#😃మంచి మాటలు జిల్లెళ్ల మూడి అమ్మ వాక్యము
శ్రీమాత
విశ్వ మాత.. శ్రీ చక్రము
జిల్లెళ్ల మూడి క్షేత్ర శరీరంలో అమ్మకు మూలాధారమై ,స్వాధిష్టానం లో వున్న పృధ్వీ అగ్ని తత్వాలకు సంకేతమేమెా అనిపిస్తుంది నాగేశ్వరాలయము నా గేంద్రుడు అగ్నితత్వమే. అందువల్లనే నాగేశ్వరాలయము వెలసింది మనకందరికీ వెన్నుపాము వుంటుంది.అదే మనశరీరంలోని నరాలన్నింటికీఆధారము మూలాధారము నుండి సహస్రారము దాకా వున్న గ్రంధులన్నీ ఆ వెన్ను పామును ఆధారము చేసుకొని వున్నాయి.మణిపూర, అనాహతాల స్థానములో హైమాలయము వున్నది. అది వాయు తత్వానికి సంకేతము అందువల్లనే యెాగనిష్ణాతమై వాయు తత్వాన్ని నియంత్రించి సర్వాభీష్టాలు నెరవేరతాయి
విశుద్ధి ఆజ్ణా చక్రాల స్థానములో అనసూయేశ్వ రాలయము వున్నది.ఆకాశ తత్త్వాన్ని నియంత్రించి మనోతత్త్వాన్ని ఆక్ర మించి హాకినీ, ఢాకినీ,.శక్తిని మిళితము చేసుకొని అర్ధ నారీశ్వరంగా ,అనసూయేశ్వరుని గా దర్శనము ప్రసాదిస్తూ షోడశ దళ పద్మములో నిలచే సిద్ధ మాతయై మన మనస్సులను నియంత్రిస్తుంది.
దక్షిణము నుండి ఉత్తరానికి వరుస గా నాగేశ్వరాలయము, హైమా లయము అనసూయేశ్వరాలయము ఈ మూడింటిని పాలిస్తున్న క్షేత్ర పాలిక సహస్రా రములో నిలచిన శుద్ధ చైతన్య శక్తిఅమ్మ. ఈ మూడు ఆలయాలతో ,నవావరణత విలసిల్లేశ్రీచక్రము జిల్లెళ్ల మూడి అయితే అందులోని బిందు స్థానము అమ్మ.
అమ్మ శాంత స్వరూపిణీ యైన విశ్వమాత
సర్వతోముఖీ
సౌందర్యలహరి మూక పంచశతి పాదారవింద శతకము
సౌందర్యలహరి
క్వణత్కాఇ్చిదామకరికలభకుమ్భస్తననతా
పరీక్షా మధ్యే పరిణత శరచ్ఛన్దద్రవమ్
ధనుర్భాణాన్ పాశం సృణ మపిదధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమతి తురాః
పరాశక్తి స్థూల రూపాన్ని శంకరాచార్యుడు ఈ శ్లోకంలో వర్ణించాడు ఓ పరాశక్తి శివుని గొప్పశక్తి చిన్న గంటలతో కూడిన నీ నడుము నడుము నుండి ఉత్పన్నమయ్యే శ్రావ్యతతో యువఏనుగు తలలా కనిపించే బరువైన పక్షిజాలతో నిన్ను కొద్దిగా ముందుకు వంచుతుంది.
సన్నని నడుముతో శరధృతువు పౌర్ణమి లా కనిపించే ముఖంతో నీ నాలుగు చేతులలో విల్లు, బాణము, పాశము మరియు ముల్లు పట్టుకొని మా ముందు కనిపిస్తుంది.
పాదారవిందశతకము
పురస్తాత్కామాక్షి ప్రచుర రస మాఖండల పురీ
పురంధ్రీణాం లాస్యం తవలలిత మాలోక్యశనకైః
నఖశ్రీభిః స్మేరా బహ వితనుతే నూపుర రవై
శ్చ మత్కృత్యాశంకే చరణయుగళీ చాటు రచనాః
ఓ కామాక్షీ నీ పాదారవిందములు అత్యంత సౌందర్యవంతమైనవి. నీ పాదాలపై వుండే గోళ్ల కాంతి కామ దేవుని యెుక్కబాణాలవలె భక్తుల హృదయాలను ఆకర్షిస్తుంది మందస్మిత చిరునవ్వు కల్గిన నీ పాద యుగ్మం భక్తులను కరుణతో అనుగ్రహిస్తూ వారి పాదాలను నశింపచేస్తుంది ఆ పాదాల సేవ మనకు సర్వసౌఖ్యాలను యిస్తుంది.
