#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 🙏*లింగాష్టకమ్*🙏
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 ||
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 ||
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||
దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరమపదం పరమాత్మక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 మహాశివరాత్రి రోజు రాత్రి, ముఖ్యంగా అర్థరాత్రి (నిశిత కాలం) సమయంలో శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించిన సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు.ఫిబ్రవరి 15 అర్ధరాత్రి, సుమారు 12:09 నుండి 12:59 నిమిషాల వరకు ఈ పవిత్ర కాలం ఉంటుంది, ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
బ్రహ్మ-విష్ణువులకు తన గొప్పతనాన్ని తెలపడానికి శివుడు అగ్నిస్తంభంగా (జ్యోతిర్లింగం) ఉద్భవించిన సమయం.
ఈ సమయంలో శివునికి రుద్రాభిషేకం, బిల్వదళాలతో పూజించడం, పంచాక్షరీ మంత్ర జపం చేయడం చాలా విశేషం.
ఈ సమయంలో శివుడిని ఆరాధిస్తే సకల దోషాలు తొలగి, జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం.
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 🕉 శివరాత్రి సందర్భంగా 🕉
🔅 చిత్తూరు జిల్లా : గుడిమల్లం
🔅 శ్రీ పరశురామేశ్వర ఆలయం :
గుడిమల్లం.
🙏 తన ఒడికి చేర్చుకునే గుడిమల్లం దేవుడు శివుడు 🙏
🔅 ఈ గుడి ఏనాటిదో ఖచ్చితంగా చెప్పటానికి తగిన శాసనాలేవీ లభించలేదు . కానీ పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధన ఇది క్రీ.పూ. రెండో శతాబ్దం నాటిదని నిర్ణయించింది .
👉 అయితే ఆలయంలోని లింగాన్ని ఎవరు , ఎప్పుడు ప్రతిష్టించారో మాత్రం తెలియటం లేదు .
ఆలయంలోని శివ లింగం ఆకారం మరెక్కడా లేని విధంగా పురుషాంగాన్ని పోలి ఉంటుంది . దానిమీద రాక్షసుడి భుజాలపై నిలుచున్న శివమూర్తి ఉంటాడు .
👉శివుడి కుడిచేతిలో జింక , ఎడమ చేతిలో భిక్షపాత్ర , ముంజేతికి కడియం , చెవులకి కుండలాలు , భుజం మీద గండ్ర గొడ్డలి , తలకు తాటికాయలు కిరీటం , మొలకు ధోవతి స్పష్టంగా కనిపిస్తాయి .
👉చోళుల తర్వాత పల్లవులు కొంత కాలం ఈ ఆలయ నిర్వహణ చేశారు .
వాళ్ళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని " తిరువిప్పురమ్ బేడు " అని పిలిచినట్టు తెలుస్తోంది . అంటే తెలుగులో ' శ్రీ విప్రపీఠం ' అంటారు . పల్లపుల నిర్వహణలోకి వచ్చాక ఇది గుడిపల్లంగా మారిపోయింది . కాలక్రమంలో అదే గుడిమల్లంగా మారిపోయింది.
👉ఈక్షేత్రంలోఉన్న శివలింగం త్రిమూర్తి స్వరూపం అనునది సుస్ఫష్టం.
శివలింగములన్నీ ఆద్యంతములులేని స్తంభమువలె లింగరూపంలో దర్శనమిస్తాయి.
👉 ఆలయమందు శివుడు పరశురామేశ్వరుడుగా పూజింపబడుతున్నాడు.
👉గర్భాలయంలో ప్రతిష్ఠించబడిన శివస్వరూపం జ్యోతిర్లింగ ఆలయాలు మరియు ఇతర శివాలయాల మాదిరిగా లింగ రూపంలో కాక పురుషాంగాన్ని పోలి ఐదుఅడుగుల పొడవు ఒక అడుగు వెడల్పుతో ముదురు కాఫీరంగు రాతితో చేయబడి వేటగానితూపంలో శివుడు యక్షుని భుజాలపై నిలబడి రుద్రుని భంగిమలో దర్శనమిస్తాడు.
