాడుతున్నావు కదా, పడమటి వైపుకు వెళ్ళు నా పాపాలు కనిపిస్తాయి అని చెప్పింది. సాతాను పడమటికి వెళ్ళి వచ్చిన తరువాత, ఇప్పుడు తూర్పు వైపుకు వెళ్ళు నా పాపాలు కనిపిస్తాయి అని తూర్పుకు పంపించింది. బైబిల్ సెలవిస్తుంది; *“పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర పరచి యున్నాడు”* (కీర్తనలు 103:12). అనగా పడమటికి తూర్పుకు ఎంత దూరమో అంత దూరం మనము గతంలో చేసిన పాపాలను దేవుడు మన నుంచి దూరము చేసేశాడు. ఆయన మన పాపములన్నిటిని క్షమించాడు. ఇక ఎన్నడు ఆయన మన గతాన్ని జ్ఞాపకం చేసుకోడు. *దేవుడు మనల్ని క్షమించిన కారణం..మనం క్షమించబడటానికి! ఇతరులను క్షమించడానికి!!* మీరు చేసిన తప్పులను దేవుడు క్షమించాలని మీరు కోరుతున్నట్లయితే, మీ యెడల తప్పు చేసినవారిని కూడా మీరు క్షమించాలి. దేవుని వద్ద నుండి పొందుకున్న క్షమాపణ మీ జీవితంలో సంపూర్ణం కావాలంటే మీరు కూడా ఇతరులను క్షమించాలి. అనగా, మీ సంతోషాన్ని చూసి ఏడ్చేవాళ్ళని – క్షమించండి! మీ అభివృద్దిని చూసి అసూయపడేవాళ్ళని – క్షమించండి! మీరు విజయం సాధిస్తున్నప్పుడు విమర్శించేవాళ్ళని - క్షమించండి! *వాళ్ళు క్షమించబడటానికి అర్హులు కాకపోయినా, ప్రశాంతంగా జీవించడానికి మీరు అర్హులు! కాబట్టి వారిని క్షమించేయండి!* *📖 మత్తయి 18:23-35* పదివేల తలాంతులు అప్పు ఉన్నవాడిని తన యజమాని క్షమిస్తే, క్షమాపణ పొందుకున్న వ్యక్తి నూరు దేనారములు అప్పు ఉన్న వ్యక్తి వద్దకు వెళ్ళి గొంతుపట్టుకుని అప్పు మొత్తం చెల్లించమని చెప్పాడు. అందుకతడు చెల్లించలేని పరిస్థితిలో ఉంటే, అతన్ని చెరసాలలో వేయించాడు. అది తెలిసినటువంటి యాజమాని అతన్ని పిలిపించి; నీవు చేసింది ఏమిటి? పదివేల తలాంతులు నీవు అప్పు ఉన్నప్పటికీ నిన్ను క్షమిస్తే, నూరు దేనారములు అప్పు ఉన్నవాడిని క్షమించలేకపోయావా? *నేను నిన్ను క్షమించినట్లుగా, నీవు వాడిని క్షమించలేదు గనుక చివరి తలాంతు చెల్లించెంత వరకు నీవు చెరసాలలో ఉండాల్సిందే అని శిక్ష విధించాడు.* ప్రియ సహోదరీ.. సహోదరా! దేవుడు మిమ్మును క్షమించిన ప్రధాన కారణం మీరు క్షమించబడతారని, ఇతరులను క్షమిస్తారని! ఒకరోజు ఒక యజమాని మరియు అతని దగ్గర పనిచేసే కుర్రవాడు కలసి కొంతమంది బానిసలను కొనడానికి మార్కెట్ కి వెళ్లారు. యజమాని ముగ్గురు బలమైన బానిసలను కొన్నాడు, ప్రక్కనే నాలుగోవ ఉన్నాడు. అతను చూడటానికి చాలా బలహీనంగా ఉన్నాడు. ఆ కుర్రవాడు...అయ్యా! ఈ నాలుగోవ బానిసను కూడా మనం కొందము అని చెప్పాడు. అతను చూస్తే రోగిష్టిలా ఉన్నాడు, అతన్ని కొనుక్కుంటే మనమే అతనికి సేవలు చేయాల్సి వస్తుంది. అతను మనకి వద్దురా అని చెప్పాడు. అప్పుడా కుర్రవాడు; అయ్యా! నా జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు ఏమి కొరలేదు, మీరు చెప్పిందంతా నేను చేసాను. దయచేసి అతన్ని కొనుక్కుందాము అని ప్రాధేయపడ్డాడు. యజమాని ఆ కుర్రవాడి మాట నమ్మి అతన్ని కొన్నాడు. కొన్నా మూడు రోజులకే మంచం అతడు పట్టేసాడు. అతను చేయాల్సిన పని కూడా ఈ కుర్రవాడే చేసేవాడు, అంతేకాకుండా రోగంతో మంచం మీద పడినప్పుడు ఈ కుర్రవాడు వెళ్లి అతనికి అన్నం పెట్టేవాడు, అతడు మంచం పాడు చేస్తే ఈ కుర్రవాడే వెళ్లి మొత్తం శుభ్రం చేసేవాడు. ఇదంతా అక్కడున్నటువంటి పనివారు గమనించి యజమాని దగ్గరకు వెళ్ళి అయ్యా...ఆ కుర్రవాడు మిమ్మల్ని మోసం చేసాడు. మీరు కొన్నటువంటి ఆ ముసలి వ్యక్తి ఎవరో కాదు ఈ కుర్రవాని యొక్క తండ్రే! అని చెప్పారు. యజమాని ఆ కుర్రవాన్ని పిలిపించి; నన్ను మోసం చేసావు కదా.. అతను నీ తండ్రి అని నాకు ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించాడు. అయ్యా! అతను నా తండ్రి కాదు కాబట్టే చెప్పలేదు. ప్రొద్దుట లేచినప్పటినుంచి వాడికి సకల పరిచర్యలు చేస్తున్నావ్ అంట! నీకు పెట్టిన ఆహారం తీసుకెళ్లి వాడికి పెడుతున్నావ్ అంట! అని యజమాని మరలా ప్రశ్నించాడు. "అవునండి అతనికి ఆరోగ్యం బాలేదు కాబట్టి, ఆహారం సరిపోవడం లేదు కాబట్టి అతనికి నా ఆహారం పెట్టాను" అప్పుడా యజమాని; ఆహారం పెట్టినందుకు కాదు అతను మీ నాన్న అని నాకు ఎందుకు చెప్పలేదు. "మా నాన్న కాదు కాబట్టే చెప్పలేదు, అతనికి నాకు ఏ సంబంధము లేదు" అని ఆ కుర్రవాడు చెప్పాడు. మరి ఎందుకు వాడిని అంతగా ప్రేమిస్తున్నావ్? అని యజమాని అడిగాడు. మా ఇంటిలో నేను ఒక్కన్నే కొడుకుని, మా అమ్మ నాన్న నన్ను అల్లారి ముద్దుగా పెంచుకున్నారు. నేను గొప్పవాన్ని కావాలని నా తల్లిదండ్రులు కలలు కన్నారు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే, ఒక వ్యక్తి నన్ను కిడ్నప్ చేసి మార్కెట్ కు తీసుకువచ్చి అమ్మేశాడు! ఆరోజు నుండి ఈరోజు వరకు నేను మా అమ్మ నాన్నని చూడలేదు. నన్ను కిడ్నప్ చేసి మార్కెట్ లో అమ్మేసి నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరో కాదండీ..నేను రోజు సేవలు చేస్తున్నటువంటి ఈ వ్యక్తే! అని చెప్పాడు. అప్పుడా యజమాని; నీకు అంతా ద్రోహం చేసిన వాడికి నువ్వెందుకురా ఇన్ని సేవలు చేస్తున్నావ్? అని అడిగితే, "శత్రువులను క్షమించాలి, శత్రువుకు క్రీస్తు ప్రేమ చూపించాలి” అని మా అమ్మ చిన్నప్పుడు నేర్పించింది. నా జీవితంలో నన్ను మా అమ్మ నాన్నకు దూరం చేసిన వీడికంటే గొప్ప శత్రువు ఎవరున్నారు! నా శత్రువుకు క్రీస్తు ప్రేమను చూపించాలనే ఆనాడు ఇతన్ని కొనమని చెప్పాను. కనీసం ఇతను చచ్చిపోయే ముందైనా దేవుని ప్రేమ చూపిస్తే వాడు రక్షించబడతాడాని, క్రీస్తును ప్రేమను క్రియల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అని యాజమానికి వివరించి చెప్పాడు. *మీ మనసులో క్షమాపణ లేకపోతే, మీరు క్షమాపణను అనుభవించడం సాధ్యము కాదు!