బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
ShareChat
click to see wallet page
@deerajreddy
deerajreddy
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
@deerajreddy
ఐ లవ్ షేర్ చాట్ నా హాబీలు: డాన్స్, రైటింగ్,రీడింగ్
ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా నిస్వార్థ సేవలు అందించిన నిజమైన ప్రజానాయకుడు దివంగత నీలం సంజీవరెడ్డి గారు!( అయన 30వ వర్ధంతిని పురస్కరించుకొని )! ( 1 - 6 - 2026)! లేదా తన రాజకీయజీవిత అద్యంతం నైతిక విలువలకు కట్టుబడి,ప్రజా శ్రేయస్సే పరమావదిగా జీవించిన ఓ దార్శనికుడు,ఆదర్శ పరిపాలన దక్షకుడు ఈ దివంగత నీలం సంజీవరెడ్డి గారు! భారత రాష్ట్రపతిగా,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా,కేంద్రకమంత్రిగా,లోక్ సభాపతిగా,ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా,సంయుక్త రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి ప్రజల మన్ననలను విశేషంగా చూరగొన్న నిస్వార్థ రాజకీయవేత్తగా,ఓ దార్శనికుడుగా అందరికి సుపరిచితులు అయిన ఈ దివంగత నీలం సంజీవరెడ్డి గారి 30వ వర్ధంతి నేడు(1- 6 - 2026).ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన గొప్పతనం గురించి ఓ మారు మనమంతా స్మరణకు తెచ్చుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే కోట్లకు పడగలు ఎత్తుతూ రాజకీయ వారసత్వన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో వాటిని వ్యతిరేకించి ఎలాంటి హంగు,ఆర్భాటాలకు పోకుండా మన భారతదేశానికి,మన రాష్ట్రానికి మహోన్నత,అజారామమైన సేవలు అందించిన ఓ నిఖర్సైనా ప్రజా నాయకుడు ఈ దివంగత నీలం సంజీవరెడ్డి గారు.ముఖ్యంగా లోక్ సభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికార పక్ష - ప్రతిపక్షం మధ్య ఓ మంచి సద్భావన వాతావరణం ఏర్పరచి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన ఓ అచ్చమైన రాయలసీమ అణిముత్యం ఈ మన నీలం సంజీవరెడ్డి గారు.అంతేగాకుండా ఆంధ్రప్రదేశ్ అవతరణలో సైతం సంజీవరెడ్డి గారు ప్రముఖ పాత్ర పోషించాడు.ఇక రాష్ట్ర స్థాపనలో ప్రధాన,నిర్ణాయక ఘట్టమైన పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర తరపున అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రిగా వున్న సంజీవరెడ్డి గారు కూడా పాల్గొని ఒప్పందంపై సంతకాన్ని సైతం పెట్టిన ఘనత మన దివంగత నీలం సంజీవరెడ్డి గారిది.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అవతరించాక కాంగ్రెసు శాసన సభా పక్ష నాయకుడిగా వున్న బెజవాడ గోపాలరెడ్డిని ఓడించి తాను ముఖ్యమంత్రి అయ్యాడు.అలాగే అల్లూరి సత్యనారాయణ రాజును రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీకి నిలబెట్టి రంగాను ఓడించాడు.1960లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు.ఇంకా చెప్పుకుంటూపోతే కాంగ్రెసు అధ్యక్షుడిగా రెండేళ్లు పనిచేసి,మళ్ళీ1962లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.