𝄟⃝💕 ⃪ͥ͢ ᭄ᷟ🇸‌𝗶𝗱𝗱𝘂🕊️
ShareChat
click to see wallet page
@jai_shivaji_maharaj
jai_shivaji_maharaj
𝄟⃝💕 ⃪ͥ͢ ᭄ᷟ🇸‌𝗶𝗱𝗱𝘂🕊️
@jai_shivaji_maharaj
EMI జోలికి ఏ అమ్మాయి జోలికి వెళ్ళకపోతే ప్రశాంతం
మాటే మంత్రంలాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే దాన్ని పవిత్రంగా, శుద్ధంగా వాడుకుంటామో అప్పుడు ఆ మాటకు విలువ పెరుగుతుంది కాబట్టి ఇతరుల కష్టాలను తీర్చగలిగేస్తోమతు నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు. “చావును కూడా చంపాలంటే నలుగురి కోసం బతికి చూడు”# #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్
🙏Thank you😊 - 3 సంధ్యాసమయం-శైవ తత్వదర్శనం ಅನಾಂಕಾರಯನ "ನೆನು" ఆసక్తియైన 'నాది" ఈ రెండూ విడిచిన క్షణమే; ఆత్త తన స్వరూపాన్ని గుర్తిస్తుంది 3 సంధ్యాసమయం-శైవ తత్వదర్శనం ಅನಾಂಕಾರಯನ "ನೆನು" ఆసక్తియైన 'నాది" ఈ రెండూ విడిచిన క్షణమే; ఆత్త తన స్వరూపాన్ని గుర్తిస్తుంది - ShareChat
ఒక చిన్న పాప కిటికీలోనుండి చూస్తూ ఉందీ ఎవరో కొంతమంది దుండగులు పక్కనే ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేస్తూ కనిపించారు వెంటనే ఆ పాప తండ్రి దగ్గరకు వెళ్లి ఎవరో శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారనీ అడ్డుకోవాలనీ కోరింది. ఆతండ్రి పాపను దగ్గరకు తీసుకుని మనం మొఘలుల ఆదీనంలో ఉన్నామనీ అడ్డుకోవడం అసాద్యమనీ చెప్తాడు దానితో నిర్ఘాంతపోయిన ఆపాప బాధగా వెనుతిరిగింది.. పాప పెరిగి పెద్దది అయ్యింది పెళ్లి జరిగింది ఒక రోజున అత్తవారింట్లో గుమ్మం దగ్గర నిల్చుని బయటకు చూస్తున్న ఆమెకు కొంతమంది దుండగులు ఎదురుగా ఉన్న దేవాలయం ధ్వంసం చేయడం కనిపిస్తుంది హుటాహుటిన భర్త వద్దకు వెళ్లి దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారనీ అడ్డుకోవాలనీ చెపుతుంది దానికి ఆ భర్త మనం ఖిల్జియా ప్రభువుల ఆదీనంలో ఉన్నా మనీ అడ్డుకుంటే మరణ శిక్ష విధిస్తారనీ చెప్తాడు ఈ సమాధాంతో ఏమాత్రం సంతృప్తి చెందని ఆమే ఇటువంటి సమాధానం మళ్ళీ వినకూడదూ అనుకుంటుంది.. కొంతకాలానికి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డకు చిన్నతనం నుంచే రామాయణ మహాభారత గాధలు పురాణాలు వాటిలోని మంచి చెడులు హిందూ ధర్మం పై జరుగుతున్న దాడులు వాటిని ఎలా ఎదుర్కోవాలి ధర్మాన్ని ఎలా పరిరక్షించాలీ స్త్రీలపట్ల గౌరవ మర్యాదలతో మెలగడం యుద్ద విద్యలు ఇలా అన్నీ వివరంగా చెబుతూ పెంచసాగింది... కాలక్రమంలో ఒకరోజున వీధి చివరన దేవాలయాని ధ్వంసం చేస్తుండటం చూసి కొడుకును పిలుస్తున్న ఆమె పిలుపు పూర్తవకుండానే మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని సింహగర్జన చేస్తూ దుండగులపై విజృంభించి భవానీమాతా వర