#📙ఆధ్యాత్మిక మాటలు
02-12-2025 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు వచ్చినప్పుడు మేము మీపై బలిహారము అవుతాము అని మీరు ప్రతిజ్ఞ చేశారు, మీకు ఈ ప్రతిజ్ఞను గుర్తు చేయించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు’’
ప్రశ్న:-ఏ ముఖ్యమైన విశేషత కారణముగా పూజ్యులు అని కేవలం దేవతలను మాత్రమే అనగలరు?
జవాబు:-దేవతల విశేషతయే ఏమిటంటే - వారు ఎప్పుడూ ఎవ్వరినీ స్మృతి చేయరు. వారు తండ్రినీ స్మృతి చేయరు, అలాగే ఎవరి చిత్రాలనూ స్మృతి చేయరు, అందుకే వారిని పూజ్యులు అని అంటారు. అక్కడ సుఖమే సుఖముంటుంది, అందుకే ఎవ్వరినీ స్మృతి చేయవలసిన అవసరము ఉండదు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రి స్మృతితో ఇటువంటి పూజ్యులుగా, పావనులుగా అవుతారు, అప్పుడిక స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు.
ఓంశాంతి. మధురాతి మధురమైన రుహాని పిల్లలు స్మృతి చేయరు... వాస్తవానికి రుహాని ఆత్మలు అని అనరు. రూహ్ అన్నా లేక ఆత్మ అన్నా విషయము ఒకటే. ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. పరమపిత పరమాత్మ ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆత్మలకు జ్ఞానాన్ని ఇవ్వలేదు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను ఒక్కసారి మాత్రమే కల్పము యొక్క పురుషోత్తమ సంగమయుగములో వస్తాను. మొత్తము కల్పములో సంగమయుగములో తప్ప స్వయము తండ్రి ఇంకెప్పుడూ రారు అని ఈ విధముగా ఇంకెవ్వరూ చెప్పలేరు. తండ్రి సంగమయుగములోనే వస్తారు, అప్పుడు భక్తి పూర్తవుతుంది మరియు తండ్రి కూర్చుని పిల్లలకు ఈ జ్ఞానాన్ని ఇస్తారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలామంది పిల్లలకు చాలా కష్టమనిపిస్తుంది. వాస్తవానికి ఇది చాలా సహజము కానీ బుద్ధిలో సరైన రీతిలో కూర్చోదు కావున పదే-పదే అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ అర్థం చేయించినా కూడా అర్థం చేసుకోరు. స్కూల్లో టీచర్ 12 నెలలు చదివిస్తారు, అయినా కానీ కొంతమంది ఫెయిల్ అయిపోతారు. ఈ అనంతమైన తండ్రి కూడా పిల్లలకు ప్రతిరోజు చదివిస్తారు, అయినా కానీ కొంతమందికి ధారణ అవుతుంది, కొంతమంది మర్చిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి - ఈ ముఖ్యమైన విషయాన్నే అర్థం చేయించడము జరుగుతుంది. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రియే చెప్తారు, ఇతర మనుష్యమాత్రులెవ్వరూ ఎప్పుడూ ఇలా చెప్పలేరు. తండ్రి అంటారు, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను, కల్పము తర్వాత మళ్ళీ సంగమయుగములో ఒక్కసారి మాత్రమే పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేయిస్తాను. మీరే ఈ జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుంటారు, ఇతరులెవ్వరూ ఈ జ్ఞానాన్ని తీసుకోనే తీసుకోరు. ప్రజాపిత బ్రహ్మా యొక్క ముఖవంశావళి బ్రాహ్మణులైన మీరు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. కల్పక్రితము