#srisailam #srisailam #srisailam dam 10 gates open #lordshiva #god #shiva #jyothirlingadarshan #trending #shiva
#🕉️మహాశివరాత్రి త్వరలో రాబోతోంది🕉️ లింగోద్భవం...........!!
లింగోద్భవ సమయం....
నిశిత కాల పూజ (లింగోద్భవ సమయం): ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 11:55 నుంచి ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 12:56 వరకు.
చతుర్దశి తిథి ముగింపు: ఫిబ్రవరి 16, సోమవారం సాయంత్రం 05:34 గంటలకు.
సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడూ అందులోనూ తేజో లింగస్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఈ కథా సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది.
ఒక్క శివలింగానికి కాసింత పూజను, అభిషేకాన్ని ఏ రోజు చేసినా పుణ్యఫలమే. అందులోనూ శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు, అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేముంటుందని పురాణజ్ఞులు, పండితులు అంతా అనేమాట వాస్తవమే.
అసలు మనిషి దైవ సందేశాన్నందుకొని లోక యాత్రలో పుణ్య పురుషుడుగా మెలగాలన్నదే మన ఆర్షవాణి, సంప్రదాయ పర్వదినాల అవతరణలో అసలు విషయం. ఇక లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశమేమిటి? ఆ భవుడికి, భవనాశనుడికి, శంకరుడికి నచ్చనిది ఏది? అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావితమై కనిపిస్తుంది.
పూర్వం ఓసారి బ్రహ్మకు, విష్ణువుకు తాను గొప్పంటే తాను గొప్పన్న అహంకారం కలిగింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది. లోకాలన్నీ ఆ తగవులాటవల్ల భీతిల్లుతున్న తరుణంలో చంద్ర శేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నాడు. వెంటనే వారి ముందు ఒక దివ్యతేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగరూపంలో అవతరించేలా చేశాడు. అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్యతేజోస్తంభం ఏమిటా అని హరి, బ్రహ్మలు యుద్ధంమాని విస్తుపోతూ చూశారు. వెంటనే పార్వతీ వల్లభుడు తన దివ్యలీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని, ఆ స్తంభం (లింగం) అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మురొకరు చూసి రావాలని, ఎవరు ముందుగా వస్తే వారే గొప్పని, వారికే సర్వాధిపత్యం అని చెప్పాడు. వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరటానికి వెళ్ళాడు. విష్ణువు వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవటానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు.
హరి, బ్రహ్మలకు ఆ దివ్యతేజో రాశి ఆద్యంతాలు ఎంతకీ అంతు పట్టలేదు. ఇంతలో పై నుండి ఒక కౌతకి (మొగలిపువ్వు) రావటం హంస రూపంలో ఉన్న బ్రహ్మ చూశాడు. బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజో రాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు. పాతాళం వైపు వెళ్ళిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు. ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకొని శివుడి దగ్గరకొచ్చాడు. బ్రహ్మ, ఆ తర్వాత కొద్ది సేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ పై కొచ్చాడు. శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని కూడా వెంటపెట్టుకొచ్చానన్నాడు. ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకువచ్చిది. వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మను దండించమన్నాడు.
భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదుతలలలో అబద్ధం ఆడిన తలను తుంచేశాడు. తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశుడిని శరణు వేడుకొన్నాడు. పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడి గొప్పప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించాడు. బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు. శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడ్డాడు. ఇంతకు ముందు లాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని, అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు, పూజలు ఏవీ ఉండవని చెప్పాడు. అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలందుకుంటాడని, స్థితి కారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు.
మొగలిపువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలిపువ్వుకు చోటుండదని అన్నాడు. అయితే ఆ కేతకి శివుడికి పరిపరివిధాల ప్రణమిల్లింది. భక్తవత్సలుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలిపువ్వును ధరిస్తారని, అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్థానమయ్యాడు. ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాపఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది. మానవులాంతా సత్యమార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తోంది. #😴శుభరాత్రి #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕అయోధ్య రామ మందిరం🙏 #🎶భక్తి పాటలు🔱
శివుడు దక్షిణమూర్తిగా ఎందుకు పిలవబడతాడు...........!!
శివుడిని "దక్షిణామూర్తి" (దక్షిణ మూర్తి) అని పిలవడానికి కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక,తాత్విక కారణాలు ఉన్నాయి.
ఇది శివుని ప్రత్యేకమైన రూపం,
ముఖ్యంగా జ్ఞానాన్ని, ఉపదేశాన్ని మరియు మౌన ఉపదేశాన్ని సూచిస్తుంది.