ప్రసాదమైన ఖడ్గంతో ఒకేఒక్క దెబ్బతో శతశిరఛ్ఛేదనం గావించి స్వరాజ్య సామ్రాజ్యమే తన లక్ష్యం గా ధర్మ పరిరక్షణే తన ద్యేయంగా నవాబుల పాలనపై తిరుగుబాటు బావుటా ఎగురవేశాడా నూనూగు మీసాల పదిహేడు ఏళ్ళ యువకుడు.. ఆ తల్లి పేరు జిజియా భాయి ఆ కొడుకు పేరు శివాజీ భోంస్లే (ఛత్రపతికి శివాజీ మహారాజ్) తన పదిహేడవ ఏట ప్రారంభించిన ఉద్యమంతో జీవితాంతం అలుపెరగని పోరాటాలు చేసి దాదాపుగా మొఘలుల పాలనకు స్వస్తి చెప్పి మరాఠ దేశంలో అన్ని ప్రాంతాలనూ కోటలనూ కైవసం చేసుకుని. ధర్మగ్లాని గావిస్తున్న వారి శిరఛ్ఛేధనం చేసి ధర్మాన్ని నాలుగు పాదాలపై మొహరింపజేసి యావధ్బారతావనీ జయహో ఛత్రపతి అనే విధంగా పరిపాలన సాగించి అజరామర కీర్తి ప్రతిష్టలు కైవసం చేసుకుని కాలగర్భంలో కలిసిపోయిన శివాజీ.. జయహో ఛత్రపతి శివాజీ మహారాజ్.🚩🚩🚩 జై హింద్ భారత్ మాతాకీ జై.🙏🙏🙏 #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊
✌️నేటి నా స్టేటస్ - WELCOME] WELCOME] - ShareChat
#🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్
🙏Thank you😊 - CIAIRAPAII ehivaji | ధర్యాన్నిప్రపంచ దేశాలకు చాటిన ನಾಂದಾ మహనీయుడు ఛత్రపరి శివాజీ. హిందూ సామ్రాట ఛేత్రేపీతి శివాడీబుంతి సందర్ధంగా వారికి శతకోటివందనాలు : Siddu CIAIRAPAII ehivaji | ధర్యాన్నిప్రపంచ దేశాలకు చాటిన ನಾಂದಾ మహనీయుడు ఛత్రపరి శివాజీ. హిందూ సామ్రాట ఛేత్రేపీతి శివాడీబుంతి సందర్ధంగా వారికి శతకోటివందనాలు : Siddu - ShareChat
#🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్ #🙆 Feel Good Status
🙏Thank you😊 - నీనాతేన ధర్శ వీరిరక్షకుడు, హిందుూ సామ్రాట్ గెరిల్లె యోధుడు నీర్వమంనవారికి దిక్కరసూచి ఛత్రపతి శివాజీమహారాజ్ జయంతి శుభాకాంక్షలు నీనాతేన ధర్శ వీరిరక్షకుడు, హిందుూ సామ్రాట్ గెరిల్లె యోధుడు నీర్వమంనవారికి దిక్కరసూచి ఛత్రపతి శివాజీమహారాజ్ జయంతి శుభాకాంక్షలు - ShareChat
#శివపురాణం_లింగావిర్భావం 🕉️ లింగావిర్భావ మహాత్మ్యం – జ్యోతి స్తంభంగా అవతరించిన పరమేశ్వర తత్త్వం 🔥 శివపురాణం లింగావిర్భావం – అహంకారాన్ని కరిగించిన అనంత జ్యోతి కథ 🙏 ఎన్ని రూపాలు… ఒక్క తత్త్వం – లింగావిర్భావ అద్భుత గాథ శివపురాణం: లింగావిర్భావం – శివతత్త్వ రహస్యం లింగావిర్భావ కథ – శివుడి అనంత స్వరూపం ఒకనాడు లింగావిర్భావకాలమునందు ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి ‘నేను అధికుడను అంటే నేను అధికుడను’ అని వాదోపవాదం జరిగింది. వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్రస్థాయిని పొందుతుంటే దేవతల మొరవిన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారిమధ్య ఆవిర్భవించాడు. దాని ఆది