#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
గురిగింజలు వాటి ఉపయోగములు ............!!
గురుగింజలు గురించి ఒకప్పటి వారిలా ఇప్పటివారికి తెలియకపోవచ్చు. పల్లెటూరి వారికి పరిచయమున్నంతగా అవి పట్నంవారికి తెలియకపోవచ్చు. ఎందుకంటే పల్లెల్లో గురుగింజల చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఒకప్పుడు వీటి కాత విపరీతంగా ఉండటం వలన వీటి గురించి ఎక్కువ మందికి తెలిసింది.
గ్రామీణ ప్రాంతాల్లో పాడుకునే పాటల్లోనూ గురుగింజల ప్రస్తావన కనిపిస్తుంది. 'గురుగింజ ఎత్తు బంగారం' అంటూ దానిని కొలమానంగా చెప్పడం వింటూ ఉంటాం. గురుగింజపై సామెత ఉందంటే, అవి ఎంతగా జన బాహుళ్యంలోకి వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు. గురుగింజలులో ఎక్కువభాగం ఎరుపు రంగులో ఉండి, తక్కువ భాగం నలుపు రంగు ఉంటుంది. రంగుల కలయిక కారణంగా చూడటానికి ఇవి ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తూ ఉంటాయి.
అయితే అందంగా కనిపించడం ఒక్కటే కాదు, వీటివలన అనేక ప్రయోజనాలు ఉన్నట్టుగా చెబుతారు. గురుగింజలు లక్ష్మీ కారకాలనీ ... వీటిని భద్రపరచిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అంటారు. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉండవని అంటారు. ఈ కారణంగానే పూర్వం గురుగింజలను తమ ఇంట్లో ఉండేలా చూసుకునేవారు.
ఇంట్లో ధనాన్ని ఉంచే చోట గురిగింజలు ఉంచడం వలన సంపదలు రెట్టింపు అవుతాయనే విశ్వాసం కూడా ప్రాచీన కాలం నుంచి ఉంది. సంపదలు పెరగడానికి ఉపయోగపడటమే కాకుండా, ఆ సంపదలకు దిష్టి తగలకుండా చేసే శక్తి కూడా గురుగింజలకు ఉంది. ఈ కారణంగానే నేడు అరుదుగా లభిస్తోన్న గురుగింజలను మరింత అపురూపంగా భద్రపరుస్తున్నారు ... లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతున్నారు.
గురిగింజలు ఒక్కొక రంగు గురిగింజ ఒక్కో రకంగా ఉపయోగపడుతుంది,
నల్ల గురిగింజ :-
ఇది దృష్ట శక్తులు ఇంటిలోకి రాకుండా అడ్డుకొంటుంది , నరదృష్టి, కన్నుదృష్టి కి ఇది బాగా ఉపయోగపడుతుంది.
తెల్ల గురిగింజ :-
ఇది శత్రువశం , సభావశం , రాజ్యవశం , స్త్రీ పురుష వశికరణ కి ఉపయోగపడుతుంది.
ఆకుపచ్చ గురిగింజ :-
ఇది దనాభివృద్ది కి లక్ష్మీ కటాక్షమునకు ఉపయోగపడుతుంది, దనాభివృద్ది అవుతుంది ,ఆకస్మికంగా ధనం కలుగుతుంది.
పసుపు గురిగింజ :-
ఇది ప్రమాదమల నుండి కాపాడుతుంది, వాహన ప్రమాదముల నుండి కాపాడును, మానసిక ధైర్యం అధికముగా ఉండుతుంది ,అనుకున్న పనులు ఆటంకం లేకుండా జరుగును... ఇంకా కొన్ని గురిగింజలు వాటి శక్తి కొద్దీ ప్రభావం చూపి మానవ జీవిత సరళికి ఏ ఆటంకం లేకుండా పని చేయును...
ఈ గురిగింజలు చాలా అరుదుగా దొరుకును , నకిలివి ఉంటాయి చాలా జాగ్రత్తగా పరిశీలించవలెను..