దక్షిణామూర్తి అంటే ఎవ్వరు..
"దక్షిణ" అనగా దక్షిణదిక్కు అని అర్థం.
"మూర్తి" అనగా దేవతరూపం.
అంటే, దక్షిణదిక్కుకు ముఖంగా ఉండే మూర్తిని దక్షిణామూర్తి అంటారు.
ఇది శివుని జ్ఞానరూపమైన అవతారంగా భావించబడుతుంది.
శివుడు దక్షిణమూర్తిగా ఎందుకు పిలవబడతాడు?
1.జ్ఞానదాతగా.!
శివుడు ఈరూపంలో సృష్టి, సంహారం కాదూ, జ్ఞానాన్ని ప్రసారంచేసే గురువురూపంగా ఉంటాడు. దక్షిణామూర్తి శ్రీశంకరాచార్యులద్వారా ప్రముఖంగా ప్రాచుర్యంలోకి వచ్చాడు.
ఆయన "మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం" అని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు.. అంటే, శివుడు మాటలతో కాకుండా మౌనంద్వారా పరబ్రహ్మం తత్వాన్ని బోధిస్తాడని.
2.దక్షిణదిక్కు పూజాత్మకంగా..!
దక్షిణదిక్కు సాధారణంగా పితృదేవతలకు సంబంధించినదిగా భావిస్తారు.
కానీ శివుడు ఈదిక్కువైపు ముఖంపెట్టి బోధ చేయడంవల్ల,ఈదిక్కుకు కూడా శుభత తీసుకువచ్చినట్లు భావిస్తారు.
3.గురుస్వరూపంగా..!
శివుడు మొదటిగురువు (ఆదిగురు)గా పరిగణించబడతాడు.
ఆయనే మానవులకు మొదటగా జ్ఞానాన్ని బోధించాడు.
అందుకే శైవసంప్రదాయంలో శివుడిని "జ్ఞానమూర్తి"గా పూజిస్తారు.
4.తపస్వులకు మౌనంగా ఉపదేశం..!
దక్షిణామూర్తి తపస్సుచేసే ఋషులకు మౌనంగా ఉపదేశం చేసినట్టుగా పురాణాలు చెబుతాయి. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చుని ఉంటారు – సంచిత, సనక, సనందన, సనాతన! వీరికి మౌనంగా తత్వజ్ఞానం బోధించాడు.
దక్షిణామూర్తి యొక్క లక్షణాలు..!
దక్షిణదిక్కు ముఖంగా ఉంటుంది.
ఒక చెట్టు క్రింద (వటవృక్షం) ఆశీనుడై ఉంటాడు.
ఒకచేతిలో జ్ఞానముద్ర,మరోచేతిలో అక్షమాల లేదా గ్రంథం.
అపస్మార పురుషునిమీద కాలుమోపి ఉంటాడు – ఇది అజ్ఞానాన్ని సూచిస్తుంది.
చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు.
మూలమంత్రం.!
ఓం నమో భగవతే దక్షిణామూర్తయే!
ఈ మంత్రం ద్వారా శివుని జ్ఞానరూపాన్ని ధ్యానం చేయడం జరుగుతుంది. #🎶భక్తి పాటలు🔱 #🌅శుభోదయం
#🙏🏻బుధవారం భక్తి స్పెషల్ మీరు కోరుకున్న కోరికల కోసం కార్యసిద్ధి గణపతి మంత్రం...........!!
మంత్రం:
" ఓం గం గణపతియే సర్వ కార్య సిద్ధి కురు కురు స్వాహా."
మంత్ర విధానం :
సూర్యోదయం సమయంలో శుక్ల పక్ష మంగళవారం నుండి ఈ మంత్రాన్ని మొదలుపెట్టండి , మీ పూజ గదికి వెళ్లి తూర్పు ముఖంగా ఎర్రటి ఆసనం మీద కూర్చోండి. మీ ముందు పీఠాన్ని ఉంచండి మరియు దానిపై రాగి ప్లేట్ ఉంచండి.దానిపై గణపతి విగ్రహాన్ని ఉంచండి. మట్టి విగ్రహం లేదా పరాడ్ విగ్రహం ఉత్తమం.మీకు కావాలంటే మీరు కోరుకున్న కోరికల కోసం సంకల్పము చెప్పుకోవచ్చు . లేదంటే, మీ రోజువారీ సాధనలో భాగంగా కూడా మీరు సంకల్పము లేకుండా జపించవచ్చు.రుద్రాక్ష మాలను ఉపయోగించి ప్రతిరోజూ 11 మాలలు మంత్రం జపించండి.