👉రెండు చేతులందు తలక్రిందులుగా గొర్రెపోతు కాళ్ళు కుడిచేతితో, చేతిలో చిన్నపాత్ర పట్టుకొని తలకట్టుతో, చెవులకు రింగులు మరియు ఆభరణాలు ధరించి నడుమునుండి మోకాళ్ళ వరకూ వస్త్రముధరించి యజ్ఞోపవీతం లేని వేటగానివలె కనపడతాడు. ఎడమభుజం ఆనుకొని గొడ్డలిఉంది. పలుచని వస్త్రమునుండి స్వామివారి శరీరభాగములు స్పష్టంగా కనపడతాయి. తలపాగా, దోవతిధరించిన రుద్రుని వస్త్రధారణ రుగ్వేదకాలం నాటిదని తెలుస్తూంది.
👉భాగవతపురాణ కధనంప్రకారం శ్రీమహావిష్ణువు పది అవతారాలో ఆరవ ఆవతారం పరశురాముడు.
జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి కుమారుడు.
👉జమదగ్ని మరియు రేణుకాదేవికి వాసు, విశ్వావసు, బ్రిహుద్యను, బృత్వకన్వ మరియు భద్రరామ అను అయిదుగురు కుమారులు.
ఇందు భద్రరామ తరువాత కాలంలో పరశురాముడని పిలువబడ్డాడు.
👉రేణుకాదేవి మహాసాధ్వీ మరియు తన భర్తకు గొప్ప భక్తురాలు. ఒకరోజు ఆమె నదికినీరు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నదిలో స్నానం చేస్తున్న గంధర్వుడిని చూసి మోహించినది. అందువలన ఆమెకు గల దైవికశక్తులు నశించినవి. దివ్యదృష్టితో ఆ విషయం తెలుసుకొన్న జమదగ్ని ముందుగా తన నలుగురు కుమారులను పిలిచి తల్లి శిరస్సు ఖండించమని ఆదేశించాడు.
👉వారు అంగీకరించక పోవడంతో పరశురామునితో సోదరులను, తల్లిని వధించమని ఆదిశించాడు .
తన తండ్రి ఆజ్ఞతో తల్లి మరియు సోదరులకు శిరచ్ఛేదం చేసిన తరువాత, పరశురాముడు తన తల్లి మరియు సోదరులను తిరిగి బ్రతికించుటకు తండ్రి నుండి వరం కోరుకున్నాడు.
👉తల్లిని చంపిన మాతృహత్యా దోషంనుండి విముక్తి కొరకు శివలింగం పూజించవలసిందిగా తండ్రి చేసిన సలహాతో శివలింగం కొరకు వెతకి పరశురాముడు అడవి మధ్యలో శివలింగం చూచి సమీపంలో చెరువుతవ్వి పూజించసాగాడు.. ..
👉ఆ చెరువు నందు ప్రతిరోజు ఒక దైవికపుష్పం పెరుగుతూ ఉండగా పరశురాముడు శివునికి పూజించేవాడు. పువ్వును జంతువులనుండి రక్షణకొరకు చిత్రసేనుడను యక్షుడుని కాపలాగా ఉంచాడు.
👉ఒకమారు పరశురాముడు లేని సమయంలో బ్రహ్మభక్తుడైన చిత్రసేనుడు ఆపుష్పంతో శివుని పూజించాడు. ఇది తెలిసిన పరశురాముడు కోపోధ్రిక్తుడై చిత్రసేనునీతో పద్నాలుగు సంవత్సరాలు యుద్ధంచేశాడు.
👉వారు ఇరువురు యుద్ధం చేసిన ప్రదేశం గుంటవలే తయారై గుడిపల్లం అని పేరు వచ్చిందని స్థానిక కధనం.
👉యుద్ధం ముగియకపోవడంతో శివుడు ప్రత్యక్షమై వారిని శాంతింపజేశాడు. శివుడు వారి భక్తికి తృప్తి చెంది వారిలో రెండు భాగాలుగా లీనమయ్యడు.. అందువల్ల శివలింగం ఒకభాగం విష్ణు రూపమైన పరశురామునిగా ఒకచేతిలో వేటాడిన మృగంతో, రెండవచేతిలో కల్లుకుండతో - రెండవభాగం చిత్రసేనుడు బ్రహ్మవలె మరియు శివుడు లింగరూపంతో మలచబడినట్లు కథ ప్రాచుర్యంలో ఉంది.