సర్వతోముఖీ #😃మంచి మాటలు
#😃మంచి మాటలు యెాగ గణపతి
యెాగ సాధనంతా అధ్యాత్మిక విజయము కోసమే యెాగసాధకుల అంతిమ లక్ష్యం ముముక్షుత్వమే కావాలిఅంటుంది శాస్త్రము అది సాధ్యము కావాలంటే మానవశరీరంలోని షట్చక్రాలు ఉత్తేజితం అవ్వాలి అప్పుడేశిరస్సుపై వుండే సహస్రారము ఉత్తేజితమై మెాక్షానికి చేరువ అవుతారు. అయితే ఏ క్రతువు చేసినా తొలిపూజ గణపతికే చెందుతుంది.
అలాగే ఈ యెాగ సాధన సైతము గణపతికే చెందుతుందిఅలాగే ఈ యెాగ సాధన సైతము గణపతి అధిష్టానంగా భావించే మూలాధార చక్రంతోనే మెుదలవుతుందని యాజ్ణవల్క్య స్మృతి చెబుతున్నది.
త్వం మూలాధారే స్థితోసి నిత్యమ్
త్వం యెాగినో ధ్యాయంతి నిత్యమ్
అంటుంది గణపతి అధర్వ శీర్షం.
మానవశరీరములోని మూలాధార స్ధానములో వుండే దైవానివి నీవే యెాగులందరూ ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తూ వుంటారని భావము.యెాగశాస్త్రంలో గణపతిని మూలాధారచక్రానికి అధిష్టాన దేవతగా భావిస్తారు.
మూలాధారము ఉత్తేజితమైనప్పుడు అక్కడి నుంచి పైన వుండే సుషుమ్న నాడి మేల్కొంటుంది,తద్వారా సాధనా క్రమంలో మిగితా ఐదు చక్రాలు ఉత్తేజితము అవుతాయిసుషుమ్న కుయిరు ప్రక్కల వుండే ఇడ, పింగళ నాడులు ప్రధానమైనవి.ఇడ బుద్ధికి పింగళసిద్ధికి సంకేతంగా భావిస్తారు.
సుషుమ్న ఎప్పుడూ ఈ రెండు నాడులతోనే కలిసి వుంటుంది మూలాధారము గణపతిఅయితే యిడ, పింగళ సిద్ధి, బుద్ధి అన్న మాట యెాగ సాధనతో శరీరము, మనసు పవిత్రం అయినప్పుడు బుద్ధి వికసిస్తుంది.ఫలితంగా సిద్ధి కలుగుతుంది
సర్వతోముఖీ
#😃మంచి మాటలు వానర గీత
హనుమంతుడురూపంలో వున్నప్పటికీ గాలి, వాయు రూపము ఆయన భగవంతుని ప్రతిరూపము. ఈ రామభక్తుడు ఒకరికి ఆదర్శ వంతమైన ఆదర్శ పురుషుడు. మరియు అతను ఒక జ్ణాన పండితుడు. అన్ని విషయాలలో నిష్ణాతుడైన గొప్ప పండితుడు. జ్ణాన శాఖలు తొమ్మిది రూపాలలో పాండిత్యము సాధించడము భక్తి యెుక్క నవవిధ భక్తి ఈ గొప్ప భక్తి రామభక్తుడిని సముచితంగా చెప్పవచ్చును
భక్తిశిఖరాలను శిఖర స్థానము ను చేరుకొన్నారు.హనుమంతుడు రాముడిని నిశితంగా చూడటం దానికి ప్రతీక. బుద్ధి అంటే మనస్సులో విలీనము కావడము. అవి కలసి మనస్సు, బుద్ధి మనోబుద్ధి విలీనము లాంటిది.
ప్రభువు అంటే శాశ్వతంగా కూర్చుని పూర్తి ఏకాగ్రతతో వుండటము. ఆ ఏకాగ్రత పరమాత్మ పై స్థిరపరచబడినది. ప్రతీ జీవి యెుక్కదృష్టిని బోధించడం దీని ఉద్దేశ్యము. దానిపై శాశ్వతంగాా, స్థిరంగా వుండాలి.పరమాత్మ, బుద్ధి.అంటే క్రియ అయినప్పుడే ఆధారితకర్మరూపము అత్యున్నత శక్తి పరమాత్మవైపు కు మరలించ బడుతుంది.