కూడా తండ్రి ఈ సంగమయుగములో ఈ జ్ఞానాన్ని వినిపించారని మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఈ పాత్ర ఉంది, ఈ వర్ణాలలోకి కూడా తప్పకుండా రావలసిందే. ఇతర ధర్మాల వారు ఈ వర్ణాలలోకి రానే రారు, భారతవాసులే ఈ వర్ణాలలోకి వస్తారు. బ్రాహ్మణులుగా కూడా భారతవాసులే అవుతారు, అందుకే తండ్రి భారత్ లోనే రావలసి వస్తుంది. మీరు ప్రజాపిత బ్రహ్మా యొక్క ముఖవంశావళి బ్రాహ్మణులు. బ్రాహ్మణుల తర్వాత దేవతలు మరియు క్షత్రియులు ఉంటారు. వాస్తవానికి ఎవ్వరూ ప్రత్యేకముగా క్షత్రియులుగా అవ్వరు. మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారుచేస్తారు, ఆ తర్వాత మీరు దేవతలుగా అవుతారు, ఆ తర్వాత నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గిపోయినప్పుడు వారినే క్షత్రియులని అంటారు. క్షత్రియులుగా ఆటోమేటిక్ గా అవ్వడము జరుగుతుంది. తండ్రి అయితే వచ్చి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు, ఆ తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు, మళ్ళీ వారే క్షత్రియులుగా అవుతారు. మూడు ధర్మాలను ఒక్క తండ్రియే ఇప్పుడు స్థాపన చేస్తారు. స్థాపన చేయడము కోసమని తండ్రి మళ్ళీ సత్య, త్రేతాయుగాలలోకి వస్తారని కాదు. అర్థం చేసుకోని కారణముగా మనుష్యులు తండ్రి సత్య, త్రేతాయుగాలలో కూడా వస్తారని అంటారు. తండ్రి అంటారు, నేను ప్రతి యుగములోనూ రాను, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను, కల్పము యొక్క సంగమయుగములో వస్తాను. మిమ్మల్ని నేనే బ్రాహ్మణులుగా తయారుచేస్తాను, ప్రజాపిత బ్రహ్మా ద్వారా. నేనైతే పరంధామము నుండి వస్తాను. అచ్ఛా, బ్రహ్మా ఎక్కడ నుండి వస్తారు? బ్రహ్మా అయితే 84 జన్మలు తీసుకుంటారు, నేను తీసుకోను. బ్రహ్మా-సరస్వతులే విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణులుగా అవుతారు, వారే 84 జన్మలు తీసుకుంటారు, మళ్ళీ వారి అనేక జన్మల అంతిమములో ప్రవేశించి వారిని బ్రహ్మాగా చేస్తాను. వారికి బ్రహ్మా అని నేను పేరు పెడతాను. ఇదేమీ వారి సొంత పేరు కాదు. పిల్లలు జన్మించినప్పుడు ఆరవ రోజు పండుగను జరుపుతారు, జన్మ దినాన్ని జరుపుతారు, వారి జన్మపత్రికలోని పేరు అయితే లేఖ్ రాజ్. అది బాల్యములోని పేరు. సంగమయుగములో ఎప్పుడైతే తండ్రి ప్రవేశించారో, అప్పుడు పేరు మారింది, అది కూడా వీరు వానప్రస్థ అవస్థలో ఉన్నప్పుడు పేరు మారుతుంది. ఆ సన్యాసులైతే ఇళ్ళు-వాకిళ్ళను వదలి వెళ్ళినప్పుడు పేరు మారుతుంది. వీరైతే ఇంటిలోనే ఉంటారు, వీరికి బ్రహ్మా అన్న పేరు పెట్టారు, ఎందుకంటే బ్రాహ్మణులు కావాలి కదా. మిమ్మల్ని తమవారిగా చేసుకుని పవిత్ర బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. పవిత్రముగా తయారుచేయడము జరుగుతుంది, అంతేకానీ మీరు జన్మించడముతోనే పవిత్రముగా ఉన్నారని కాదు. మీకు పవిత్రముగా తయారయ్యేందుకు శిక్షణ లభిస్తుంది. పవిత్రముగా ఎలా అవ్వాలి? ఇదే ముఖ్యమైన విషయము.
