#😃మంచి మాటలు ఆంజనేయ స్వామి తోక పూజ లాంగూలము
ఆంజనేయ స్వామి తోక పూజ లాంగూల పూజ
హనుమంతుని శక్తులకు ప్రతీక తోక భాగంలో సింధూరం, మల్లె నూనె, కుంకుమతో పూజ చేస్తారు.భయంపోయి ధైర్యం ఆరోగ్యం,. శని దోష నివారణ కలుగుతుందనినమ్మకం.
మంత్రం
ఓం నమెా భగవత్ ఆంజనేయాయ
మహా బలాయ స్వాహా లేదా హనుమాన్ చాలీసా పఠించాలి.
శ్రీ హనుమల్లాంగూలాస్త స్తోత్రం
జ్వలత్ కాంచన వర్ణాయ దీర్ఘలాంగూల ధారిణే
సౌమిత్రే జయదా త్రే చ రామ దూతాయ తే నమః
రగులుతున్న బంగారు వర్ణంలో వెలుగుతూ , పొడవైన తోకను కల్గిన వాడా లక్ష్మణునికి విజయాన్ని చేకూర్చిన వాడా శ్రీ రామదూత ఆయన హనుమంతునికి నమస్కారము.
పంచ వక్త్రం మహా భీమంత్రి పంచనయ నైర్యుతం
బాహు భిర్దశ భి ర్యుక్తం ప్రణమామి ప్లవంగమం
ఐదు ముఖా లతో పంచముఖ హనుమాన్ అత్యంత భయంకరమైన రూపుతో , పది కళ్లతో ,పది చేతులతో ప్రకాశించేఆ వానర శ్రేష్టునికి హనుమంతు నికి నమస్కారం.
భక్త జ్ణానాంజనేయాయ వాయు పుత్రాయ నమః
భక్తులకు జ్ణానాన్ని ప్రసాదించే అంజనీ పుత్రుడా,వాయుదేవుని హనుమంతుడా నీకు నమస్కారము.
సర్వతో ముఖీ
#😃మంచి మాటలు రుద్రాక్ష యెుక్కత్రిమూర్తి స్వరూపము
రుద్యాక్ష మూలం తత్ బ్రహ్మ
రుద్రాక్ష యెుక్క మూలము నందు సృష్టికర్త అగు బ్రహ్మ దేవుడు సంస్థితులు
తత్ నాళం విష్ణు రేవచ
నాళము మధ్య ప్రదేశము విష్ణు స్థానము
తత్ ముఖమ్ రుద్ర
ముఖము రుద్ర స్థానము
బిందుః సర్వ దేవతా యితి
బిందు స్థానము సర్వదేవతా నిలయం
సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్సర్వమ్ ప్రతిష్టితమ్
రుద్రాక్షతాత్వికార్ధము
ఈ జగత్తు ను రుద్ర సంకల్ప, వికల్ప చమత్కారము గా దర్శించటముసస్వరూపాత్మయే రుద్ర ప్రత్యక్ష రూపముగా భావించటము సమస్త జగత్తు రుద్రభూమిగాను,సర్వ భౌతిక రూపములు రుద్రుని ఆశ్రయించిన భూత గణముగాను, సమస్త మనస్సులను రుద్రుని సేవించు పిశాచ గణముగాను ఎరిగి వుండటము.
సర్వముకేవలాత్మ యందు ఏకము లయము చేయు కనులు లేక దృష్టి అనునదేరుద్రాక్షశబ్ధార్ధము సదాశివుడు సంహార కాలములో సంహార లీలను నిర్వర్తించటానికై కనుల నుండి జనించటం చేత రుద్రాక్ష లుఅనబడుచున్నాయి.