* 🔴 *2. రక్షించబడ్డారా - రక్షకుడిని లోకానికి పరిచయం చేయండి :* రక్షింపబడిన మనం రక్షకుడిని(యేసును) లోకానికి పరిచయం చేయాలి. నిత్యము కాలిపోతున్న అగ్నిలో నుండి మనం రక్షించబడ్డాము. రక్షింపబడిన మనం భాగ్యవంతులము! ఓ భక్తుడు ఇలా సెలవిచ్చాడు; రక్షింపబడినవాడు నిజంగా భాగ్యవంతుడు. కానీ రక్షింపబడి గబగబా వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఆ అగ్నిని చల్లార్చి మరికొంతమందిని రక్షించేవాడు మాహా భాగ్యవంతుడు! ప్రియ సహోదరీ... సహోదరా! మీరు నిజంగా రక్షించబడితే, ఇతరుల రక్షణ కొరకు ప్రయాస పడతారు. *“నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు”* (సామెతలు 11:30). రక్షించబడిన మీరు మరొకరి రక్షణ కొరకు ప్రయాస పడకుండా, ప్రార్థన చేయకుండా ఉంటున్నట్లయితే దేవుడు మీకు ఇచ్చిన రక్షణను ఎంతోకొంత నిర్లక్ష్యం చేస్తున్నారనేది వాస్తవం! *“బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు”* (దానియేలు 12:3). ఒక రోజు నేను విమానంలో ప్రయాణం చేస్తుండగా, అనుకోకుండగా విమానం ప్రమాదంగుండా వెళ్ళింది. కాబట్టి దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్ట్ లో అర్జెంటుగా లాండ్ అవ్వాలి అని విమాన సిబ్బందివారు తెలియజేశారు. విమానంలో ఉన్నవారందరం ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్నాం. దేవుని మహా కృపను బట్టి దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్ట్ లో లాండ్ చేశారు. విమానం రిపేర్ అయిన తారువాత పిలుస్తాము, మీరు ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్ళి వేట్ చేయండి అని మాకు ఒక పాస్ ఇచ్చి పంపించారు. వెళ్ళి కూర్చున్నాము, మరొక వైపు బాగా ఆకలి వేస్తుంది. నాతో పాటు ఉన్నవాళ్ళందరు రెస్టారెంట్ ముందు కూర్చుని తింటున్నారు. నేను అక్కడికి వెళ్లి చూస్తే రెండు మూడు చికెన్ ముక్కలు 500-600 రూ. రేటు ఉంది. ఇక తప్పక రెండు చికెన్ ముక్కలు ఒక కూల్ డ్రింక్ కొనుక్కుని తిన్నాను. తిన్న తరువాత, విమానం రిపేర్ అయిపోయింది అని సమాచారం వచ్చింది. లైన్ లో విమానంలోకి వెళ్తున్న సమయంలో నా చేతిలో ఉన్న పాస్ ని పరిశీలించి చూస్తే కింద ఈ విధంగా వ్రాసి ఉంది “గమనిక: మీరు అత్యవసర పరిస్థితుల్లో ఈ ఎయిర్ పోర్ట్ లో దిగారు గనుక, మీరు ఈ ఎయిర్ పోర్ట్ లో ఏమి తిన్నప్పటికి ఉచితంగానే తినవచ్చు” అని వ్రాసి ఉంది. నాతోపాటు ప్రయాణం చేసిన వారందరికీ ఈ విషయం తెలుసు. కానీ నాకు తెలీదు. వారికి తెలిసినప్పటికి నాకు చెప్పలేదు, కనీసం కౌంటర్ లో ఉన్నవాడు కూడా చెప్పలేదు ఫుడ్ ఫ్రీ అని. వారికి తెలిసిన సత్యాన్ని నాకు చెప్పకుండా పడి పడి తినేశారు అని నేను లోలోపల మదనపడిపోతూ ఉంటే, ఆ సమయంలో దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు; “నా కుమారుడా మూడు చికెన్ ముక్కల కోసమే నాకు చెప్పలేదు చెప్పలేదు అని లోలోపల మదనపడిపొతున్నావే...నశించిపోతున్న ప్రతి ఒక్కరి కొరకు నా ప్రాణాన్నే అర్పించాను. ఈ సత్యాన్ని నీవు లోకానికి తెలియజేయకపోతే నేనెంత బాదపడలో ఒక్కసారి ఆలోచించు. నీకు తెలిసిన సత్యాన్ని ఎంతమందికి తెలియజేయగలవో అంతమందికి తెలియచెయ్యి! ఇది నేను నీకు ఇస్తున్న భాద్యత” అని దేవుడు చెప్పాడు. *రక్షింపబడిన మనం అనేకమందికి రక్షకుడిని పరిచయం చేయడం - మాహాభాగ్యం!* 🔴 *3. దీవించబడ్డారా - దీవెనలను పంచిపెట్టండి :* ఈ లోకంలో ఉన్నవాటికంటే, మనం పొందుకున్న పాప క్షమాపణ, రక్షణ బహు విలువైంది. ఈ లోకంలో ఉన్న ఆస్తి అంతటినీ తీసుకెళ్ళి ఒక తక్కెట్లో పెట్టినసరే మనకి క్షమాపణ వచ్చే అవకాశం ఉండదు. ఈ భూమి మీద ఉన్న ధనము, వెండి, బంగారం, వజ్రాలు ఒక తక్కెట్లో పెట్టినసరే ఒక్కరు కూడా పరలోకము వెళ్ళడం అసాధ్యం! “యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు” (కీర్తనలు 33:12). *దీవించబడినవారు ధన్యులు!* దేవుడు మనలను దీవించాడు...తన ప్రియ కుమారుడైన యేసును మన కొరకు అనుగ్రహించి, మన జీవితాన్ని ధన్యకరంగా మార్చాడు. దేవుడు మనల్ని దీవించిన కారణం, ఇతరులకు దీవెనకరంగా ఉంటామని. *“నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును”* (సామెతలు 11:10). *“దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును అట్టివాడు దీవెననొందును”* (సామెతలు 22:9). *“దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును”* (సామెతలు 21:26). మన జీవితంలో ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచకపోతే, మన ఆశీర్వాదము అభివృద్ది చెందడం సాద్యం కాదు! ఒక గురువు గారు తన ఇద్దరి శిష్యులను పిలచి, ఒకడికేమో కాళీ సంచే ఇచ్చాడు, మరొకడికేమో సంచి నిండా అరటి పండ్లు ఇచ్చాడు. ఈ అరటి పళ్ళు సంచే చాలా బరువుగా ఉంది, ఆ ఖాళీ సంచి చాలా తేలికగా ఉంది. ఆ గురువు గారు మొదటి శిష్యునితో; ఈ సంచులో ఉన్న ఈ పండ్లన్ని నీకు కనిపించిన పేదవారికి పంచుకుంటూ పలనా పట్టణానికి చేరుకో అని చెప్పాడు. రెండోవాడికి ఖాళీ సంచి ఇచ్చి; నీకు కావాల్సినవి అన్ని కూడా ఈ సంచులో నింపుకుంటూ ఆ పట్టణానికి వేళ్ళు అని చెప్పాడు. అరటి పండ్లు కలిగిన బరువైన సంచి భుజాన వేసుకుని మోసుకుంటూ వెళ్తున్నప్పుడు, అది అతనికి చాలా భారంగా ఉంది. అతనికి కనిపించిన పేదవారికి, వృద్ధాశ్రయంలో ఉన్న వృద్ధులకు ఆ అరటి పండ్లు మొత్తం పంచిపెట్టసాడు కొంత దూరం వెళ్లేసరికి ఆ సంచి కాళీ అయిపోయింది. ఫలితంగా అతని ప్రయాణం తెలికగా మారింది! ప్రశాంతంగా ముందుకు సాగిపోయాడు!! రెండోవాడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, వాడికి కావాల్సిన వస్తువులు అన్ని కొనుక్కుంటూ సంచి మొత్తం నింపేసుకున్నాడు, అలా నింపుకుంటూ 30 నిమిషాలు ప్రయాణం చేసేసరికి వాడికి కావాల్సిన అన్నిటి చేత ఆ సంచి నిండిపోయింది. బరువు పెరిగిపోయింది, ప్రయాణం భారంగా మారిపోయింది *ప్రియ చదువరీ ❗* ఈ లోక యాత్ర ముగించేరోజు వచ్చినప్పుడు, మీకు ఉన్నదంతా పంచిపెట్టేసి ప్రశాంతంగా వెళ్లిపోతారా? లేదా, అన్ని నాకే కావాలి అని, వాటిని పొందే ప్రక్రియలో సగంలోనే అర్థాంతరంగా మరణించి, మీరు కలిగున్న దీవెనలను విడిచిపెట్టి పోతారా? మీరు మరణించిన తరువాత ఎవరికి ఉపయోగం ఉండదు. *మీరు సంపాధించిన దానిని మీరు బ్రతికున్నప్పుడే పంచిపెట్టేసి, పరలోకంలో ఐశ్వర్యవంతులు కావడం గొప్ప ఆశీర్వాదం!* మీరు కలిగున్న దీవెనలను పంచిపెట్టకపోతే, దేవుడు మిమ్మును దీవించినందుకు బాదపడతాడు. మీరు కలిగున్న దీవెన చిన్న దీవెన కావచ్చు, మీకు ఉన్న స్థితి దీనస్థితి కావచ్చు, ఆ దీనస్థితిలోనే, ఆ చిన్న దీవెనలోనే మీరు చేయగలిగిన సహాయం చేయండి, మీరు పంచి పెట్టగలిగిన దీవెనలను పంచిపెట్టండి!👍🙇‍♀️🙏