కనుక్కోవడానికి శ్రీమహావిష్ణువు వరాహరూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని చివర కనుక్కుందుకు వెళ్ళారు. బ్రహ్మగారు వెళుతూ ఉండగా కేతకీ పుష్పం(మొగలి పువ్వు) ఒకటి క్రింద పడింది. దానిని నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు?” అని అడిగారు. అపుడు మొగలిపువ్వు ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో నన్ను శంకరుడి మీద వేశాడు. అక్కడి నుంచి నేను క్రింద పడ్డాను. మీరు ఎక్కడికి వెడుతున్నారు?” అని అడిగింది. అపుడు బ్రహ్మగారు నాకొక ఉపకారం చేస్తావా?’ అని అడిగాడు. ఏమిటి కావాలి మీకు?” అని అడిగింది మొగలిపువ్వు. ఆయన “క్రింద శ్రీమన్నారాయణుడు ఉంటారు. నేను ఆ పైభాగమును చూశానని సాక్ష్యం చెప్తావా? అని అడిగాడు. చెప్తాను అన్నది మొగలి పువ్వు. బ్రహ్మగారు మొగలిపువ్వుతో కలిసి క్రిందకు వచ్చారు. శ్రీమహావిష్ణువును ఆయన చూసి వచ్చారా? అని అడిగారు. అపుడు విష్ణువు నాకు కనపడలేదు. ఎంతదూరం వెళ్ళినా నేను కనుగొనలేకపోయాను అన్నారు. అపుడు బ్రహ్మ గారు నేను చూసి వచ్చాను. సాక్ష్యం ఈ కేతకీ పుష్పం అన్నారు. ఇప్పుడు జ్యోతి స్తంభంగా ఉన్న పరమాత్మ సాకారమును పొంది బ్రహ్మగారితో బ్రహ్మా నీకు దర్శనం అయిందని అబద్ధం ఆడావు. కాబట్టి నీకు భూమియందు పూజ లేకుండుగాక! కానీ బ్రహ్మ స్థానమని ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానమునందు ఆవాహన పొంది నీవు గౌరవింపబడుతుంటావు. మహావిష్ణువు నేను చూడలేదు అని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకు వైభవోపేతంగా పూజలు ఉంటాయి. ఆ ఉత్సవములకు నీవు ఆధిపత్యం వహిస్తూ ఉంటావు. అందుకే బ్రహ్మోత్సవం అని బ్రహ్మగారి రథం ఉత్సవములకు ముందు నడుస్తుంది. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ పుష్పం నా పూజయందు వినిమయం అవకుండుగాక! ఇప్పుడు కేతకీ పుష్పం నాకు పూజార్హత లేదా అని బాధపడింది. నాకు పూజింపబడవు కానీ నా భక్తులయిన వారు నిన్ను తలలో ధరిస్తారు. వారు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను. పూజ జరిగే ప్రాంగణం మొగలి పువ్వులతో అలంకారం చేస్తే ప్రీతి పొందుతాను. అని చెప్పాడు. అలా ఏర్పడిన శివలింగం జ్యోతి స్తంభంగా ఏర్పడినదే మహాశివరాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటిచే చూడదగినటువంటి లింగాకృతిని పొందిన రూపమే అరుణాచలంలో ఉన్న కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమయిన రోజే మహాశివరాత్రి. కాబట్టి భగవత్ స్వరూపములు అన్నీ సమానములే. ఎన్ని దీపములు వెలుగుతున్నా వెలుగుతున్నది ఒక్క జ్యోతి రూపమే. ఇన్ని రూపములుగా ఉన్నది ఒక్కటే అని మీరు తెలుసుకోవాలనే జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. శివలింగమునకు ఒక విశేషం ఉంది. మొట్టమొదట అన్నిటికన్నా గొప్పదయినా లింగమును స్వయంభూ లింగము అని పిలుస్తారు. ఆ లింగమును ఒకరు ప్రతిష్ఠ చేయరు. తనంత తాను వెలుస్తుంది. శ్రీశైలాది క్షేత్రములు ఇందుకు ఉదాహరణ. రెండవది దివ్య లింగములు ఇవి దేవతలు ప్రతిష్ఠ చేసినవి. కుమారస్వామి ప్రతిష్ట చేసిన సామర్లకోటలోని కుమారారామం ఇందుకు ఉదాహరణ. మూడవది మానుష లింగములు. ఇవి మనుష్యులు ప్రతిష్ఠ చేసినవి. తరువాత ఆర్ష లింగములు. ఇవి మహర్షులు ప్రతిష్ఠ చేసినవి. రాక్షస లింగములు. రాక్షసులు ప్రతిష్ఠ చేసినవి. దైవిక లింగములు వాటంతట అవి ఏర్పడతాయి. అరకువేలీలోని బుర్రా గుహలలో పైనుండి నీటి బిందువులు క్రిందపడతాయి. కొండ ఉపరితలం ఎక్కడో పైన ఉంటుంది. పైనుండి నీటి బిందువు ఒకేచోట బయలుదేరి క్రింద ఒకేచోట పడుతుంది. ఆ నీటి బిందువు పడినప్పుడల్లా క్రింద ఉన్న భూమి కొద్దికొద్దిగా పైకి లేస్తూ శివలింగంగా మారిపోతుంది. ఇది క్రమక్రమంగా పెరిగి చివరకు ఎక్కడి నుండి నీరు పడుతోందో ఆ ప్రదేశమును తాకి ఇంక నీరు పడకుండా ఆపేస్తుంది. అలా అది మర్రిచెట్టు ఊడలా పెరిగిపోతుంది. దీనిని దైవిక లింగం అంటారు. బాణ లింగములు అని ఉంటాయి. అవి నర్మదానది ప్రవాహము ఒరిపిడి చేత ఏర్పడతాయి. లింగము అరూపరూపి. ఉపాసనలో లింగోపాసన ఒక మెట్టు పైన ఉంటుంది. మీకు శివలింగమును చూపించి ఆ శివలింగం ఎటువైపు చూస్తోంది అని అడిగినట్లయితే దానికి సమాధానం చెప్పడం తేలికయిన విషయం కాదు. యథార్థమునకు మీరు శివాలయంలోపల కూర్చుని శివలింగమునాకు అభిషేకం చేయడం కన్నా రుద్రాధ్యాయంతో అర్చక స్వాములు అభిషేకం చేస్తుండగా బయట కూర్చుని కైమోడ్చి నమస్కరిస్తే దానివలన మీరు ఎక్కువ ప్రయోజనమును పొందుతారు. ఇది సాక్షాత్తు చంద్రశేఖరపరమాచార్య స్వామివారు చెప్పినమాట. శివలింగంలో తూర్పుకు చూస్తున్న దానిని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుకు అధిష్ఠానంగా ఉంటుంది. దీనివలన అజ్ఞానం కలుగుతుంది. దక్షిణమునకు చూసే ముఖమును అఘోర ముఖము అంటారు. ఇది అగ్నిహోత్రమును శాస్తిస్తుంది. అది అగ్నిహోత్రంగా ఉంటుంది లయం చేస్తుంది. ఇది మీ అజ్ఞానమును దహించేస్తూ జ్ఞానమును కూడా ఇస్తుంది. పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. దీనిని సద్యోజాత ముఖం అంటారు. పశ్చిమ ముఖం నుండి పాలు, నీళ్ళు విభూతి, పళ్ళరసములు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా మీకు పరమేశ్వరుని అనుగ్రహం కలిగేస్తూ ఉంటుంది. అది భూసంబంధంగా ఉంటుంది. అది సృష్టికి కారణం అవుతుంది. అందుకే లోకంలో పిల్లలు పుట్టలేదని అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. దుష్ట నక్షత్రంలో పిల్లాడు