జాగ్రత్,స్వప్న. సుషుప్తుల వస్తుతః
రాహిత్యము స్వతహాగా లేవుఅను తత్త్వార్ధ దృష్టియే రుద్రాక్షత రుద్రాక్ష ధరించిన వాడు జన్మ జన్మాంతర చక్రము నుండి విడి వడగలరు జన్మ కర్మల విషయంలో సర్వ స్వ తంత్రులై స్వస్వరూపానందము నందు ప్రతిష్ఠితము కాగలరు
సర్వతోముఖీ
#😃మంచి మాటలు విష్ణు సహస్ర నామము
నరః
నశించనివాడు రఅనగానాశనము నాశనము లేనివాడు. నాశనము లేని చేతనా చేతనములను విభూతిగా గలవాడుప్రాణులను సృష్ట్యా దుల చేత తమ తమ వ్యాపార ములందు ముందుకు తీసుకొని పోయే వాడు.
సృష్టి పరిణామము ఆరు విధాలు
జాయతేస్తి పరిణమతే వర్ధ తేక్షీయతే వినశ్యతి అని నిరుక్తములో చెప్పబడినది.
జాయతే పుడుతున్నది.
అస్థి అస్థిత్వము పొందుతున్నది
పరిణమతే పరిణామము పొందుతున్నది
వర్ధతే వర్ధిల్లు తున్నది పెరుగుతున్నది
క్షీయతే క్షీణిస్తున్నది
నశ్యతి నశించుచున్నది
అయితే ఈ ఆరు దశలు ఒక దానితో ఒకటి కలసి మెుత్తం మూడుదశలు అవుతున్నాయి. పుట్టుక. అస్థిత్వము, పరిణామము. పొందటము, వర్ధిల్లటము, స్థితి, క్షీణించటము, నశించటము, లయము ఈ దశ లన్నింటికీ కారణము పరబ్రహ్మ.అతడు ఈ దశలలో ఈ జగత్తును ముందుకు తీసుకు పోతున్నాడు. యిలా జరిగిన సృష్టి క్రమంలో మానవులు కొంతమంది పార లౌకిక విషయాలను గురించి ఆలోచిస్తారు. అటువంటి వారికి తన భక్తులకు జ్ణా నోపదేశం చేస్తాడు
ఆజ్ణానులలో అర్హులైన వారికి ముక్తిని ప్రసాదిస్తాడు.ముక్తి అంటే విముక్తి. ఐహిక బంధనాల నుంచి విముక్తి నేను, నాది అనే అహంకార, మమకారాలను వదలి పెట్టిన వాడికి అరిషడ్వర్గాలను జయించిన వాడికి ఆత్మసాక్షాత్కారమవుతుందిదాన్నే స్సస్వరూప జ్ణానము అంటారు.
అంటే చరాచర జగత్తు తనలోనే వున్నది తనకు ఈ జగత్తులోని మిగిలిన జీవరాశి కి తేడా లేదు. తనలో వున్న తేజస్సే తనలో కూడా వున్నది. ఈ రకంగా జగత్తంతా పరమేశ్వర మయము.అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న వాడు బ్రహ్మాత్మ సిద్ధి పొందుతాడు.
బృహదారణ్యకోపనిషత్తులో బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి
పరబ్రహ్మను గురించి తెలుసుకున్న వాడు కూడా సాక్షాత్తు పరబ్రహ్మ అవుతాడు అతడికి జననమరణాలు వుండవు అదే సాయుజ్యము, ముక్తి, అని చెప్పబడినది. సృష్టి, స్థితి, లయాదులను చెయ్యటం ద్వారా పరమేశ్వ రుడైన అర్హు లైన తన భక్తు లకు జ్ణానాన్ని ప్రసాదించి వారికి ముక్తిని యిస్తున్నాడుఅందుకే శ్రీ మన్నారాయణుడు నరః అనబడుతున్నాడు.
సర్వతోముఖీ
#😃మంచి మాటలు విష్ణు సహస్ర నామము
నరః
నశించనివాడు రఅనగానాశనము నాశనము లేనివాడు. నాశనము లేని చేతనా చేతనములను విభూతిగా గలవాడుప్రాణులను సృష్ట్యా దుల చేత తమ తమ వ్యాపార ములందు ముందుకు తీసుకొని పోయే వాడు.