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
*అథః చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం*
*(పతంజలి కృతం)*
*సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలంచలిత మంజు కటకమ్|*
*పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జననభంజన కరమ్|*
*కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబకవిడంబక గళం*
*చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబరనటం హృది భజ(1)*
*హరం త్రిపుర భంజన-మనంతకృతకంకణమఖండదయ-మంతరహితమ్*
*విరించిసురసంహతిపురందర విచింతితపదం తరుణచంద్రమకుటమ్|*
*పరం పద విఖండితయమం భసిత మండితతనుంమదనవంచన పరం*
*చిరంతనమముం ప్రణవసంచితనిధిం పర చిదంబరనటం హృది భజ(2)*
*అవంతమఖిలం జగదభంగ గుణతుంగమమతంధృతవిధుం సురసరిత్ తరంగ నికురుంబ ధృతి లంపట జటం శమనదంభసుహరం భవహరమ్|*
*శివం దశదిగంతర విజృంభితకరం కరలసన్మ్రగశిశుం పశుపతిం*
*హరం శశిధనంజయపతంగనయనం పర చిదంబరనటం హృది భజ(3)*
*అనంతనవరత్నవిలసత్కటకకింకిణిఝలం ఝలఝలంఝలరవం*
*ముకుందవిధి హస్తగతమద్దల లయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదమ్|*
*శకుంతరథ బర్హిరథ నందిముఖ దంతిసుఖ భృంగిరిటిసంఘనికటం భయహరం*
*సనంద సనక ప్రముఖ వందిత పదం పర చిదంబరనటం హృది భజ(4)*
*అనంతమహసం త్రిదశవంద్య చరణం ముని హృదంతరవసంతమమలం*
*కబంధ వియదింద్వవని గంధవహ వహ్నిమఖబంధురవిమంజు వపుషమ్|*
*అనంతవిభవం త్రిజగదంతర మణిం త్రినయనం త్రిపురఖండన పరం*
*సనంద ముని వందిత పదం సకరుణం పర చిదంబరనటం హృది భజ(5)*
*అచింత్యమలివృంద రుచి బంధురగళం కురిత కుందనికురుంబ ధవళం*
*ముకుంద సుర వృంద బల హృంత కృత వందనలసంతమహికుండల ధరమ్|*
*అకంపమనుకంపిత రతిం సుజన మంగళనిధిం గజహరం పశుపతిం*
*ధనంజయ సుతం ప్రణత రంజనపరం పర చిదంబరనటం హృది భజ(6)*
*పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమముం*
*మృడం కనక పింగళ జటం సనక పంకజ రవింసుమనసం హిమరుచిమ్|*
*అసంఘమనసం జలధిజన్మగరళం కవలయంతమతులం గుణనిధిం*
*సనంద వరదం శమితమిందు వదనం పర చిదంబరనటం హృది భజ(7)*
*అజం క్షితిరథం భుజగపుంగవగుణం కనక శృంగిధనుషం కరలసత్*
*కురంగ పృథు టంక పరశుం రుచిర కుంకుమ రుచిం డమరుకం చ దధతమ్|*
*ముకుంద విశిఖం నమదవంధ్య ఫలదం నిగమ వృందతురగం నిరుపమం*
*స చండికమముం ఝటితి సంహృతపురం పర చిదంబరనటం హృది భజ(8)*
*అనంగపరిపంథినమజం క్షితి ధురంధరమలంకరుణయంతమఖిలం*
*జ్వలంతమనలం దధతమంతకరిపుం సతతమింద్రసురవందితపదమ్|*
*ఉదంచదరవిందకుల బంధుశత బింబరుచి సంహతి సుగంధి వపుషం*
*పతంజలి నుతం ప్రణవ పంజర శుకం పర చిదంబరనటం హృది భజ(9)*
*ఇతి స్తవమముం భుజగపుంగవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః*
*సదః ప్రభుపద ద్వితయదర్శనపదం సులలితం చరణ శృంగ రహితమ్|*
*సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం*
*స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకందురితదమ్(10)*
*ఇతి శ్రీ పతంజలిముని ప్రణీతం చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం సంపూర్ణమ్||*
*యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్, తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే!!*
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం,మార్చి.11,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం - శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం - బహుళ పక్షం
తిథి:అష్టమి రా2.24 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ రా8.31 వరకు
యోగం:వజ్రం ఉ8.09 వరకు
కరణం:బాలువ మ1.21 వరకు తదుపరి కౌలువ రా2.24 వరకు
వర్జ్యం:తె5.20 నుండి
దుర్ముహూర్తము:ఉ11.46 - 12.33
అమృతకాలం:ఉ10.46 - 12.32
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:6.17
సూర్యాస్తమయం:6.04
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
ఓం గం గణపతయే నమః
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
#చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి:
#ఆలయ క్షేత్ర పురాణము
సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన రామసేతు వంతెన. సువర్ణముఖి నది ఈ కోవెలకు పశ్చిమ వాహినిగా ప్రవహిస్తూ వున్నది
సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమునకెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు.బొద్దు పాఠ్యంయ
ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం వ్రాసిన దూర్జటి) వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.
కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు.
ఈ దేవాలయము చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేకములయిన చిత్రములు ఉన్నాయి. " మణికుండేశ్వరాఖ్య " అనే మందిరమువున్నది. కాశీ క్షేత్రములో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారకమంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము. దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము ఉంది. దేవాలయమునకు సమీపములోగల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాసమనియు, సత్య మహా భాస్కరక్షేత్రమనియు, సద్యోముక్తిక్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది.
ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరుడు మీద శతకం వ్రాశాడు. అందులో శ్రీ కాళహస్తి స్థలపురాణం స్పృశిస్తూ
ఏవేదంబు పఠించెలూత భుజంగంబే శాస్త్రముల్ చదివె తా
నేవిద్యాభ్యాసమొనర్చె కరి చెంచే మంత్రమూహించె బో
ధావిర్భావ విధానముల్ చదువులయ్యా కావు మీపాద సం
సేవా శక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!
#చరిత్ర
#దక్షిణ గోపురం
క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రమును గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్ కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రమును సందర్శించారు.
ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్తంభాలు కలిగిన మంటపం మరియు అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం 2010 మే 26 న కూలిపోయింది. పది సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడా పగుళ్ళు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మత్తులు చేస్తూ వస్తున్నారు అయితే కూలిపోక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒక వైపు బాగా బీటలు వారింది. మరో రెండు రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు కానీ రెండు రోజుల తర్వాత శిథిలాల క్రింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమయింది.[ ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణలతో కూడిన ఒక కమిటీని నియమించింది.
క్రీస్తుశకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్టైకి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు
దేవాలయ చరిత్ర, ప్రత్యేకతలుఈ దేవాలయము యొక్క పేరు మూడు జంతువుల కలయికతో ఏర్పడినది.
శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ల పేరుతో కాళహస్తిగా ప్రసిద్ధి చెందినది.
ఇది స్వర్ణముఖి నది తీరములో ఉన్న క్షేత్రము. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖముగా ప్రవహించడం జరుగుతున్నది.
ఈ దేవాలయములోని లింగము పంచభూత లింగములలో ఒకటైన వాయులింగము
#ఆలయ విశేషాలు
స్వామివారి రథం. మహాశివరాత్రి మరుసటి రోజు, రథోత్సవం కన్నులపండుగగా జరుగుతుంది.
.శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణం
ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వరస్వామి సాంకేతిక కళాశాలను 1997లో స్థాపించారు.
#నాలుగు దిక్కుల దేవుళ్ళు
గుడి గర్భాలయంలోని శ్రీకాళహస్తీశ్వర, జ్ఞాన ప్రసూనాంబ విగ్రహాలు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు) గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.
#గోపురాలు
ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు, మరియు 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేరాయలు కట్టించినది) ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా "తేరు వీధి"కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమరూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిచ్చాలు" దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్ప గోపురాన్ని "బాల జ్ఞానాంబి గోపురం" అని, ఉత్తరం గోపురాన్ని "శివయ్య గోపురం" అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని "తిరుమంజన గోపురం" అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున "సూర్య పుష్కరిణి", ఎడమవైపున "చంద్ర పుష్కరిణి" ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.
ఇతర శివలింగాలు, పరివార దేవతలు
ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి - అర్ధ నారీశ్వర లింగము; అగస్త్యుడు - నీలకంఠేశ్వర లింగము; ఆత్రేయుడు - మణి కంఠేశ్వర లింగము; ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు (మృత్యంజయేశ్వర లింగము), రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్ఠించినవనే లింగాలున్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై యున్నాడు.
ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలున్నాయి.
#మంటపములు
ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపరులను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, నూరుకాళ్ళ మంటపము (రాయల మంటపము), పదునారు కాళ్ళ మంటపము, కోట మంటపము వాటిలో కొన్ని. నూరుకాళ్ళ మంటపం చక్కని శిల్పాలకు నిలయం. పదహారు కాళ్ళ మంటపంలో 1529లో అచ్యుత దేవరాయలు (కృష్ణదేవరాయలు సోదరుడు) పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలున్నాయి.
రాహు కేతు క్షేత్రము.ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.
#దక్షిణామూర్తి
దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.