#📀యేసయ్య కీర్తనలు🎙 *#ఏప్రిల్_ముగింపు – #కృతజ్ఞత_సమయం* 🌿 👉 *ఇంకా కొన్ని గంటల్లో ఈ నెల ముగిసిపోతోంది… ఏప్రిల్ మన జీవితంలో ఒక అధ్యాయం అయిపోతోంది…* 👉 *ఈ నెలలో మనం నవ్వాం…కొన్ని సార్లు ఏడ్చాం…* *కొన్ని సార్లు అలసిపోయాం…కానీ…* *#ప్రతి_క్షణంలో_దేవుడు_మనతోనే_ఉన్నాడు.* 🔹 *మనకు తెలియని ప్రమాదాల నుండి కాపాడిన దేవుడు…* 🔹 *మన బలహీనతలో బలం ఇచ్చిన దేవుడు…* *మన ఆశలు చనిపోకుండా పట్టుకున్న #దేవుడు…* ✨ *మనం ఇక్కడివరకు వచ్చాం అంటే — అది మన శక్తి కాదు, #దేవుని_కృపే.* ✨ *మనం నిలబడగలిగాం అంటే — అది మన సామర్థ్యం కాదు, #ఆయన_సహాయమే.* 📖 బైబిల్ వాక్యం: *“ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చేయుడి.”* — 1 థెస్సలొనీకయులకు 5:18 💬 *#యువతకి_సందేశం :* 👉 *జీవితంలో అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండకపోయినా…* 👉 *దేవుడు నీతో ఉన్నాడంటే నీ కథ ఇంకా ముగియలేదు. కృతజ్ఞతతో ముందుకు నడువు — దేవుడు ఇంకా గొప్పగా చేయబోతున్నాడు.* 👉 *గడిచిన నెలను కృతజ్ఞతతో ముగిస్తే... రాబోయే నెలను ఆశీర్వాదంతో ఆహ్వానిస్తాము*
#📀యేసయ్య కీర్తనలు🎙 లేయా ద్వార నేర్చుకొనే పాఠాలు📚 🛐🛐🛐✝️✝️✝️✝️🕎🕎🕎 యాకోబు యొక్క భార్య "లేయా" గురించి పూర్తి వివరాలు..అలాగే లేయా ద్వార నేర్చుకొనే పాఠాలు కూడ ఈ వర్తమానంలో నేర్చుకుందాం పూర్తిగా చదవండి.!* 👉 లేయా అంటే (అడవి ఆవు) అని అర్ధమొస్తుంది. అంతే కాదు "అలసట" అనే అర్ధం వస్తుంది అడవి అవు లేదా అలసట.* 👉 *లేయా సాధు స్వభావం గల సహన శీలీ.* 👉 *లేయా లాభాను యొక్క పెద్ద కూతురు* 👉 *లాభానుకు ఇద్దరు కూతుర్లు పెద్దది "లేయా" చిన్నది "రాహేలు"* ✨️ *యాకోబును మొదటగా వివాహం చేసుకున్నటువంటి భార్య ఈ లేయా.* ఈ లేయా అంత అందమైనది కాదు. రాహేలు లాంటి అందము కూడ లేదు. రాహేలులా అందగత్తె కాకపోయినా..ఆమె ఆత్మీయ సౌందర్యమును బట్టే దేవుడు ఆమెను అత్యధికంగా హెచ్చించాడు. భర్త నిరాధరణ వల్ల క్రుంగిపోయినప్పుడు దేవుడు ఆమెను ఆదరించాడు. ✨️ *లేయా తన చెల్లెలైనటువంటి రాహేలు చేత ద్వేషించబడినప్పుడు దేవుడు ఆమెను ఓదార్చాడు.* యూదాకు తల్లియై యూదా గోత్రపు సింహామైన యేసుక్రీస్తు వంశావళిలో నిలిచింది ఈ లేయా. 👉 *"లేయా" గురించినటువంటి కొన్ని పాఠాలు దాని ద్వార నేర్కుకొనే విషయాలు మనం తెలుసుకుందాం.!* ♻️ *మొదటి అంశం* 🟪🟩🟫⬛⬜🟧🟥🟨🟦 ✨️ *తనను కోరుకోని వ్యక్తికి భార్య అయ్యింది లేయా* దొంగ పెళ్ళికి బలయ్యింది. యాకోబు రాహేలు కోసం తన మామయైనటువంటి లాభాను దగ్గర ఏడు సంవత్సరాలు కొలువు చేసాడు. కొలువు చేయవలసిన కాలం పూర్తయ్యింది. యాకోబు తన మామతో నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు నాకు ఆజ్ఞ ఇమ్మని చెప్తాడు. లాబాను ఆ ఊరి పెద్దలందరికి విందు చేయించి రాత్రి లేయాను యాకోబు దగ్గరికి పంప్పిస్తాడు. (ఆది,29:21-29) వాక్యాలలో.. ✨️ *యాకోబు కొలువు చేసింది రాహేలు కోసమైతే..ఈ లాభాను లేయాను యాకోబు దగ్గరకు పంప్పిస్తాడు.* తెల్లవారి ఆమె లేయా అని తెలుసుకున్నప్పుడు యాకోబు లాభానుతో నేను రాహేలు కోసం కదా నీ దగ్గర కొలువు చేసింది నీవు నాకేం చేసావని ప్రశ్నిస్తాడు. అందుకు లాభాను అంటాడు పెద్దదాని కంటే చిన్న దానిని ఇవ్వడం అనేది మా దేశ మర్యాద కాదు అని. ఈమె యొక్క వారము సంపూర్ణము చెయ్. ఇంకా ఏడు సంవత్సరాలు నాకు కొలువు చేసిన యెడల అప్పుడు నేను రాహేలును ఇస్తానని యాకోబుతో చెప్తాడు. అలా మరలా ఏడు సంవత్సరాలు పూర్తయిన తరువాత *ఈ లాభాను తన కుమార్తెయైనటువంటి "రాహేలును" యాకోబుకు భార్యగా ఇస్తాడు.* ఈ విధంగా లేయా యాకోబుకు భార్య అయ్యింది. లేయా తనని కోరుకోని వ్యక్తికి భార్య అయ్యింది. ఇష్టం లేని వ్యక్తికి భార్య అయ్యింది. యాకోబు ఇష్టపడతాడా అంటే.? యాకోబు రాహేలు కోసమే చూస్తున్నాడు. తన తండ్రి చేసిన మోసపు పెళ్ళి వల్ల ఎంతో మానసిక వేదనకు భర్త తిరస్కరణకు గురైంది. ✨️ అంతేకాదు ఈ లేయా జబ్బు కళ్ళు కలది అని ఉంటుంది. ఎందుకు అంటే.? ఆమె కళ్ళు సరిగా ఉండవు. రాహేలు రూపవతి,సౌందర్య వతి సుందరి. ఐతే లేయా మాత్రం కళ్ళు చెడ్డవి. యాకోబు బాహ్య సౌందర్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడు. లేయా తన భార్య కావడం దేవుని చిత్తమని యాకోబు తలంచడం లేదు. అందుకే పౌలు ఇలా హెచ్చరిస్తున్నాడు. మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించండి అని (ఎఫెసీ,5:17) లో..పండుగ దినాలు,వారాలు,గడచిపోగానే రాహేలు కొరకు ఇంకొక ఏడు సంవత్సరాలు కొలువు చేస్తానని వాగ్దానం చేసి రాహేలును కూడా భార్యగా పొందాడు. నీవు కూడ యాకోబు వలె వెలి చూపును బట్టి ప్రవర్తిస్తున్నావేమో ఆలోచించండి. ✨️ *యాకోబు రాహేలును చాలా ప్రేమించాడు. ఎక్కువగా ఇష్టపడేవాడు.