#శుభ రాత్రి
భారతీయ రామకథ ఒకే రోజులో ఒకే గ్రంథంగా పుట్టిన కథ కాదు. అనేక శతాబ్దాలపాటు వివిధ సంప్రదాయాల్లో మార్పులు చెందుతూ వచ్చిన సాహిత్య ప్రవాహం.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న బౌద్ధ సాహిత్యంలో దశరథ జాతకం ఒక ముఖ్యమైన ఆధారం. ఈ కథ పాళీ భాషలో బౌద్ధ జాతక సంప్రదాయంలో కనిపిస్తుంది.
ఈ కథలో:
రామ పండితుడు,
లక్ష్మణుడు,
సీత,
దశరథుడు,
భరతుడు
వంటి పాత్రలు కనిపిస్తాయి.
కానీ ఇక్కడ రావణుడు లేడు.
లంక యుద్ధం లేదు.
వానరసేన లేదు.
సీత అపహరణ లేదు.
ఈ కథలో రామ పండితుడు, లక్ష్మణుడు, సీత ఒకే కుటుంబానికి చెందిన పిల్లలుగా కనిపిస్తారు. తండ్రి మాటను నిలబెట్టడానికి అరణ్యానికి వెళ్లే కథగా ఇది చెప్పబడుతుంది.
బౌద్ధ సంప్రదాయం ప్రకారం బుద్ధుని దగ్గరకు వచ్చిన కుటుంబ వివాదాలు, తండ్రి–పిల్లల మధ్య అనుబంధ సమస్యలు, నీతి బోధ అవసరాల సందర్భాల్లో ఇటువంటి జాతక కథలు చెప్పబడినట్టు తెలుస్తుంది.
అంటే ప్రారంభ దశలో రామకథ ఒక నీతి కథ, కుటుంబ బంధం, ధర్మం, తండ్రి మాటకు విలువ అనే అంశాలపై నిలిచినట్లు కనిపిస్తుంది.
ఈ కథల్లో ఎక్కడా మహిమలు, మాయలు, దైవ అద్భుతాలు కనిపించవు. సాధారణ మానవ జీవితానికి సంబంధించిన నీతి మాత్రమే కనిపిస్తుంది.
ఈ జాతక కథలకు సంబంధించిన శిల్పాలు కూడా బౌద్ధ గుహలు, చైత్యాలు, విహారాల్లో చెక్కబడి ప్రజలకు కథా రూపంలో బోధించబడినట్టు కనిపిస్తుంది. మహాయాన–వజ్రయాన బౌద్ధ సంప్రదాయాల్లో ఇటువంటి కథా శిల్ప సంప్రదాయం సాధారణ శకం (CE) 8వ శతాబ్దం వరకు బలంగా కనిపిస్తుంది.
తర్వాత కాలంలో ఇదే కథ మరింత విస్తరించిన రూపంలో జైన సంప్రదాయంలో కనిపిస్తుంది.
జైన సంప్రదాయంలో ప్రసిద్ధిగా చెప్పబడే రామకథ పౌమచరియ వంటి గ్రంథాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం జైన రామాయణ సంప్రదాయానికి సంబంధించిన స్పష్టమైన లిఖిత, శిల్ప, సాంస్కృతిక ఆధారాలు ప్రధానంగా సాధారణ శకం (CE) 8వ శతాబ్దం తర్వాత ఎక్కువగా కనిపిస్తాయి.
చరిత్ర పరిశీలనలో రాష్ట్రకూట రాజవంశ కాలంలో జైన సంప్రదాయానికి పెద్దపీట వేసినట్టు కనిపిస్తుంది.
ఈ జైన రామకథలో అయోధ్యను దశరథ మహారాజు పరిపాలిస్తాడు. అతనికి రాముడు, లక్ష్మణుడు వంటి కుమారులు జన్మిస్తారు. రాముడు శాంత స్వభావుడు, ధర్మపరుడు, ప్రజల ప్రేమను పొందిన యువరాజు. సీతను వివాహం చేసుకుంటాడు.
రాజ్య పరిస్థితుల వల్ల రాముడు అడవికి వెళ్లాల్సి వస్తుంది. అతనితో పాటు సీత, లక్ష్మణుడు కూడా అడవికి వెళ్తారు.
అదే సమయంలో లంకను రావణుడు పరిపాలిస్తుంటాడు. కానీ జైన కథల్లో రావణుడు కేవలం భయంకర రాక్షసుడిగా కనిపించడు. అతను మహా విద్యావంతుడు, శాస్త్రజ్ఞుడు, సంగీతంలో నిపుణుడు, శక్తివంతమైన రాజు. అయితే అతనిలో అహంకారం కూడా ఉంటుంది.