👉దీనినిబట్టి ఈక్షేత్రంలోఉన్న శివలింగం త్రిమూర్తి స్వరూపం అనునది సుస్ఫష్టం.
👉 సూర్యకిరణాలు ఉత్తరాయణ, దక్షిణాయణములలో శివలింగం నుదిటిపై నేరుగా ప్రసరిస్తాయి.
👉 ఇక్కడ వసతి మరియు భోజన సదుపాయాలు ఏమి ఉండవు.
✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 ఓం నమశ్శివాయ మాఘమాసం చివరి సోమవారం శుభాకాంక్షలు అనంతగిరి క్షేత్రం మృత్యుంజయాలయం జ్యోతిర్లింగా పడిపూజ విశేషముగా జరిగి ఉన్నది ఓం నమశ్శివాయ
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 అరుణాచల👏
అరుణాచలం, తిరువన్నామలై
తమిళనాడు
నేను ఈ దేవాలయం, గిరి ప్రదక్షిణం గురించి 6 భాగాలుగా ఇస్తున్నాను. దయచేసి గమనించగలరు.
భాగము-1
అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు.
మొదటిసారి అరుణాచలం వచ్చేవారికి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టడానికి చాలా సందేహాలు – గుడి దగ్గర నుంచే మొదలు పెట్టాలా? మేము డయాబెటిక్ వాళ్ళం – చెప్పులు లేకుండా నడవడం; ఆటో లో వెళ్ళడం తప్పా? వగైరా … మొదటిసారిగా ప్రదక్షిణం చేసే వారు అరుణాచలేశ్వర ఆలయం రాజగోపురం నుంచి మొదలు పెడితే అష్టలింగాల గుడులన్నీ అన్ని క్రమపద్ధతిలో వస్తాయి – అంటే ముందు తూర్పు ఇంద్రలింగం తో మొదలుపెట్టి, ఆఖరున ఈశాన్యలింగం వచ్చి, చివరగా తిరిగి అరుణాచలేశ్వర ఆలయం రాజగోపురం చేరుకోవడంతో ప్రదక్షిణ పూర్తవుతుంది. అందువల్ల ఈ బ్లాగ్ లో అదే వరుసప్రకారం విషయం రాయటం జరిగింది. ఎవరి అనుకూలతనిబట్టి వారు, ప్రారంభించిన చోటికి తిరిగి చేరుకుంటే అది కూడా ప్రదక్షిణే! అసలు అరుణాచలంలో గిరిప్రదక్షిణ ఎందుకు? ఏమిటి? ఎలా? ఇలాంటి సందేహాలకు ఈ అధ్యాయం చదవటం పూర్తి అయ్యేసరికి మీకు సమాధానాలు దొరుకుతాయి. చదవడం ద్వారా గిరిప్రదక్షణ అనుభూతి మీకు కలిగించే ప్రయత్నమిది. ముందుగా భగవాన్ రమణమహర్షి ప్రదక్షిణగురించి ఏం చెప్పారో తెలుసుకుంటూ ప్రారంభిద్దాము.
సూరినాగమ్మగారి ది 26-6-1949 లేఖ నుండి
కొత్తగావచ్చి ఇక్కడ కొంతకాలంగా ఉంటున్న భక్తులొకరు “ఇక్కడంతా తరచు గిరిప్రదక్షణం పెడుతూ ఉంటారు దాని మహిమ ఏమిటి” అని శ్రీవారినే అడిగారు. భగవాన్ వికసించిన ముఖంతో “ఈ గిరిప్రదక్షణ మహిమ అరుణాచల పురాణంలో ఎంతో అతిశయంగా చెప్పబడి ఉంది. నందీశ్వరుడు, సదాశివుని ఇదే విధంగా అడిగితే వారు ఈవిధంగా సెలవిచ్చారు.
“ఈ గిరిని ప్రదక్షిణిoచడం చాలా మంచిది. అసలు తత్వం ఇది .
ప్ర = సకల పాపాలను పోగొట్టడమూ,
ద= ఇష్ట ఫలాలను ఇవ్వడమూ,
క్షి= జన్మాంతరము నశించడమూ,
ణ = జ్ఞానముక్తిని ఇవ్వడమూ అని.