రవాణా సంస్థల జాతీయీకరణ వివాదంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడంతో 1964 ఫిబ్రవరి 29న తన పదవికి రాజీనామా చేశారు మాట మీద నిలబడే,మరకను,మురికిని ఏ మాత్రం అంటించుకొని ఉన్నత వ్యక్తిత్వం గల ఈ నీలం సంజీవరెడ్డి గారు.. ఏదిఏమైన 1929లో మహాత్మాగాంధీ స్ఫూర్తితో తన చదువును సైతం పక్కకుపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర్య పోరాటం వైపు దృష్టి సారించాడు సంజీవరెడ్డి గారు.1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్లు అయన అ పదవిలో కొనసాగారు.అంతేకాదు క్విట్ ఇండియా ఉద్యమంలో సైతం పాల్గొని డిటెన్యూగా జైలుకు వెళ్లారు.1940,1945 ల మధ్య ఎక్కువకాలం అతను జైలులో ఉన్నాడు.తిరిగి 1948లో మద్రాసు శాసన సభకు ఎన్నిక అయ్యాడు.ఇంకా చెప్పుకుంటూ పోతే 1947లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభకు ఎన్నిక అయ్యారు.1949 నుంచి 1951 వరకు మద్రాసు రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసారు.అదేమాదిరి 1951లో ఆంధ్ర - ప్రాంత కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మంత్రి పదవికి రాజీనామా చేశారు సంజీవరెడ్డి గారు.అన్నింటికి మించి 1951లో ఆంధ్ర - ప్రాంత కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవికి ఎన్.జి.రంగాతో పోటీపడి మరీ ప్రకాశం మద్దతు గల రంగాను ఆ ఎన్నికలలో ఓడించాడు.ఆ తర్వాత రంగా, ప్రకాశం కాంగ్రెసును విడిచి వెళ్లారు.అయితే ఎన్ని పదవులను అలంకరించిన అయా పదవులన్నింటికి ఎనలేని వన్నె తెచ్చిన ఈ దివంగత నీలం సంజీవరెడ్డి గారి జీవితంలో ఓక భరించలేని ఓ చేదు పుట్టెడు దుఃఖంతో కూడిన అనుభవం ఎదురైంది.అదేమంటే దురదృష్టవ శాత్తు తన ఐదేళ్ళ కుమారుడిని ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో కోల్పోయాడు.దాంతో నీలం సంజీవరెడ్డి గారు తన క్రియశీలక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు.అయితే కాంగ్రెసు పార్టీ పెద్దల ఒత్తిడి మేరకు మళ్ళీ పూర్తి స్థాయి రాజకీయాలలో భాగమైనారు ఈ దివంగత నీలం సంజీవరెడ్డి గారు. అయితే అయన తన రాజకీయ జీవితంలో అనుసరించిన నిబద్దత,క్రమశిక్షణ,అవినీతి మకిలీ అంటని అయన ఉన్నతమైన వ్యక్తిత్వం,అయా పదవులలో అయన చూపిన అంకితభావం,పోరాట పటిమ,దృఢచిత్తం ప్రస్తుత రాబోయే తరాల పాలకులకు ఓ స్ఫూర్తిదాయకం,ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు.అమర్ రహే!అమర్ రహే,జోహార్ దివంగత నీలం సంజీవరెడ్డి గారు! జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్!✍️✍️✍️🇮🇳🇮🇳🇮🇳 - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #😉ఎమోజి విషెస్😂 #🥳Celebrations Video🎆
😉ఎమోజి విషెస్😂 - ShareChat
00:15
( 4 - 6 - 2026) బరిలోకి దిగితే చీతా ఆడేస్తాడు కబడ్డీ ఆట! జై జగనన్న వేసిన బాట పిరంగి గుండు తన మాట!