#శ్రీకాళహస్తి రాజగోపురం
ఆలయంలో జరిగే కొన్ని సేవలు - కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్ర నామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వరస్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం (ఉదయం), ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష (రాహు కేతు) పూజ, పౌర్ణమినాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహ వాహనము
#తీర్ధాలు
ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయట. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని "పాతాళ గంగ" లేదా "మూక తీర్థము"లోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.
#ఇతర విశేషాలు
ధర్మ కర్తల మండలి పరిపాలనలో, దేవాదాయ శాఖ అధ్వర్యంలోఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతిగృహాలున్నాయి. (2007 నాటికి) దేవస్థానానికి ఆదాయం సుమారు 7 కోట్ల రూపాయలు ఉంది. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పధకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం జరుగుతున్నది
#పండుగలు
పండుగల విషయానికొస్తే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా నాలుగు ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవం ప్రధానమైన మూడు రోజులు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నిర్వహిస్తుంది. అన్నింటి కన్నా ఎక్కువగా మహాశివరాత్రి రోజున సుమారు లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనార్థం విచ్చేస్తారు. ఈ రద్దీని తట్టుకోవడానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు, హరికథకులు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, సంగీత వాయిద్య కారులు, భక్తులను తమ కౌశలంతో రంజింప జేస్తారు.
ఇక్కడికి విచ్చేసిన ప్రముఖ కళాకారుల్లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ, ప్రముఖ నటి మరియు భరత నాట్య కళాకారిణి శోభన, నేపథ్య గాయకులు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, మొదలైనవారు ముఖ్యులు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి ఊరేగు శివుని ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాతి రోజు జరిగే రథ యాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పలపై స్వామి వారిని మరియు అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. పెద్ద ఖర్చులు భరించి పెళ్ళి చేసుకోలేని పేదలు స్వామి, అమ్మవారి కళ్యాణంతో పాటుగా పెళ్ళి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా ఇక్కడ వస్తున్న ఆనవాయితీ.
ఇంకా ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంబ కొండపై వెలసిన కనక దుర్గమ్మ అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ తొమ్మిది రోజులపాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని 2006లో విస్తరించడం జరిగింది. మరి కొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కొండపై కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.ధర్మరాజుల స్వామి తిరునాళ్ళు కూడా ఐదు రోజులపాటు విశేషంగా జరుగుతాయి. ద్రౌపదీ అమ్మవారు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది. విరాటపర్వం చదివిన రోజున పట్టణంలో కచ్చితంగా వర్షం కురవడం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు. ఉత్సవాలలో ప్రధాన భాగంగా ఐదవరోజున సుమారు 2000 మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు.
ఇంకా ప్రతీ సంవత్సరం డిసెంబరు నెలలో జరిగే ఏడు గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే. ఈ ఉత్సవాలలో భాగంగా పట్టణం లోని ఏడు వీధులలో ఏడు రూపాలలో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్ఠిస్తారు. ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుంచి ఈ ఏడు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధులలో ప్రతిష్ఠిస్తారు. ఆ గంగమ్మ విగ్రహాలు జీవం ఉట్టి పడేలా తయారు చేయడం ఆ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం.
#పాతాళ గణపతి ఆలయము
ఈ ఆలయమునకు ప్రవేశద్వారము వైపున పాతాళ గణపతి ఆలయము ఉంది. ఇందులోనికి ప్రవేశము ఒకసారికి ఒకరికి మాత్రమే ఉంది. మెట్లద్వారాలోనికి వెళ్లేందుకు సన్నని సందు వంటి మార్గము లోనికి ఉంది. దాదపు 20 అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప గణపతి విగ్రహం ఉంది. ఈ స్వామి కోర్కెలు తీర్చేవాడని ప్రసిద్ధి.
|| ఓం నమః శివాయ || #"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
నంది చెవిలో చెబితే..అనుకున్న పనులన్నీ..
క్షణంలో అయ్యిపోతాయట..........!!
సాధారణంగా దేవాలయాలలో భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెబుతారు.
దీనికి ఒక కథ ఉంది.
ఒకసారి శివుడు, పార్వతి, నంది ధ్యానంలో నిమగ్నమయ్యారట.
అదే సమయంలో జలంధరుడు అనే రాక్షసుడు పార్వతి మాతను అపహరించాలని ప్రయత్నం చేశాడు.
ఈ చర్య ముందుగానే తెలుసుకున్న వినాయకుడు
ఈ విషయం తన తండ్రికి చెప్పాలనుకున్నాడు..
కాని వినాయకుడు, ఇతర దేవతలు ధ్యానంలో ఉన్న రుద్రుడి దగ్గరికి వెళ్ళే సాహసం ఎవ్వరు చెయ్యలేదట.