ఈ గిరికి ప్రదక్షిణంగా ఒక అడుగు పడితే భూలోక సుఖం, రెండడుగుల వల్ల స్వర్గ సుఖం , మూడు అడుగులు అయితే సత్యలోక ఆనందం పొందగలరని మౌనమో, ధ్యానమో, జపమో, సంకీర్తనమో ఏదో ఒక దైవ చింతనతో పోవాలనీ, నవమాసములు నిండిన గర్భిణీ స్త్రీ నడిచినట్లు నడవాలనీ, తపస్సు చేస్తున్న అంబ కృత్తికా నక్షత్రం నాటి ప్రదోష సమయంలో జ్యోతి దర్శనం అయిన వెంటనే, గిరి చుట్టివచ్చి తనలో ఐక్యం ఆయిందని ఇంకా ఎన్నో చెప్పారు . కడకు దీపోత్సవం అయిన మూడవనాడు భూతగణసహితంగా ఏటేటా తామే ప్రదక్షిణానికి బయలుదేరుతామనీ చెప్పారు . నిజంగా ఈ ప్రదక్షిణవల్ల కలిగే ఆహ్లాదం, సుఖం ఇంతని చెప్పడం శక్యం కాదు .
శరీరం అలసి పోయి ఇంద్రియచేష్టలకు బలంతగ్గి, సర్వవృత్తులూ అంతర్గతం కాగలవు. అట్లాగే మైమరిచి ధ్యానమగ్నతను పొందవచ్చును. నడుస్తూనే ఉండడం వల్ల శరీరం తానుగానే ఆసన పద్ధతిని అమరిపోతుంది. అందువల్ల శరీరానికి ఆరోగ్యం ఏర్పడుతుంది. అంతేగాక ఈ పర్వతం మీద బహువిధములైన ఓషధులున్నవి. ఆ ఓషధుల మీదుగా వచ్చే గాలి శ్వాసకోశాలకు చాలా మంచిది. బండ్లకు బస్సులకనీ నీ తప్పుకోవాల్సిన పనిలేదు. యధేచ్చగా నడవవచ్చును.
“మేము ప్రదక్షిణానికి వెళ్ళేరోజుల్లో భలే హుషారుగా ఉండేది. ఎప్పుడంటే అప్పుడే బయలదేరే వాళ్ళం. ఏదైనా పర్వడి వచ్చిందంటే ప్రదక్షిణానికి బయలుదేరి, ఎక్కడ ప్రొద్దెక్కిందనీ, అలసినామనీ తోస్తే, అక్కడే ఆగి, వంటచేసుకుని తినేవాళ్ళం. ఒకచోట ఉండాలని నిబంధన లేకుండా ఉంటే చింతే ఉండదు. ఈ రైళ్లు వచ్చిన వెనక ఇల్లా అయింది కానీ, పూర్వం కాలినడకనే క్షేత్రాటనం చేసేవారు. ఈవేళకు ఇక్కడ చేరాలనీ, ఇంతకాలం ఉండాలనీ నిర్ణయించుకుని బయలుదేరేవారు కారు. ‘కాశీకి పోయిన వారూ, కాటికి పోయినవారూ సమాన మన్న’ సామెత ఉండనే ఉంది కదా. తిరిగి రావాలని ఆశలేనివారే కాశీకి బయలదేరేవాళ్ళన్నమాట. కావడి కట్టుకొని, ధ్యానమగ్నులై నడుస్తూ, ఎక్కడ అలుపు తోస్తే, అక్కడ మజిలీ చేసుకొని మళ్ళీ బయలుదేరేవారు. వారు గ్రామంలో కాలు పెట్టే అవసరం లేకుండానే ఊరి వెలుపల ధర్మశాలలు ఉండేవప్పుడు. అవి లేని చోట్ల గుళ్ళూ,గుహలూ, చెట్లూ, గుట్టలూ అన్నీవారికి నివాస స్థానాలే. అన్యచింతన లేకుండా అట్లాగే పోతూ పోతూ ఆత్మలో లీనం అయ్యేవారన్నమాట.
