#🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌 శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు
దెందులూరు మాజీ శాసన సభ్యులు మరియు అసెంబ్లీ నియోజక వర్గ సమన్వయకర్త
ప్రెస్ నోట్
11/04/2026
దెందులూరులో 'కూటమి' మార్కు వింతలు1
గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలను పోలీస్ స్టేషన్లుగా మార్చి ప్రారంభోత్సవాలు
తామే నిర్మించినట్లుగా ప్రచారాల సంబరాలు
ఇంతకంటే హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా? – మాజీ ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు
జగనన్న ఆశయాలకు అనుగుణంగా తాను పెదపాడులొ ఏర్పాటు చేసిన సచివాలయాన్ని అలాగే, పెదవేగిలో కట్టిన రైతుభరోసా కేంద్రాన్ని కూటమి ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లుగా మార్చి, మంత్రి గారి ద్వారా ప్రారంభోత్సవాలు చేయించి గొప్ప ఘనత సాధించినట్లుగా భావిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే తీరుపై దెందులూరు మాజీ శాసన సభ్యులు మరియు అసెంబ్లీ నియోజక వర్గ సమన్వయకర్త శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు విస్మయం ప్రకటించారు.
గ్రామ స్వరాజ్య పాలనలో భాగంగా వివిధ రకాల ప్రజా సేవల కోసం, నియోజక వర్గంలో తాను సుమారు 250 భవనాలు నిర్మించానని, వాటిని కూడా ఇలాగే రంగులు మార్చి నిజమైన ప్రజాసేవకు వాడుకోవచ్చని, తమకేమి అభ్యంతరం లేదని అయితే ఇది తమ వైసీపీహయాంలో ఏర్పాటైన కట్టడాలే, ఈ ప్రభుత్వం కేవలం రంగులు మార్చిందన్న విషయం ప్రజలకు తెలుసని కూటమి నేతలు గ్రహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు భవనాలను పోలీసుల సేవలకు ఉపయోగించడం తమకు కూడా ఆనందంగానే ఉన్నట్లు ఆయన ప్రకటించారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, మౌలిక సదుపాయాల్లో నెంబర్ వన్ గా నిలబెడతాం, అనంతమైన సంపద సృష్టిస్తాం అంటూ ఊదరకొడుతున్న కూటమి ప్రభుత్వానికి, దెందులూరులో సొంతంగా కొత్తగా ఒక పోలీస్ స్టేషన్ భవనం కట్టుకునే "స్తోమత" లేదని రుజువు అవుతోందని, భవనాల బోర్డులు మార్చినంత తేలికగా ప్రజల మనసుల్లో నుండి జగనన్న పాలనను మరిపించలేమని వారు తెలుసుకోవాలని శ్రీ అబ్బయ్య చౌదరి గారు వ్యాఖ్యానించారు.,
ఇట్లు
శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారి క్యాంపు కార్యాలయం
దెందులూరు నియోజకవర్గం
#AdminPost #TeamABC #🟢వై.యస్.జగన్ #🔵వైయస్ఆర్సీపీ