* ఏడు సంవత్సరాలు యాకోబు కొలువు చేస్తే కొద్ది దినాలుగా తోచాయి అంటాడు. అంటే ఆ ఏడేండ్ల శ్రమ కూడా కొన్ని దినాలలాగే తోచాయి అని. ఇలా మీ తప్పు కాకున్నా ఏ తప్పు లేకున్నా కూడా వేరొకరు చేసిన పొరపాటుకు నీ జీవితంలో బలైపోవాల్సిన పరిస్థితితులు కూడా ఉంటాయ్. నీ జీవితం బాధ పడే పరిస్థితి కూడా వస్తుంది. దేవుని పై ఆధారపడండి. లేయాను ఓదార్చిన దేవుడు మిమ్మల్ని కూడ ఓదారుస్తాడు. నమ్మకముంచండి.! ♻️ *ఇక రెండవ అంశం* 🟩🟫⬛⬜🟧🟥🟨🟦🟩🟪 ✨️ *దేవుని చేత ఆదరించబడింది లేయా* లేయా తాను భర్త చేత ప్రేమించబడాలని ఎంత గానో ఎదురు చూసింది. భర్త ప్రేమ కోసం పరితపించపోయింది. ఐతే యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. లేయా ద్వేషించబడటం చూసినటువంటి దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. ✨️ మనుషులు మనల్ని త్రునీకరించినప్పుడు మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఆ దేవుడు తన చేతులు చాపుతున్నాడు. *సంతానం ద్వార దేవుడు లేయాకు ఆదరణ కలిగించాడు.* నీవు ఎవరి చేతనైన ద్వేషించబడి నిరాధారణకు గురైతే నీవు ప్రేమించే వారి నుంచి ఎప్పుడైనా దూరం చేయబడితే అలాంటి పరిస్థితుల్లో నిన్ను ఆదరించడానికి నీ ఆధరణ కర్త సిద్ధంగా ఉన్నాడు. అలా దేవుని చేత ఆదరించబడింది ఈ లేయా అలాగే సంతానాన్ని పొందిది లేయా (ఆదికాండము,29:31,32) వాక్యాలలో... ♻️ *మూడవ అంశం* 🟪🟩🟫⬛⬜🟧🟥🟨🟦 ✨️ *దేవున్ని స్తుతించింది లేయా యాకోబు వలన నిరాధరణ పొందిన లేయాను దేవుడు చూసాడు. ఆదరించాడు. లేయాకు మొదటి కుమారుడ్ని ఇచ్చాడు "రూబేను" రూబేను ను పొందినప్పుడు ప్రభువు తన శ్రమను చూసాడు అని గ్రహించింది. తరువాత "షిమ్యోను" పుడతాడు షిమ్యోనును పొందినప్పుడు తాను ద్వేషించబడ్డాను అను సత్యాన్ని దేవుడు విన్నాడు కాబట్టి షిమ్యోనునిచ్చాడు అని గ్రహించింది. ✨️ ఆ తరువాత "లేవి" లేవిని పొందినప్పుడు కూడా తన భర్త ఇంకా ప్రేమిస్తాడేమో ఇకనైన ప్రేమిస్తాడేమో అని ఆశించింది. ఐతే నాలుగవ కుమారుడు "యూదా" యూదా కలిగినప్పుడు తన దృష్టిని భర్త నుండి దేవుని వైపు మలచుకోవాలని నా దేవున్ని నేను స్తుతిస్తాను అని నిర్ణయించుకుంది లేయా. నిర్నిమిత్తంగా ద్వేషించబడిన లేయా తన దృష్టి సరియైన వైపుకే త్రిప్పుకోగలిగింది. (ఆదికాండము,29:35) వాక్యాలలో.. ✨️ మీరు ఇరుకుల్లో ఇబ్బందుల్లో శ్రమల్లో బాధల్లో ఎవరి వైపు చూస్తున్నారు. ఇతరుల చేత ద్వేషించబడుతున్నప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నారు. మీరు లోకం నుంచి మీ చూపును మలచుకొని సృష్ఠి కర్తయైన దేవుని వైపు చూడగలుగుతున్నారా.? నీ ప్రభువు నిన్ను మర్చిపోలేదు. నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు అని గ్రహించాలి. ✨️ ఇంకా ఎంత కాలం లోకం వైపు చూస్తాం. లోకాన్నే ప్రేమిస్తాం. ఆదరణ కొరకు ఎదురు చూస్తాం. నిన్ను ఆదరించాలని దేవుడు తన గాయపడిన హస్తాన్ని నీవైపు చూపిస్తున్నప్పుడు నీకు సేద తీర్చాలి అని ఆశిస్తున్నప్పుడు మీరు చూడాలి. తన సొంత భర్త చేత అలాగే సొంత చెల్లెల్ల చేత ద్వేషించబడిన లేయా తన నిరాధరణ స్థితిలో తనకు మనశాంతి నిచ్చే దేవునిలో ఆనందించడానికి తీర్మానించుకుంది. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నిజానికి లేయా తన భర్త వల్ల నిరాధరణకు గురి కాకపోతే దేవునికి ఇంత దగ్గరయ్యేది కాదేమో యాకోబు అత్యధికంగా ప్రేమించాడు రాహేలును.. ✨️ భర్త ప్రేమించిన రాహేలు దేవుని వల్ల మేలు పొంది కూడా గృహ దేవతలను దొంగిలించి బేతేలుకు బయలు దేరింది. యాకోబు నిరాధరణ,రాహేలు అసూయ,లేయాకు బలమయ్యాయ్. లేయాను దేవునికి దగ్గర చేసాయ్. ✨️ మన జీవితంలో దేవుడు అనుమతించేటువంటి శ్రమలు కూడా మనల్ని దేవునికి సమీపంగా దగ్గరగా చేయడానికే అని మనం గ్రహించాలి. దేవుడు మనకు అభయమిస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నిన్ను నిలువబెట్టే శక్తి మంతుడు దేవుడే. ♻️ *నాలుగవ అంశం* 🟪🟪🟩🟫⬛⬜🟧🟥🟨🟦 ✨️ *భాగ్యవతి అని పిలిపించుకుంది లేయా భాగ్యవతియైనది లేయా. లేయా యాకోబు ప్రేమ కోసం ప్రాకులాడింది గానీ పొందలేకపోయింది. తన దృష్టిని మనుషుల వైపు నుంచి దేవుని వైపుకు మలచుకుంది. లేయా దేవున్ని స్తుతించాలి అని తీర్మానించుకుంది. తనకి సంతానం ఇంక కలిగే అవకాశం లేదని గ్రహించింది. ✨️ లేయా తన దాసియైనటువంటి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది. లేయా దాసి "జిల్పా" యాకోబుకు భార్యగా ఇచ్చింది. ఆమె ద్వార "గాదు" అనేటువంటి కుమారుడ్ని పొందింది. ఇది కూడా అదృష్టమే అనుకున్నది. *నిజమే లేయా దేవునిలో చాలా భాగ్యవంతురాలు.* లేయా ఫలించిన ద్రాక్షా వల్లి. ఎందుకంటే.? దేవుని యందు భయభక్తులు గల వారు ఇలా ఆశీర్వదించబడతారాని బైబిల్ చెప్తుంది. ✨️ లేయా తన కుమారుడు తెచ్చినటువంటి పుత్ర దాత ఫలాన్నిచ్చి యాకోబును కొనుక్కున్నది. దేవుడు ఆమె మనవి విని ఆమెకు ఇంకా ఇద్దరు కుమారులను ఇచ్చాడు. ఒక్క కుమార్తెను కూడా ఇచ్చాడు. వారే "ఇశ్శాఖారు" "జెబూలోనూ" అలాగే కుమార్తె "దీనా" లేయాను దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆరుగురు కుమారులను ఒక కుమార్తెను పొందింది. (ఆదికాండము,30:9-13) వాక్యాలలో... ✨️ దేవునికి దగ్గరై ఆయన చేత ఆశీర్వదించబడింది లేయా దేవుడు అబ్రాహాతో చేసిన వాగ్ధానాన్ని నెరవేర్చడానికి ఆయన వెలుపలికి తీసుకవచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రాలు లెక్కించుము నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానాన్ని అలా చేస్తాను అని చెప్పాడు. అంత ధన్యత పొందింది భాగ్యురాలుగా ఉంది లేయా. ♻️ *ఐదవ అంశం* 🟪🟩🟫⬛⬜🟧🟥🟨🟦 ✨️ *భర్తకు సహకరించింది లేయా* భర్తకు సహకరిస్తూనే ఉంది. యాకోబు దేవుడు తనతో మాట్లాడిన ప్రకారం లాభానును హారానును విడచి బేతేలు వెళ్ళాలి అని తీర్మానించుకుంటాడు. రాహేలుతో పాటు లేయా కూడా అందుకు సమ్మతించింది. దేవుడు నీతో చెప్పినట్లే చేయమని చెప్పింది. దేవుడు ఏం చెప్పాడో అలాగే చేయమని చెప్పింది ఎంత విశ్వాసమో చూడండి. భర్తతో ఏకీభవించే మనస్తత్వం కూడా ఉంది లేయాకు. (ఆదికాండము,31:16) వాక్యాలలో ✨️ మనము కూడ..