కొన్ని జైన కథా రూపాల్లో సీత జనన కథ కూడా భిన్నంగా ఉంటుంది. కొన్ని సంప్రదాయాల్లో సీత రావణుడి కుమార్తె అని, జ్యోతిష్య సూచనల భయంతో చిన్నప్పుడే విడిచిపెట్టబడిందని, తరువాత జనకుడికి దొరికిందని చెబుతారు.
ఒక సందర్భంలో సీత సౌందర్యం గురించి విని రావణుడు ఆమెను లంకకు తీసుకెళ్తాడు. కానీ ఆమెపై బలవంతం చేయకుండా రాజమర్యాదలతో ఉంచుతాడు.
సీతను వెతుకుతూ రాముడు, లక్ష్మణుడు అడవుల్లో సంచరిస్తారు. ఈ ప్రయాణంలో సుగ్రీవుడు, హనుమంతుడు, వాలి వంటి వానర గణ నాయకులతో పరిచయం ఏర్పడుతుంది.
జైన సంప్రదాయంలో “వానరులు” నిజమైన కోతులు కాదు. ప్రత్యేక యోధ గణాలు లేదా వంశాలుగా కథలో కనిపిస్తారు.
వాలి–సుగ్రీవ విభేదం తర్వాత సుగ్రీవుడు రాముడికి మిత్రుడవుతాడు. హనుమంతుడు లంకకు వెళ్లి సీతను కనుగొంటాడు.
తర్వాత లంకపై యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో లక్ష్మణుడే ప్రధాన యోధుడిగా నిలుస్తాడు. చివరకు రావణుణ్ని సంహరించేది కూడా లక్ష్మణుడే.
ఇది జైన రామకథలో అత్యంత ముఖ్యమైన భేదం. ఎందుకంటే జైన తత్వంలో అహింసకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల రాముణ్ని తక్కువ హింసాత్మకుడిగా చూపించే ప్రయత్నం కనిపిస్తుంది.
ఈ కథలో కూడా ఎక్కడా అతీంద్రియ మహిమలు, మాయలు ప్రధానంగా కనిపించవు. మానవ ప్రవర్తన, అహంకారం, ధర్మం, కర్మ ఫలితం వంటి భావనలు ప్రధానంగా కనిపిస్తాయి.
యుద్ధం ముగిసిన తర్వాత సీత తిరిగి రాముడితో చేరుతుంది. కానీ కథ అక్కడితో ముగియదు.
చివరికి రాముడు వైరాగ్యం పొందుతాడు. రాజ్యం, యుద్ధం, అధికారం, భోగాలు శాశ్వతం కావని గ్రహించి సంయమ జీవితం వైపు వెళ్తాడు.
లక్ష్మణుడు యుద్ధ హింస కారణంగా కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడని కథ చెబుతుంది. రావణుడు కూడా కేవలం దుష్టుడిగా కాకుండా, అహంకారం వల్ల పతనమైన మహారాజుగా చిత్రించబడతాడు.
ఈ విధంగా జైన రామకథ దేవతా అవతారాల కంటే మానవ పాత్రలపై, యుద్ధ వీరత్వం కంటే కర్మ–అహింసపై, చివరికి వైరాగ్యం మరియు మోక్ష భావనపై ఎక్కువ దృష్టి పెడుతుంది.
తర్వాత భారతదేశంలో దేవాలయ వ్యవస్థ బలపడిన కాలంలో, జీవుడు వేరు దేవుడు వేరు అనే భావన బలపడిన తరువాత, విష్ణు అవతారాల సాహిత్యం విస్తరించిన తరువాత రామకథ మరింత దేవీకరించబడినట్టు కనిపిస్తుంది.
ఈ దృష్టికోణం ప్రకారం, ముందే ఉన్న బౌద్ధ మరియు జైన కథా సంప్రదాయాలను సేకరించి, వాటిలో మార్పులు చేర్పులు చేసి, మహిమలు, మాయలు, దైవ శక్తులు జోడించి రామాయణం వంటి రూపం బలపడినట్టు కొందరు చరిత్ర–సాహిత్య పరిశోధకులు చర్చిస్తారు.
ఈ మొత్తం పరిణామాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది.
మొదట ఒక నీతి కథ.
తర్వాత ఒక విస్తృత సాహిత్య కథ.
తర్వాత ఒక మత ఇతిహాసం.
ఆ తర్వాత దేవాలయ సంస్కృతిలో దైవ అవతార కథ.
