#🌅శుభోదయం #😇My Status #🙆 Feel Good Status #✌️నేటి నా స్టేటస్ శ్రీ గురుభ్యోనమః🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,
తేది ... 31 - 3 - 2026,
వారం ... భౌమ్య వాసరే (మంగళ వారము),
శ్రీ పరాభవ నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
శుక్ల పక్షం,
తిధి : త్రయోదశి ఉ 6.50 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం : పుబ్బ సా 3.19 వరకు
తదుపరి ఉత్తర
యోగం: గండం మ 3.47 వరకు
తదుపరి వృద్ధి
కరణం : తైతుల ఉ 6.50 వరకు
గరజి రా 6.40 వరకు
వర్జ్యం : రా 10.38 - 12.16 వరకు
దుర్ముహూర్తం : ఉ 8.25 - 9.14 వరకు
రా 10.53 - 11.40 వరకు
అమృతకాలం : ఉ 8.54
- 10.30 వరకు
రాహుకాలం : మ 3.00 - 4.30 వరకు
యమగండం : ఉ 9.00 - 10.30 వరకు
సూర్యరాశి : మీనం
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : 6.00
సూర్యాస్తమయం:6.09
*నేటి విశేషం*
ఒంటిమిట్ట రామస్వామి వారి కళ్యాణ మహోత్సవం,
మహావీర్ జయంతి,
రేవతి కార్తె ప్రారంభం రా 10.11
*నేటి మాట*
ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మాణేినమః
గురుచరిత్ర - 59
నవమాధ్యాయం
నామధారకుడు ప్రణుతుడై సిద్ధుని మరలా ఇట్లు అడిగినాడు.
కృపానిధి! శ్రీపాదుల వారు కురువపురము నందు ఉన్న సమయంలో జరిగిన కథ పూర్తిగా చెప్పగొరెదను.
నామధారకా! ఆ సమయంలో సంభవించిన విశేషములు తెలిపెదను, వినుము.
కురువపురములో ఒక రజకుడు శ్రీపాదుల వారికి సేవకుడై ఉండేవాడు.
శ్రీపాదుల వారు నిత్యమూ కృష్ణానదిలో స్నానమునకు వెళ్ళుచుండేవారు.
త్రిమూర్తులు స్వయముగా కృతార్థులు అయిననూ లోకసంగ్రహమునకై నిత్యమూ స్నానమునకై వెళ్ళుచుండిరి.
కృష్ణాప్రవాహ మధ్యమున భక్తకామదులైన శ్రీపాదుల ఒకనాడు స్నానమునకు ఉద్యుక్తులు అయినారు.
ఆ నది ఒడ్డు నందే రజకుడు వస్త్రములను ఉతుకుచున్నాడు.
భక్తితో స్వామిని చేరి ఆ రజకుడు ప్రతిదినమూ స్వామికి నమస్కారము చేసేవాడు.
త్రికాలములందు వాడు శ్రీపాదుల వారికి సాష్టాంగ నమస్కారము అర్పించేవాడు.
మనోవాక్కాయములందు భక్తితో రజకుని సేవ ఇలా కొన్ని రోజులు జరిగెను.
శ్రీపాద శ్రీవల్లభుల వారు ఆ రజకుని యందు ప్రసన్నులై ఒకనాడు వానితో ఇట్లు పలికిరి.
ఓ రజకా! ప్రతిదినమూ ఈ విధముగా నాకు ప్రణామము చేస్తున్నావు, నా నుండి నీవు ఏమి ఆశిస్తున్నావు?
భక్తా! నీకు రాజ్యము కావలెనా?
ఈ మాటలు గురుదేవుని నోటి నుండి వినిన రజకుడు,
తన వస్త్రమును కొంగున ముడి వేసుకొని,
చేతులు కట్టుకొని,
స్వామీ! మీరే ఈశ్వరులు, సత్యసంకల్పులు. అన్నాడు.