పుట్టాడు అని చెప్తే సుందరకాండ పారాయణ/శివాభిషేకం చేసుకోమని చెప్తారు. అపమృత్యువు వస్తుందేమోనని భయంగా ఉంది అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. పీడకలలు వస్తున్నాయని చెప్తే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. ఈ రెండు క్రియలె చెప్తారు. ఎందుచేత? హనుమ శివాంశ. వర్షములు పడకపోతే శివలింగామునకు అభిషేకం చెయ్యండని చెప్తారు. అభిషేకం చేస్తే వామదేవ ముఖం కానీ తడిసినట్లయితే పరమేశ్వర అనుగ్రహం వలన వర్షములు పడతాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది. దానిని ఈశానముఖం అంటారు. దీనిని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపియై ఉంటుంది. ఇదే మోక్షమును కటాక్షిస్తుంది. ఈ అయిదు ముఖములతో పంచభూతములను శాసిస్తోంది. సృష్టి స్థితి లయ అజ్ఞాన మోక్షములకు కారకం అవుతుంది. సమస్త ఫలితములను ఇస్తుంది. కాబట్టి శివలింగం చల్లబడడం ఊరంతా చల్లగా ఉండడమే. అసలు లింగమునకు బాహ్యమునందు ఏమీ లేదు. బ్రహ్మాండములన్నీ లింగాకృతిలోనే ఉన్నాయి. లింగమునకు పూజ చేస్తే సమస్త లోకములకు పూజ జరిగినట్లే. శివాలయమునకు వెళ్ళినపుడు ముఖ్యంగా ఎనిమిది కనపడతాయి. మనం ఒక అపచార ధోరణి చేస్తూ ఉంటాము. శివాలయం గోడకు ఆనుకోవడం, స్తంభాలను ఆనుకోవడం చేస్తుంటాము. ఆ గోడలు, స్తంభములు అన్నీ ఈశ్వర స్వరూపమే అయి ఉంటాయి. దేవాలయ గోడను కొట్టినట్లయితే శాస్త్రం ప్రకారం శివుడిని కొట్టినట్లుగానే పరిగణింపబడుతుంది. శివాలయం నందు ఎనిమిది రూపములలో లింగం ఉంటుంది. అందుకే పూర్వం పెళ్ళిళ్ళు గాని, జరిగితే ధ్వజస్తంభం ఎక్కడివరకు కనపడుతోందో అక్కడ మేళతాళములు ఆపుచేసేవారు. గోపురంగా శివుడే ఉంటాడు. రెండవది శివుడు గర్భాలయ శిఖరంగా ఉంటాడు. ధ్వజస్తంభం శివుడు. ఇప్పటికీ కొన్ని దేవాలయములలో బలి పీఠమునకు, ధ్వజ స్తంభానికి అభిషేకం చేస్తారు. లోపల ఉన్న శివలింగమును మహాలింగం అని పిలుస్తారు. పెద్ద పెద్ద దేవాలయములలో కొన్ని మహాలింగముల మీద చారికలు ఉంటాయి. ఆ గీతలను బ్రహ్మసూత్రములు అని పిలుస్తారు. అవి సాధారణంగా స్వయంభూ లింగముల మీద ఉంటాయి. శివాలయంలో ఉన్న ప్రధాన లింగమును ‘మూల లింగము లేక మహాలింగము’ అని పిలుస్తారు. చందీశ్వరుడు ఒక లింగము. ఇవి కాకుండా అర్చక స్వామి ఒక లింగము. అందుకే నందికి శివుడికి మధ్య అర్చకుడు వెళ్ళవచ్చు. శివాలయంలో దేవతామూర్తులు స్థానములు మారడానికి వీలులేదు. ఎంత పెద్ద శివాలయం అయినా సరే నైరుతిలో విఘ్నేశ్వరుడు, పడమట సుబ్రహ్మణ్యుడు, ఉత్తరమున చండీశ్వరుడు, దక్షిణమునందు దక్షిణామూర్తి, ఆగ్నేయం నందు సోమస్కందుడు, ఈశాన్యము =నందు నటరాజు కాని, భైరవ మూర్తి కాని ఉండాలి. శివ లింగారాధనం ఎలా చేయాలి అని తెలిసి చెయ్యగలిగితే వాడంత