అంటే ఒక భావం తర్వాత ఒక సాహిత్యం, తర్వాత ఒక శిల్పం, తర్వాత ఒక దేవాలయ వ్యవస్థ ఇలా అనేక శతాబ్దాలపాటు మార్పులు చెందుతూ వచ్చిన చారిత్రక–సాంస్కృతిక పరిణామాన్ని మనం చూస్తున్నాం.
ముందు వచ్చిన ఆధారాలను పక్కన పెట్టి, తరువాతి కాలంలో ఏర్పడిన రూపాన్నే “శాశ్వత సత్యం”గా భావించడం చరిత్ర అవగాహనలో లోపాన్ని చూపిస్తుంది.
చరిత్రను విశ్వాసంతో కాదు, ఆధారాలతో చదవాల్సిన అవసరం ఉంది.
ఇంత వివరంగా చెప్పినా కూడా కొందరు పిడివాదం చేస్తారు కాబట్టి చరిత్రలో రాముడు, లక్ష్మణుడు, సీత, భరతుడు, దశరథుడు, ఈ పాత్రలతో మొదట సాహిత్యం ఎక్కడ మొదలైందో తర్వాత అది ఎలా కాలక్రమంలో మారిందో ఆధారాలు ఇస్తున్నాను చూడండి 👇
1. దశరథ జాతకం పాళీ బౌద్ధ జాతక సాహిత్యంలో భాగంగా పరిగణించబడుతుంది. బౌద్ధ సంప్రదాయం ప్రకారం పాళీ త్రిపిటకాన్ని శ్రీలంకలో సాధారణ శక పూర్వం (BCE) 1వ శతాబ్దంలో లిఖితరూపంలో నమోదు చేసినట్టు పేర్కొంటారు. ఈ సమాచారం శ్రీలంక బౌద్ధ వంశావళి గ్రంథాలు దీపవంశ మరియు మహావంశ లో కనిపిస్తుంది.
2. మహావంశ ప్రకారం వట్టగామిణి అభయ రాజు కాలంలో అలువిహారలో బౌద్ధ త్రిపిటకాన్ని తాళపత్రాలపై లిఖించారని పేర్కొనబడింది. అంటే బౌద్ధ జాతక కథలు మౌఖిక సంప్రదాయం నుండి లిఖిత సంప్రదాయంలోకి వచ్చిన కాలంగా సాధారణ శక పూర్వం (BCE) 1వ శతాబ్దం ప్రస్తావించబడుతుంది.
3. ఫాహియాన్ 5వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చి బౌద్ధ విహారాలు, బౌద్ధ కథా సంప్రదాయాలు, బౌద్ధ గ్రంథాల అధ్యయనం గురించి ప్రస్తావించాడు.
4. హ్యూయెన్ త్సాంగ్ 7వ శతాబ్దంలో భారతదేశంలోని నాళంద, విక్రమశీల వంటి బౌద్ధ విద్యా కేంద్రాలను ప్రస్తావించాడు. అతని రచనల్లో బౌద్ధ సంప్రదాయం విస్తృతంగా కనిపిస్తుంది.
5. ఇత్సింగ్ కూడా 7వ శతాబ్దంలో భారతదేశంలోని బౌద్ధ విద్యా సంప్రదాయాలు, వినయపిటక అధ్యయనం, బౌద్ధ మఠ వ్యవస్థ గురించి స్పష్టంగా వ్రాశాడు.
6. పౌమచరియ జైన రామకథకు సంబంధించిన ముఖ్య గ్రంథంగా పరిగణించబడుతుంది. జైన సంప్రదాయం దీన్ని ప్రాకృత భాషలో రచించబడిన గ్రంథంగా పేర్కొంటుంది. కొన్ని జైన గ్రంథ సంప్రదాయాలు దీనిని సాధారణ శకం (CE) 3వ–5వ శతాబ్దాల మధ్యకు తేదీకరిస్తాయి.
7. కానీ జైన సంప్రదాయానికి సంబంధించిన స్పష్టమైన శిల్ప, దేవాలయ, శాసన ఆధారాలు ప్రధానంగా సాధారణ శకం (CE) 8వ శతాబ్దం తర్వాత ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా రాష్ట్రకూట రాజుల కాలంలో జైన శిల్ప సంప్రదాయం విస్తరించినట్టు చరిత్రలో ప్రస్తావించబడుతుంది.
8. ఎల్లోరా జైన గుహలు ప్రధానంగా రాష్ట్రకూట వంశ కాలమైన సాధారణ శకం (CE) 9వ–10వ శతాబ్దాలకు తేదీకరించబడుతున్నాయి.