క్యాప్షన్ : ఈ నెల అంటే జూన్ 4 వ తేదీన ఉదయం 9.30 గంటలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నయ్య గారు బేతంచెర్ల నగర ప్రజల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ' ఈ చలో మున్సిపాలిటి ' ( ఊరి బయట నీళ్ల కళకళ - ఊరిలో నీళ్ల విలవిల ) కార్యక్రమానికి బేతంచెర్ల నగర మరియు మండలం నుంచి అశేష సంఖ్యలో వైస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు,శ్రేయోభిలాషులు,మన బుగ్గన రాజారెడ్డి అన్నయ్య గారు సాధించిన అభివృద్ధిని చూసి వ్యక్తిగతంగా ఆయనను అభిమానించే పట్టణ పుర ప్రజలు అందరూ కూడా ' ఓ చీమలదండులా ' జన సంధ్రాన్ని,జన ప్రభంజనాన్ని తలపించేలా చాలా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన గురుతర భాద్యత మనందరి భుజస్కంధాలపై ఎంతైనా వుంది.ఎందుకంటే నీరు అనేది మానవకోటికి ఓ ప్రాణాదారం వంటిది,అలాంటి నీరు లేనిదే ఏ ప్రాణకోటి కూడా మనుగడ సాగించడం దాదాపు దుర్లభం.సరిగ్గా అలాంటి నీటి దాహర్తి సమస్య ఇప్పుడు బేతంచెర్ల పట్టణ ప్రజలకు వచ్చింది కాబట్టి,అదేమాదిరి ' అన్ని ఉండి అల్లుడి నోట్లో శని మాదిరి ' నీటి వనరులు తగినంత పుష్కలంగా ఉండి కూడా వాటిని బేతంచెర్ల నగర ప్రజలకు సరఫరా చేయడంలో అధికారులు,పాలకులు తీవ్ర అపసోపానాలు పడుతూ,పట్టణ ప్రజల నీటి దాహర్తిని తీర్చడంలో వారంతా తీవ్ర అశ్రద్ధను చూపుతున్న నేపథ్యంలో,ఈ నీటి దాహర్తి సమస్య పరిష్కారం విషయంలో వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి,వారి మెడలు వంచి అయిన మన బేతంచెర్ల పట్టణ ప్రజలకు తక్షణమే ఈ నీటి దాహర్తి సమస్య పరిష్కారం అయ్యేలా మనమంతా ఉద్యమిద్దాం! అందుకోసం మనమంతా ' ఐకమత్యమే మహాబలం ' అనే నీతి నానుడికి అనుగుణంగా చెయ్యి చెయ్యి కలిపి మనమనుకున్నది సాధిద్దాం! అంతేకాదు ' పోరాటమే ఊపిరి ' అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకోని మరీ మనమంతా కదం తొక్కుదాం,ఈ బేతంచెర్ల ప్రజలమేలు కోరి చేసే ఈ నీటి ఉద్యమానికి మనమంతా జై కొడదాం!చేయూతను అందిద్దాం! ప్రశ్నించే హక్కుకు సలాం కొడదాం! జై జై జగన్! జై జై బుగ్గన!✍️✍️✍️👉👉👉 - మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు! #ysr
ysr - ShareChat
01:00
వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గి సత్తా చాటిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు! లేదా చెన్నై - ముంబైల తర్వాత వరుసగా రెండు టైటిల్స్ నెగ్గిన జట్టుగా నిలిచి అందరిచే శెబాష్ అనిపించుకున్న ఆర్ సీబీ జట్టు! తొలి ట్రో్ఫీ కోసం ఏకంగా దాదాపు 18 సీజన్ల పాటు కళ్ళకు వత్తులు కట్టుకొని మరీ ఎదురుచూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఎట్టకేలకు వరుసగా రెండోసారి ఐపీ ఎల్ టైటిల్ ను సొంతం చేసుకోవడం ఎంతైనా హర్షణీయం,అభినందనీయం. ఆదివారం అహ్మదాబాద్ లో దాదాపు ఏకపక్షంగా సాగిన ఫైనల్ లో బెంగుళూరు జట్టు 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేయడం ఓక గొప్ప విశేషం.అదేమాదిరి చెన్నై సూపర్ కింగ్స్ ( 5సార్లు ), ముంబయి ఇండియన్స్ ( 5 సార్లు ):కోల్ కత్తా నైట్ రైడర్స్ మూడు సార్లు ఐపీఎల్ టోర్నీ నెగ్గినప్పటికి,విరాట్ కోహ్లీ వంటి టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మ్యాన్ ఆర్ సీబీ జట్టులో ఉన్న ఐపీ ఎల్ టోర్నీ విజేతగా ఆవిర్భవించేందుకు ఏకంగా కొన్ని వసంతాల పాటు చెకోరా పక్షుల్లాగా,కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి రావడం ఆ జట్టుకు ఖచ్చితంగా ఓక చేదు అనుభవమే.