అప్పటి నుండి అతడు సంసార చింతన వీడి గురుసేవకుడు అయినాడు.
దూరముగా స్వామి వారిని చూసినా దండప్రణాణము ఆచరించువాడు.
ఈవిధముగా చాలా కాలము గడిచింది.
ఆ రజకుడు ప్రతిదినమూ శ్రీపాదుల వారి నివాసము ముందర ప్రాంగణము తుడిచి, నీరు జల్లి ఉంచేవాడు.
ఒకమారు వసంతఋతువున, వైశాఖమాసమందు ఒక యవనరాజు జలక్రీడలు ఆడుచూ, నదీతీరమునకు వచ్చినాడు.
ఆభరణాలంకృతలయిన స్త్రీలతో ఆ రాజు స్వయముగా అలంకరించుకొని, జలమధ్యమున నౌకలో విహరించుచున్నాడు.
గజతురగ పదాతి దళములు రెండు తీరములందు ఉండిరి.
ఆ రాజు రెండు తీరములలో ఉన్న తన సేవకులను నది మధ్యలో నౌకలో నుండి పరికించి చూస్తున్నాడు.
కృష్ణా తీరములందు నానావిధములైన వాయిద్యములు మ్రోగుచున్నాయి.
రాజు ప్రవాహంలో స్త్రీలతో జలక్రీడలు ఆడుచూ ఉన్న్మత్తుడై ఉన్నాడు.
రజకుడు ఆ వాద్య శబ్దమును విని శ్రీగురు చింతనము మాని, కృష్ణానది మధ్యలో ఉన్న రాజును చూస్తూ విస్మయం చెందినాడు.
ఈ సంసారమున జన్మించి ఇట్టి సౌఖ్యమును, వైభవమును పొందనిచో జన్మయే వ్యర్ధము.
ఈశ్వరుని భక్తులు సేవించినట్లు,
వీనిని నానాలంకార భూషితులైన స్త్రీలు సేవించుచున్నారు.
ఇతడు ఎట్టి పుణ్యము సంపాదించినాడో కదా!
ఈ రాజు గురువు ఎవరో కదా!
ఏ దేవుడిని ఇతడు ఆరాధించినాడో కదా!
ఇట్టి మహర్దశ వీనికి లభించుట ఏ విధంగా సంభవించినదో కదా!
అని మనస్సులో అనుకుంటూ,
తిరిగి వచ్చిన శ్రీపాదుల వారిని చూసి దండ ప్రణామాలు ఆచరించినాడు.
ఎదురుగా నిలిచినాడు.
సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందమస్తు 🙏
#🙆 Feel Good Status #✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం #😇My Status శ్రీ గురుభ్యోనమః🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,
తేది ... 30 - 3 - 2026,
వారం ... ఇందు వాసరే (సోమ వారము),
శ్రీ పరాభవ నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
శుక్ల పక్షం,
తిధి : ద్వాదశి ఉ 7.39 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం : మఖ సా 3.18 వరకు
తదుపరి పుబ్బ
యోగం: శూలం సా 5.25 వరకు
తదుపరి గండం
కరణం : బాలువ ఉ 7.39 వరకు
కౌలువ రా 7.15 వరకు
వర్జ్యం : రా 11.18 - 12.54 వరకు
దుర్ముహూర్తం : మ 12.28 - 1.16 వరకు
మ 2.53 - 3.42 వరకు
అమృతకాలం : మ 12.56
- 2.30 వరకు
రాహుకాలం : ఉ 7.30 - 9.00 వరకు
యమగండం : ఉ 10.30 - 12.00 వరకు
సూర్యరాశి : మీనం
చంద్రరాశి : కర్కాటకం
సూర్యోదయం : 6.00
సూర్యాస్తమయం:6.08
*నేటి మాట*
ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మాణేినమః
గురుచరిత్ర - 58
అంబికా! నీ చిత్తము నందు సత్పుత్ర వాంఛ ఉన్నది.