భక్తి మార్గములో పూజ్యులు ఒక్కరు కూడా ఉండరని మీకు తెలుసు. గురువులు మొదలైనవారికి మనుష్యులు తల వంచి నమస్కరిస్తారు ఎందుకంటే వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి పవిత్రముగా అవుతారు, అంతేకానీ వారిని పూజ్యులని అనరు. ఎవరైతే ఎవ్వరినీ స్మృతి చెయ్యరో, వారే పూజ్యులు. సన్యాసులు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు కదా, ప్రార్థన చేస్తారు. సత్యయుగములో ఎవ్వరినీ స్మృతి చేయరు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు ఒక్కరినే స్మృతి చేయాలి. అదంతా భక్తి. మీ ఆత్మ కూడా గుప్తముగా ఉంది. ఆత్మ గురించి యథార్థ రీతిగా ఎవ్వరికీ తెలియదు. సత్య, త్రేతాయుగాలలో కూడా శరీరధారులు తమ పేర్లతోనే పాత్రను అభినయిస్తారు. పాత్రధారులు అన్న తర్వాత పేరు లేకుండానైతే ఉండలేరు. ఎక్కడున్నా సరే శరీరానికి తప్పకుండా పేరు ఉంటుంది. పేరు లేకుండా పాత్రనెలా అభినయిస్తారు. తండ్రి అర్థం చేయించారు - మీరు వచ్చినట్లయితే మేము మిమ్మల్నే మా వారిగా చేసుకుంటాము, ఇతరులెవ్వరినీ కాదు అని భక్తి మార్గములో పాడుతారు. మేము మీకు చెందినవారిగానే అవుతాము అని ఆత్మ అంటుంది. భక్తి మార్గములో ఏయే దేహధారులైతే ఉన్నారో, ఎవరికైతే పేర్లు పెట్టడము జరుగుతుందో, వారిని మేము పూజించము, ఎప్పుడైతే మీరు వస్తారో, అప్పుడు మీపైనే బలిహారమవుతాము. ఎప్పుడు వస్తారు, ఇది కూడా తెలియదు. అనేక దేహధారులను, నామధారులను పూజిస్తూ ఉంటారు. అర్ధకల్పము భక్తి పూర్తయినప్పుడు తండ్రి వస్తారు. వారు అంటున్నారు, మేము మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయము, మా దేహాన్ని కూడా స్మృతి చేయము అని మీరు జన్మ జన్మాంతరాలుగా అంటూ వచ్చారు. కానీ నా గురించి తెలియనే తెలియకపోతే మరి ఎలా స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. తండ్రియే పతిత-పావనుడు, వారిని స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా, సతోప్రధానముగా అయిపోతారు. సత్య, త్రేతాయుగాలలో భక్తి ఉండదు. మీరు ఎవ్వరినీ స్మృతి చేయరు. తండ్రినీ స్మృతి చేయరు, అలాగే చిత్రాలనూ స్మృతి చేయరు. అక్కడైతే సుఖమే సుఖముంటుంది. తండ్రి అర్థం చేయించారు - ఎంతగా మీరు సమీపముగా వస్తూ ఉంటారో, అంతగా కర్మాతీత అవస్థ తయారవుతూ ఉంటుంది. సత్యయుగములో కొత్త ప్రపంచములో, కొత్త ఇంటిలో సంతోషము కూడా చాలా ఉంటుంది, ఆ తర్వాత 25 శాతము పాతదిగా అయినప్పుడు స్వర్గాన్నే మర్చిపోయినట్లవుతుంది. తండ్రి అంటారు - మీ వారిగానే అవుతాము, మీ నుండే వింటాము అని మీరు పాడేవారు. తప్పకుండా మీరు పరమాత్మతోనే ఇలా అనేవారు కదా. ఆత్మ తన తండ్రి అయిన పరమాత్మతో ఇలా అంటుంది. ఆత్మ సూక్ష్మమైన బిందువు, దానిని చూడటానికి దివ్యదృష్టి కావాలి. ఆత్మపై ధ్యానము చేయలేరు. ఆత్మనైన నేను ఇంత చిన్న బిందువును అని ఈ విధముగా భావిస్తూ స్మృతి చేయడమనేది శ్రమతో కూడుకున్నది. ఆత్మ సాక్షాత్కారము కోసం ప్రయత్నించరు, పరమాత్మ కోసం ప్రయత్నిస్తారు, వారు వేయి సూర్యుల కన్నా తేజోమయుడు అని వారి గురించి విన్నారు. ఎవరికైనా సాక్షాత్కారమైతే, వారు చాలా తేజోమయముగా ఉన్నారని అంటారు ఎందుకంటే అదే విని ఉన్నారు. ఎవరికైతే నవ విధ భక్తి చేస్తారో, సాక్షాత్కారము కూడా వారిదే చూస్తారు. లేకపోతే విశ్వాసమే కూర్చోదు. తండ్రి అంటారు, ఆత్మనే చూడకపోతే ఇక పరమాత్మను ఎలా చూస్తారు. ఆత్మను అసలు ఎలా చూడగలరు, మిగిలినవారందరికీ అయితే శారీరక చిత్రాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, కానీ ఆత్మ ఒక బిందువు, చాలా చిన్ననిది, దానిని ఎలా చూడగలరు. చాలా ప్రయత్నిస్తారు కానీ ఈ కళ్ళతో చూడలేరు. ఆత్మకు జ్ఞానము యొక్క అవ్యక్త నేత్రాలు లభిస్తాయి.