సర్వతోముఖీ
#😃మంచి మాటలు శివుడికి వున్న జానపద పేర్లు
హిందూ ధర్మంలో శివుడిని శాస్త్రోక్తంగా మహేశ్వరుడు, పరమశివుడు అని పిలచినప్పటికీ జానపద సాహిత్యం లో మరియు సామాన్య ప్రజల వాడుకలో ఆయనకు చాలా ఆత్మీయమైన ,విభిన్నమైనపేర్లు వున్నాయి. తెలుగు జానపదులు శివుడిని తమ యింటిదైవంగా భావిస్తూ పిలుచుకొనే కొన్నిపేర్లు
మల్లి కార్జునుడు శ్రీశైల క్షేత్రంలో వెలసిన శివుడిని భక్తులు ఎంతోయిష్టంగామల్లన్న అని పిలుచుకుంటారు
తెలంగాణా ,ఆంధ్ర ప్రాంతాలలోని యాదవులు కురుములు శివుడిని కురుమ మల్లన్న లేదా కొమురవెల్లి మల్లన్న అని పిలుస్తారు.
బోళా శంకరుడు భక్తులు అడిగిందే తడువుగా వరాలిచ్చే భోళామనిషిగా శివుడిని బోళా శంకరుడు అని పిలుస్తారు
జంగమయ్య శివుడు భిక్షాటన చేస్తూ తిరిగే వేషంలో వున్నప్పుడుజానపదులు ఆయన్ని జంగమ దేవర జంగమయ్యఅని పిలుస్తారు
కిరాతార్జునుడు అడవిలో వేటగాడి వేషంలో వున్న శివుడిని జానపదకథల్లో కిరాతుడు అని వ్యవహరిస్తారు
లింగమయ్య లింగరూపంలో వున్న స్వామిని సామాన్యుడు ప్రేమతో లింగన్న లేదా లింగమయ్య అని సంబోధిస్తారు
జానపద సాహిత్యంలో శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు ఒక రైతుగా. ఒకకూలీగా కష్టాల్లో వున్న వారిని ఆదుకునే తోటి మనిషిగా కనిపిస్తాడు
సర్వ తో ముఖీ
#😃మంచి మాటలు విష్ణు సహస్రనామము
జ్యోతిర్గణేశ్వరః
నిత్య సూరులకుఈశ్వరుడు జ్యోతిర్గణాలకు ఈశ్వరుడు
నిత్య సూరి గణానాం యఃఈశో జ్యోతిర్గణేశ్వరః
జ్యోతిర్గణము అంటే అనంతుడు గరుడుడు మెుదలైన పరమభక్తులువీరందరికీ ప్రభువు.
జ్యోతిర్గణస్యఈశ్వరః జ్యోతిర్గణేశ్వరః
జ్యోతిర్గణముఅంటే పరిచారికా గణము వారికి ఈశుడు ప్రభువు
జ్యోతిషా గణానాం ఈశ్వరః
సూర్యుడు మెుదలైన జ్యోతిర్గణాలకు అధిపతి పరమాత్మ స్వయం ప్రకాశి. ఆ పరమేశ్వరునిఆశ్రయంగా చేసుకొనే మిగిలిన గ్రహాలన్నీ కాంతులను ప్రసరింప చేస్తున్నాయి. చంద్ర, సూర్యాగ్నులు అతని సహాయం వల్లనే ప్రకాశిస్తున్నాయి వారి వల్లనే ఈ జగత్తు అంతా ప్రవర్తిల్లుతున్నది.కాబట్టి ఈ రకమైనగణా లన్నింటికీ శ్రీ మన్నారాయణుడే ప్రభువు
బృహదారణ్యకోపనిషత్తు
లోకాలన్నీ పగటి పట సూర్యుని వెలుగు లతోనూ ,రాత్రిపూట చంద్రుని వెలుగులతోనూ సంధ్య వేళల యందు అగ్ని యెుక్క వెలుగు లతోనూ ప్రవర్తిల్లుతున్నాయి చంద్రసూర్యాగ్నుల తేజస్సు ఆ పరమేశ్వరుని నుండే వచ్్చింది అందుచేతనే అతడు జ్యోతిర్గణేశ్వరః అనబడుతున్నాడుఅంటూ లక్ష్మీపతిత్వాన్నివివరించాడు రత్నాకరుడు
సర్వతో ముఖీ
#😃మంచి మాటలు జిల్లెళ్ల మూడి అమ్మ వాక్యము
మంగళ సూత్రము
మంగళ సూత్రము అంటే పవిత్రమైన సూత్రం. అని అర్ధం. పుట్టింటి వారిని ,మెట్టినింటి వారిని ఎప్పటికీ కలసి వుంచుతామని చెప్పటానికి గుర్తుగా మంగళ సూత్రంలో రెండు తాళి బొట్లు వుంటాయి.