ఫలితం :
మంచి ఆరోగ్యం, బలం, తెలివితేటలు, విజయం, శత్రువుల నుండి విముక్తి, విశ్వాసం, సానుకూలత, వినయం, ప్రశాంతత, వ్యాపారంలో విజయం మరియు అభివృద్ధి, ఎక్కువ లాభాలు, భౌతిక సంపద, ఆకర్షణ పెరుగుదల, కోరికలు నెరవేరడం మరియు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మరెన్నో లెక్కించలేని కోరికలు నెరవేరుతాయి.ప్రయోజనాల సంఖ్య అంతులేనిది.కానీ క్లుప్తంగా చెప్పాలంటే, ఇది సాధకుని జీవితం నుండి ప్రతికూలత, అడ్డంకులు, కష్టాలు మరియు గ్రహ పీడలన్నింటినీ తొలగిస్తుంది . ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 11 మాలలు జపించడం ద్వారా, సాధకుడు తన జీవితంలో చాలా మంచి అవకాశాలను అనుభవిస్తాడు.
జీవితంలో ఏ రంగంలో అనుకున్నా విజయం సాధిస్తాడు. #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🌅శుభోదయం #🎶భక్తి పాటలు🔱 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
Manasantha nuvve #📽ట్రెండింగ్ వీడియోస్📱 #షేర్ చాట్ బజార్👍 #💪పాజిటీవ్ స్టోరీస్ #🤩నా ఫేవరెట్ హీరో🤩 #😁Hello🙋♂️
#☸🙏సూర్యనారాయణ స్వామి #☸🙏సూర్యనారాయణ స్వామి #🌅శుభోదయం #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🎶భక్తి పాటలు🔱 #🔯దోష పరిహారాలు🔯 చాలా అరుదుగా దొరికే సూర్య మండల స్త్రోత్రం.........!!
రోజూ చదవలేకపోయినా..వారంలో ఒకరోజు..ఆదివారం నాడు చదివినా.. సమస్త పాపాల్ని హరించి..పుణ్యఫలం పెంచే స్తోత్రం..!!
నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే
సహస్రశాఖాన్విత సంభవాత్మనే |
సహస్రయోగోద్భవ భావభాగినే
సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ ||
యన్మండలం దీప్తికరం విశాలం |
రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ ||
యన్మండలం దేవగణైః సుపూజితం |
విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ ||
యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం |
త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |
సమస్త తేజోమయ దివ్యరూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ ||
యన్మండలం గూఢమతి ప్రబోధం |
ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |
యత్సర్వ పాపక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ ||
యన్మండలం వ్యాధివినాశదక్షం |
యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౬ ||
యన్మండలం వేదవిదో వదంతి |
గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౭ ||
యన్మండలం సర్వజనైశ్చ పూజితం |
జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాల కాలాద్యమరాది రూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౮ ||
యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం |
యదక్షరం పాపహరం జనానామ్ |
యత్కాలకల్పక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౯ ||
యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం |
ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |
యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౦ ||
యన్మండలం సర్వగతస్య విష్ణోః |
ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౧ ||
యన్మండలం వేదవిదోపగీతం |
యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |
తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౨ ||
సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||
ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం..సంపూర్ణం..|| #📽ట్రెండింగ్ వీడియోస్📱
#శుక్రవారం స్పెషల్ విషెస్💐 అమ్మా 🪷 జననీ భ్రమరాంబ మహాదేవి 🙏🏻 #srisailam_bramarambhika #Srisailam #durga #devi
#🌅శుభోదయం #📽ట్రెండింగ్ వీడియోస్📱 #💫శుక్రవారం స్పెషల్ రాశిఫలాలు 🌟
ఏ రోజు ఏ దేవుడికి ఉపవాసం ఆచరించాలి.............!!
ఉపవాసం మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి, మానసిక స్థైర్యానికి, సత్త్వసిద్ధికి ఉపకరిస్తుంది.
ఆహార శుద్ధే సత్వశుద్ధి: అని అన్నారు. అంటే ఆహార లక్షణాన్ని బట్టే మానవుని మనసు ఉంటుందన్నమాట. ఆధ్యాత్మికపథంలో పయనిస్తున్నవారు తమ శారీరక ఆరోగ్యం కోసం మితాహారం, క్రమాహారం, సాత్వికాహారం అంటూ విభజించి తీసుకుంటుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకునే మనవాళ్ళు ''ఆత్యాహార మానాహారం నిత్యం యోగీ వవర్జయేత్'' అని అన్నారు. అతిగా తినడం, అసలు తినకుండా ఉండటం కూడా మంచిది కాదన్నారు. జీవించడానికే తినాలిగానీ తినడానికే జీవించకూడదు.