గిరిప్రదక్షిణమూ అంతే. శరీరం తేలికపడి తానుగానే నడిచిపోతుంది. మనం నడుస్తున్నామన్న తలంపేఉండదు. కూర్చుంటే కుదరని ధ్యానం ప్రదక్షిణకి వెడితే కుదురుతుంది. ఆ ప్రదేశం, ఆ గాలీ అటువంటివి. ఎంత నడవలేనివారైనా ఒకసారి వచ్చి వెళ్లారంటే మళ్ళీ వెళ్లాలని బుద్ధి పుడుతుంది. వెళ్ళిన కొద్ది సరదా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. ఆ ప్రదక్షిణ సుఖానికి అలవాటు పడితే మరి విడువలేరు సుమా.”
(పై లేఖ రమణాశ్రమ ప్రచురణ శ్రీరమణాశ్రమ లేఖలు పుస్తకం నుండి )
గిరిప్రదక్షిణ మొదలు పెట్టడం
అరుణాచలేశ్వరాలయం తూర్పువైపున వున్న రాజగోపురం ముందున్న అలంకారమండపం దగ్గర కర్పూరం వెలిగించి అరుణాచలేశ్వర ఆలయ గోపురానికి నమస్కరించి , రోడ్డు మీదికి వచ్చి కుడి వైపు నుంచి ప్రదక్షిణ ప్రారంభించాలి.అష్టలింగాల పొజిషన్, గిరి ప్రదక్షిణ దూరం సూచించే రూట్ మ్యాప్ ప్రదక్షిణ ప్రారంభించే చోట పెట్టారు. మనసులో నామం (అరుణాచలశివ, అరుణాచలశివ) చెప్పుకుంటూ ఇక్కడి నుంచి కుడివైపు పావు కిలో మీటర్ నడిస్తే చాలు, ఇంద్రలింగం వచ్చేస్తుంది. బిజీగా ఉండే బజార్ లో ఇరుకుగా, చిన్నదిగా, అసలు గుడి అంటే నమ్మేలా ఉండదు ఇంద్రలింగం . అక్కడవున్న బోర్డు మీద ఇంగ్లీషులో స్పెల్లింగ్ ‘INDIRA LINGAM’ అని ఉంటుంది. లోపలకు వెళ్లి చూద్దాం.
ఇంద్రలింగం చాలా చిన్నగుడి. లోపలి వెళ్లి ప్రదక్షిణ చేసి, దర్శనం చేసుకుని బయటకు రావటానికి ఇదునిముషాలకంటే సమయం పట్టదు.చాలామంది భక్తులు అష్టలింగాల గుడుల దగ్గిర గుడి ముందరకర్పూరం వెలిగించి, హారతి ఇచ్చి, తరువాత దర్శనం చేసుకుంటారు. అయితే ఇంద్రలింగం బజారులో వుండటం వలన ఒక్కోసారి కర్పూరం వెలిగించడానికి అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల నమస్కారంతో దర్శనం చేసుకుందాం. . అష్ట లింగాలలో మెదటిది ఇంద్రలింగం దర్శనం పూర్తయిన సందర్భంలో నామస్మరణ.
అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలా అరుణాచలశివ అరుణాచలశివ🙏
https://youtube.com/shorts/WRrK_L9q2sE?feature=share #🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹
https://youtube.com/shorts/lFv_RqCzqpA?feature=share #🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹
https://youtube.com/shorts/K248ofqiP1U?feature=share #🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #శివాభిషేకం శివపూజ*
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
శివపూజలో ప్రధానమైన అంశం ‘అభిషేకం’. శివుడు అభిషేక ప్రియుడు. హాలాహలాన్ని కంఠమందు ధరించాడు. ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు.
🕉️అభిషేక్రపియుడైన శివుడ్ని ఇలా అభిషేకించి తరిద్దాం.
🕉️ధారాభిషేకం: కంచిలో గల ఏకామ్రేశ్వర శివలింగం ‘పృధ్వీలింగం’.ఈ పృధ్వీరూపధారియైన శివునకు ధారాభిషేకం ప్రీతి. ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం.
🕉️ఆవృత్త్భాషేకం: జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర లింగం ‘జలలింగం’. జల రూపధారియైన శివునికి ఆవృత్త్భాషేకం ఎంతో ప్రీతి. ఆవృత్త్భాషేకం చేస్తే సుఖ సంతోషాలు మానవుల పరం చేస్తాడు భక్తవత్సలుడు.