మీరు కూడా మీ భర్తతో ఏకీభవించాలి ప్రతీ సారి. దేవుడు కోరుకున్న విధంగా లేయా యాకోబుకు సాటియైన సహాయంగా ఉన్నది. మరి మీరెలా ఉంటున్నారు.? మీరు మీ స్వపురుషునికు లోబడి ఉండాలి అదే వాక్యం మనకు చెప్తుంది (1పేతురు,3:1) వాక్యంలో.. ♻️ *ఆరవ అంశం* 🟪🟩🟫⬛⬜🟧🟥🟨🟦 ✨️ *దేవుని నడుపుదలనే కోరుకున్నది లేయా* లేయా యాకోబు వల్ల నిరాధరించబడింది. రాహేలు వల్ల ద్వేషించబడింది. అలాంటి స్థితిలో లేయా తండ్రి ఇంట ఉంటే ఆమెకు తండ్రి అండ ఉంటుంది. ఐతే లేయా యాకోబు మాటలకు లోబడి ఇష్టపూర్వకంగా తండ్రి ఇల్లు వదిలి భర్తతో దూర ప్రాంతానికి వెళ్ళడానికి సిద్దపడింది. దీనంతటికి కారణం ఒకటే.? అదే లేయా దేవునిపై ఆధార పడటం. ఆధారపడింది. అందుకే ఇలా అంటుంది దేవుడు మీతో చెప్పిందల్లా చేయమని. అదే తండ్రి ఇల్లు వదిలేటప్పుడు రాహేలు మాత్రం గృహ దేవతలను దొంగిలించింది. ఆ దేవతలు తనకు సహాయపడతాయేమో అని రాహేలు అనుకుంది. ఐతే లేయా మాత్రం దేవతలను విగ్రహాలను ఆశ్రయించలేదు. *జీవం గల దేవున్నే నిజంగా ఆశ్రయించింది.* అందుకే గృహ దేవతలను తెచ్చుకోలేదు. (ఆదికాండము,32:3-23) వాక్యాలలో.. ✨️ యాకోబు అన్న ఏశావు. ఏశావు ఎదుర్కొని వస్తున్నాడని విని యాకోబు తన సంపదను మనుష్యులను గుంపులుగా చేసాడు. దాసీలను వారి పిల్లలను ముందుంచాడు. వారి వెనుక లేయాను ఆమె సంతానాన్ని ఉంచాడు. చిట్ట చివరన తనకు ఇష్టమైనటువంటి భార్య రాహేలును ఆమె కుమారుడు యోసేపును ఉంచాడు. ఒకవేళ ఏశావు హాని చేస్తే గనుక దాసీలు వారి పిల్లలకు,లేయాకు,ఆమె సంతానానికి కూడా ప్రమాదమే. ఆ తర్వాతే రాహేలు ఎదుర్కోబడుతుంది. ఎలాంటి వ్యత్యాసాలు చూసినా లేయా అంత ఓర్పు వహించిందో చూడండి. ✨️ *లేయా దేవునిపై ఆధారపడింది గనుకనే ఇలాంటి సుగుణాలు చూపగలిగింది.* మరి మీరెలా ఉంటున్నారో ఆలోచించండి.? ఆయనపై ఆధారపడుతున్నారా.? పూర్తిగా ఆదారపడి ప్రతీ శ్రమను ఓర్చుకుంటున్నారా.? ఆయన యందు విశ్వాసముంచువారు ఎప్పటికి కూడా సిగ్గు పరచబడరు. *ఓర్చుకున్నవారికి దేవుడు తప్పక ప్రతి ఫలమిస్తాడు.* మన శ్రమలలో గానీ,కష్టాలు వచ్చినప్పుడు గానీ,లేయా వలె దేవునిలో నిరీక్షణ కలిగి ఉండాలి అని మనకు తెలియజేస్తుంది.! ♻️ *ఏడవ అంశం* 🟫⬛⬜🟧🟥🟨🟦🟫🟩🟪 ✨️ *కుమార్తె వల్ల బాధ పడింది లేయా* కుమార్తె ప్రవర్తన వలన వేదన పడింది లేయా. షెకెము అనేటువంటి ఊరు ముందర యాకోబు గుడారం వేసాడు. దీనా ఆ దేశపు కుమార్తలను చూడటానికి వెళ్ళింది. ఆ దేశ నేత హమోరు. హమోరు కుమారుడైనటువంటి షెకెము దీనాను చెర పట్టి తన ఇంట్లోనే ఉంచుకుంటాడు. ఇది ఇశ్రాయేలు ప్రజల్లో అవమాన కరమైనటువంటి కార్యము. చేయరానటువంటి పని. కనుక కోపంతో లేయా కుమారులైనటువంటి లేవి షిమ్యోనులు ఆ ఊరు వారందరిని కూడా చంపి దీనాను ఇంటికి తెచ్చారు. (ఆదికాండము,34) వ అధ్యాయంలో. ఆ తర్వాత షెకెము ప్రాంతాన్ని విడచిపెట్టి బేతేలుకు వెళ్తారు. దీనా గురించినటువంటి విషయాన్ని అంతటిని కూడా ఒక మెసేజ్ లో వివరించాను గనుక అది కూడా చదవండి. ఐతే తర్వాత కాలంలో దీనాకు వివాహమైనట్లు కనపడలేదు. యోసేపు యాకోబు కుటుంబాన్నంతా కూడ ఐగుప్తుకు పిలిపించినప్పుడు దీనా తండ్రి ఇంటనే ఉన్నది అని మనకు తెలుస్తుంది. ✨️ దీనా లేయాకు ఒక్క గానొక్క కుమార్తె. ఆమె ముద్దు ముచ్చట తీరలేదు. దీనా వల్ల లేయాకు తన చివరి దశలో ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటుందో అలోచించండి. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా గమనించాల్సింది ఏంటి అంటే.? మీ పిల్లలను ప్రభువు భోధనలో క్రమశిక్షణలో పెంచాలి అని బైబిల్ ఖచ్చితంగా హెచ్చరిస్తుంది (ఎఫెసీ,6:4) వాక్యంలో ✨️ మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు.? వారి ప్రవర్తన మారుతుంది..ప్రవర్తన వల్ల కుటుంబంలో ఆనందానికి తావు ఉండదు. ఇందు విషయమై ప్రభువు యొక్క శక్తిని జ్ఞానాన్ని ఆశ్రయించాలి. ఒక్కొక్క సారి పిల్లల వల్ల కాదు ఎదురయ్యేటువంటి ప్రమాదం వల్ల..ఎదురయ్యేటువంటి వ్యక్తుల వల్ల..కూడా ప్రమాదం పొంచి వస్తుంది ఆలోచించండి.! ♻️ *ఎనిమిదవ అంశం* 🟪🟩🟫⬛⬜🟧🟥🟨🟦 ✨️ *అధిక్యత పొందింది లేయా* యాకోబు ఇశ్రాయేలియుల 12 గోత్రాలను కూడా దీవించాడు. దీవించి ఇలా చెప్తాడు. హిత్తియుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రి యొద్ద నన్ను పాతి పెట్టండి.ఆ గుహ కానాను దేశమందలి మమ్రే యెదుట మక్పేలా పొలంలో ఉంది. అబ్రాహాము దానిని హిత్తియుడగు ఎఫ్రోను యొద్ద స్మశాన భూమి కొరకు స్వాస్థ్యంగా కొన్నాడు. అక్కడే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతి పెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్యయైనా రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను కూడా లేయాను పాతి పెట్టాను అంటాడు. అంటే లేయా మరణించింది. పితరుల యొద్ద పాతి పెట్టబడింది. ✨️ ఐగుప్తు చేరిన యాకోబు కూడ తాను చనిపోయిన తర్వాత లేయా వద్దనే పాతి పెట్టబడాలని కోరుకుంటున్నాడు ఇది ఎంత ఆదిక్యత. రాహేలు ఎఫ్రాత మార్గంలోనే మరణించి సమాది చేయబడింది. ఐతే లేయా మాత్రం పితరుల యొద్ద సమాది చేయబడింది. ✨️ ఈ లేయా ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధి చేసిన స్త్రీ. దేవుని వాగ్ధానము అబ్రహముకిచ్చిన వాగ్ధానం ప్రకారం ఈమె వంశాభివృద్ధికి దేవుడు వాడుకున్నటువంటి స్త్రీ. దేవుడు పిలిచిన బేతేలుకు చేరి వాగ్ధాన దేశంలో మృతి పొంది పితరుల యొద్ద చేర్చబడింది లేయా ధన్యజీవి. ✨️ అందము లేనప్పటికి బాహ్య సౌందర్యము కంటే అంతర్గ సౌందర్యం కలిగి బెత్లేహేము ప్రజల చేత కీర్తించబడిన స్త్రీ లేయా. ✨️ ఆయన యందు విశ్వాసముంచు వారు ఎప్పటికి సిగ్గుపరచబడరు అనే వాగ్దానం రుజువు చేయబడింది లేయా విషయంలో..లేయా వలె అంతర్గ సౌందర్యవతిగా ఉండటానికి ప్రభువును ఆశ్రయించి ఆయన ద్వార మనము కూడా అనేక ఈవులను పొందడానికి సిద్ధపడండి.!
