Lakshmi
ShareChat
click to see wallet page
@561424011
561424011
Lakshmi
@561424011
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే
#🙏దేవుళ్ళ స్టేటస్ #శుక్రవారం స్పెషల్ విషెస్💐 #🌅శుభోదయం #✌️నేటి నా స్టేటస్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ నమః🌹 శుభోదయ నమస్కారములు.... 🌺జై సంతోషిమాత🌺 సంతోషమే సగం బలమన్నారు పెద్దలు ... ఎటువంటి కార్యాన్నయినా సంతోషంగా ప్రారంభిస్తే సగం విజయం చేకూరినట్టేనని కూడా చెప్పారు. సంతోషం ... సమస్త సమస్యలకు విరుగుడుగా పనిచేస్తుంది. అది ఆరోగ్యంగా ఉంచుతుంది ... ఆయుస్షు పెంచుతుంది. కష్ట నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు సంతోషం ఒక వరంగా కనిపిస్తుంది ... పన్నీటి జల్లై పలకరిస్తుంది. అలాంటి సంతోషాన్ని అందించడం కోసం అధిష్ఠాన దేవతగా అవతరించిన అమ్మవారే శ్రీ సంతోషిమాత. ఇక సంతోషిమాత ఆవిర్భావం విషయానికి వస్తే ...👉 ఆమె సాక్షాత్తు వినాయకుడి మానస పుత్రిక. ఒక రోజున శివుడి మానస పుత్రిక అయిన నాగదేవత, వినాయకుడికి రక్షాబంధనం కడుతూ ఉంటే, ఆయన ఇద్దరు కుమారులైన లాభక్షేమాలు తమ చేతికి కూడా రక్షా కంకణం కట్టమని నాగదేవతను కోరారు. రక్షాబంధనాన్ని సోదరితో మాత్రమే కట్టించుకోవాలని ఆమె చెప్పడంతో, తమకి సోదరి కావాలంటూ వాళ్లు వినాయకుడి దగ్గర మారాం చేయడం మొదలు పెట్టారు. దాంతో వినాయకుడు తన నేత్రముల నుంచి ఓ బాలికను ఆవిర్భవింప జేశాడు. చతుర్భుజాలతో ... దివ్యాభరణాలతో చిరునవ్వులు చిందిస్తూ ఆ బాలిక వినాయకుడికి నమస్కరించింది. సంతోషాన్ని ప్రసాదించడానికి అవతరించినది కావునా 'సంతోషి'అని దేవతలంతా కలిసి నామకరణం చేశారు. లాభ క్షేమాలనే కాకుండా ... కోరిన వారికి కొంగు బంగారమై, ప్రతి ఇంటా సంతోషసిరులు కురిపించమని దేవతలంతా కోరడంతో అందుకామె అంగీకరించింది. సంతోషిమాతను ఎవరైతే పూజిస్తారో అలాంటి వారి దరికి కష్టనష్టాలు చేరవని నారదమహర్షి సెలవిచ్చినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. వ్రతం👉ఇక పూర్వ కాలం నుంచి కూడా తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలనీ, ఆనందంతో కళకళలాడుతూ ఉండాలని స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. ఈ వ్రతాన్ని చైత్ర .. వైశాఖ .. శ్రావణ .. భాద్రపద .. ఆశ్వీజ .. కార్తీక .. మార్గశిర .. మాఘ .. ఫాల్గుణ మాసాల్లో శుక్రవారం రోజున చేసుకుంటూ ఉంటారు. మరికొందరు శ్రావణమాసపు పౌర్ణమి రోజున చేస్తుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించే వారు ముందుగా పూజా మంటపంలో అమ్మవారి చిత్ర పటాన్ని ... మంచినీటి కలశాన్ని ఉంచాలి. కలశం పై అయిదు పల్లవములు కలిగిన మామిడి కొమ్మను ... దానిపై నారికేళమును ఉంచాలి. దీపారాధన ... ఆచమనం అనంతరం, గణపతి ప్రార్ధన చేసి సంకల్పం చెప్పుకోవాలి. పూర్ణ కలశ పూజలో భాగంగా వరుణదేవుడిని