🕉️రుద్రాభిషేకం: తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరడు ‘తేజోలింగం’. తేజోరూపధారి అయిన శివునకు రుద్రాభిషేకం ఇష్టం. రుద్రాభిషేకం చేస్తే సర్వసంపదలూ చేకూర్చుతాడు పరమదయాళువు.
🕉️శతరుద్రాభిషేకం: చిదంబరంలోని చిదంబరేశ్వరుడు ‘ఆకాశలింగం’. ఆకాశరూపధారియైన శివునకు శతరుద్రాభిషేకం ప్రీతి. శత రుద్రాభిషేకం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధిని ఫాలనేత్రుడు అనుగ్రహిస్తాడు.
🕉️ఏకాదశ రుద్రాభిషేకం: శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరుడు ‘వాయులింగం’. వాయురూపధారియైన శివునకు ఏకాదశ రుద్రాభిషేకం ఇష్టం. ఏకాదశ రుద్రాదాభిషేకం చేస్తే శివునితో పాటు లక్ష్మీ అమ్మవారి కటాక్షం దొరుకుతుంది.
🕉️లఘురుద్రాభిషేకం: ఒరిస్సాలోని కోణార్క్లోని శివలింగం ‘సూర్యలింగం’. సూర్యరూపధారియైన శివునకు లఘు రుద్రాభిషేకం ప్రీతి. లఘురుద్రాభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదని శాస్త్ర వచనం.
🕉️మహారుద్రాభిషేకం: భటగావ్లోని శివలింగం చంద్రనాధ లింగం. ‘చంద్రలింగం’. చంద్రరూపధారియైన శివునకు మహా రుద్రాభిషేకం ఇష్టం. మహారుద్రాభిషేకంతో జ్ఞానాభివృద్ధి అనుగ్రహిస్తాడు.
🕉️అతిరుద్రాభిషేకం: ఖట్మండువద్ద త్రినాధ క్షేత్రంలోని పశుపతి లింగం ‘యజలింగం’ సర్వరూపధారియైన శివునకు అతి రుద్రాభిషేకం ప్రీతిని కలిగిస్తుంది. అతిరుద్రాభిషేకంవల్ల అఖండ పుణ్యం, ముక్తి చేకూరుతుంది.
🕉️శివలింగానికి ఆవుపాలతో సంతాన ప్రాప్తి , బిల్వపత్రం ఉంచిన నీటితో ఆయువు ఆరోగ్య అభివృద్ధి స్వచ్ఛమైన నీటితో సకాల వర్షాలు, కొబ్బరినీరు, తేనె, పండ్లరసం, చెరుకురసం, నేయి లాంటివాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం.
శివాభిషేకంలో మహన్యాసం, లఘున్యాసం, నమకం, చమకం, పురుష సూక్త, శ్రీసూక్త, మన్యుసూక్త మంత్రాలు, దశ శాంతుల మంత్రాలు అది ఏకవార అభిషేకం అయినా, ఏకాదశ రుద్రాభిషేకమైనా విధిగా చెప్పాలి.
🕉️శివపూజకు బిల్వపత్రాలు వినియోగించాలి. మారేడు చెట్టునే బిల్వవృక్షమని, శ్రీ వృక్షమని అంటారు. కాని ఎండిపో యిన బిల్వపత్రిని కూడా శివుడు ఆనందంగా స్వీకరిస్తాడు. ఈ బిల్వపత్రాలతో శివపూజ చేసిన వారికి మరుజన్మ ఉండదు. ఒక్క మారేడు దళం లక్ష బంగారు పువ్వులకు సమానమని శివపురాణంఅంటుంది. బిల్వ వృక్షాన్ని పెరట్లో పెంచితే అశ్వమేధ యాగం చేసిన ఫలం చేకూరుతుంది. వెయ్యిమందికి అన్నదాన ఫలం లభిస్తుంది. నిత్యం బిల్వపత్రితో శివుని పూజిస్తే ఐశ్వర్యవంతులవుతారు.
🕉️మారేడు చెట్టుకింద కూర్చుని ‘నమఃశివాయ’ పంచాక్షరీ మంత్రం జపం చేస్తే మంత్రసిద్ధి లభ్యం అవుతుంది.