అప్పుడు నంది చెవిలో ఆ విషయం చెబితే ఖచ్చితంగా శివునికి చేరుతుందని నందికి ఆ విషయం చెప్పారట.
ఆ విషయం తెలుసుకున్న వెంటనే శివుడు రాక్షసుడిని సంహారించారు.
ఇక అప్పటి నుండి నంది చెవిలో చెబితే శివునికి చేరుతుందని ఈ సాంప్రదాయం కొనసాగుతుంది.
స్వస్తి..!!
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
ఈరోజు అడిగొప్పల నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ సందర్భంగా పల్నాడు జిల్లాలో దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామ సమీపంలో నిదానం పాడు లో వెలసిన మహిమాన్విత శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి చరిత్ర :
పల్నాటి ప్రజల ఆరాధ్య దైవం మరియి రెండు తెలుగు రాష్ట్రాల లో అనేక మంది భక్తులకు కొంగుబంగారం భక్తుల కోర్కెలు తీర్చే శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి పూర్తి కధను చిత్రరూపం తో సహా తెలుసుకుందాం.
ద్వాపర యుగాంతంలో కైలాసం లో పార్వతి పరమేశ్వరులు కొలువుదీరి వుండగా నారదుడు మరియు నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి దర్శనానికి వచ్చారు. నారద మహర్షి శివుని తో స్వామి మీ పుణ్య దంపతుల నాట్యం చూడ కోరిక గా ఉంది అని కోరాడు.దానికి శివుడు మీము ఎందుకు నారద ఈ రోజు మా బదులు నందీశ్వరుడు నాట్యం చేస్తాడు,చూడుము అని చెప్పినందీశ్వరు, నితో నాట్యం చేయమని ఆజ్ఞాపించెను,శివుని ఆజ్ఞానుసారం నందీశ్వరుడు నాట్యం చేయసాగెను. సాహిత్య,లయబద్దం లేని నందీశ్వరుడు నాట్యం చూసి పార్వతి దేవి పగలబడి నవ్వసాగెను.
అది చూసి నారద మునీంద్రుడు,నందీశ్వరుని తండ్రి శిలాదునికి చూసావా? మునివర్యా!పార్వతీ దేవి నీ కుమారుడి నాట్యం చూసి పగలబడి నవ్వుతుంది అని రెచ్చగొట్టెను,దానికి కోపోద్రేకుడు అయిన శిలాదుడు పార్వతీ దేవితో తల్లీ! ఎందుకు నా పుత్రుడు నాట్యం చూసి హేళన చేయుచున్నారని ప్రశ్నించగా,దానికి బదులుగా పార్వతి లయబద్దంలేని నాట్యం వింత రూపంతో చేసే నాట్యం చూసి నవ్వు వచ్చిందని,అసలు ఈ నాలుగు కాళ్లతో వున్న వింత ఆకారంను గర్భాన మోసిన నీ భార్య అసలు మనిషి నేనా?అంటూ నవ్వుతూ అడిగింది,దానికి పట్టరాని కోపంతో శిలాదుడు పరమ శివుని భార్యవన్న గర్వంతో మునీశ్వరులను వారి భార్యలను అవమానిస్తావా,అంటూ భూలోకంలో ఏశక్తులు లేకుండా మానవరూపంలో పుట్టి,12 సంవత్సరాల వయస్సులో వివాహాంకాకుండానే అకాల గర్బం ధరించి అందరి చేత నగుబాట్లు పొంది,అవమానంకు గురి అయ్యు తుదకు నీ ఇంటి వారే నిన్ను అవమానించి అగ్నిలో ఆహుతి చేయుదరని శపించెను.
పార్వతి దేవి శిలాద మునిని క్షమింపమని ప్రాధేయ పడగా, భూలోకంలో పరమ నిష్టాగరిష్టుడు,శివున్ని అనునిత్యం కొలిచే యాగంటి అను కమ్మ వారి కులంలో జన్మిస్తావు,మరియు నీకన్నా ముందే కైలాసం లో కామధేనువు వారి ఇంట గోవుగా జన్మిస్తుంది.అనునిత్యం ఆకామధేనువు ను కొలువుము,ఆ గోవు పంచకం వల్లన నీకు మాయా గర్బం వస్తుంది.నీ గర్బంలో నందీశ్వరుడు సూక్ష్మరూపం లో ఉంటాడు అని పలుకుతూ, మీ మానవ రూపం అంతంతో శాప విముక్తి కలుగుతుందని చెప్పెను.ఇదంతా చూస్తున్న శివుడు నోరెత్తకుండా మౌనంగా ఉండటం గ్రహించి,పార్వతి దేవి ఏమిటి స్వామి ఇంత జరుగుతున్నా మీరు నోరు మెదపకుండా అలా ఉన్నారు,నందీశ్వరుడు నా కుమారుడు లాంటి వాడు అతన్ని చూసి నీను నవ్వటం ఏమిటి? ఈ శాపం ఏమిటి? అని ప్రశ్నించింది.