మంగళ సూత్రాన్ని కట్టేటప్పుడు వేసే మూడు ముడులు వరుడు, వధువుల మధ్య మనో వాక్కాయ కర్మల మనస్సు,మాట, శరీరం క్రియ సమైక్యత ను సూచిస్తాయి. మరియు దైవం పట్ల వారి నిబద్ధతను తెలియచేస్తాయి.
తాళి బొట్టు లో రెండు బొట్లు వుంటాయి. యివి శివ, పార్వ తుల లేదా విష్ణు ,లక్ష్మీ అనుగ్రహానికి చిహ్నాలుగా భావిస్తారు.
అమ్మ వివరణ
సూత్రం అంటేఅన్ని సూత్రాలను తెలియ పరచేదే సూత్రం. అని చెప్పారు అమ్మ అన్ని సూత్రాలు తెలుసుకున్న తరువాత మంగళ సూత్రంఅవుతుంది.తెలుసుకుండేది నేనే సూత్రం
తెలియ పరచేది కనుక సూత్రంతో సూత్రాన్ని సూత్రం గుర్తిస్తుంది.అది అందరికీ అర్ధ మయ్యే సూత్రం కాదుఅదేమహా సూత్రం అని అమ్మ వివరించారు.
సూత్రం అంటే యిముడ్చుకునేది దారం .బంగారం తో చేసిన తాళి బొట్టుతో యిమిడి వుంటుంది. దారంతో తాళి బొట్టు యిమిడి యిమిడి వుంటాయి.యిముడ్చుకునే శక్తి రెంటికీ వున్నది.అదే అర్ధ నారీశ్వరుడుఅంటే ఒక దానిలో ఒకటి యిమడటమే అట్లా యిమిడిన శక్తిని ఆరాధించాలంటే ప్రత్యక్షంగా మెడలో కట్టిన సూత్రమునే ఆరాధించాలి
దారము బొట్లు కలిస్తేనే సూత్రం దారం లేకపోయినా సూత్రం కాదు.బొట్లు లేకపోయినా సూత్రం కాదు. ఆ రెండు బొట్లు భర్త పాదాలుఆ పాదాలను ప్రేమ అనే పాశంతో మూడు ముళ్లు వేసుకుని వుంటుంది. ఆ మూడు ముళ్లే త్రిపుటి. ప్రేమ, అంటేభక్తి.భర్తమీద ప్రేమ భక్తి, బిడ్డల మీద ప్రేమ వాత్సల్యం, ప్రేమ, ఒకటే గాని స్థానాలను బట్టి పేర్లు మారుతూ వుంటాయి
ఆ రెండు పాదాలే శరణ్యం, యిహానికీ ,పరానికీ, ఆచరణాలే ఆచరణీయం త్రిపుటి అంటే సృష్టి,సృష్టి అంతా త్రిపుటి మీదే ఆధారపడి వుంటుంది
సర్వతోముఖీ
#😃మంచి మాటలు శ్రీ విద్యా పంచదశీమహా మంత్రానికీ గణేశత్వము,యెాగినీ రూపము
గణేశ రూపము
అకధా దిక షోడశాక్షరా త్మక తార్తీయక కామ వాగ భివైః
ఘటి తాచ పరాది వాగ్గణై రితి విద్యాపి గణేశ రూపిణీ
1
అకారాది పదహారు అక్షరములు.. శక్తి కూట స్వరూపము
2
క నుంచి త వరకు పదహారు అక్ష రములు కామ రాజ కూటమి
3
ధ నుంచి స వరకు పదహారు అక్షర మాల వాగ్భవ కూటమి
4
వ్యష్టి , సమిష్టి భేదముచే విద్యా స్వరూపము
ఈ రకంగా వర్ణ గణ స్వరూపము కలది కాబట్టి పంచదశీ గణేశ త్వం లభించింది ఈ రకంగా వర్ణ గణ స్వరూపము కలది కాబట్టి పంచదశీ మహా మంత్రానికి గణేశత్వం లభించింది
యెాగినీరూపము
హృల్లేభా భి సృభి స్తదన్య కూటశ్చ యెాగినీ యెాగాత్
శ్రీ విద్య లో హ్రీంకారాలు మూడు. అవి లేని కూటములు మూడు మెుత్తం ఆరు ఢాకిపీ, రాకినీ, లాకినీ, కాకినీ , సాకినీ .హాకినీ. అనే యెాగినులు ఆరుగురు కాబట్టి ఈ మంత్రానికి యెాగినీ స్వరూపము వచ్చినది.
