కర్నూలు జిల్లా ఆదోనిలో లక్ష్మమ్మ అవ్వ వెండి రథోత్సవం: పోలీసుల భారీ బందోబస్తు
ఆదోని: పట్టణంలో వెలసిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ 94వ వెండి రథోత్సవం రేపు (మే 9, 2026) వైభవంగా జరగనుంది. ఈ వేడుకను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, ఆదోని ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీ ఎం.ఎన్. భార్గవి పర్యవేక్షణలో 1టౌన్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
నిఘా: రథోత్సవ మార్గంలో డ్రోన్ కెమెరాలు, బాడీ ఓన్ కెమెరాలు, వీడియో కవరేజ్ మరియు తాత్కాలిక సిసి కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచనున్నారు.
అప్రమత్తత: రద్దీ దృష్ట్యా భక్తులు తమ మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు, మనీ పర్సుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. మైకుల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు సూచనలు అందించనున్నారు.
సహకారం: దర్శనానికి వచ్చే భక్తులు తొక్కిసలాట జరగకుండా ఓపికతో వ్యవహరించి, రథోత్సవం ప్రశాంతంగా ముగిసేలా పోలీసులకు సహకరించాలని ఆదోని 1 టౌన్ సి.ఐ. పి. చంద్రశేఖర్ కోరారు.
#🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😇My Status #🎶భక్తి పాటలు🔱 #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్