సృష్టి పరిణామము ఆరు విధాలు
జాయతేస్తి పరిణమతే వర్ధ తేక్షీయతే వినశ్యతి అని నిరుక్తములో చెప్పబడినది.
జాయతే పుడుతున్నది.
అస్థి అస్థిత్వము పొందుతున్నది
పరిణమతే పరిణామము పొందుతున్నది
వర్ధతే వర్ధిల్లు తున్నది పెరుగుతున్నది
క్షీయతే క్షీణిస్తున్నది
నశ్యతి నశించుచున్నది
అయితే ఈ ఆరు దశలు ఒక దానితో ఒకటి కలసి మెుత్తం మూడుదశలు అవుతున్నాయి. పుట్టుక. అస్థిత్వము, పరిణామము. పొందటము, వర్ధిల్లటము, స్థితి, క్షీణించటము, నశించటము, లయము ఈ దశ లన్నింటికీ కారణము పరబ్రహ్మ.అతడు ఈ దశలలో ఈ జగత్తును ముందుకు తీసుకు పోతున్నాడు. యిలా జరిగిన సృష్టి క్రమంలో మానవులు కొంతమంది పార లౌకిక విషయాలను గురించి ఆలోచిస్తారు. అటువంటి వారికి తన భక్తులకు జ్ణా నోపదేశం చేస్తాడు
ఆజ్ణానులలో అర్హులైన వారికి ముక్తిని ప్రసాదిస్తాడు.ముక్తి అంటే విముక్తి. ఐహిక బంధనాల నుంచి విముక్తి నేను, నాది అనే అహంకార, మమకారాలను వదలి పెట్టిన వాడికి అరిషడ్వర్గాలను జయించిన వాడికి ఆత్మసాక్షాత్కారమవుతుందిదాన్నే స్సస్వరూప జ్ణానము అంటారు.
అంటే చరాచర జగత్తు తనలోనే వున్నది తనకు ఈ జగత్తులోని మిగిలిన జీవరాశి కి తేడా లేదు. తనలో వున్న తేజస్సే తనలో కూడా వున్నది. ఈ రకంగా జగత్తంతా పరమేశ్వర మయము.అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న వాడు బ్రహ్మాత్మ సిద్ధి పొందుతాడు.
బృహదారణ్యకోపనిషత్తులో బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి
పరబ్రహ్మను గురించి తెలుసుకున్న వాడు కూడా సాక్షాత్తు పరబ్రహ్మ అవుతాడు అతడికి జననమరణాలు వుండవు అదే సాయుజ్యము, ముక్తి, అని చెప్పబడినది. సృష్టి, స్థితి, లయాదులను చెయ్యటం ద్వారా పరమేశ్వ రుడైన అర్హు లైన తన భక్తు లకు జ్ణానాన్ని ప్రసాదించి వారికి ముక్తిని యిస్తున్నాడుఅందుకే శ్రీ మన్నారాయణుడు నరః అనబడుతున్నాడు.