అయినప్పటికీ ఆ ఘోర ఓటముల నుంచి వీలయినంత త్వరగా పాఠాలు నేర్చుకొని,ఆర్ సీబీ జట్టు కెప్టెన్ రజిత్ పాటీదార్ నాయకత్వంలోని ఆ జట్టు బ్యాటింగ్,బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలలో బాగా రాటుదేలి,ఈ ఐపీఎల్ టోర్నీ అద్యంతం ఆ జట్టు అంతా సమిష్టికృషితో సత్తా చాటడంతో ఈ రోజు ఐపీ ఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు వరుసగా రెండోసారి విజయకేతనం ఎగురవేయడానికి కారణభూతమైంది. అన్నింటికీ మించి చావో రేవో తేల్చుకోవాల్సిన ఐపీ ఎల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో ఎలాగైనా గుజరాత్ టైటాన్స్ జట్టును ఓడించేందుకు కంకణం కట్టుకొని ఆ దిశగా తీవ్ర కసరత్తు చేసి ముందడుగు వేయడం,అందుకు తగ్గట్లు టీం ఇండియా ప్రదాన ఆటగాడు విరాట్ కోహ్లీ తనదైన శైలితో కూడిన మార్క్ బ్యాటింగ్ తో తప్పనిసరిగా గెలవాల్సిన ఈ ఫైనల్ మ్యాచ్ లో కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు,4 సిక్సర్లతో కలుపుకొని 75 నాటౌట్ విలువైన పరుగులు సాధించి మరీ తన ఆర్ సీబీ జట్టు ఘన విజయం సాధించడానికి తన వంతుగా విశేష కృషి సల్పడం అనేది నిజంగా ఓక చెప్పుకోదగ్గ విశేషం. ఏదిఏమైన ఈ ఐపీ ఎల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగిన వెంకటేష్ అయ్యర్ మంచి భాగస్వామ్యం నెలకొల్పడమే కాదు వ్యక్తిగతంగా తన బ్యాటింగ్ లో 32 విలువైన పరుగులు సాధించడం,మరో వైపు బౌలింగ్ విభాగంలో జమ్మూ కాశ్మీర్ ఆటగాడు రసిఖ్ సలాం తన పదునైన బౌలింగ్ తో మూడు వికెట్లు సాధించడం,మరో వైపు మాజీ టీం ఇండియా జట్టు ఆటగాడు భువనేశ్వర్ సైతం రాణించి 2 వికెట్లు తీయడం,ఇక హాజల్ వుడ్ కూడా తాను కూడా ఏమి తక్కువ తినలేదు అన్నట్లుగా 2 వికెట్లు సాధించి గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాట్స్ మ్యాన్లకు సింహా స్వప్నంగా నిలిచి వారి వికెట్లను ఒకరితో మరొకరు పోటీపడినట్లుగా కూల్చివేయడంతో ఆర్ సీబీ జట్టు విజయం నల్లేరు మీద నడకే అయ్యింది అనే మాట సత్యదూరం కాదు.దీన్నిబట్టి చూస్తే ఈ ఐపీ ఎల్ టోర్నమెంట్ లలో ఏ జట్టు టైటిల్ నిలబెట్టుకుంటుందో ముందుగా ఊహించడం, ఓక అవగాహనకు రావడం అంతా సులభమైభ విషయం కాదు అనే పచ్చి యదార్థం మనందరికి తేటతెల్లమయ్యింది.ఎందుకంటే అత్యంత పటిష్ట, ప్రతిభావంతమైన జట్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్,కల కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్,గుజరాత్ టైటాన్స్ సైతం ఈ 2026 ఐపీ ఎల్ టోర్నమెంట్ లో విజేతగా ఆవిర్భవించే విషయంలో నీళ్లు నమిలి మరీ తోక ముడిచిన విషయం మనందరికీ కూడా విదితమే. జయ జయహో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు! హ్యాట్సాఫ్ టూ కింగ్ విరాట్ కోహ్లీ!✍️✍️✍️🏏🏏🏏🏏 - బుగ్గన మధుసూదరెడ్డి, సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల, నంద్యాల జిల్లా! #రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు💥
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు💥 - QATAR IAN KL QAIARI QAIAR | oj QATAR IAN KL QAIARI QAIAR | oj - ShareChat