9. శ్రవణబెలగొళ లోని బాహుబలి మహాశిల్పానికి సాధారణ శకం (CE) 10వ శతాబ్దపు గంగ వంశ శాసన ఆధారాలు ఉన్నాయి. చాముండరాయ నిర్మించినట్టు శాసనాల్లో ప్రస్తావించబడింది.
10. రామాయణం సంస్కృత సాహిత్యంలో ప్రధాన రామకథా గ్రంథంగా పరిగణించబడుతుంది. భారతీయ సాహిత్య పరిశోధకులు దీనిని సాధారణ శక పూర్వం (BCE) చివరి శతాబ్దాల నుండి ప్రారంభ సాధారణ శకం (CE) శతాబ్దాల మధ్య అభివృద్ధి చెందిన కావ్య సంప్రదాయంగా భావిస్తారు.
11. రామాయణానికి సంబంధించిన ప్రాచీన శిల్ప ఆధారాలు నాగార్జునకొండ, దేవగఢ్, బాదామి వంటి ప్రదేశాల్లో సాధారణ శకం (CE) 5వ–7వ శతాబ్దాల మధ్య కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో రామకథ దేవాలయ శిల్పాల్లో స్థిరపడినట్టు తెలుస్తుంది.
12. చైనా యాత్రికుల రచనల్లో బౌద్ధ విహారాలు, బౌద్ధ విద్యా వ్యవస్థల గురించి విస్తృత ప్రస్తావనలు కనిపిస్తాయి. కానీ 5వ–7వ శతాబ్దాల్లో దేశవ్యాప్త వైష్ణవ రామభక్తి గురించి అదే స్థాయిలో స్పష్టమైన వర్ణనలు కనిపించవు.
13. అందువల్ల చారిత్రక ఆధారాల ఆధారంగా చూస్తే:
బౌద్ధ జాతక సంప్రదాయం ముందుగా లిఖిత మరియు యాత్రికుల వర్ణనల్లో కనిపిస్తుంది.
తరువాత జైన రామకథ శిల్ప–సాహిత్య రూపంలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఆ తరువాత వైష్ణవ రామభక్తి దేవాలయ సంప్రదాయం విస్తృతంగా కనిపిస్తుంది.
14. చరిత్ర పరిశోధనలో ఒక సంప్రదాయాన్ని నిర్ధారించడానికి: శాసనాలు, సమకాలీన రాజుల ప్రస్తావనలు, విదేశీ యాత్రికుల వర్ణనలు, శిల్పాలు, లిఖిత గ్రంథాలు, నిర్మాణాలు వంటి భౌతిక ఆధారాల సమ్మిళితం ముఖ్యంగా పరిగణించబడుతుంది.
మీ
బండపల్లి శివారెడ్డి
#🌅శుభోదయం #శుభ శనివారం
తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా.. ఇదిగోండి ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ!!
తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు..
అక్కడ వసతి మరో ఎత్తు..
కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే.. ఏం చేయాలో తెలియదు,
ఎక్కడ తల దాచుకునే వసతి దొరుకుతుందో తెలియదు.. టీటీడీ కేటాయించే సత్రాల్లో గదుల కేటాయింపు మరో అర్థంకాని బ్రహ్మపదార్థం..
రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి,
ఆర్థికంగా బలవంతులకు,
సెలబ్రిటీలకు, అధికారులు, పోలీసులు, ప్రెస్.. ఇలా ఎందరికో ప్రాధాన్యమిచ్చిన తర్వాత చివరాఖరుకు సామాన్యులకు శ్రీవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. దీంతో వసతి దొరక్క అనేక మంది భక్తులు ఆ ఆవరణలోనే గాలికి పడుకుని ఉండే సీన్లు అనేకం…
అక్కడ పలు మఠాలకు చెందిన, కులాలకు చెందిన సత్రాలున్నాయి… అవి ఆదరిస్తాయి,
తలదాచుకునే చోటు చూపిస్తాయి… అయితే…?
వాటిని కంటాక్ట్ చేయడం ఎలా..?
ఇదుగో మఠాలు, సత్రాలు, నంబర్లు….
కాకపోతే కాస్త ముందే సంప్రదించండి…
రిజర్వ్ చేసుకొండి…
ఆ స్వామి కొలువైన ప్రాంగణంలో మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొండి…
ఇవిగో నంబర్లు, పేర్లు….
మనకు తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు,
వాటి ఫోన్ నంబర్లు:
Mool Mutt Ph:0877-2277499.
Pushpa Mantapam Ph:0877-2277301.
Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.
Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.
Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.
Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.
Sri Vaykhanasa Divya Siddanta
Vivardhini Sabha Ph:0877-2277282.
Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.
Sri Pushpagiri Mutt Ph-0877-2277419.