కావున నీవు ప్రదోషవేళలో శివార్చన చేయుచూ ఉన్నచో,
నావంటి పుత్రుడు నిస్సంశయంగా నీకు జన్మాంతరమున జన్మించును.
ఈ విధముగా శ్రీపాదుల వారు సెలవిచ్చినప్పటికీ,
అంబికకు వచ్చిన దుఃఖము సహింపజాలక ఉన్నదని శ్రీపాదులు గమనించి,
భక్తవత్సలుడు కనుక శ్రీపాదుల వారు ప్రసన్నులై,
ఆమె కుమారుని పిలిచి,
వాని మస్తకమున తన హస్తమును ఉంచిరి.
వెంటనే అంబిక కుమారుడు జ్ఞానియై, త్రివేద వేత్త అయినాడు.
ఆ పుత్రుడు అంతవరకూ మందబుద్ధి అయినవాడు,
వెంటనే వేద భాష్య తర్కాదుల యందు నిపుణుడై,
వేదపాఠము చేయుచుండగా,
చూసిన వాని తల్లి అంబిక, విస్మయమును పొందెను.
శ్రీపాదుల వారు నిశ్చయముగా ఈశ్వరులే,
కార్యార్థము మానుష వేషధారియై అవతరించిరని,
విప్రవనిత అంబిక భావించి,
పూర్వజన్మలో ఆర్జించిన పుణ్యము వలన,
గురునాధులు ఇచ్చట తటస్థ పడినారని భావించుచూ,
క్షణక్షణమూ శ్రీపాదుల వారికి నమస్కరించుచూ,
స్వామీ! శివుడు మీరే! ప్రదోషమున మిమ్మలిని అర్చించెదను.
మీ వాక్యము మిధ్య కాదు.
నా పుత్రుడు మీవంటి వాడు అగును.
అని అనుచూ, స్వామి వారిని పూజించి,
తరువాత స్వగ్రామమును చేరినది.
అది మొదలుకొని ప్రతీ ప్రదోషము నందు శంకరుని పూజించింది.
అంబిక సుతుడు వేదశాస్త్రార్థ సంపన్నుడై జ్ఞాని అయినాడు.
ఆ పిల్లవాడు సర్వాధిక పూజ్యుడై, వినయవంతుడై, శ్రీపాదుల వారి అనుగ్రహమున వివాహము కాగా,
పుత్ర పౌత్రాది సమన్వితుడై,
అదే గ్రామమున సంతుష్టుడై నివసించాడు.
గురుకృప భక్తజనులకు సర్వార్థములను ఒసగును.
కృపాసింధువు అయిన గురువు భక్తులకు సకలానందములు, అఖిల సంపత్తి ఒసగును.
ఈ విధముగా సిద్ధుడు నామధారకునకు ప్రదోష వేళ యొక్క విశేషములతో చెప్పినాడు.