( 4 - 6 - 2026) బరిలోకి దిగితే చీతా ఆడేస్తాడు కబడ్డీ ఆట! జై జగనన్న వేసిన బాట పిరంగి గుండు తన మాట!క్యాప్షన్ : ఈ నెల అంటే జూన్ 4 వ తేదీన ఉదయం 9.30 గంటలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నయ్య గారు బేతంచెర్ల నగర ప్రజల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ' ఈ చలో మున్సిపాలిటి ' ( ఊరి బయట నీళ్ల కళకళ - ఊరిలో నీళ్ల విలవిల ) కార్యక్రమానికి బేతంచెర్ల నగర మరియు మండలం నుంచి అశేష సంఖ్యలో వైస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు,శ్రేయోభిలాషులు,మన బుగ్గన రాజారెడ్డి అన్నయ్య గారు సాధించిన అభివృద్ధిని చూసి వ్యక్తిగతంగా ఆయనను అభిమానించే పట్టణ పుర ప్రజలు అందరూ కూడా ' ఓ చీమలదండులా ' జన సంధ్రాన్ని,జన ప్రభంజనాన్ని తలపించేలా చాలా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన గురుతర భాద్యత మనందరి భుజస్కంధాలపై ఎంతైనా వుంది.ఎందుకంటే నీరు అనేది మానవకోటికి ఓ ప్రాణాదారం వంటిది,అలాంటి నీరు లేనిదే ఏ ప్రాణకోటి కూడా మనుగడ సాగించడం దాదాపు దుర్లభం.సరిగ్గా అలాంటి నీటి దాహర్తి సమస్య ఇప్పుడు బేతంచెర్ల పట్టణ ప్రజలకు వచ్చింది కాబట్టి,అదేమాదిరి ' అన్ని ఉండి అల్లుడి నోట్లో శని మాదిరి ' నీటి వనరులు తగినంత పుష్కలంగా ఉండి కూడా వాటిని బేతంచెర్ల నగర ప్రజలకు సరఫరా చేయడంలో అధికారులు,పాలకులు తీవ్ర అపసోపానాలు పడుతూ,పట్టణ ప్రజల నీటి దాహర్తిని తీర్చడంలో వారంతా తీవ్ర అశ్రద్ధను చూపుతున్న నేపథ్యంలో,ఈ నీటి దాహర్తి సమస్య పరిష్కారం విషయంలో వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి,వారి మెడలు వంచి అయిన మన బేతంచెర్ల పట్టణ ప్రజలకు తక్షణమే ఈ నీటి దాహర్తి సమస్య పరిష్కారం అయ్యేలా మనమంతా ఉద్యమిద్దాం! అందుకోసం మనమంతా ' ఐకమత్యమే మహాబలం ' అనే నీతి నానుడికి అనుగుణంగా చెయ్యి చెయ్యి కలిపి మనమనుకున్నది సాధిద్దాం! అంతేకాదు ' పోరాటమే ఊపిరి ' అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకోని మరీ మనమంతా కదం తొక్కుదాం,ఈ బేతంచెర్ల ప్రజలమేలు కోరి చేసే ఈ నీటి ఉద్యమానికి మనమంతా జై కొడదాం!చేయూతను అందిద్దాం! ప్రశ్నించే హక్కుకు సలాం కొడదాం! జై జై జగన్! జై జై బుగ్గన!✍️✍️✍️👉👉👉 - మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు! #ysr
ysr - ShareChat
00:15
అదివో అల్లదివో శ్రీహరివాసము! పదివేల శేషుల పండగలమయము! అదే వేంకటాచల మఖిలోన్నతము! అదివో బ్రహ్మదుల కపురూపము! అదివో నిత్యనివాస మఖిలమునులకు! - మా హిందూ భక్తజనసంఘర్షణకు ఆధ్యాత్మిక అదివో అల్లదివో శ్రీహరివాసము శుభ శనివారం! #శుభ శనివారం
శుభ శనివారం - ShareChat
00:33
అరుణ అరుణ కాంతి అలివేలు మంగకు! వెంకటేశ హృదయరాణి పద్మావతీ దేవికి! మంగళ హరతులు శ్రీ మహాలక్ష్మీకి! అలివేలే మా జననీ శ్రీ దేవదేవికి! - మా హిందూ జనభక్తప్రభంజనానికి ఆధ్యాత్మిక శ్రీ మహాలక్ష్మీ శుభ శుక్రవారం! #శుభ శుక్రవారం
శుభ శుక్రవారం - ShareChat
00:20
ఓం నమశ్శివాయో నమశ్శివాయ హర హర బోలే నమశ్శివాయ! రామేశ్వర శివ రామేశ్వర హర హర బోలే నమశ్శివాయ! #శుభ సోమవారం
శుభ సోమవారం - ShareChat