అదృష్టవంతుడు సృష్టిలో లేడు. అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై నీటిని సన్నటి ధారగా పోయాలి. అంతేకానీ పంచపాత్రలో నీళ్ళు తీసుకుని ఉద్ధరిణతో పోయకూడదు. అభిషేక జలం తొక్కకూడదు. శివాభిషేకం గురు ముఖతః చేయడం చాలా మంచిది.. సాంప్రదాయ దుస్తులు ధరించడం చాలా చాలా మంచిది. “ఎన్ని రూపాలు… ఒక్క తత్త్వం. ఎన్ని దీపాలు… ఒక్క జ్యోతి. ఓం నమః శివాయ 🕉️” 🔥 “శివలింగం చల్లబడితే… మన జీవితాలూ చల్లబడతాయి. శివస్మరణే శాశ్వత శాంతి 🙏” 🕉️“ప్రతి రోజూ శివస్మరణే నిజమైన శివరాత్రి.🕉️ 🕉️ఓం నమః శివాయ… హర హర మహాదేవ 🕉️” #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊
✌️నేటి నా స్టేటస్ - నల్యమేవ బయతే నల్యమేవ బయతే - ShareChat
#హనుమంతుడు_శ్రీకృష్ణుని_సుదర్శన_చక్రాన్ని_మింగేశాడు_అని_మీకు_తెలుసా? 🚩 భక్తికి హద్దుల్లేవు — శ్రీకృష్ణుని సుదర్శన చక్రాన్ని మింగిన హనుమంతుడు! 🕉️ విశ్వాసమే మహాశక్తి — సుదర్శన చక్రాన్ని గ్రసించిన ఆంజనేయ స్వామి! 🚩ఇది సాధారణ ఘట్టం కాదు — హనుమంతుడి అపూర్వ భక్తి గాథ! 🕉️ కృష్ణ లీలలో మరో అద్భుతం — హనుమంతుడి మహిమ! 🚩భక్తుడు ముందు భగవంతుడే ఆశ్చర్యపోయిన ఘడియ! ఆంజనేయ స్వామి సుదర్శన చక్రాన్ని నోట్లో పెట్టుకున్న ఈ ఆసక్తికరమైన కథను మీరు కోరినట్టుగా ఎక్కడా పొల్లు పోకుండా, క్రమ పద్ధతిలో వివరిస్తాను. ​ఈ కథ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ద్వారకను పాలిస్తున్న సమయంలో జరుగుతుంది. 🚩​1. శ్రీకృష్ణుడి ఆలోచన ​ద్వారకలో శ్రీకృష్ణుడి వద్ద ఉన్న ముగ్గురికి తామే గొప్ప అనే గర్వం కొంచెం పెరిగింది: ​సత్యభామ: తన అందం మీద గర్వం. ​గరుత్మంతుడు: తన వేగం మీద గర్వం. ​సుదర్శన చక్రం: తన శక్తి మీద, ఆయుధాలలో తానే గొప్ప అనే అహంకారం. ​వీరి గర్వాన్ని అణచాలని కృష్ణుడు ఒక లీలను ప్రారంభించాడు. 🕉️​2. హనుమంతుడికి పిలుపు ​కృష్ణుడు గరుత్మంతుడిని పిలిచి, "నువ్వు వెంటనే గంధమాదన పర్వతానికి వెళ్లి, అక్కడ రామ నామ స్మరణలో ఉన్న హనుమంతుడిని నేను పిలిచానని తీసుకురా" అని ఆజ్ఞాపించాడు. గరుత్మంతుడు తన వేగంతో వెళ్లి హనుమంతుడిని కలవగా, హనుమంతుడు "నేను నా రాముడి ఆజ్ఞను తప్ప ఎవరి మాట వినను" అని అంటాడు. అప్పుడు గరుత్మంతుడు "నాతో రాకపోతే నిన్ను బంధించి తీసుకెళ్తాను" అని విర్రవీగుతాడు. కానీ హనుమంతుడు చిరునవ్వుతో గరుత్మంతుడిని తోకతో విసిరికొట్టి, అంతకంటే ముందే ద్వారకకు చేరుకుంటాడు. 🚩​3. సుదర్శన చక్రానికి పరీక్ష ​హనుమంతుడు ద్వారక కోట ద్వారం వద్దకు వచ్చేసరికి, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని పిలిచి, "ఎవరినీ లోపలికి రానివ్వద్దు" అని ద్వారం వద్ద కాపలా పెట్టాడు. హనుమంతుడు లోపలికి వెళ్లబోతుంటే సుదర్శన చక్రం అడ్డుకుంది. హనుమంతుడు ఎంత బ్రతిమాలినా వినలేదు సరే కదా, సుదర్శన చక్రం తన పదునైన అంచులతో హనుమంతుడిని భయపెట్టాలని చూసింది. 