ఇతి శ్రీగురుచరిత్ర పరమ కథా కల్పతరౌ నృసింహ సరస్వత్యుపాఖ్యానే ఙ్ఞానకాండే సిద్ధనామధారక సంవాదే ప్రదోషకాల శివపూజాఫలం నామ అష్టమోద్యాయః
సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందమస్తు 🙏
#🙆 Feel Good Status #😇My Status #🌅శుభోదయం #✌️నేటి నా స్టేటస్ శ్రీ గురుభ్యోనమః🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,
తేది ... 29 - 3 - 2026,
వారం ... భాను వాసరే (ఆది వారము),
శ్రీ పరాభవ నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
శుక్ల పక్షం,
తిధి : ఏకాదశి ఉ 8.55 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం : ఆశ్లేష సా 3.43 వరకు
తదుపరి మఖ
యోగం: ధృతి రా 7.26 వరకు
తదుపరి శూలం
కరణం : భద్ర ఉ 8.55 వరకు
బవ రా 9.32 వరకు
వర్జ్యం : ఉ 6.28 వరకు
తె 3.31 - 5.05 వరకు
దుర్ముహూర్తం : సా 4.31- 5.19 వరకు
అమృతకాలం : మ 2.11 - 3.43 వరకు
రాహుకాలం : సా 4.30 - 6.00 వరకు
యమగండం : మ 12.00 - 1.30 వరకు
సూర్యరాశి : మీనం
చంద్రరాశి : కర్కాటకం
సూర్యోదయం : 6.01
సూర్యాస్తమయం:6.08
*నేటి విశేషం*
మతత్రయ ఏకాదశి,
వాడపల్లి తీర్థము,
సింహాచల శ్రీవరాహా లక్ష్మీ నృసింహ స్వామి వార్ల వార్షిక కల్యాణం
*నేటి మాట*
ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మాణేినమః
గురుచరిత్ర - 57
ఆ బాలుడు స్థాపించిన శివలింగము రత్నమయమై కోటి సూర్య ప్రకాశమై వెలసెను.
ప్రజలు అందరూ అక్కడ రవి ఉదయించాడు అనుకొనిరి.
యుద్ధము చేయవచ్చిన రాజులు తమ తమ మనస్సులలో శంకలు తోచగా, ద్వేషము విడిచి, రాజదర్శనము కర్తవ్యము అని భావించిరి.
ఈ పవిత్రమైన నగరము నందు రాత్రివేళ సూర్యుడు ఉదయించినాడు.
కావున ఈ రాజు పవిత్రుడు.
ఇతనితో విరోధము పనికిరాదు.
అని తలంచుచూ వారు,
తాము నగరము చూడవచ్చితిమి అని దూతలను పంపినారు.
రాజు వారికి ఎదురేగి, హర్షంతో నగరమునకు కొనివచ్చినాడు.
స్నేహంతో కూడిన ఆ రాజులు ఒకరినొకరు చూసుకుంటూ,
రాత్రి చీకటిలో సూర్యోదయము ఎట్లు అయ్యెనో అని సంభాషించుకుంటూ,
చిత్రసేన మహారాజుతో సహితముగా రత్నఖచితమైన శివాలయమును చూసిరి.
బాలుని ముఖము ద్వారా శివలింగావిర్భావ కథ విని,
ఆ బాలునకు గోపాలురపై ఆధిపత్యమును, సంపదలను ఇచ్చిరి.
ఆ తర్వాత, వచ్చిన రాజులు అందరూ తమ తమ దేశములకు పోయిరి.
రాజైన చిత్రసేనునకు శత్రు దండయాత్రల వలన భయము తీరినది.
శని ప్రదోష సమయంలో శివపూజా ఫలము ఇట్టిది.
శైవుడైన గోపకుమారుడు గృహమునకు మరలి వచ్చి, తల్లితో జన్మాంతరమున నీ కడుపున విష్ణువు అవతరించగలడు,
ఈ వరము నీకు కర్పూరగౌరుడైన పరమేశ్వరుడు సంతుష్టుడై ఇచ్చినాడు.
ప్రదోషవేళ శివదర్శనం చేసినందున శివుడు నీకు ప్రసన్నుడు అయినాడు.
నీ అపరాధము క్షమింపుమని నేను శివుని యాచించితిని.
శూలపాణి నిన్ను క్షమించి, నాకు కూడా సద్వరములను ఇచ్చినాడు.
అని తల్లికి వృత్తాంతము అంతయూ చెప్పినాడు.
ఈశ్వరుడు ప్రసన్నుడైన,
ఎవరికి ఏది దుర్లభము!?
సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందమస్తు 🙏
#✌️నేటి నా స్టేటస్ #🙆 Feel Good Status #😇My Status #🌅శుభోదయం శ్రీ గురుభ్యోనమః🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,
తేది ... 28 - 3 - 2026,
వారం ... స్థిర వాసరే (శని వారము),
శ్రీ పరాభవ నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
శుక్ల పక్షం,
తిధి : దశమి ఉ 10.35 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం : పుష్యమి సా 4.33 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: సుకర్మం రా 9.44 వరకు
తదుపరి ధృతి
కరణం : గరజి ఉ 10.35 వరకు
వణిజ రా 9.45 వరకు
వర్జ్యం : తె 4.55 నుండి
దుర్ముహూర్తం : ఉ 6.01 - 7.37 వరకు
అమృతకాలం : ఉ 10.27 - 11.59 వరకు
రాహుకాలం : ఉ 9.00 - 10.30 వరకు
యమగండం : మ 1.30 - 3.00 వరకు
సూర్యరాశి : మీనం
చంద్రరాశి : మిథునం
సూర్యోదయం : 6.01
సూర్యాస్తమయం:6.08
*నేటి విశేషం*
ధర్మరాజ దశమి,
పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి కళ్యాణం
*నేటి మాట*
ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మాణేినమః
గురుచరిత్ర - 56
అంబిక శ్రీపాదుల వారి వచనములు విని సంతుష్టియై,
ఆ ద్విజాంగణ శ్రీగురు చరణములకు నమస్కరించి,
స్వామీ! చిత్రమైన, నవీనమైన కథను చెప్పితిరి.
ప్రదోషమందు నందీశ్వరార్చన చూసినందుననే కృష్ణుని పుత్రునిగా పొందగలిగిన గోపిక జన్మ ధన్యము.
అట్టి శివపూజా విశేషము నాకు కూడా తెలియజేయమని వేడుకున్నది.
శ్రీపాదుల వారు, ఈ కథ స్కాందపురాణమున ఉన్న కథయే.
ఉజ్జయిని అను పేరుగల సుందర నగరి కలదు.
అందు చిత్రసేనుడు అను రాజు అతి ధార్మికుడై ఉండెను.
వానికి మణిభద్రుడు అను మిత్రుడు ఉండేవాడు.
ఆ మిత్రుడు ఈశ్వర భక్తి సంపన్నుడు.
ఈశ్వర పూజా పరాయణుడు.
శివుని ప్రసన్నుని చేసుకొనగా వానికి ఈశ్వరుడు చింతామణి ని ఇచ్చినాడు.
ఆ మణి ధరణీతలమున కోటి సూర్య ప్రభలతో వెలుగుచుండెను.
మణిభద్రుడు తన కంఠము నందు ఆ మణిని ఎల్లప్పుడూ ధరించి ఉండేవాడు.
ఆ మణి యొక్క తేజస్సు తాకిన లోహము సద్యోవిద్యోతితాత్మకమై కాంచనము అయ్యేది.
ఆ మణి స్మరణము వలన సంకల్పితమైన వస్తువు లభించును.
ఆ మణి ఖ్యాతి విని అనేక మంది రాజులు వచ్చి చూసినారు.
కొందరు స్నేహంతో, మరికొందరు కుతూహలంతో, ఇంకొందరు బలాత్కారంగా, మరికొందరు మూల్యం ఇచ్చి రాజు ధరించిన మణి చూసి వెళ్ళిరి.
ఏ విధముగా అయినా మాకు ఆ మణిని ఇమ్మని కొందరు రాజులు దూతలను పంపించినారు.
మరికొంతమంది యుద్ధమునకు వచ్చినారు.
ఈ విధముగా ఉజ్జయిని లో రాజులు అందరూ చేరి, మహాబలములతో ఆ రాష్ట్రమును చుట్టుముట్టి,
మణిగ్రహణలాలసులై ఉండిరి.
శనివారమున త్రయోదశి యందు రాజు,
మంత్రులతో కూడి,
ప్రదోషవేళ విధివిధానమున శంకరుని అర్చించుటకు నిశ్శకముగా కూర్చొని ఉన్నాడు.