సర్వతోముఖీ
జిల్లెళ్ల మూడి అమ్మ వాక్యము
భగవదారాధనకు దేవాలయాలు దివ్య సాధనాలు
భగవంతుని స్మరణ మన జీవితంలో ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు లభి స్తుందో మనకున్న ఆయుస్సు లో ఆ భాగమే సార్ధ కమైన జీవితంమామూ లుగా మను అనవసరమైన మాటు ,అనవసరమైన తలపులు ఎక్కువగా అవుతూ వుంటాయి.భగవంతుడు మనకు కొంత ఆయుస్సు యిచ్చాడు గదా యిందులో భగవత్ స్మరణ లో ఎన్ని గంటలు గడచినవి అని మనస్సులో వివేచనము చేసి ఆలోచిస్తే మనకు శాంతి కలుగుతుంది.లౌకిక విషయాలు నానారకాలైన యితర విష యాలను గురించి ఆలోచించినప్పుడెల్లా ఏదో ఒక ఉద్వేగమెా ఒక తాపమెా ,మెాహ మెా,కామమెా భయమెా కల్గుతుంది భగవత్ స్మరణ చేస్తే శాంతం తప్ప మరొకటి కలుగదు. అందరికీ కుటుంబ భారం వుంటుంది. అనేక ఆలో చనలు, పనులు చేయవలసిన అవసరం అందరికీ వుంది అయితే ఎంతవరకు అవసరమెా అంతవరకు నిర్వర్తించి మిగిలిన అవకాశాన్ని భగవత్ స్మరణతో గడపాలి. మనోు యితరకార్యాలల్లో నిమగ్నులమై నప్పుడు కూడా భగవన్మామ స్మరణో రూప స్మరణో చేయవచ్చు
భగవత్ స్మ రణ కలగాలనే ఉద్ధేశ్యంతోనే దేవాల యాలు నిర్మించబడినవి. దేవాలయాన్ని చూడగానే యిదొక గొప్ప కట్టడం ప్రపంచమంతా సృష్టి చేసిన వాని కోసం కట్టిన యిల్లు యిది అనే స్మరణ కల్గుతుంది.ఉత్తమమైన ది దేవాలయం ధర్మం,శాశ్వతంగా వుండేది.జీవులలో తక్షణం భగవత్ స్మరణను కలుగ చేస్తున్నది.అసలు దేవాలయమే కనుక లేకపోతే దేవుడనే వాడొకడున్నాడని సాధా రణంగా మనకు స్మరణకు రావడానికి అవకాశమే లేకపోతుంది.
భగవత్ స్మరణ కలిగే క్షణమే మనకు శాంతి భగవత్ స్మరణకు దేవాలయం కారణంఅందువల్ల దేవాలయాలు కావాలి. దేవాలయ గోపురం ,శైలి,.సాన్నిధ్యం కల్గించేలా వుండాలి.దానికి శాస్త్రం అవసరం
వ్యాస భగవానుడు మనకు వేదాలను,పురాణాలను వేదాంతానికి ఉపనిషత్తులు రచించాడు
దివ్య సాధనాలు
అధ్యాత్మిక సాధన
దేవాలయం మనస్సును కేంద్రీకరించడానికి అంతర్గతశక్తిని దశ మహా విద్యలు పొందడానికి సహాయపడే ఒక యంత్రం.లేదా కేంద్రము
అమ్మ వివరణ
అమ్మ ఆలయం భగవదారాధనకు ఒక దివ్యమైన దేవాలయము భగవంతుడికి ప్ర త్యా మ్నాయం దేవాలయాలు అమ్మవారు కోరికలు తీర్చేటప్పుడు అమ్మ కామే శ్వరీ మాతగా, లాలించేటప్పుడు లలితామాతగా, ఆడుకునేటప్పుడు బాలగా ,మరిఅయితే యిన్ని రూపాలు ఎక్కడివి అన్నీ ఆ దేవతేగాఅన్నం ఆరోగ్య వంతుడుతింటేఒంటికి పడుతుందిఅనారోగ్యవంతుడు తింటేవిష మౌతుంది
చూస్తే కనపడను కనపడితే చూస్తారు అని అమ్మ తన గురుంచి తెలియ చేశారు
అమ్మ ఆలయం ప్రేమా లయం అమ్మ ప్రేమ సాగరపు లోతులను మనము దర్శించగలగాలి. మన తపన, మనతపస్సు అదే కావాలి విశ్వాసమే భగవంతుడు నమ్మకమే దైవం అన్న భావన మనలో పాదె కోవాలి అమ్మ దైవం అన్న భావన సుస్థిరం కావాలి విశ్వ సృష్టి స్థితి లయాలకు మన జనన మరణాలకు జయాపజయాలకు ,సుఖ దుఃఖాలకు అభి వృద్ధి పతనాలకు ,సర్వానికి అమ్మే కారణమన్న అరూఢ స్థితి రావాలి
నిరంతరం అమ్మనే అర్చించాలి మన పంచేంద్రియాలు సదా ఆ మూర్తికి ఉన్ముఖమై వుండాలి ప్రతీ అణువు అమ్మ గానంతోనే పరవశించాలి అమ్మను స్మరించి నంతనే మనలో మనకే తెలియాలి అవ్యక్తానందు కలుగుతుంది
సర్వతో ముఖీ #😃మంచి మాటలు
#😃మంచి మాటలు శ్రీ విద్యా... బ్రహ్మ సూత్రములు
బ్రహ్మ సూత్రాలలో అద్వైత పరంగా నిరాకారుడు నిర్గుణుడు పరబ్రహ్మ అని శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించారు.