దానికి బదులుగా పరమ శివుడు మరిచితివా పార్వతీ,గజాసుర మరణం తర్వాత నందీశ్వరుడు
నీ గర్భాన జన్మించాలని వరం కోరగా,నువ్వు వరం ప్రసాదించావు. ఇప్పుడు జరిగినదంతా విష్ణుమాయ లోక కళ్యాణం కోసం నువ్వు భూమి పై అవతరించ వలసిన సమయం
ఆసన్న మయినది దిగులు చెందకు అని వారించాడు. నీకు రక్షణగా నాగేంద్రుడు కూడా ఆగ్రామంలో వెలుస్తాడు.
నందీశ్వరుడు గోమాత రూపంలో నీ గర్భాన జన్మించగానే నీకు శాప విమోచనం అని తెలిపాడు. అలా శాప ఫలం తో పార్వతీ దేవి నిదానంపాడులో ఉన్న యాగంటి రామయ్య,సుగుణమ్మ దంపతులకు సంతాన వ్రతం ఆచరించగా 15 వ శతాబ్దంలో జన్మించెను. ఆమె కు శ్రీలక్ష్మి అని నామకరణం చేసారు. శ్రీలక్ష్మి జననం కి ముందే రామయ్య ఇంట కామదేనువు ఒక గోమాత కు జన్మించి ఆయన ఇంట ఉండెను. రామయ్య ఊరికి పెద్ద గా వ్యవహరించేవారు,గ్రామంలో బాగోగులు చూసేడి వా డు.ఆయనకు నలుగురు మగ సంతానం కలరు.మూర్తయ్య,వెంకయ్య,నరసయ్య,లింగయ్యలు.
వారంతా శ్రీలక్ష్మి ని బాగా గారంగా చూసెడి వారు.ప్రతి రోజు శ్రీలక్ష్మి గోశాలకు వెళ్లి,కామధేనువుకు నమస్కరించి,3 ప్రదక్షినలు చేసి కామధేనువు
"గో పంచకం" ను స్వీకరించేది.ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు.
ఇలా 12 సంవత్సరాల వరకు అనునిత్యం చేసేది.ఒకరోజు ఒక ఆంబోతు,రామయ్య గోశాలపై పడి
కామధేనువుతో బలవంతంగా క్రీడించింది.
అదే రోజు కూడా శ్రీలక్ష్మి రోజు లాగే గోశాల కు వెళ్లి కామధేనువుకు నమస్కరించి గో పంచాగం స్వీకరించగా,ఆంబోతు వీర్యకణాలతో ఉన్న అవి శ్రీలక్ష్మి గర్భంలోకి వెళ్లి,గర్బం దాల్చేలా చేసింది. అప్పుడు శ్రీలక్ష్మి రజస్వల కూడా కాలేదు,కాని శాపపలం వలన గర్బం దాల్చించి. శ్రీలక్ష్మి శరీరంలో మార్పులు ఇంటిలో ఎవరు పరిశీలించలేదు,కాని ఒక రోజు రోజు లాగే గోశాల కు వెళ్తున్న శ్రీలక్ష్మి ని చూసి రచ్చబండ పై కూర్చున్న పెద్దలు ఆమెను గమనించి వివాహాం కూడా కాని రామయ్య గారి అమ్మాయి ఇలా చేస్తే,మిగతా వారికి గ్రామ పెద్ద అయిన ఆయన ఇక ఏమి న్యాయం చెప్తారు.అంటూ ఈ విషయం ఆయనను పిలిచి చెప్పారు.