ధ్యానించాలి. నవగ్రహాలను పూజించిన అనంతరం అమ్మవారిని ధ్యానించి ఆవాహన చేయాలి. అమ్మవారికి ఆసనాన్ని ... అర్ఘ్య పాద్యాలను సమర్పించాలి. పంచామృతాలతో అభిషేకం ... శుద్ధోదక స్నానం చేయించి పసుపు కుంకుమలను ... వస్త్రాభరణములను సమర్పించాలి. అష్టోత్తర శతనామావళిచే అమ్మవారిని పూజించి ధూప .. దీప .. నైవేద్యాలను సమర్పించాలి. సంతోషిమాత ఆశీస్సులను కోరుతూ హారతి పట్టాలి. తీర్థ ప్రసాదాల అనంతరం ఇంటికి వచ్చిన పేరంటాళ్ల ను, పిల్లలను సాక్షాత్తు అమ్మవారిగానే భావిస్తూ వాయనాలు ఇచ్చి పంపించాలి. శుభమస్తు💐 మీ శ్రీ
🙏దేవుళ్ళ స్టేటస్ - ShareChat
#🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం #శుక్రవారం స్పెషల్ విషెస్💐 #🙏దేవుళ్ళ స్టేటస్
🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ - ShareChat
#శుక్రవారం స్పెషల్ విషెస్💐 #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🙏దేవుళ్ళ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం
శుక్రవారం స్పెషల్ విషెస్💐 - ShareChat
00:16
#🌅శుభోదయం #✌️నేటి నా స్టేటస్ #🙏దేవుళ్ళ స్టేటస్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #శుక్రవారం స్పెషల్ విషెస్💐 .. .. .. సుప్రభాతం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః । కృష్ణప్రియాయై సారాయై పద్మాయై చ నమో నమః ॥ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🌅శుభోదయం - ShareChat
#🕉 ఓం సాయిరామ్😇 #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏దేవుళ్ళ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం
🕉 ఓం సాయిరామ్😇 - SST STTIRI)T Shir itds 4 SST STTIRI)T Shir itds 4 - ShareChat
#🌅శుభోదయం #✌️నేటి నా స్టేటస్ #🙏దేవుళ్ళ స్టేటస్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #✨గురువారం స్పెషల్ రాశిఫలాలు💫 ఆదిగురువు - దక్షిణామూర్తి 🌺* దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడిచెవికి మకరకుండలం ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం, తాటంకం స్త్రీల అలంకృతి, దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి. సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా ఈ విషయాన్నే లలితాసహస్రంలో "దక్షిణామూర్తి రూపిణీ సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ" అని వివరిస్తోంది. ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం) భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి పరమ జ్ఞానమూర్తియైన ఈ ఆది గురువును స్తుతిస్తూ ఆదిశంకరులు రచించిన దక్షిణామూర్తి సోత్రము బహుళ ప్రసిద్ది చెందింది. దక్షిణామూర్తి సకల జగద్గురు మూర్తి కనుక - స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా - బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం.