అయితే శ్రీ విద్య బ్రహ్మ సూత్రములలో ఆ పరబ్రహ్మ సాకారంలో త్రిపుర సుందరి. నిరాకారంలో పరాశక్తి. మరణానంతరము భక్తులకు బ్రహ్మ లోకంలో మహ దైశ్వర్యాన్ని ప్రసాదించేది త్రిపుర సుందరి. యిదేద్వైతము అర్హులైన జ్ణానులకు సాయుజ్యాన్ని ప్రసాదించేది పరాశక్తి. యిక్కడ జీవాత్మ, పరమాత్మలో లీనమవుతుంది. యిది అద్వైతము ఈ రకంగా పరబ్రహ్మకు సాకార, నిరాకారాలు ద్వైత,అద్వైతాలు రెండూ శ్రీ విద్యా బ్రహ్మ సూత్రములలో ప్రతిపాదించబడుతున్నాయి.
నిరాకారుడు,నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ అతడు గనుక ఒక రూపం పొందినట్లై తే అదే లలితఅమ్మ వారు సృష్టి ప్రారంభానికి ముందు నిరాకరంగా వున్న ఆ పరాశక్తి సృష్టి చేయాలనే సంకల్పంతో తనను తాను రెండుగా విభజించుకున్నది.వారే లలితా త్రిపుర సుందరి త్రిపుర సుందరులు శివా శివులు పరమేశ్వరీ,పరమేశ్వరులు.శివశక్తులు.
అధాతో బ్రహ్మ జిజ్ణాస
బ్రహ్మ మును గురించి తెలుసుకోవాలనే కోరిక వివేకాది సాధనా సంపత్తి సిద్ధించిన తరువాత కర్మ ఫలం అనిత్యము అశాశ్వతము మెాక్షము,నిత్యము పరబ్రహ్మయే సత్యము అను తెలిసింది కాబట్టి ముముక్షువు బ్రహ్మను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
మనకు వేద శాస్త్రములే ప్రమాణం ఈ జగత్తు అంతా మిధ్య అంటే యివాళ వుండేదిరేపు వుండనిది పుట్టిన ప్రతీ మనిషి గిట్టకమానదుజీవితం దుఃఖభూయిష్టం సంసారికి దుఃఖాల నుండి నివృత్తి కావాలి. యిది అందరూ కోరేదే అంటే మరణం వుండకూడదు. జననము లేకపోతే మరణం వుండదు. అందుకే జన్మ రాహిత్యం కావాలియిదే మెాక్షంమెాక్షం ఒక్కటే ఈ దుఃఖాలనుంచి రక్షించి మానవుడికి శాశ్వత ఆనందాన్ని యిస్తుంది. పరబ్రహ్మ సాక్షాత్కారమే మెాక్షము యిది జ్ణానము వల్లనే వస్తుంది.