ఆయన ఇంటికి వెళ్లి శ్రీలక్ష్మి ని పరిశీలించి కోపోద్రేకు అయ్యు,తమ వంశ పరువు తీసావని ధూషించగా, శ్రీలక్ష్మి తండ్రి నేను ఏపాపం ఎరుగను.నేను ఇంక రజస్వల కూడా కాలేదు,అది మీకు తెలుసు కదా అంటూ విల విలపించి,ఇదంతా దైవ లీల అని చెప్పెను, వారు నమ్మక తమ కర్మ అంటూ విలపించసాగిరి,ఆనోటా,ఈ నోటా ఈ విషయం తెలుసుకున్న అన్నలు శ్రీలక్ష్మి తమ పరువు తీసిందని ఆమెను అంతం చేస్తే కాని పరువు నిలబడుతుందని భావించి తమ తల్లితండ్రుల ఇంట లేని సమయంలో ఒక ఆదివారం రోజు ఆమెతో తాము పొలంకు వెళ్తున్నామని,మధ్యహ్నం భోజనం పొలానికి తీసుకురమ్మని చెప్పి వెళ్లారు. శ్రీలక్ష్మి భోజనం తయారు చేసి గోశాలకు వెళ్లి కామధేనువు కి నమస్కరించి పొలానికి బయలు దేరబోగా కామధేనువు శ్రీలక్ష్మితో మీ అన్నలు నిన్ను అగ్ని దహనం చేయాలని కుట్ర చేసారు. వెళ్లకు అని బతిమాలెను,
దానికి తన అన్నల మాట తాను కాదనలేనని అని చెప్పి,బయలు దేరెను,
మార్గ మద్యలో నాగేంద్రుడు ప్రత్యక్ష్యమయ్యు పొలానికి వెళ్ళవద్దని శ్రీలక్ష్మితో వారించెను, కాని వినక పొలానికి బయలు దేరెను.అన్నలలొ చిన్న అన్న అయిన లింగయ్య తన అన్నలు మాటలు ద్వారా శ్రీలక్ష్మిని ని అంతం చేయుచున్నారని అర్ధమయ్యి,అన్నలారా!శ్రీలక్ష్మికి గర్బం దైవ లీల అని ఆమెను ఏమి చేయవద్దని వారించాడు,దానికి మిగతా ముగ్గురు శ్రీలక్ష్మిని ఏమి చేయమని నీవు బావి దగ్గరకు వెళ్లికి నీరు తెమ్మని పంపారు,ఇంతలో శ్రీలక్ష్మి పొలానికి భోజనం తీసుకువచ్చింది.
అన్నలు పత్తి కట్టే వేస్తున్నారు. తన అన్నలకు కామదేనువు,నాగరాజుల మాటలు చెప్పెను,వారు అవి నమ్మలేదు. నువ్వు పత్తి మండే పైకి ఎక్కు మీము అందిస్తాము అంటూ పైకి ఎక్కించారు.ఆమె పైకి ఎక్కగానే చుట్టు మంటలు పెట్టారు. అన్నలారా! నీను ఏ పాపం ఎరుగను నన్ను ఇలా దహనం చేయటం మీకు భావ్యమా?అంటూ విలపిస్తూ శ్రీలక్ష్మి అగ్ని కి ఆహుతి అయ్యింది.
. ఆ క్షణంలో వెంటనే నాగరాజు కూడా అక్కడకు వచ్చి అగ్నిలో దూకి శ్రీలక్ష్మీ తో పాటు దహనంఅయ్యాడు.
అగ్ని కీలక దహనంతో గర్బం నాలుగు ముక్కలు గా చీలి నాలుగు కాళ్లతో శిరస్సు మీద మచ్చతో ఒక కోడె దూడ మరణించి భూమి పై పడినది.ఈ దృశ్యం చూసిన అన్నలు తమ నేత్ర దృష్టి కోల్పోయారు.గోశాల లో కామదేనువు తాడు తెంపుకుని ఆ ప్రదేశం కి వచ్చి అంబా,అంబా! అంటూ అరుస్తూ అగ్ని లో దూకి తాను ఆహుతి అయ్యింది,అరుపులు విని పరిగెత్తుకొచ్చిన లింగయ్య భాదతొ ఏడుస్తూ ఎంత పని చేసారు అన్నలారా! అంటూపెద్దగా రోదించసాగాడు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పరిగెత్తుకుంటూ ఆ ప్రదేశంకు చేరారు మిట్టమధ్యనం 12 గంటలు అయింది. మిట్టమధ్యనం సమయంలో భీకర శబ్దంతో భూమి బారెడు వైశాల్యంతో భూమి చీలి సువర్ణ విగ్రహం వెలుగులతో వెలసింది.