ఆత్మలమైన మనము ఎంత చిన్నగా ఉంటాము అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది, దానిని నేను రిపీట్ చేయాలి. శ్రేష్ఠముగా తయారుచేసేందుకని తండ్రి శ్రీమతము లభిస్తుంది కావున దానిపై నడవాలి. మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి. అన్నపానాదులు కూడా రాయల్ గా ఉండాలి, నడవడిక చాలా రాయల్ గా ఉండాలి. మీరు దేవతలుగా అవుతారు. దేవతలు స్వయం పూజ్యులు, వారెప్పుడూ ఎవరి పూజను చేయరు. వారు డబుల్ కిరీటధారులు కదా. వారు ఎప్పుడూ ఎవరినీ పూజించరు కావున వారు పూజ్యులు కదా. సత్యయుగములో ఎవ్వరినీ పూజించే అవసరమే ఉండదు. కానీ ఒకరికొకరు గౌరవాన్ని తప్పకుండా ఇచ్చుకుంటారు. ఈ విధముగా నమస్కరించడాన్ని గౌరవము అని అంటారు. అలాగని మనసులో వారిని స్మృతి చేయాలని కాదు. గౌరవమైతే ఇవ్వాల్సిందే. ఉదాహరణకు ప్రెసిడెంట్ ఉన్నారు, అందరూ వారిని గౌరవిస్తారు. వీరు పెద్ద పదవి కలవారు అని తెలుసు. వారికి నమస్కరించవలసిన అవసరము లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ జ్ఞాన మార్గము పూర్తిగా వేరు, ఇందులో కేవలం స్వయాన్ని ఆత్మగా భావించాలి, దీనిని మీరు మర్చిపోయారు. శరీరము యొక్క పేర్లను తలచుకుంటూ వచ్చారు. పనులైతే తప్పకుండా పేర్లతోనే చేయాలి. పేరు లేకుండా ఎవరినైనా ఎలా పిలుస్తారు. మీరు శరీరధారులై పాత్రను అభినయిస్తున్నారు కానీ బుద్ధితో శివబాబాను స్మృతి చేయాలి. శ్రీకృష్ణుని భక్తులు - తాము శ్రీకృష్ణుడినే స్మృతి చేయాలని భావిస్తారు. ఎక్కడ చూసినా, కృష్ణుడే కృష్ణుడు, నేనూ కృష్ణుడినే, నీవూ కృష్ణుడివే అని అంటారు. అరే, నీ పేరు వేరు, అతని పేరు వేరు... అందరూ కృష్ణులే కృష్ణులుగా ఎలా అవ్వగలరు. అందరికీ కృష్ణుడు అన్న పేరు ఉండదు, ఏది అనిపిస్తే అది అంటూ ఉంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గపు చిత్రాలు మొదలైనవాటినన్నింటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయండి. చిత్రాలనైతే మీరు పతిత-పావన అని అనరు, హనుమంతుడు మొదలైనవారు పతిత-పావనులు కారు. అనేక చిత్రాలు ఉన్నాయి. ఎవ్వరూ పతిత-పావనులు కారు. శరీరమున్న దేవీలు మొదలైనవారినెవ్వరినీ పతిత-పావనులు అని అనరు. 6-8 భుజాల కల దేవీలు మొదలైనవారిని తయారుచేస్తారు, అంతా తమ బుద్ధితోనే తయారుచేస్తారు. వారెవరు అన్నది తెలియదు. ఈ పతిత-పావనుడైన తండ్రి యొక్క పిల్లలు సహాయకులని ఎవ్వరికీ తెలియదు. మీ రూపమైతే ఈ విధముగా సాధారణముగానే ఉంటుంది. ఈ శరీరాలైతే వినాశనమైపోతాయి. మీ చిత్రాలు మొదలైనవి ఉంటాయని కాదు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. వాస్తవానికి దేవీలు మీరే. సీతా దేవి, ఫలానా దేవి అని పేర్లు కూడా తీసుకోవడము జరుగుతుంది. రామ దేవత అని అనరు. ఫలానా దేవీ లేక శ్రీమతి అని అంటూ ఉంటారు, అది కూడా తప్పే అవుతుంది. ఇప్పుడు పావనముగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి. పతితము