#📀యేసయ్య కీర్తనలు🎙 కొరకు కోర్టు మెట్లు ఎక్కిన అన్నదమ్ములు - కేసును చూసి షాక్ కు గురి అయిన జడ్జి:* *విచిత్ర సంఘటన…* *ఇటీవల సౌదీ రియాద్ హైకోర్ట్ లో ఒక కేసు బెంచ్ ముందుకొచ్చింది. జడ్జి కేసు చదువుతుండగా కేసు వేసిన వారు అన్న దమ్ములు. అన్న వయస్సు 80 సం.రాలు, తమ్ముని వయస్సు 70 సం.రాలు. బహుశా ఇది ఆస్తి కి సంభందించిన కేసు ఏమో! ఇంత పెద్ద వయస్సులో వీరికి ఆస్తి ఎందుకో అనుకుంటూ కేసు పూర్తిగా చదివాకా జడ్జి కి దిమ్మ దిరిగింది. ఇంత వరకు ఇటువంటి కేసు తన ముందుకు రాలేదు. వారికి ఆస్తి పాస్తులు కూడ ఎక్కువ లేవు.* *కేసు పూర్వ పరాలు ఏమిటంటే తన అన్న వద్ద తల్లి ( 110 సం.రాలు. ) గత 40 సం.రాలుగా ఉంటుంది. ఆలనా పాలన బాగానే చూసుకుంటాడు. తమ్ముని బాధ ఏమిటంటే తన తల్లిని తన వద్దకు పంపమని, సంవత్సరాల తరబడి ప్రాదేయబడ్డా కూడ తన అన్న తల్లిని తమ్ముని వద్దకు పంపడం లేదు. జడ్జి ఇద్దరినీ పిలిచి విడి విడిగా మీరే ఒక నిర్ణయానికి రండి అని అడిగాడు, కానీ ఇద్దరు అన్నదమ్ములు కూడ తల్లి తన వద్దనే ఉండాలని పట్టుబట్టారు. తుదకు తల్లిని స్ట్రెచ్చర్ లో కోర్టులో హాజరు పర్చారు. జడ్జి తల్లిని అడిగాడు ఎవరి వద్ద ఉంటావు అని, అప్పుడు ఆ తల్లి తనకు ఇద్దరు కుమారులు సమానమేననీ, ఇంతకన్నా ఏమి చెప్పలేనని, మీరు ఏం చెప్తే నేను అక్కడే ఉంటాను కానీ నేను ఎవరి మనసును గాయ పరిచలేను అంది.* *జడ్జి ఇద్దరన్నదమ్ముల ఆరోగ్య సమాచారం సేకరించి తల్లిని తమ్ముని వద్ద ఉండాలని ఆదేశించాడు. ఆ ఆదేశాలతో అన్న అక్కడే కుప్పకూలి పోయాడు. ఇది ప్రేమ అంటే...ఈ రోజుల్లో తల్లి తండ్రులను పోషించలేక కొట్టి చంపడమో, లేక వృద్ధ శ్రమంలో చేర్పించడమో లేక వంతుల వారిగా పోషించడమో చూస్తున్నాము కానీ ఇటువంటి కేసు వినలేదు. తల్లి తండ్రుల పాదాల కింద స్వర్గం ఉంటుందని ఎంత మందికి తెలుసు. అందుకే తమ పిల్లలకు చిన్నప్పటి నుండి ఇంట్లో మరియు బడులలో వారి విలువలను గుర్తించేటట్లు బోధించాలి.*
#📀యేసయ్య కీర్తనలు🎙 *(❤️‍🩹ప్రేమగీతం💝)* *👇గ్రంథం గురించి షార్ట్ మెసేజ్ లో* *పూర్తి వివరణ👇* *1️⃣ఎవరు వ్రాశారు* : సొలొమోను *2️⃣ఎప్పుడు వ్రాశారు* : క్రీస్తు పూర్వం 971-931 *3️⃣ఎవరు ముఖ్యమైన వ్యక్తులు* : సొలొమోను, షూలమ్మీతీ *4️⃣ఏది మూల వాక్యము* : అగాధ సముద్రజలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు. (పరమ 8:7) *5️⃣ఎందుకు వ్రాశారు?* : ప్రియుడు తన ప్రియురాలి పట్ల కలిగియున్న ప్రేమను వర్ణించడం లోను, వివరించుటలోను కొన్ని మాటలు హద్దులు దాటినట్లు కనిపించినా వివాహబంధములో దాగియున్న ప్రేమ యొక్క పరిశుద్ధతను, గౌరవమును మరియు సంతోషమును తెలియజేస్తూ ఈ గ్రంథాన్ని సొలొమోను వ్రాశాడు. *6️⃣ఏమి సూచిస్తుంది?* : క్రీస్తు తన ప్రజల పట్ల చూపించిన ఆ సిలువ ప్రేమను ఈ గ్రంథము సూచిస్తుంది. *7️⃣ఈ గ్రంథానికిగల మరొక పేరు - ప్రేమగీతం.* *8️⃣ప్రియుడు, ప్రియురాలు ఎవరు?* *💥ప్రియుడు - సొలొమోను* *యేసుక్రీస్తుకు సూచన* *💥ప్రియురాలు - షూలమ్మీతి* *సంఘమునకు సూచన* *వివాహ* బంధములో ప్రేమ, ఒకరిపట్ల ఒకరి వ్యామోహం ఎంత బలమైనదో ఈ పరమ గీతము తెలియజేస్తుంది. అధ్యాయములు ప్రేమ గీతాలు. మొదటి రెండు ఈ ప్రేమగీతం దేవునికి దేవుని ప్రజలకు మధ్య ప్రేమను, విడదీయరాని బంధమును సూచిస్తుంది. యేసుక్రీస్తు మన కొరకు చూపించిన ప్రేమ, మరణము కంటే ఎంతో బలమైనది. (8:6) ఉదాహరణకు.... ఒకరోజు ఓ రాజ్యము యొక్క రాజు, రాణి మరియు వారి బిడ్డలు అనుకోకుండా శత్రుసైన్యానికి దొరికిపోయారు. సైనికులు వారిని రాజు దగ్గరకు ప్రవేశపెట్టారు. కాని మంచివాడైన రాజు, పట్టబడిన ఆ రాజు కుటుంబాన్ని ఏ కారణం లేకుండా చంపడం ఇష్టం లేక... “కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సరైన జవాబు చెబితే నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను విడిచిపెట్టేస్తాను, ఒకవేళ చెప్పలేకపోతే చంపేస్తాను" అని చెప్పెను. దీనికి పట్టబడిన ఆ రాజు సరేనని అంగీకరించెను. మంచివాడైన ఆ రాజు ప్రశ్నిస్తూ... నిన్ను నేను విడిచిపెడితే నీవు నాకేమిస్తావు అని అడిగెను. అందుకు పట్టబడిన రాజు, నా రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తాను అని అనెను. నీ పిల్లలను విడిచిపెడితే నీవు నాకేమిస్తావు అని మరలా అడిగెను. అందుకు ఆ రాజు నా రాజ్యమంతా ఇచ్చేస్తాను అని చెప్పెను. నీ భార్యను విడిచిపెడితే నీవు నాకేమిస్తావు? అని మరలా అడిగెను. అందుకు వెంటనే ఆ యువరాజు నా ప్రాణాన్నే ఇచ్చేస్తాను అని అనెను. ఆ సమాధానం వినిన రాజు "ఇతను ఎంతో విలువైన వ్యక్తిత్వం కలిగినవాడు". ఇటువంటి వ్యక్తి యొక్క పరిపాలనలో రాజ్యము క్షేమంగా ఉంటుందని భావించి చంపకుండా వారిని విడిచిపెట్టేశాడు. దారిలో కుటుంబంగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆ యువరాజు తన భార్యయైన యువరాణితో, ఆ రాజ్యాన్ని చూశావా... ఎంతో అద్భుతముగా ఉంది కదూ అని అంటుంటే ఆ రాణి చూడలేదండి అంటూ సమాధానమిచ్చెను. ఆ అందమైన భవనాన్ని చూశావా... అని అడిగితే రాణి చూడలేదండి అంటూ సమాధానమిచ్చింది. సరే, పోని ఆ సింహాసనాన్ని, ఆ అందమైన భవనం యొక్క లోపలి అందాలను చూశావా... అని అడిగితే అవి కూడా చూడలేదంటూ ఆ రాణి సమాధానమిచ్చింది. ఆ యువరాజు ఉండబట్టలేక కోపంతో ఆ రాజ్యాన్ని, ఆ అందమైన భవనాన్ని కూడా చూడలేదు, మరి ఏమి చూశావు అని అడిగాడు. ఆ రాణి జవాబును ఇస్తూ... 