#📰ఈరోజు అప్డేట్స్
నరసన్నపేట: నిరుపయోగంగా చెత్త నుండి సంపద కేంద్రం
నరసన్నపేట మేజర్ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తడి చెత్త, పొడి చెత్త సంపద కేంద్రం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. రోజుకు 10 టన్నుల వ్యర్థాలు వస్తున్నప్పటికీ, వాటిని తడి, పొడి చెత్తగా వేరు చేసే పరిస్థితి లేదు. ఎరువుల తయారీకి ఏర్పాటు చేసిన ట్యాంకులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధిత అధికారులు ముందుకు రావాలని ప్రజలు కోరుతున్నారు.