Sri Uuttaradi Mutt Ph-0877-2277397.
Udupi Mutt Ph-0877-2277305.
Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.
Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.
Sri Tirupati Srimannarayana Ramanuja
Jeeyar Mutt Ph:0877-2277301.
Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.
Sri Ahobita Mutt Ph:0877-2279440.
Sri Tirumala Kashi Mutt phone : 222 77316
Udipi Mutt Ph:0877 222 77305
Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)
Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)
Sri Vallabhacharya Mutt phone : 222 77317
Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302
Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436
Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826
Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282
Sri Ahobila Mutt Ph:0877-2279440
Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269
Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445
Hotel Nilarama Choultry Ph:0877 222 77784
Sri Srinivasa Choultry Ph:0877 222 77883
Sri Hathiramji Mutt Ph:0877 222 77240
Karnataka Guest House Ph:0877 222 77238
Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245
Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435
Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015
అందరికీ ఎంతో ఉపయోగ పడే సమాచారం పదిమందికి Share చెయ్యండి…
#🌅శుభోదయం
ఆయన పేరు శ్రీకృష్ణదేవరాయలు.. అలనాటి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారసుడు. రాయలవారి ఘనతను మరోసారి చాటడానికి కృషి చేస్తున్నారాయన.
రాయల వంశం మాది. ఆ వంశంలో నాది పంతొమ్మిదో తరం. ఐదు శతాబ్దాలకుపైగా చరిత్ర.. దక్షిణ భారతాన అడుగడుగునా కనిపించే చరిత్రకు వారసుడినని గర్వంగా చెప్పుకుంటాను. 1565లో తళ్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్య రాజధాని హంపిలోని కోటలన్నీ ధ్వంసమయ్యాయని తెలిసిందే.
ఆ తర్వాత మా పూర్వీకులు తొలుత పెనుగొండకు అక్కడ్నుంచి చంద్రగిరికి, తర్వాత వెల్లూరుకు, శ్రీరంగపట్నానికి చివరగా కర్ణాటకలోని అనెగొందికి వచ్చి స్థిరపడ్డారట.
అక్కడ మా రాజవంశీకులు కట్టించిన బంగ్లా (హీరే దివానా) మా నివాసం. మా తాతగారు దర్బార్ రాజకృష్ణదేవరాయ. మధ్యప్రదేశ్లోని నర్సింఘడ్కు చెందిన రాణి లాల్కుమారీ భాయ్ని వివాహం చేసుకున్నారు.
మా నాన్నగారు అచ్యుత దేవరాయ, అమ్మ చంద్రకాంతదేవి. నేను ఇంజనీరింగ్ చేశాను. పదిహేనేళ్లపాటు అమెరికాలో ఉండి నాన్నగారు పోయాక 2008లో ఇక్కడికి వచ్చేశాను. మా భూముల్లో వ్యవసాయం చేస్తున్నా. మరోవైపు మైనింగ్ వ్యాపారం ఉంది. ప్రస్తుతం హోస్పేటలో ఉంటున్నాం.
మా పూర్వీకుల చరిత్రను, నాటి వైభవానికి గుర్తుగా ఉన్న సంపదను పదిలపరచాలని నిర్ణయించుకున్నా. అందులో భాగంగా హీరేదివానా బంగ్లాను పునర్నిర్మిస్తున్నాను. రెండేళ్లుగా అదే పనిలో నిమగ్నమై ఉన్నా. సున్నం గోడలు, కలపతో కలగలసిన నిర్మాణం అది.
ఆనాటి నిర్మాణ శైలికి ఎలాంటి అవరోధం కలగకుండా.. సిమెంట్ వాడకుండా.. సున్నంతోనే మళ్లీ పునర్నిర్మాణం చేపట్టాం. అలాంటి కలపనే తెప్పించి వాడుతున్నాం. ఈ భవనంలో మా పూర్వీకులు వాడిన కత్తులు, తుపాకీ (వాడకంలో లేదు) ఉంచనున్నాం. ఇక పంచలోహ విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ భద్రపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
మా బంగళాలోని లైబ్రరీలో ఉన్న సాహితీ సంపదను భద్రపరిచాను. కొత్త బంగ్లాలో మరింత సురక్షింతంగా వీటిని ఉంచడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.
అనెగొందిలో ఉన్న మా పూర్వీకుల ఆస్తులను చాలా వరకూ 1824లో బ్రిటీష్ పాలకులు తీసుకున్నారు. అప్పటినుంచి మా కుటుంబ వారసులకు నెలకు 500 రూపాయలు చొప్పున పింఛన్ ఇచ్చేవారు. ఈ పింఛను మా తాతగారు, ఆయన తర్వాత మా నాయనమ్మ కూడా అందుకున్నారు. 1966లో మా నాయనమ్మ హయాంలో దీనిని నిలిపివేశారు.