'నా భార్యను విడిచిపెడితే నా ప్రాణాన్నిస్తాను అని చెప్పిన నా భర్తనే చూస్తూ ఉండిపోయాను' అని సమాధానమిచ్చింది!❤️‍🔥 ఆ రాణి మాటలు జాగ్రత్తగా పరిశీలిస్తే... ఆమె లోకాన్ని, లోకములో ఉన్న ఆకర్షణలు చూడలేదు. అంతేకాదు ఆ రాజ్యాన్ని, ఆ రాజ్యంలో ఉన్న రాజభవనాన్ని, సింహాసనమును కూడా చూడలేదు. ఎందుకో తెలుసా? ఇవేవీ తన దృష్టిలో విలువైనవి కావు, తన కోసం ప్రాణాన్నే ఇచ్చేస్తాను' అనిన భర్తపైనే తన చూపంతా, మనస్సంతా ఉండిపోయింది. తన భార్య కోసం ప్రాణాన్ని ఇస్తానన్న ఆ యువరాజు కన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో గొప్పవాడు, శ్రేష్ఠమైనవాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనకోసం ప్రాణం ఇస్తానని వాగ్దానం చేయడం కాదు, మనలను ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్నే మన రక్షణ కోసం అర్పించినవాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వరుడు అయితే, సంఘం వధువు. సంఘం యొక్క దృష్టి, మనస్సు, ఆలోచనలు మనల్ని కాపాడడానికి ఈ లోకానికి వచ్చి, సిలువలో మరణించి, సమాధి చేయబడి తిరిగి లేచిన అతికాంక్షణీయుడైన యేసుక్రీస్తు మీదనే ఉండాలి. ఇది సంఘానికి, క్రీస్తుకు మధ్య ఉన్న సాదృశ్యం, దేవునికి, దేవుని చేత సృష్టించబడిన మనకు మధ్యనున్న దైవ ప్రేమకు సాదృశ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే, పరమగీతము అసలు సిసలైన, నిస్వార్ధమైన దేవుని ప్రేమకు నిర్వచనం. *🗓️ అనుదినం మీకు ఇలాంటి మెసేజ్ లు కావాలనుకుంటే 👇క్రింది నంబర్ నీ వాట్సప్ లో మాత్రమే సంప్రదించగలరు* 🙏 7207673134
#📀యేసయ్య కీర్తనలు🎙 FRIDAY MESSAGE* 24-04-2026 *శుక్రవారపు సందేశం* 〰️〰️〰️〰️〰️〰️〰️〰️ *అంశం* : *విశ్వాసిగట్టిగా పట్టుకొవలసినవి* *వాక్య భాగం* : ప్రకటన 3:11 ➖➖➖➖➖➖➖➖ *విశ్వాసి గట్టిగా పట్టుకోనె కొన్ని విషయలు..??* ➖➖➖➖➖➖➖➖ 1️⃣ *దేవుని నామమును గట్టిగా పట్టుకోవాలి* - ప్రకటన 2:13 -------------------+++----------------- 2️⃣ *విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి* - హెబ్రీ:3:15 -------------------+++-------------- 3️⃣ *ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలి* - సామెతలు:4:13 తీతుకు:1:9 ------------------+++---------------- 4️⃣ *నీతిని విడువక గట్టిగా పట్టుకోవాలి* - యోబు:27:6 ----------------++++------------- 5️⃣ *సువార్తను గట్టిగా పట్టుకొనిపొందాలి* - 1కొరింథి:15:2 -------------++++----------------- 6️⃣*దేవుని మాటలు గట్టిగా పట్టుకోవాలి* సామెతలు 4:4 -------------++++----------------- 7️⃣ *మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకొవాలి* *(మన తీర్మానములు)* - హెబ్రీ 4:14 -------------------+++-------------- 🟪 *GOD BLESS YOU*
#📀యేసయ్య కీర్తనలు🎙 *తప్పిపోయి - దొరికిన -కుమారుడు*♻️ ( *మొదటి భాగం*) *ఉపోద్ఘాతము* Luke(లూకా సువార్త) 15:21 *21.అప్పుడు ఆ కుమారుడు అతనితోతండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.* 👉 దేవుని నామమునకు మహిమ కలుగును గాక! *ఇప్పుడు తప్పిపోయిన కుమారునికోసం ధ్యానం చేస్తూ మిమ్మల్ని ఈ రకంగా కలుస్తున్నందుకు సంతోషిస్తూ, ఈ ధన్యత, అవకాశం ఇచ్చిన దేవాదిదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను.* *ఈ ఉపమానానికి తప్పిపోయిన కుమారుడు అని పేరు పెట్టారు గాని, తండ్రియోద్దకు తిరిగి చేరాడు కాబట్టి తప్పిపోయి దొరికిన కుమారుడు అనడమే సమంజసం అని నా అభిప్రాయం.* 👉 *యేసుప్రభులవారు తన ప్రసంగాలలో అనేక ఉపమానాలు చెప్పారు. మార్కు 4:33,34 లో ఉపమానం లేక ఆయన వారికి బోధించలేదు అని వ్రాయబడింది. ఆయన ప్రసంగాలన్నీ ఉపమానాలతో నిండి ఉండేవి. వాటిలో బోలెడు నిఘూడ సత్యాలు, పరమరాజ్య రహస్యాలు దాగి ఉండేవి. నేటిదినాల్లో వాడుచున్న ఉపమానాలు ప్రజల్ని నవ్వించడం తప్ప దేవునిరాజ్య ఆత్మీయ మర్మాలు తక్కువ.* *లూకా సువార్త 15వ అధ్యాయంలో గల ఉపమానాలు మిగతా సువార్తలలో లేవు. ఈ 15వ అధ్యాయం బైబిల్ గ్రంధములోనే చాలా ప్రత్యేకమైనది, ప్రాముఖ్యమైనది, ఎందుకంటే ఇందులోగల పాత్రలు నేటికీ మనలో ప్రతీ ఒక్కరికి సరిపోతాయి.* (These relates each and every one of us). 👉 *ఈ తప్పిపోయిన కుమారుని ఉపమానం మనలో ప్రతీ ఒక్కరికి వర్తిస్తుంది. ఈ ఉపమానం నాకు చెందదు అంటే ఆ వ్యక్తీ పచ్చి అబద్ధికుడు. అయితే చిన్న కుమారుని పోలి ఉంటాం. లేదా పెద్ద కుమారుని పోలి యుంటాము.* 👉 *అంతేకాదు క్రైస్తవ భక్తిగల తల్లిదండ్రులకు తమ పిల్లలలో చాలామందికి తప్పిపోయిన కుమారుని అనుభవం ఎదురయ్యి ఉంటుంది. కాబట్టి ఇది ఉపమానమే తప్ప నిజం కాదులే అనుకోవద్దు. నేను ఏ విషయంలోనూ తప్పిపోలేదు కాబట్టి ఈ ఉపమానం నాకు కాదు అనుకోవద్దు. మనందరం ఎప్పుడో ఒకప్పుడు, చాలాసార్లు తప్పిపోయి ఉంటాము మాటలోనో, పవిత్రతలోనో, చూపులోనో, తలంపులోనో, ప్రవర్తనలోనో, ప్రార్ధించుటలోనో, దేవునికిచ్చుట లోనో తప్పిపోయినవారమే!!!