కొనిచ్చిన బైకునే తగలబెట్టిన తండ్రి.
విశాఖపట్నం (వేపగుంట) : కుమారుడి కోరిక మేరకు ఆ తండ్రి బైక్ కొనిచ్చారు. దాన్ని ఆ కుమారుడు రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తుండడంతో ట్రాఫిక్ చలానాలు వస్తున్నాయి. దీంతో విసిగిపోయిన తండ్రి.. చివరకు వాహనాన్ని తగలబెట్టారు. విశాఖలోని పెందుర్తి జరిగిన ఈ ఘటనపై పోలీసుల కథనం.. వేపగుంట సమీప బంటాకాలనీకి చెందిన ఓ వ్యక్తి ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో ఓ కుమారుడు కళాశాలకు వెళ్లొచ్చేందుకు బైక్ కావాలని పట్టుబట్టాడు. తప్పనిసరి పరిస్థితిలో తండ్రి ఏడాది కిందట వాహనం కొనుగోలు చేశారు. అది చేతికందిన తర్వాత ఆ అబ్బాయి తన స్నేహితులతో ఎక్కువగా తిరగడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన నడిపాడు.
గతేడాది ఓ ప్రమాదం జరగ్గా.. ఆసుపత్రి ఖర్చుల కోసం తండ్రి రూ. లక్ష వరకు ఖర్చు చేశారు. తాజాగా మరోమారు ట్రిపుల్ రైడింగ్ కారణంగా జరిమానా పడడంతో తండ్రి అసహనం చెందారు. బైకు కొనివ్వడం వల్లే తన కుమారుడు ఇలా తయారయ్యాడని ఆగ్రహించి కాలనీకి దూరంగా వాహనాన్ని తీసుకెళ్లి తగలబెట్టారు.
#instagramreels #foryou #instagram #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
ఎప్పటికీ యంగ్గా కనిపించాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఒక మహిళ ఆ కోరిక కోసం ఏకంగా రూ.94 లక్షలు ఖర్చు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ విషయం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
సమాచారం ప్రకారం, ఆమె తన వయస్సును తగ్గించి యువతిలా కనిపించేందుకు పలు బ్యూటీ ట్రీట్మెంట్లు మరియు కాస్మెటిక్ ప్రొసీజర్లు చేయించుకుంది. ఈ ప్రక్రియ తర్వాత ఆమె రూపంలో వచ్చిన మార్పు చాలా మందిని ఆశ్చర్యపరిచింది. చాలామంది ఆమెను గుర్తించలేని స్థాయిలో మారిపోయిందని చెబుతున్నారు.
ఆమె ట్రాన్స్ఫార్మేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె ధైర్యాన్ని మరియు నిర్ణయాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఇంత ఖర్చు చేసి ఈ మార్పులు చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. సహజ అందం మరియు కాస్మెటిక్ మార్పుల మధ్య ఉన్న తేడాపై కూడా చర్చ జరుగుతోంది. #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్#📰ఈరోజు అప్డేట్స్
*గుడ్ న్యూస్.. ఇక 'ఆధార్' అవసరం లేదు..!*
ఇకనుంచి ఆధార్ కార్డు మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అవును మీరు విన్నది నిజమే.. ఆధార్ వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తూ కేంద్ర ప్రభుత్వం ‘న్యూ ఆధార్’ అనే యాప్ను ప్రారంభించింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ యాప్ను లాంచ్ చేశారు. ఫేస్ ఆథెంటికేషన్, క్యూఆర్ కోడ్ స్కాన్ వంటి సౌకర్యాలతో ఇకపై జిరాక్స్ కాపీలు, ఫిజికల్ కార్డు అవసరం ఉండదు. ఇందులోనే ఆధార్ ఫోన్ నెంబర్, అడ్రస్ వివరాలు చేంజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లోనే ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒకే యాప్లో ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ ప్రొఫైల్స్ నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్