నుండి పావనముగా చేయండి అని మీరంటారు కూడా. అంతేకానీ లక్ష్మీ-నారాయణులుగా చేయండి అని అనరు. పతితము నుండి పావనముగా కూడా తండ్రియే తయారుచేస్తారు. నరుని నుండి నారాయణునిగా కూడా వారే తయారుచేస్తారు. వారు పతిత-పావన అని నిరాకారుడిని అంటారు. సత్యనారాయణుని కథను వినిపించేవారిని వేరే చూపించారు. బాబా, మీరు సత్యనారాయణ కథను వినిపించి అమరులుగా చేయండి, నరుని నుండి నారాయణునిగా తయారుచేయండి అని అయితే అనరు. కేవలం - మీరు వచ్చి పావనముగా చేయండి అని మాత్రమే అంటారు. బాబాయే సత్యనారాయణుని కథను వినిపించి పావనముగా తయారుచేస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు సత్య కథను వినిపిస్తారు. దీనిని ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. మీరు మాత్రమే తెలుసుకుంటారు. మీ ఇంటిలో మిత్ర-సంబంధీకులు, సోదరులు మొదలైనవారు ఉన్నా కానీ వారు కూడా అర్థం చేసుకోరు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వయాన్ని శ్రేష్ఠముగా తయారుచేసుకునేందుకు తండ్రి యొక్క శ్రీమతమేదైతే లభిస్తుందో, దానిపై నడవాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి. అన్నపానాదులు, నడవడిక అన్నీ రాయల్ గా ఉంచుకోవాలి.
2. ఒకరినొకరు స్మృతి చేయకూడదు కానీ గౌరవాన్ని తప్పకుండా ఇవ్వాలి. పావనముగా అయ్యే పురుషార్థాన్ని చేయాలి మరియు చేయించాలి.
వరదానము:-నీరస వాతావరణములో సంతోషపు మెరుపును అనుభవము చేయించే ఎవర్ హ్యాపీ భవ
ఎవర్ హ్యాపీగా అనగా సదా సంతోషముగా ఉండే వరదానము ఏ పిల్లలకైతే ప్రాప్తించిందో, వారు దుఃఖపు అలను ఉత్పన్నము చేసే వాతావరణములో, నీరస వాతావరణములో, అప్రాప్తిని అనుభవం చేయించే వాతావరణములో సదా సంతోషముగా ఉంటారు మరియు తమ సంతోషపు మెరుపుతో దుఃఖము మరియు ఉదాసీనతతో కూడిన వాతావరణాన్ని ఏ విధముగా పరివర్తన చేస్తారంటే, సూర్యుడు అంధకారాన్ని పరివర్తన చేసినట్లుగా చేస్తారు. అంధకారము మధ్యన ప్రకాశాన్ని తీసుకురావడము, అశాంతిలో శాంతిని తీసుకురావడము, నీరస వాతావరణములో సంతోషపు మెరుపును తీసుకురావడము, దీనినే ఎవర్ హ్యాపీ అని అంటారు. వర్తమాన సమయములో ఈ సేవ యొక్క అవసరమే ఉంది.
స్లోగన్:-అశరీరి ఎవరంటే - ఎవరినైతే శరీరము యొక్క ఏ ఆకర్షణ తనవైపుకు ఆకర్షించదో వారు.
అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలనే ధ్యాసలోనే ఉండండి
కర్మాతీతము అంటే కర్మల నుండి అతీతమైపోవటము అని అర్థము కాదు. కర్మ నుండి అతీతమవ్వటము కాదు, కర్మ యొక్క బంధనములో చిక్కుకోవటము నుండి అతీతమవ్వటము - దీనినే కర్మాతీతము అని అంటారు. కర్మయోగ స్థితి కర్మాతీత స్థితిని అనుభవము చేయిస్తుంది. ఈ కర్మయోగ స్థితి అతి ప్రియమైన మరియు అతీతమైన స్థితి. ఈ స్థితి ద్వారా ఎంత పెద్ద కార్యమైనా, శ్రమతో కూడిన కార్యమైనా కానీ, అది ఎలా అనిపిస్తుందంటే పని చెయ్యటము లేదు కానీ ఆడుకుంటున్నాము అన్నట్లు ఉంటుంది.
"