అప్పుడు శ్రీ లక్ష్మీ అమ్మవారు ఓ గ్రామ ప్రజలారా! నీను యాగంటి వారి ఇంట కారణ జన్మురాలిగా జన్మించాను వారికి ఈ విషయం తెలియక దహనం చేసారు.ఆదివారం నన్ను దహనంచేసారు కావున ప్రతి ఆదివారం నాకు పసుప,కుంకుమ తో పూజించండి.నన్ను దహనం చేసిన అన్నల వంశం
నాశనమై, ఒక్క లింగయ్య వంశం మాత్రం వర్ధిల్లితుంది అని చెప్పి,భూమిలోకి సువర్ణ శిలా విగ్రహం భూమి లొకి వెళ్లిపోతూ, నాకు ఎటువంటి రూపం కల్పించరాదని,నన్ను మండుటెండలో అగ్ని దహనం చేసినంద్దున నాకు ఆలయం కట్టవద్దని,నన్ను ఎండలో ఉండే భక్తులు దర్శించుకోవాలని,నీను ఇక్కడ భూగర్బంలో నిదానం పాటి అమ్మవారిగా
యజ్ఞ నిక్షిప్తమయ్యి ఉంటానన్ని నన్ను బయటకు తీయ ప్రయత్నించ వద్దని హెచ్చరించి,తనతో పాటు అగ్ని కి ఆహుతు అయిన కామదేనువు ను మూడు పసుపు ముద్దలు గా చేసి మిరియాల గ్రామస్తుల అయిన బత్తుల వంశంకు చెందిన యాదవ కులస్తులకు ఇలవేల్పుగా,ఆవుదేవర అను నామంన కొలమనని మిరియాలకు పంపెను,
ప్రతి సంవత్సరం మిరియాల లో నేటికి ఉత్సవాలు 5 రోజు లు చేస్తారు.ఆవుల పబ్బం గా గొప్ప ఉత్సవం చేస్తారు.
నన్ను భక్తితో కొలిచేవారిని స్వప్నమందు కనిపించి వారి కోర్కెలు తీరుస్తానాని,నా మహామంత్రం జయజయ లక్ష్మి! నిదానంపాటి శ్రీలక్ష్మి అంటూ పూజించిన వారికి సకల సౌభాగ్యాలు ఇస్తాను. అని చెప్పి అని చెప్పి, సువర్ణ శిలా విగ్రహం భూమి లొకి వెళ్లిపోతూ తన అన్నలకు నేత్ర దృష్టి ప్రసాదించింది. అప్పటి నుండి శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ గా
ఆమె దగ్ధమైన ప్రదేశంలో పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలిచించి.
పాల్గుణ పౌర్ణమి కి దగ్గరగా ఉండే ఆదివారం ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
మెదటగా తన పుట్టింటి యాగంటి వారి కుంకుమ బండి ప్రభ వస్తుంది,అనేక గ్రామాల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తారు.
ప్రతి ఆదివారం కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంతారు.ఇప్పటికి అమ్మవారికి రూపం ఉండదు . మహిమలు అన్ని చోట్ల కు విస్తరించి అన్ని ప్రాంతాల భక్తులు విపరీతంగా నిదానంపాడు శ్రీ లక్ష్మీ అమ్మవారిని దర్శిస్తున్నారు.సంతానంలేని వారు ఈ తల్లి ని దర్శిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది.కొత్త వాహానాలు కొన్నవారు ఈ తల్లి ని దర్శించి వాహానానికి పూజలు చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని చెప్తారు. ప్రశాంత అటవీ వాతావరణం చూడ చక్క గా ఉంటుంధి.భక్తులు అమ్మవారిని దర్శించి భక్తితో ప్రార్ధించి మొక్కుకుంటే కోరిన మొక్కులు తీరుతుండటంతో ఈ విషయం ఆ నోటా,ఈనోటా ప్రాకి ఒకప్పుడు సాధారణ రద్దీ ఉండే అమ్మ ఆలయం ప్రస్తుతం ఆదివారం వేల సంఖ్యాక భక్తులతో అతి రద్దీ గామారింది ఈ ఆలయానికి వచ్చే ఏ భక్తులను అడిగినా అమ్మ మీము కోరిన మొక్కు తీర్చింది కావున వచ్చాము అనే చెపుతారు.ప్రతి ఒక్కరు అదే చెపుతారు,
అద్బుత మహిమలు కలిగిన నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిని తప్పక దర్శించండి.ఇటువంటి మహిమ కలిగిన దేవత మన పల్నాడు ప్రాంతంలో వెలవటం మన అదృష్టం. నిదానంపాటి శ్రీ లక్ష్మీ ఆశీస్సులు అందరి పై ఉండాలని కోరుతూ
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status