500 రూపాయలు కోసమని కాదు.. కానీ మమ్మల్ని గుర్తించడం లేదనే బాధ ఉంది. అయితే ప్రముఖ ఆలయాల్లో పూర్ణకుంభాలతో స్వాగతం పలుకుతుండటం కొంత సంతృప్తినిస్తుంది. అయితే వంశం పేరు చెప్పుకుని పబ్బం గడపడం సరికాదు.
అంత గొప్ప రాజవంశంలో పుట్టినందుకు.. పదిమందికి ఉపయోగపడే పని చేయాలి. అందుకే 1970 నుంచి హోస్పేటలో ‘దీపాయన’ అనే పాఠశాల నడుపుతున్నాం. తక్కువ ఫీజుతో మెరుగైన విద్యనందిస్తున్నాం. నా పిల్లలు కూడా ఇదే పాఠశాలలో చదువుతున్నారు.
చివరగా మా పూర్వీకుల వస్తువులు, పుస్తకాలు భవిష్యత తరాలకు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాను. రాయల వైభవాన్ని మరోసారి చాటడమే నా లక్ష్యం.
#శుభ మధ్యాహ్నం
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సమయం ఉదయం మూడు గంటలు. అక్కడ ప్రయాణీకులంతా నిద్రలో ఉన్నారు. డెబ్భై ఎనిమిదేళ్ళ వృద్ధుడు. తెల్లటి ధోవతి, చొక్కాతో కూర్చున్నాడు. చేతిలో ఒక వెదురు బుట్ట. అందులో వేడి వేడి ఇడ్లీ ఉన్నాయి. ఆయన,
“ఇడ్లీ… వేడి ఇడ్లీ… ఒక రూపాయి… ఒక్క రూపాయి మాత్రమే…” అని పిలుస్తున్నాడు. కానీ, ఎవరూ కొనలేదు. ఇది 2026 సంవత్సరం. ఒక రూపాయికి చాక్లెట్ కూడా రాదు… ఇడ్లీలా? చాలామంది నవ్వుతూ అతన్ని పిచ్చివాడని అనుకున్నారు. నా పేరు అరవింద్. నేను ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. నైట్ షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాను. ఆకలిగా ఉంది. కానీ స్టేషన్ స్టాళ్లలో ఇడ్లీ ప్లేట్ ₹50. ఆ వృద్ధుడిని గమనించాను. బుట్టలో దాదాపు 100 ఇడ్లీలు ఉన్నాయి. ఒక్క కస్టమర్ కూడా లేడు. ఆయన కళ్లలో తేమ కనిపించింది. నేను దగ్గరకు వెళ్లి అడిగాను: “తాతయ్య… ఒక రూపాయికి ఇడ్లీ అమ్మితే నష్టమవదా?” ఆయన చిరునవ్వు నవ్వాడు. “బాబూ… ఇది నష్టం కాదు. లాభం.” “ఎలా తాతయ్య? బియ్యం ధర, గ్యాస్ ధర… ఒక్క ఇడ్లీకి కనీసం ₹5 ఖర్చవుతుంది కదా!” ఆయన బుట్ట మూసి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు… “1975 సంవత్సరం. అప్పటికి నాకు 25 ఏళ్లు. రైల్వే పోర్టర్గా పనిచేసేవాడిని. నెల జీతం ₹100. ఒక రోజు భారీ వర్షం. పని లేదు. డబ్బు లేదు. మూడు రోజులు ఆకలితో ఉన్నాను. స్టేషన్ బెంచ్ మీదే మూర్చపోయాను.” “అప్పుడు ఒక అమ్మ వచ్చింది. ఆమె ప్లాట్ఫాంపై ఇడ్లీలు అమ్మేది. ఒక్క రూపాయికి. నన్ను లేపి నీళ్లు చల్లి 4 ఇడ్లీలు పెట్టింది. డబ్బు అడగలేదు.” “నేను ఏడుస్తూ… ‘నా దగ్గర డబ్బు లేదు’ అన్నాను. అప్పుడు ఆమె చెప్పింది — ‘బాబూ… నేను కూడా ఒకప్పుడు ఆకలితో ఉన్నాను. అప్పుడు ఎవరో నాకు భోజనం పెట్టారు. అప్పుడే నేను ఒక మాట ఇచ్చుకున్నాను — నేను బ్రతికినంతకాలం ఆకలితో ఉన్నవారికి ఒక రూపాయికి ఇడ్లీ ఇస్తాను. నువ్వూ పెద్దవాడైన తర్వాత ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలి.’” వృద్ధుడి కళ్లలో నీళ్లు మెరిశాయి. “ఆమె 1995లో చనిపోయింది. చనిపోయే ముందు నా చెయ్యి పట్టుకుని అడిగింది — ‘నా మాట నిలబెడతావా?’ నేను ‘అవును’ అన్నాను.” “ఆ తర్వాత నేను రైల్వే కాంట్రాక్టులు తీసుకున్నాను. బాగా సంపాదించాను. మూడు ఇళ్లు. ఇద్దరు పిల్లలు. ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. కానీ 1995 నుంచి ఈరోజు వరకు… ప్రతి ఉదయం 3 గంటలకు… 100 ఇడ్లీలు… ఒక రూపాయి… ఈ స్టేషన్లోనే.” నా శరీరమంతా గగుర్పొడిచింది. “తాతయ్య… రోజుకి ₹400 నష్టం. నెలకి ₹12,000. సంవత్సరానికి ₹1.5 లక్షలు. 30 సంవత్సరాలకు ₹45 లక్షలు!” ఆయన చిరునవ్వుతో అన్నాడు: “డబ్బు ప్రకారం చూస్తే నష్టం. కానీ మనసు ప్రకారం చూస్తే లాభం. ఈ 30 ఏళ్లలో ఎంతమందికి తినిపించానో తెలుసా? 10 లక్షల ఇడ్లీలు… 10 లక్షల కడుపులు… 10 లక్షల ఆశీర్వాదాలు… వాటి విలువ ఎన్ని కోట్లుంటుంది బాబూ?” అంతలో ఒక చిన్న బాలుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. చిరిగిన చొక్కా. వయస్సు 12 సంవత్సరాలు. “తాతయ్య… ఇడ్లీ… మూడు రోజులుగా తినలేదు. అమ్మ ఆసుపత్రిలో ఉంది. డబ్బు లేదు.” వృద్ధుడు ఒక ఆకు మీద 4 ఇడ్లీలు పెట్టి చట్నీ వేశాడు. “నెమ్మదిగా తిను బాబూ.” ఆ బాలుడు తింటూ ఏడ్చాడు. “రేపు డబ్బు ఇస్తాను…” “అవసరం లేదు. నువ్వు పెద్దవాడైన తర్వాత ఇంకొక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టు. అదే చెల్లింపు.” ఆ బాలుడు ఆయన కాళ్లకు పడిపోయాడు. “నేను కూడా మాట ఇస్తున్నాను తాతయ్య. నేను కూడా ఒక రూపాయికి ఇడ్లీ అమ్ముతాను.” నేను వెంటనే ₹1000 తీసి ఇచ్చాను. “తాతయ్య… దయచేసి ఈ ఇడ్లీల్లన్నీ నాకు ఇవ్వండి.” ఆయన నవ్వి అన్నాడు: “ఇవి ఒకరికే అమ్మడానికి కాదు బాబూ… ఆకలితో ఉన్నవారికోసం. నీకు ఆకలి అయితే ఒక ఇడ్లీ తీసుకో. ఒక రూపాయి వేయి. చాలు.” నేను ₹1 పెట్టి ఒక ఇడ్లీ తీసుకున్నాను. నా జీవితంలో అంత రుచిగా అనిపించిన భోజనం మరొకటి లేదు. కన్నీళ్లతో తిన్నాను. “తాతయ్య… ఒకటి అడగనా?” “అడుగు బాబూ.” “మీ పిల్లలు ఇది డబ్బు వృథా అంటారా?” ఆయన ఫోన్ తీసి వీడియో కాల్ చేశాడు. అమెరికాలో ఉన్న తన కొడుకు ఫోన్ ఎత్తాడు. “అప్పా, ఇడ్లీలు అమ్మేశారా? ఆరోగ్యం ఎలా ఉంది?” “బాగున్నాను. ఈరోజు ఒక యువకుడు నా కథ విన్నాడు.” ఆయన కొడుకు నన్ను చూసి నవ్వాడు. “సర్, మా నాన్నను చూసుకున్నందుకు ధన్యవాదాలు. ప్రతి నెలా మేము ₹50,000 పంపిస్తాం — ఇడ్లీల కోసం. అది ఆయన కోరిక. అదే మా ఆశీర్వాదం. ఆయన ఇచ్చిన మాట… ఇప్పుడు మా మాట.” వృద్ధుడు కాల్ ముగించి అన్నాడు: “చూశావా బాబూ? నా పిల్లలు కూడా ఈ వ్రతాన్ని కొనసాగిస్తున్నారు. నేను చనిపోయినా ఈ బుట్ట ఆగదు. ఒక రూపాయి ఇడ్లీ ఆగదు.” ఈరోజు 2026. ఆ వృద్ధుడు ఇక లేరు. గత సంవత్సరం 79 ఏళ్ల వయసులో చనిపోయారు. చనిపోయే ముందు నా చెయ్యి పట్టుకుని చెప్పారు: “బాబూ… ఈ బుట్టను చూసుకో. మాట నిలబెట్టు.” ఇప్పుడు ప్రతి ఉదయం 3 గంటలకు… అదే చెన్నై సెంట్రల్ స్టేషన్లో… అదే బెంచ్ దగ్గర… నేను ఉంటాను. బుట్ట నిండా ఇడ్లీలు. ఒక్క రూపాయి. నేను నా ఐటీ ఉద్యోగం వదల్లేదు. కానీ ప్రతి ఉదయం 2 