జ్ణానాదేవతు కైవల్యం కాబట్టి మెాక్ష సాధనమైన బ్రహ్మాన్ని ఆ పరాశక్తిని గురించి తెలుసుకోవాలి అందుకే ఈ బ్రహ్మ జిజ్ణాస
అధాతో శ్రీ విద్యా
నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ అతడు గనుక ఒక రూపం ధరిస్తే అదే శ్రీ విద్యలో ప్రతిపాదించిన శివశక్తుల స్వరూపమైన లలితా త్రిపుర సుందరి, లేదా రాజరాజేశ్వరి అని స్థాపించటం కోసం శ్రీవిద్యను వివ రిస్తు న్నారు.
సృష్టి ప్రారంభానికి ముందు జగత్తంతా శూన్యంగా వుండేది. ఆశూన్యాన్ని పరబ్రహ్మ తత్త్వం ఆక్రమించివున్నది.అంటే జగత్తంతా పరబ్రహ్మ తత్త్వమే అదే పరాశక్తి. చరాచరా జగత్తులో ప్రతీ జీవిని దేవతలను దానవులను కూడా ఆ పరాశక్తియే సృష్టించినది. అంతే కాదు సదాశివుణ్ణి సృష్టించినది కూడా ఆమె
ప్రళయ కాలంలో త్రిమూర్తులు ,త్రిశక్తులు కూడా ఆమె సృష్టించినది. అంతే కాదు సదాశివుణ్ణి సృష్టించినది కూడా ఆమె
ప్రళయ కాలంలో త్రిమూర్తులు ,త్రిశక్తులు సదాశివుడితో సహా ఆ పరాశక్తిలో లీనమై పోతారు,అప్పుడు మిగిలేది కేవలము పరాశక్తి మాత్రమే ఆ పరాశక్తియే పరబ్రహ్మ ఆమెను గురించి తెలుసుకోవడానికే బ్రహ్మ జిజ్ణాస.
కేనో పనిషత్తు
యింద్రుడు ఉమాదేవిని ప్రశ్నించాడు. అమ్మా దేవతలనందరినీ భయ భ్రాంతులతో ముంచి వేసిన ఆయక్షుడెవరు ఆతత్త్వము ఏమిటి ఆశక్తియే బ్రహ్మ అని ఉమాదేవి సమాధానము యిచ్చినదిఆ తరువాత యింద్రునితో ఓ దేవేంద్రా బ్రహ్మము వల్లనే కదా మీరు విజయం పొందినది మీ గొప్పదనానికి కారణము బ్రహ్మము మీ అల్ప బుద్ధి వలన యిప్పటి వరకు
కను పించిన తత్త్వమే బ్రహ్మమని గుర్తించలేకపోయారు
ఆ బ్రహ్మ తత్త్వమే మీ శరీరంలో శక్తిని వ్యాపింపచేస్తోంది దాని వల్లనే మీరంతా అసురులను సంహ రించగలిగారు.అంతేకాని యిదంతా మీ గొప్ప తనమని అహంకరించకండి అని చెప్పి అదృశ్యమై పోయింది. ముందు కనిపించినది పరబ్రహ్మతత్త్వముయిది నిరాకారము. తరువాత కనిపించినదిఉమాదేవి అంటే పరబ్రహ్మ నిరాకారము అదిగనుకఒకఆకారం పొందితే పరాశక్తి. ఆవిడే శ్రీ విద్యా స్వరూపిణీ పరాశక్తి అయిన లలితాంబికఆమెను తెలుసుకో వాలనేఈజిజ్ణాస ఆమె ను సగుణ రూపంగా అంటే లలితా పరమేశ్వరి పరాశక్తి మెాక్షాన్నిచ్చే దేవత ఆమెను గురించి తెలుసుకోవడానికే ఈ ప్రయత్నము అదే బ్రహ్మ జిజ్ణాస
శ్రీ విద్య అనేది ఆత్మ విద్యఅదే బ్రహ్మ విద్య అందులో షోడశీ మహా మంత్రము మెాక్ష కారకము ఆ మంత్రాధి దేవత సాక్షాత్తుపరబ్రహ్మ స్వరూపము ఆవిడే పరాశక్తి.