00:30
ఓం నమశ్శివాయో నమశ్శివాయ హర హర బోలే నమశ్శివాయ! #శుభ సోమవారం
శుభ సోమవారం - ShareChat
00:32
రాబోయే కాలంలో వీరు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే కాదు భారతదేశ రాజకీయాలను ఢిల్లీ లెవెల్లో శాసించే దమ్ము,సత్తా వీరురువురి సొంతం ఒకరు మన ప్రియతమ నాయకుడు,మాజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం,జననేత వైఎస్ జగనన్న గారు అయితే మరొకరు ఆయన నమ్మినబంటు,ఆయన అడుగు జాడల్లో నడిచే ఆర్థిక రంగ నిపుణుడు అయిన మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖమాత్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నయ్య గారు.అంతేకాదు వీరిరువురు కూడా మంచి విజన్ ఉన్న నాయకులే. ప్రజాకార్షణలో,వాగ్దాటిలో,ప్రత్యర్థి పార్టీ వారి విమర్శల జడివానను తమదైన శైలిలో తిప్పికొట్టే నేర్పు,వివేకం వీరి సొంతం.రాజకీయ రణరంగంలో ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు తమకు ఎదురైనా వాటిని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి పడి లేచిన కెరటాంలా నిలదొక్కుకునే ప్రతిభాసంపన్నులు.నేటి ఓటమే రేపటి గెలుపుకు నాంది అనే సిద్ధాంతాన్ని బాగా ఆకలింపు చేసుకొని తదనుగుణంగా ఓడిన చోటనే గెలుపును తిరిగి చేజేక్కించుకొనే వరకు పట్టువదలని విక్రమార్కుల్లా పోరుబాట సల్పే అసలు సిసలు ప్రజానాయకులు,మాట మీద నిలబడే,విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే వీరి రాజకీయ చతురత,తమదైనా శైలిలో పావులు కదిపే విధానం, తీరు తెన్నులు ప్రత్యర్థి పార్టీ నాయకులకు ఏ మాత్రం అంతు పట్టనిది! అదే వీరిరువురి మంత్రదండం, వజ్రాయుధం కూడా!ఏమైనా వీరిరువురి ఆదర్శ,స్ఫూర్తిదాయక నాయకత్వం వర్ధిల్లాలి మరో పదికాలాల పాటు వర్ధిల్లాలి అత్యంత దిగ్విజయంగా!జై జై జగన్! జై జై బుగ్గన!క్✍️✍️✍️ - మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr
ysr - ShareChat
00:15
పులివెందుల ముద్దుబిడ్డ వైస్సారు,మా పురిటి గడ్డ మిమల్ని మరువదు సారు! క్యాప్షన్ : పేద,సామాన్య,బడుగు బలహీనవర్గాల పెన్నిధి,రైతుభాంధవుడు దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం,డాక్టర్ వైస్సార్ తాను సీఎంగా పనిచేసిన కాలంలో ప్రజల సౌకర్యార్థమై 108 అంబులెన్సు సర్వీస్,మహిళలకు పావలా వడ్డీ రుణాలు,పేద విద్యార్థులు చదువుకునేందుకు ఫీజురీయింబర్స్ మెంట్,రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ,పేద,సామాన్య ప్రజలకు ఏదైనా పెద్ద జబ్బు వచ్చినప్పుడు వారు చికిత్సతీసుకునే నిమితమై ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశపెట్టి వారి హృదయాలలో కొలువై ఉన్న దేవుడిలా నేటికీ వారి చేత కొనియాడబడుతున్నాడు మాట మీద నిలబడే మడమ తిప్పని నేత,ఇచ్చిన హామీకీ,చెప్పిన మాటకు ఆరునూరైనా కట్టుబడే మహానేత,ఓ గొప్ప సుపరిపాలకుడు,నిరుపేదల తలవ్రాతను మార్చిన మేరుగరణధీరుడు ఈ మన దివంగత డాక్టర్ వైస్సార్! జోహార్ వైస్సార్! అమర్ రహే పులివెందుల ముద్దుబిడ్డ డాక్టర్ వైస్సార్!✍️✍️✍️ - మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr
ysr - ShareChat
00:25