సర్వతోముఖీ
#😃మంచి మాటలు శంకర విజయం
పంతజలి మహర్షి సూత్రము
మైత్రీ కరుణా ముదితో పేక్షాణాం
సుఖ దుఃఖ పుణ్యా పుణ్య విషయాణాం
భావనాతశ్చిత్త ప్రసాదనమ్ (అను కూల స్వభావము)
ఆకాశాన మేఘాలు తొలగిపోగానే చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశవంతమై జనులకు ఆనందాన్ని కలిగిస్తున్నవి. ఆప్రకారంగా హృదయమందు రాగద్వేషాది కాలుష్యాలు నాశనమయ్యే సమయం రాగానే ప్రేమ,కరుణ అనే పరిశుద్ధ మైన గుణాలతో ప్రకాశిస్తుంది. చిత్తమందు రాగద్వేషాలు వున్నప్పుడు హృదయ కమలం వికసించక బురదలోనే వుండి పోతుంది. అటువంటి మలినమైన మనస్సు కలవారు శాంతిని పొందలేరు.
ఇహ, పరాలలో కూడా సుఖ పడలేరు. రాగద్వేషాది మాలిన్యాలను ,మనసు నుండి తొలగిస్తే పుణ్యాత్ములతో మైత్రీ, దీనజనుల పట్ల కరుణ ,తనకన్నా గొప్పవారిని చూసి అసూయ పడకుండుట ,పాపాత్ముల పట్ల ఉదాసీనత అనే సద్గుణాలు వృద్ధి చెందుతాయి. అట్టి మహాత్ములను దర్శించినంత మాత్రానే పరమ పవిత్రులై పరమశాంతిని పొందుతారు.
మైత్రీ ,, స్నేహం
మనలో ప్రతీ ఒక్కరిలోనూ ప్రత్యేకత వుంటుంది. ప్రతీ ఒక్కరి పట్ల స్నేహ పూర్వక వైఖరి జీవితంలో మానవసంబంధిత అనుభవాలు అందమైన అసంపూర్ణతలను జరుపుకోవడానికి మనకు సహాయపడుతుంది.
మనకందరికీ ఒకరినొకరుఅవసరమనే మన అవగాహనను మరింత పెంచుకోవడానికిస్నేహం మనకు అవకాశం యిస్తుంది కాబట్టి పుణ్యం,మరియు సుఖం పట్ల మైత్రి మరియు జీవితాన్ని సానుకూలమైన సంతోషకరమైన వ్యక్తుల పట్ల స్నేహం
కరుణ
యితరుల పట్ల కరుణ చూపడము అధ్యాత్మికమరియు వ్యక్తిగతఅభి వృద్ధికి ఒక ముఖ్యమైన సాధనము. యితరుల పట్లకరుణ చూపడము భావోద్వేగ అవగాహన మరియు బంధాన్ని పెంపొందించ డానికి సహాయ పడుతుంది
ముదిత ..ఆనందం
యితరుల పట్ల నిజంగా సంతోషంగా వుండటం ఒకరి స్వంత మానసిక శాంతి మరియు శ్రే యస్సుకు చాలా ముఖ్యమైనదిముదిత అనేది ఏ స్వార్ధంతోనూ కల్తీ లేని అనుభూతిని కలిగించే స్వచ్ఛమైన ఆనందం
ఉపేక్ష ,,ఉదాసీనత
మన చిత్తాన్ని సమన్వయం చేసుకోవడంలో సహాయపడుతుంది
పతంజలి మహర్షి సూచించిన నాలుగు సాధారణ సద్గుణ అభ్యాసాలు ,దీర్ఘ కాలిక ఆనందం ,సంతృప్తి మరియు అంతర్గత శాంతికి రహస్యాలను కలిగి వున్నాయి
సర్వతోముఖీ