శ్రీ విద్యలో సగుణ బ్రహ్మ అంటే లలితా త్రిపుర సుందరిని ఆరాధించే వారు పంచదశీ మహా మంత్రాన్ని మెక్ష వాదులు ,మహా షోడశీ ని ఉపాసిస్తారు ఆత్మ విద్యా స్వరూపమైన ఆ పరాశక్తిని గురించి తెలుసుకోవాలనేదే
ఈ జిజ్ణాస
సగుణంలో లలితా త్రిపుర సుందరి
నిర్గుణంలో పరాశక్తి ఆవిడే మెాక్షాన్నిచ్చే పరబ్రహ్మ..
సర్వతోముఖీ
#😃మంచి మాటలు ఆంజనేయ స్వామికి వడమాల ఎందుకు సమర్పిస్తారు?
హనుమంతుడికి వనమాల ను సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయి పసివాడుగా వున్న హనుమంతుడు కనిపించిన ప్రతీ దానిని తినాలనుకుంటాడు..ఆకలిగా వున్న సమయం లో ఎర్రగా కనిపిస్తున్న సూర్యుని చూసి పండుగా భ్రమిస్తాడు.
ఆకాశంలో ఎగిరి ఆ ఎర్రటి పండు అందుకోవాలనే కుతూహలంతో వేగంగా వెళుతూ వుంటాడు.మరోవైపు గ్రహణం సమీపిస్తూ వుండటంతో రాహువు సైతము సూర్యుడికి అడ్డుగా వస్తూంటాడు. అప్పటికీ ఆకలి మీద వున్న హనుమంతుడు తన త్రోవకు అడ్డు వచ్చిన రాహువును ఒక్కతన్ను తన్ని పక్కకు పంపే స్తాడు. రాహువుకు జరిగిన అవమానం తెలుసుకున్న యింద్రుడు ఆవేశంతో రగిలిపోయి తన ఆయుధాన్ని సంధిస్తాడు
.వాయుపుత్రుడైన హనుమంతునికి గాయం కావడంతో వాయుదేవుడు ఆగ్రహిస్తాడు. సమస్త లోకాల్లో పవనాలు వీచడాన్ని ఆపేస్తాడు. దాంతో దేవతలంతా దిగి వచ్చి వాయుదేవున్ని శాంతింప చేసేందుకు ఆంజనేయుడికి తన వద్ద నున్న వరాలను ప్రసాదిస్తారు.ఆ సమయంలో రాహువు సైతం వరమిచ్చి హనుమంతుని ఆరాధించేందుకు వచ్చిన వారు మినుములతో చేసిన వడలు నైవేద్యంగా పెడితే వారికి రాహు దోషాలు తొలగి పోతాయి అని అందుకే వడలతో చేసిన వడమాలను ఆంజనేయుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.
హనుమకు రాహువు వరం
బాలహనుమంతుని శౌర్యం చూసిన రాహువు హనుమంతుడిని మెచ్చుకున్నాడు.హనుమంతుడికి ఒక వరం యిచ్చాడు.హనుమంతుని పూజించే వారు రాహువుకు యిష్టమైన మినపప్పుతో చేసిన ఆహారాన్ని హనుమకు నైవేద్యంగా సమర్పిస్తే రాహు దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని వర మిచ్చాడు.
పాము రూపంలో వడమాల
హనుమకు అలా సమర్పించే మినపప్పు ప్రసాదం ఎలా వుండాలో కూడా రాహువు వివ రించాడు అది పాములా అంటే తన శరీరభాగంలావుండాలని రాహువు హనుమంతుడికి వివరించాడు.అందుచేతనే హనుమకు సమర్పించే గారెలు మాలగా చేసి సమర్పించే ఆనవాయితీ వచ్చింది. అందుకనే హనుమాన్ ఆలయాల్లో భక్తులు వడమాలలను సమర్పిస్తారు.