గంటలు… ఇడ్లీల కోసం కేటాయిస్తున్నాను. మా కంపెనీలో 200 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ నెలకు ₹100 ఇస్తున్నారు. “వన్ రూపీ ఇడ్లీ ట్రస్ట్.” ఆ 12 ఏళ్ల బాలుడు — గణేష్ — ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. సాయంత్రం వచ్చి సహాయం చేస్తాడు. “అన్నా… నేనూ మాట ఇచ్చాను. పెద్దవాడైన తర్వాత నేనూ ఇదే చేస్తాను.” --- స్నేహితులారా… డబ్బు సంపాదించడం గొప్ప కాదు. ఆ డబ్బుతో పుణ్యం సంపాదించడం గొప్ప. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఒక చిన్న పొదుపు డబ్బా పెట్టండి. “₹1 డబ్బా.” ప్రతి రోజు ₹1 వేయమని చెప్పండి. నెలకి ₹30 అవుతుంది. ఆ డబ్బుతో ఒక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి. ఎందుకంటే… మీకు ₹30 ఒక చిన్న ఖర్చు మాత్రమే కావచ్చు… కానీ ఇంకొకరికి అది 30 రోజుల ఆశ కావచ్చు. --- ఒక మాట ఇచ్చుకుందాం: కనీసం ఒక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి. డబ్బు పోతుంది… పుణ్యం మిగులుతుంది… బుట్ట ఖాళీ కావచ్చు… కానీ మనసు మాత్రం నిండిపోతుంది… 🙏
వాట్సప్ సేకరణ
ప్రభాకర్ జైనీ
#🌅శుభోదయం
వైజాగ్ మధురవాడలో నిర్మిస్తున్న Unity Mall ప్రాజెక్ట్కు సుమారు ₹172 కోట్ల బడ్జెట్ ఆమోదించారు. ఇది కేంద్ర ప్రభుత్వ “One District One Product (ODOP)” పథకం కింద అభివృద్ధి చెందుతోంది. ✨
ఈ Unity Mall వల్ల కలిగే ప్రధాన ఉపయోగాలు:
• ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాకు ప్రత్యేక స్టాల్స్
• హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్, GI ట్యాగ్ ఉత్పత్తుల విక్రయాలు
• స్థానిక కళాకారులు, చిన్న వ్యాపారులకు భారీ మార్కెట్ అవకాశాలు
• టూరిజం & కల్చరల్ హబ్గా అభివృద్ధి
• ఫుడ్ కోర్ట్స్, కన్వెన్షన్ సెంటర్, ఓపెన్ థియేటర్ వంటి ఆధునిక సదుపాయాలు
• ప్రత్యక్ష & పరోక్ష ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి
• మధురవాడ ప్రాంతానికి కమర్షియల్ విలువ మరింత పెరుగుతుంది 📈
ఎక్కడ నిర్మిస్తున్నారు?
మధురవాడలో Ramanaidu Studios సమీపంలో, బీచ్ కారిడార్ దగ్గర సుమారు 5 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.
ఎందుకు మధురవాడలోనే?
మధురవాడ ప్రస్తుతం వైజాగ్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న Future IT & Infrastructure Corridor గా మారుతోంది:
• IT Parks & Data Centres
• Metro Rail proposal 🚇
• Bhogapuram International Airport కనెక్టివిటీ
• భారీ Residential & Commercial Projects
• UGD & Smart Infrastructure Projects
• Beach Tourism Corridor Development 🌊
అందుకే ప్రభుత్వం Unity Mall వంటి landmark projects ను మధురవాడలో అభివృద్ధి చేస్తోంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మధురవాడకు “Commercial & Tourism Hub”గా మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. 🚀