* 👉 *మనం మానవ మాత్రులం కనుక మనందరికీ ఈ అనుభవం ఉంది. అయితే ఈ చిన్న కుమారుడు పశ్చాత్తాపపడినట్లు మనం కూడా మరలా దేవునియొద్దకు వచ్చాం కాబట్టి కనికరించబడ్డాము. ఒకవేళ దీని చదువుచున్న ప్రియ సహోదరీ, సహోదరుడా! ఇంకా నీవు సమాధాన పడలేదా? ఇప్పుడే పశ్చాత్తాప పడి దేవుని యొద్దకు మరలి రా! తండ్రి తన చిన్నకుమారుని చేర్చుకొన్నట్లు నిన్నుకూడా చేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు.* ఈ 15వ అధ్యాయంలో గల ఉపమానాలలో దేవుని ఉద్దేశ్యం చాలా ప్రస్ఫుటంగా స్పష్టం అవుతుంది. 👉 *అదేమిటంటే: నీవు తప్పిపోయావా? దేవుణ్ణి విడచి, దేవుని సంఘాన్ని, సహవాసాన్ని విడచిపెట్టి తిరుగుతున్నావా? లోకస్తులతో కలసి వారిపాపంలో పాలివాడవై వారిలో ఒకనిగా ఉంటున్నావా? దేవుడు తన చేయి చాపి నిన్ను పిలుస్తున్నారు. నీవు ఇప్పడు ఎంత ఘోర పాపివైనా సరే! ఇంకా దేవుని బిడ్డవే!!! చిన్న కుమారుడు తన తప్పు తెలిసికొని తండ్రి యొద్దకు వచ్చినట్లు నేడే ఆయన యొద్దకు రా! వెంటనే ఆయన నిన్ను కౌగలించుకొని, ముద్దుపెట్టుకొని (నీవు ఎంత పాపమనే మురికిలో ఉన్నా సరే)తన హక్కున చేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు.* *వస్తావా?* *ప్రియ దైవజనమా! ఈ లూకా సువార్త 15 వ అధ్యాయంలో మూడు ఉపమానాలు చెప్పబడ్డాయి. అయితే ఈ మూడింటి సారాంశం దాదాపు ఒక్కటే.* 1. మొదటి ఉపమానం లో నూరు గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. (The Lost Sheep): 1% Lost. రెండవ ఉపమానం లో పది నాణేలలో ఒక్కటి పోయింది. (The Lost Coin) : 10% Lost. మూడవ ఉపమానం లో ఇద్దరు కుమారులలో ఒకడు తప్పిపోయాడు. (The Lost Son): 50% Lost. 👉 *ఇందులో దేవుని ఉద్దేశ్యం తేటతెల్లం అవుతుంది. దేవునికి ప్రతీ ఒక్కరు కావాలి. 50% కావాలి, 10% కావాలి, చివరకు 1% కూడా కావాలి. నీవు ఎలాంటివాడవైనా, తెలివైనవైనా, మూర్ఖుడివైనా, పరిశుద్దుడివైనా, పాపివైనా, ధనవంతుడివైనా, పేదోడివైనా నీవు ఎవరివైనా సరే! దేవునికి నీవే కావాలి!!!* 2. మొదటి ఉపమానం *లో గొర్రె -మంద నుండి తప్పిపోయింది.* రెండవ ఉపమానం లో *నాణెం -ఇంటిలోనే తప్పిపోయింది.* మూడవ ఉపమానం లో *చిన్ని కుమారుడు -తనకు తానే ఉద్దేశ్య పూర్వకంగా తప్పిపోయాడు.* 3. మొదటి ఉపమానం లో *గొర్రె మూర్ఖత్వం వలన తప్పిపోయింది.* యెషయా 53:6 ప్రకారం మనమంతా గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి. *గొర్రెల కాపరి యైన* *యేసయ్య* గొర్రెను వెదకి తీసుకుని వచ్చారు. రెండవ ఉపమానం లో *నాణెం ఆ స్త్రీ యొక్క నిర్లక్ష్యం వలన పడిపోయింది. గొర్రె, నాణెం రెండు చెడిపోయిన పాపి లేక దిగజారిపోయిన క్రైస్తవునికి సూచన. (చిన్న కుమారుడు కూడా). అయితే ఈ స్త్రీ *సంఘానికి, సంఘకాపరికి, సంఘపెద్దలకు* సూచనగా ఉన్నారు. చెడిపోయిన వారిని, దిగజారిపోయిన వారిని వెదకి తిరిగి క్రీస్తువద్దకు చేర్చాల్సిన భాద్యత వీరికుంది. మూడవ ఉపమానం లో *తనకుతానుగా తీసుకున్న తప్పుడు నిర్ణయానికి చిన్న కుమారునికి పందుల పొట్టు తినాల్సిన గతి పట్టింది. గాబట్టి తిరిగి తనకు తానుగా తప్పు తెలిసికొని, తిరిగి రావాలి. అప్పుడే చిన్న కుమారునికి రక్షణ వచ్చింది. చిన్న కుమారుని వెదకటానికి ఎవరూ వెళ్ళలేదు. తనకుతానుగా వచ్చాడు.* ఇదే ఈ మూడు ఉపమానాల సారాంశం. ఈ అధ్యాయం లో ముఖ్య వచనాలు: a)Luke(లూకా సువార్త) 15:7 *7.అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును.* 👉 కొన్ని ప్రతులలో ఈ విధముగా తర్జుమా చేయబడి యుంది. *అలాగే పశ్చాత్తాప పడనక్కరలేని• తొంభై తొమ్మిది మంది న్యాయవంతులకంటే పశ్చాత్తాపపడే ఒక్క పాపిని గురించి పరలోకంలో ఎక్కువ ఆనందం కలుగుతుందని మీతో చెపుతున్నాను.* *ఒక్కపాపి పశ్చాత్తాప పడి తండ్రిని సమీపిస్తే పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది.* b) Luke(లూకా సువార్త) 15:18 *18.నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి-తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;* 👉 ఈ రెండువచానాలు చాలా ప్రాముఖ్యమైనవి మరియు ఒకదానితో ఒకట సంభందం కలిగియున్నాయి. *అయితే మొదట తన తప్పు తెలిసికొని పశ్చాత్తాపపడి దేవుని వేడుకొంటే- ఆ పాపి రక్షణ పొందుకుంటాడు.* 👉 *అది దేవునికి- దేవుని* *దూతలకు సంతోషం కలిగిస్తుంది.* *అయితే ఆ పాపి/నీవు పశ్చాత్తాప పడకపోతే ఇవేమీ జరుగవు.* ఉదా: దప్పిగొనిన వారలారా! నీళ్ళయొద్దకు రండి. యెషయా 55:1 అంటూ వ్రాయబడింది. *దప్పిగొనిన వారలారా! అక్కడే ఉండండి. నీళ్ళు మీ దగ్గరకు వస్తాయి లేదా నేను మీ దగ్గరకు నీరు తెస్తాను అని వ్రాయబడలేదు. కాబట్టి నీపాపముల విషయమై నీవు పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు వస్తే, దేవుడు నీ దగ్గరకు వచ్చి, నీవు ఎంత పాపమనే మురికిలో ఉన్నా సరే, నిన్ను తన రక్తములో కడిగి, శుద్దునిగా చేసి పరలోకవారసునిగా చేస్తారు. నేడే ఆయన యొద్దకు రా!* అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక! *హల్లెలూయ...* *మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.* *ఆమేన్ ! ఆమేన్ !!
#📀యేసయ్య కీర్తనలు🎙
📀యేసయ్య కీర్తనలు🎙 - ShareChat