మితాహారం: కడుపులో సగభాగం అన్నం తదితర ఆహార పదార్థాల చేత, పాతికభాగం నీటి చేత నింపి, మిగిలిన పాతికభాగం గాలికోసం ఖాళీగా ఉంచాలి. ఈ విధంగా ఆహారాన్ని స్వీకరించడమే మితాహార పద్ధతి. ఇలా ఐందుకు చెప్పరంటే, అధికంగా తింటే భగవధ్యానం కుదరదు. అధిక మైన ఆహారం వలన శరీరం బరువెక్కి, మత్తుగా మారి పూజ, ధ్యానం వంటి విషయాలపై ఆసక్తిని నిలుపలేము. అందుకే మితంగా తినడం, మితంగా నిద్రించడం అత్యంతావశ్యకం అని అన్నారు.
క్రమాహారం: ఈ ఆహార విధానాన్ని మరలా సాత్త్విక, రాజసిక, తామసిక ఆహార విధానాలంటూ మూడు విధాలుగా విభజించారు. క్రమాహారం అంటే ప్రతిరోజు దాదాపు ఒకే సమయానికి, పరిమితంగా సమతులమైన ఆహారాన్ని తీసుకోవడం. ఇలా తినడం వల్ల మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. సాత్త్వికాహారం వలన మానసిక ఉద్రేకం తగ్గుతుంది. క్రమమైన సాత్త్వికాహారం అనేక శారీరకరోగాలను నిరోధించి ఆయు: ప్రమాణాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ ఆహార నియమాలకు తోడుగా ఉపవాసదీక్షను ఏర్పరిచారు. ఇందులోకూడ ఆరోగ్యరహస్యాలు ఇమిడి ఉన్నాయి.
వారంలో ఉన్న ఏడురోజులకు ఏడుగురు అధిపతులున్నారు. ఏమి ఆశించి ఉపవాసం చేస్తారనేదాన్ని బట్టి వారు వారంలో ఏరోజు ఉపవాసం చేయాలనేది ఆధారపడి వుంటుంది. ప్రతిరోజుకు ఒక్కో గ్రహం అధిపతి. ఒక్కో గ్రహాదిపతి కృప పొందేందుకు ఒక్కోవిధమైన ఉపవాసం పాటించాల్సి ఉంటుంది.
సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసముంటారు. కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది. సూర్యగ్రహ ఆరాధనవల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభించడంతో పాటు శత్రువుల పీడ నివారణ అవుతుంది. సూర్యునికోసం ఉపవాసముండేవారు సూర్యాస్తమయం లోపల రోజుకి ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు. సూర్యాస్తమయం తరువాత ఏమీ తీసుకోరు. తినే ఆహారంలో ఉప్పు, నూనె ఉండకూడదు. తామసిక ఆహారం ఉపవాసమున్నవారు తినరు. సూర్యుడికి ప్రార్థనలుచేసి సూర్యునికి సబంధించిన కథను చదవడంగానీ, వినడంగానీ చేస్తారు. అలా చదివిన తరువాతే ఆహారం తీసుకుంటారు. సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు కెంపును ధరించాలి.
గోధుమలు, ఎర్రధాన్యం, బెల్లం, బంగారం, రాగి ఆభరణాల్లో కెంపు దానమివ్వాల్సి ఉంటుంది. దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం.
సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం శివపార్వతులకు పూజలు చేస్తారు. ఆనందకరమైన వివాహజీవితం కావాలనుకునేవారు సోమవారం నాడు శివపార్వతులకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి. పెళ్ళి కావల్సినవారు సరైన జీవితభాగస్వామి కోసం శివపార్వతులకు పూజలు చేసి ఉపవాసం ఉంటారు. సోమవారం మూడురకాల ఉపవాసాలుంటారు. ఈరోజు ఉండే ఉపవాసాన్ని సౌమ్యప్రదోష మంటారు. ఏదైనా పొరపాటు జరిగితే, ఆ తప్పును ఒప్పుకుంటూ 16 సోమవారాలు ఉపవాసదీక్ష వహిస్తారు. ఉపవాసం చేసేవిధానం ఒకటే కానీ ఆరోజు చదువుకోవాల్సిన కథలు మాత్రం వేరుగా ఉంటాయి. భోజనం రోజుకి ఒకసారే చేస్తారు. తృణధాన్యాలు తీసుకోవచ్చు. శివపార్వతులకు ప్రార్థనలు చేసిన తర్వాత తగిన కథ చదువుకోవాలి. చంద్రుడి అనుగ్రహం కోసం ముత్యాలు, వెండి ధరించాలి. బియ్యం తెల్లటిదుస్తులు, శంఖం, వెండి, ముత్యాలాంటి వాటిని దానమివ్వాలి.