హనుమంతుడికి వడలను నైవేద్యంగా సమర్పిస్తే శని దోషాలు తొలగిపోతాయని అధ్యాత్మిక పండితులు తెలియ చేస్తున్నారు
సర్వతోముఖీ
#😃మంచి మాటలు "శివుడు భస్మ ధారి‘"
భస్మము అంటే 'భ "అంటే భత్సార్ణము అంటే నాశనము చేయడము". స్మ "అంటే పాపములను నశింపచేసి భగవంతుడిని జ్ణాపకము చేసేదని అర్ధము,భస్మము అంటే పాపాలను భస్మం చేసేదని చెప్తారు,జీవితంలోని అనిత్యాన్ని "భ "-భస్మం గుర్తు చేస్తూనే వుంటుంది.భస్మమే పరమశివుని స్వరూపమని, దానిని ఉపయెాగించడము వల్లదుఃఖాలు,పాపాలు నశిస్తాయి.
త్రినేత్రుడికి భస్మం అంటే చాలా యిష్టం.అందుచేతనేశివయ్యకు అలంకారంగా పరి గణించబడుతుంది. అధ్యాత్మికంగా చూస్తే భస్మం అనేది సృష్టి యెుక్క అంతిమ సత్యాన్ని తెలియ చేస్తుంది. ఈ విశ్వంలో ఏదైనా సరే అది ఎంత గొప్పదైనా అందమైనదైనా,చివరికి మిగిలేది బూడిద మాత్రమే
శివుడు స్మశాన వాసి.ప్రళయంతరువాత సమస్తం నశించి పోయిమిగిలిన శుద్ధ మైన పదార్ధమే బూడిద.శివుడు దీనిని ధరించడంద్వారా ఈ భౌతిక దేహంసంపద, పేరుప్రతిష్టలు అన్నీ తాత్కాలికమేతుది సత్యం అశాశ్వతమైనది శాశ్వతమైనది కేవలం ఆత్మ మాత్రమే.
ఈ భస్మం వైరాగ్యానికి సంకేతము
.మనముదేనినిపట్టుకోకూడదు దేనికి అతుక్కు పోకూడదు అని శివుడు తన రూపము ద్వారా బోధిస్తున్నాడు.అంతే కాక భస్మానికి ఔషధ గుణాలు వున్నాయి.శివుడు ఎప్పుడూ కఠినతపస్సులో వుంటాడు ఆయన ధరించే విభూతి ఆయన శరీరాన్ని బాహ్య శక్తుల నుండి ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత నుండి రక్షిస్తుంది.
ఈభస్మం కేవలం బూడిద కాదు. అది అగ్నిలో సంపూర్ణంగా దహనము చేయబడిన పదార్ధముఅంటేఅదికల్మషాలను అహం కారాన్ని పూర్తిగా తగుల బెట్టి పవిత్రతను మాత్రమే మిగుల్చుతుందని అర్ధం
శివుడుభస్మమును ధరించటము అంటే ఆయన సమస్త కల్మషాలకు అతీతుడు అని ఆయన పవిత్రతకు నిలువెత్తు నిదర్శనము అని మనము గ్రహించాలి. యిది కేవలము ఆచారంగా కాకుండా జీవితంలో విముక్తిని శుద్ధిని కోరుకునే వారికి ఒకగొప్ప మాార్గ దర్శకం
భస్మం దుష్టత్వాన్ని పాపాలను భస్మం చేసి పవిత్రతను ,దివ్యత్వాన్ని. సూచిస్తుంది. శివుడు భస్మధారిగా, కైలాసంలో యెాగిగా సకల ప్రాణులను కాపాడే పరమేశ్వరుడు శివుడు.
సర్వతోముఖీ