ఆ రాజు హర్షముతో మహేశ్వరుని పూజించుచున్నాడు.
ఆ సమయమున శివ సందర్శనమునకై కొందరు గోపబాలురు వచ్చినారు.
ఆ పిల్లలు లింగపూజను చూసి, మరలా తమ పేటలో ఒక ప్రాంగణమున శివమందిరము నిర్మించి,
పాషాణ లింగమును సిద్ధపరచి,
దానిని భక్తితో వినోదంతో అర్చించారు.
ఆ పాషాణ లింగమునకు కల్పితోపచారాలు చేశారు.
లభించిన పత్రములతో పూజించినారు.
ఆ గోప బాలకులు కుతూహలంతో ఉదకమును నివేదించారు.
గోపస్త్రీలు, వారి కుమార్తెలు అచ్చటకు చేరి, ఆ గోపబాలకులను భోజనార్ధము ఇండ్లకు తీసుకొనిపోయినారు.
ఒక గోపబాలకుడు పూజ యందు ఆసక్తుడై,
ఇంటికి పోకపోవుటచేత,
వాని తల్లి వానిని కొట్టసాగింది.
ఆమె, కుమారా! ఇది భోజనవేళ.
రాత్రి చీకటిలో ఏమి చేయుచున్నావు అని కోపగించుకొని,
ఆ గోపిక ఆ ప్రాంగణము నందలి పూజను పాడుచేసి, పాషాణ లింగమును దూరంగా విసిరివైచి, తన ఇంటికి పోయినది.
ఆ విధముగా తల్లి చేయుట చూసి ఆ బాలుడు విలపించినాడు.
ఒక్క క్షణము అలానే ఉండి మూర్చితుడై భూమిపై పడినాడు.
చిత్తములో లింగమును భావించుచూ ప్రాణములు విడుచుటకు ఉద్యుక్తుడైన బాలునకు శూలపాణి ప్రసన్నుడై అనుగ్రహించాడు.
అప్పుడు ఆ ప్రాంగణము శివాలయము అయినది.
ఆ పాషాణ లింగము రత్నయుక్తమైనది.
లింగము సూర్యతేజస్సును చిమ్మగా ఆ బాలుడు మేల్కాంచినాడు.
గౌరీరమణుడు ఆ బాలుని నిజరూపముతో చేరి, లేవనెత్తి, అభీష్ట వరములను ప్రార్థింపుము అనినాడు.
శంభో! నీ పూజ నా తల్లి పాడుచేసినది.
క్షమించి నా తల్లిపై దయచూపుము.
అని బాలుడు కోరినాడు.
దయాళువైన ఈశ్వరుడు ప్రీతి చెంది,
ప్రదోషవేళలో నా పూజ చూసిన నీ తల్లి దేవమాత కాగలదు.
జన్మాంతరము నందు ఆమెకు విష్ణువు కుమారుడుగా, కృష్ణ రూపమున జన్మించును.
అని శంకరుడు చెప్పి,
బాలకా! నీవు కోరినది అంతయూ లభించును.
సకల సుఖములు అనుభవింపుము.
నీ వంశము నీవంటిదే అగును.
అని పలికిన గిరిజాపతి ప్రసన్నుడై వరములు అనుగ్రహించి,
తన పదారవిందములు చేపట్టిన బాలకుడు చూచుచుండగానే పరమేశ్వరుడు అంతర్ధానం చెందినాడు.
సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందమస్తు 🙏







![✌️నేటి నా స్టేటస్ - ಒಂನಮನವೌಯ 6000 MDRuungy] ಒಂನಮನವೌಯ 6000 MDRuungy] - ShareChat ✌️నేటి నా స్టేటస్ - ಒಂನಮನವೌಯ 6000 MDRuungy] ಒಂನಮನವೌಯ 6000 MDRuungy] - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_565068_1b85189e_1774828563672_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=672_sc.jpg)