మంగళవారానికి అధిపతి కుజుడు. జాతకంలో కుజగ్రహం సరిగా లేనివారు ఆ దోషనివారణకు పన్నెండు మంగళవారాల ఉపవాసముండటం శుభప్రదం. మంగళవారం హనుమంతుడికి ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. దుస్తులు, పూలు ఎర్రటివి ధరించడం శ్రేయస్కరం. గోధుమలు, బెల్లంతో చేసిన ఆహారం రోజుకి ఒక సారి మాత్రమే తినాలి. హనుమకు పూజ చేసిన పిదప కథ చదువు కోవాలి.
బుధవారానికి అధిపతి బుధుడు. బుధవారం ఉపవాసం ఉండదల్చుకున్నవారు రోజుకి ఒకసారి ఆకుపచ్చటి ఆహార పదార్థాలు తినాలి. విష్ణుమూర్తికి పూజచేసుకుని కథ చదువుకోవాలి. బుధగ్రహం అనుగ్రహం పొందాలనుకునేవారు బంగారంతో పొదిగిన పచ్చని (ఎమరాల్డ్) ధరించాలి. పెసలు, కస్తూరి, నీలపు దుస్తులు, బంగారం, రాగి వంటి వాటిని దానమివ్వాలి.
గురువారానికి అధిపతి బృహస్పతి. జ్ఞానసముపార్జనకు, సంపదకు గురుగ్రహం అనుగ్రహం ముఖ్యం. పసుపు పచ్చని దుస్తులు ధరించి గురువుకు ప్రార్థనలు చేసి కథ చదువుకోవాలి. రోజుకి ఒకసారే భోజనం చేయాలి. బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని ధరించాలి. పసుపు, ఉప్పు, పసుపచ్చని దుస్తులు, బియ్యం వంటివాటిని దానమివ్వాలి.
శుక్రవారానికి అధిపతి శుక్రుడు. రోజుకి ఒకపూటే భోజనం చేయాలి. భోజనంలో పాయసం ఉండాలి. శుక్రుడి అనుగ్రహం పొందాలనుకునేవారు వజ్రాన్ని ధరించాలి. బియ్యం, తెల్లటి దుస్తులు, ఆవు, నెయ్యి, వజ్రాలు, బంగారం దానమివ్వలి. శుక్రవారం సంతోషిమాతకు పూజ చేసుకుని కథ చదువుకోవాలి. అమ్మవారికి హారతివ్వాలి. కటిక ఉపవాసముండాలి. పుల్లటి పదార్థాలు తినకపోవడమేకాదు, ఎవరికీ శుక్రవారం దానమివ్వకూడదు. ఇలా 16 శుక్రవారాలు ఉపవాసముండాలి. చివరి శుక్రవారం మగపిల్లలకు భోజనం పెట్టాలి.
శనివారానికి అధిపతి శని. శనికి నల్లటి వస్తువులు, నల్లని దుస్తులు, నల్లని నువ్వులు, ఇనుము, నూనె లాంటి పదార్థలు ఇష్టం. శనిదేవతకు పూజచేసుకుని కథ చదువుకొని హారతి ఇవ్వాలి. శని ప్రీతికోసం నీలం రాయిని ధరించాలి. నూనేతో నిండిన ఇనుపపాత్ర, నల్ల గొడుగు, నల్లటి చెప్పులు, నల్లటి దుస్తులు, నల్లనువ్వులు మొదలైన వాటిని దానమివ్వాలి. ఇలా మన ఉపవాసంలో ఆరోగ్యరహస్యాలతో పాటు కుంటుంబక్షేమమూ దాగుంది. #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🔯దోష పరిహారాలు🔯 #🎶భక్తి పాటలు🔱 #🔊తెలుగు చాట్రూమ్😍 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
సమ్మక్కతల్లి ఆగమనం.. మేడారం #chilukalagattu #Sammakka #Sarakka #Medaram #🌅శుభోదయం #📽ట్రెండింగ్ వీడియోస్📱 #షేర్ చాట్ బజార్👍 #🎶భక్తి పాటలు🔱 #💫శుక్రవారం స్పెషల్ రాశిఫలాలు 🌟
Kids growth #🔊తెలుగు చాట్రూమ్😍 #షేర్ చాట్ బజార్👍 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🥳Celebrations Video🎆 #🆕Current అప్డేట్స్📢