🌅శుభోదయం - ShareChat
#🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌅శుభోదయం #🙏దేవుళ్ళ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #🌷బుధవారం స్పెషల్ విషెస్
🙏🏻బుధవారం భక్తి స్పెషల్ - ShareChat
#🌷బుధవారం స్పెషల్ విషెస్ #✌️నేటి నా స్టేటస్ #🙏దేవుళ్ళ స్టేటస్ #🌅శుభోదయం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ అనే చీకట్లను తొలిగి జ్ఞానమనే జ్యోతులను వెలగలంటే* *అయ్యప్ప నమస్మరణతోనే సాధ్యం* *ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*.   శుభోదయం
🌷బుధవారం స్పెషల్ విషెస్ - ShareChat
#🙏దేవుళ్ళ స్టేటస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #✌️నేటి నా స్టేటస్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం* *దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఽస్తుతే* 🪔🕉️🪔🕉️🪔🕉️🪔🕉️🪔
🙏దేవుళ్ళ స్టేటస్ - ShareChat
_*🚩 ఈరోజు లక్ష్మీదేవి జయంతి🚩*_ 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఫాల్గుణమాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తాం. ప్రతి మానవుడూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించాలి , స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివశించే ప్రాంతాల్ని , ప్రదేశాల్ని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకుని , ఇంటిముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని , సంప్రదాయాల్ని పాటించేవారికే ఆమె కటాక్షం లభిస్తుంది. ఇక ఇప్పుడు వివిధ పురాణాలల్లో లక్ష్మీదేవి జనన గాథల్ని గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మధనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు , అపూర్వ జంతుజాలాదులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అనేక పురాణాలలో కనపడే కథనమిది. విష్ణుపురాణంలో వేరొక గాథ కనపడుతుంది. ఆ గాథ ప్రకారం లక్ష్మీదేవి భ్రుగు మహర్షి కుమార్తె. భ్రుగు మహర్షి భార్య ఖ్యాతి. తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ *ఖ్యాతి చేసిన తఫః ఫలమే* లక్ష్మీదేవి. విష్ణుమూర్తిని ఈమె వివాహమాడింది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు , చదవవలవసిన మంత్రాల గురించి పురాణాలలో అనేకచోట్ల అనేక కథలున్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు *కనకధారాస్తవం* పఠించాడని , అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలున్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్ళలోనూ , ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవజీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్దలతో పూజచేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్ళను , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. లక్ష్మీదేవి కృపకు పాత్రులమవుదాం. లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. స్వయంభువ మన్వంతరంలో భృగువు , ఖ్యాతి దంపతుల పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. సారోచిష మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్నినుంచి అవతరించిందని చెపుతారు. జౌత్తమ మన్వంతరంలో జలరాశి నుండి , తామస మన్వంతరంలో భూమినుండి , రైతవ మన్వంతరంలో బిల్వవృక్షం నుండి , చాక్షుస మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు పురాణాల ప్రకారం వెల్లడవుతోంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో లక్ష్మీదేవి జన్మించిన రోజైన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున లక్ష్మీజయంతిని మనం జరుపుకుంటున్నాం. వైవస్వతంలో శ్రీమహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఈ విధంగా సంభవించింది. పూర్వం ఒకసారి దూర్వాస మహా ముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహూకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపచేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కిందపడేసి , కాళ్ళతో తొక్కి ముక్కలు చేస్తుంది. అది చూసిన దూర్వాస మహాముని కోపోద్రిక్తుడై *”నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక”* అని శపిస్తాడు. శాపఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది. రాక్షసులు స్వర్గంపైకి దండయాత్రలు చేస్తారు. స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. దీంతో దేవేంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి శరణువేడతారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటపెట్టుకుని విష్ణువువద్దకు వెళ్ళి పరిస్థితిని వివరిస్తాడు. క్షీరసాగర మధనం ద్వారా అమృతాన్ని ఉద్బవింపచేసి , ఆ అమృత బలంతో రాక్షసులను సంహరించాలని విష్ణుమూర్తి సూచిస్తాడు. క్షీరసాగరమధనంలో ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని ఈశ్వరుడు సేవించగా , తరువాత సురభి అనే కామధేనువు , ఉచ్ఛ్వైశ్రవం అనే అశ్వం , పిమ్మట ఐరావతం , కల్పవృక్షం , వీటన్నింటి తరువాత క్షీరాబ్ధి నుంచి ఉత్తరఫల్గుణి నక్షత్రంలో శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైవస్వత మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మీ జననం వెనుక ఉన్న గాధ. ఈ రోజునే మనం లక్ష్మీ జయంతిగా శ్రీమహాలక్ష్మిని ఆరాధిస్తుంటాం. భక్తిశ్రద్ధలతో ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సిరిసంపదలతో పాటు కీర్తి దక్కుతుంది. బుద్ధి వికాసం కలుగుతుంది. అన్నింటా జయం లభిస్తుంది. బలము , మేధస్సు , ఆరోగ్యం ఇత్యాదివి సంప్రాప్తిస్తాయి. #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🙏దేవుళ్ళ స్టేటస్ #శుక్రవారం స్పెషల్ విషెస్💐 #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్
🌷మంగళవారం స్పెషల్ విషెస్ - ShareChat