🕉️ఆరోగ్యరీత్యా మారేడు చెట్టు వేరు, ఆకు రసము, కషాయం చలువ, మేహశాంతి, పైత్యశాంతి, జఠర దీప్తిని కలిగిస్తుంది. జ్వరము హరిస్తుంది. మూత్రరోగాలు నయం చేస్తుంది. గుండె దడ నివారిస్తుంది. విరేచన మందం పోగొడుతుంది. దోరగా పండిన మారేడు పండు గుజ్జు పంచదార కలిపి తీసుకుంటే గ్రహణి, రక్తగ్రహణికి ఎంతో మేలు చేస్తుంది. పండు రసం పుండ్లను మాన్పుతుంది.
🕉️రుద్రుడు, శంకరుడు, భవుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు, ఇలా శివునకు ఎన్నెన్నో నామాలున్నాయ. వీటిలో ఏది పిలిచినా శివుడు అభయం ఇచ్చితీరుతాడు. అసలు శివా అనే రెండు అక్షరాలు పలికితేచాలు శివసాయుజ్జం లభించినట్లే.
🕉️ఈశ్వరుడు పంచకృత్యపారాయణుడని వాయుపురాణం అంటుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనేవి ఈ పంచకృత్యాలు.
🕉️భక్తసులుభుడైన శివుడిని అటు మానవులు ఇటు దానవులే కాదు శ్రీరాముడు అనుక్షణం శివధ్యానం చేస్తుంటాడు.
🕉️శివలింగం మీద నీళ్లు చిలకరించి కొద్దిగా పత్రి భక్తితో పడవేసిన వారు కల్పవృక్షానికీ, కామధేనువుకూ అథిపతి అవుతారని శివభక్తులంటారు.
🕉️ప్రదోషకాలంలో శివుని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది. ప్రదోష కాలంలో దేవతలందరూ శివుని సన్నిధిలోనే ఉండి శివతాండవం వీక్షిస్తూ ఉంటారు. ఆ సమయంలో శివపూజ మహాఉత్కృష్టమైనదని శివపురాణం చెప్తోంది...🙏🙏
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #మహా శివరాత్రి వస్తోంది కదా!*
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
ఆ పరమశివుని అనుగ్రహం పొందేందుకు ఈ అద్భుతమైన అవకాశం వదులుకోవద్దు. మహా శివరాత్రి రోజున చంద్రశేఖరాష్టకం చదవడం అస్సలు మర్చిపోకండి. ఇది మీ ఆయుష్షుని పెంచడమే కాకుండా, మీ మనసులోని భయాలను పోగొట్టి ప్రశాంతతని ఇస్తుంది.*
*మహా శివరాత్రి పర్వదినం రోజున చంద్రశేఖరాష్టకం పఠించడం వల్ల అకాల మృత్యు భయం తొలగి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. శివరాత్రి రోజున ఉపవాసం ఉండే వారు లేదా జాగారం చేసే వారు, రాత్రి వేళల్లో ఈ అష్టకాన్ని చదవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.*
*చంద్రశేఖర అష్టకం.*
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥
రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ ।
క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై-రభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 1 ॥
పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహమ్ ।
భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 2 ॥
మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్ ।
దేవ సింధు తరంగ శ్రీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 3 ॥
యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం
శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్ ।
క్షేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 4 ॥
కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరమ్ ।
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 5 ॥
భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ ।
భక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 6 ॥
భక్తవత్సల-మర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర-మప్రమేయ మనుత్తమమ్ ।
సోమవారిన భూహుతాశన సోమ పాద్యఖిలాకృతిం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 7 ॥
విశ్వసృష్టి విధాయకం పునరేవపాలన తత్పరం
సంహరం తమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్ ।
క్రీడయంత మహర్నిశం గణనాథ యూథ సమన్వితం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 8 ॥
మృత్యుభీత మృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ ।
పూర్ణమాయురరోగతామఖిలార్థసంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః ॥ 9 ॥
అధిక శ్లోకం........
సంసారసర్ప దుష్టానం జంతూనామవివేకినామ్
చంద్రశేఖరపాదాబ్జాస్మరణం పరమౌషదం ||
ఇతి మార్కెండేయ కృత చంద్రశేఖరాష్టకం సంపూర్ణం ||