🕉️​4. చక్రాన్ని మింగేసిన హనుమ ​సుదర్శన చక్రం అహంకారాన్ని గమనించిన హనుమంతుడు, దాన్ని ఒక చిన్న వస్తువులా చూశాడు. "నా రామ దర్శనానికి అడ్డుపడతావా?" అంటూ అంజనీ పుత్రుడు తన నోరు తెరిచి, ఆ సుదర్శన చక్రాన్ని ఒక బిళ్ళలాగా చటుక్కున మింగేసి, లోపలికి వెళ్ళిపోయాడు. 🚩​5. గర్వభంగం ​లోపలికి వెళ్ళిన హనుమంతుడిని చూసి కృష్ణుడు (శ్రీరాముడి రూపంలో ఉండి) "హనుమా! లోపలికి ఎలా వచ్చావు? ద్వారం వద్ద చక్రం అడ్డుకోలేదా?" అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు వినయంగా నవ్వి... ​"స్వామీ! ఆ చిన్న చక్రం నన్ను ఆపాలని చూసింది. అది అడ్డు పడుతుంటే నా నోట్లో పెట్టుకుని వచ్చాను" అని తన నోటి నుంచి సుదర్శన చక్రాన్ని బయటకు వదిలాడు. ​తమ వేగం (గరుత్మంతుడు), శక్తి (సుదర్శన చక్రం) హనుమంతుడి భక్తి ముందు ఎంత చిన్నవో అందరికీ అర్థమైంది. దీంతో వారి అహంకారం పటాపంచలైంది. ​చివరిగా: ఈ విధంగా హనుమంతుడు తన స్వామి భక్తిని చాటుకోవడమే కాకుండా, సుదర్శన చక్రానికి గర్వభంగం కలిగించాడు. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ॥🙏 #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్
🙏Thank you😊 - సత్యమేవ జయతే శ్రీకృష్ణుని-సుదర్శన ಏತನ್ನಿ ಮಿಂಗುಲುನ್ನು 'హనుమంయడు" సత్యమేవ జయతే శ్రీకృష్ణుని-సుదర్శన ಏತನ್ನಿ ಮಿಂಗುಲುನ್ನು 'హనుమంయడు" - ShareChat
నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ శేషతల్పం మీద ఉన్న విష్ణుమూర్తిని చూడగానే... నారదుడిలో ఓ ఆలోచన మెదిలింది. విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవరు ఉంటారు' అనుకున్నాడు. ఆవిషయాన్నే సాక్షాత్తూ విష్ణుమూర్తి నోట వినాలనుకున్నాడు నారదుడు. 'ఓ దేవదేవా! ఈ ముల్లోకాలలోనూ నిన్ను అత్యంత భక్తిగా కొలుచుకునేది ఎవరు' అని అడిగాడు. 'ఓస్! అదేమంత కష్టమైన ప్రశ్న కానే కాదు. అల్లదిగో ఆ పల్లెటూరిలో ఓ చిన్న గుడిసె కనిపిస్తోంది కదా! అందులో ఓ రైతు నివసిస్తున్నాడు. నన్నడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే!' అన్నాడు విష్ణుమూర్తి. అనునిత్యం హరినామస్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడవుతాడు?' అనుకుంటూ ఓసారి తన దివ్యదృష్టితో ఆ రైతు జీవితంలోకి చూశాడు. ఆ రైతు మహా పేదవాడు. అతనికి ఓ ఎకరం పొలం మాత్రమే జీవనాధారం. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలోనూ నానాచాకిరీ చేస్తే కానీ అతనికి బొటాబొటీకా తిండి దక్కేదికాదు. ఉదయం లేచిన దగ్గర నుంచీ రాత్రి నిద్రపోయే దాకా అతనికి అసలు భగవన్నామస్మరణ చేసుకోవడానికి వెసులుబాటే చిక్కేది కాదు. రోజు మొత్తం మీదా మహా అయితే ఓ నాలుగైదు సార్లు నారాయణుడిని తల్చుకునేవాడు అంతే! అలాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడని విష్ణుమూర్తి చెప్పకనే చెప్పడం నారదునికి మహా సిగ్గుగా తోచింది. ఇంతలో విష్ణుమూర్తి...అన్నట్లు నాకో చిన్న సాయం చేసిపెట్టవా నారదా! ఈ పాల కుండ ఉంది చూశావూ దాన్ని కాస్త అలా బ్రహ్మలోకానికి తీసుకువెళ్లి ఇచ్చిరావా అయితే మార్గమధ్యంలో పాలు ఏమాత్రం తొణకకూడదు సుమా! ఒక్క చుక్క కిందకి ఒలికినా అపచారం అవుతుంది.' అంటూ ఓ కుండ నిండుగా పాలని నారదునికి అప్పగించాడు. అక్కడ దాన్ని క్షేమంగా అందించి విజయగర్వంతో నారదుడు విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు. "చెప్పిన పని అద్భుతంగా పూర్తి చేశావు. సంతోషం నారదా! కానీ ఓ చిన్న అనుమానం. నువ్వు పాలకుండని తీసుకుని వెళ్లేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించారు" అని అడిగాడు విష్ణుమూర్తి. ఆ ప్రశ్న విని తెల్లబోయాడు నారదుడు. ఎందుకంటే తన దృష్టంతా పాలు ఒలికిపోకుండా చూసుకోవడంలోనే ఉంది. కాబట్టి నారాయణుడిని తల్చుకునే అవకాశమే లేదు. అప్పుడర్థం అయ్యింది నారదుడికి... విష్ణుమూర్తి ప్రశ్నలోని ఆంతర్యం! తను ఈ ఒక్క రోజు ఏదో పనిలో పడి అసలు నారాయణుడిని తల్చుకోవడమే మర్చిపోయాడు. అలాంటిది, ఆ రైతు ఎంతో కష్టాన్నీ, శ్రమనీ ఓర్చుకుంటూ కూడా అంతటి అలసటలోనూ నారాయణుడిని తల్చుకోవడం మానలేదు. అన్నీ ఉన్నప్పుడు భగవంతుని స్మరించుకోవడం గొప్ప కాదు, లేమిలో కూడా ఆయనను తల్చుకోవడం గొప్ప విషయం అని అర్థమైంది నారదుడికి! "ఆర్భాటంకంటే భక్తే ముఖ్యం" అనే సూత్రమూ బోధపడింది .. #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊
✌️నేటి నా స్టేటస్ - ShareChat
#🙏Thank you😊 #🙏ఓం నమః శివాయ🙏ૐ #✌️నేటి నా స్టేటస్ #🙆 Feel Good Status
🙏Thank you😊 - కుటుంబసభ్యులందరికీ మీకు మీ మహా శివరాత్రి శుభాకాంక్షలు Siddu కుటుంబసభ్యులందరికీ మీకు మీ మహా శివరాత్రి శుభాకాంక్షలు Siddu - ShareChat
🙏నిన్ను మరచి నేను మనజాలన! ఉండజాలన! మాయలు చాలు స్వామి! మహిమను చూపు స్వామి! బ్రహ్మాండములు నిండిన స్వామి... నా మొర వినవు కారణమేమి? తొలినాడు బడిగంట... మరునాడు గుడి గంట... నీవే ఏనాడు మా జంట... మారేను నా వయసు... మారదు నా మనసు... ఏనాటికైనా ఇది నీదే స్వామి... నేనే యమునై కదలి రానా ? చరణ కడలికి చేరిపోనా... నీ చరణ కడలికి చేరిపోనా?🙏 🙏🙏 ఓం నమశ్శివాయ🙏🙏 #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊 #🙏ఓం నమః శివాయ🙏ૐ
✌️నేటి నా స్టేటస్ - Idi Idi - ShareChat
🌙 మహా శివరాత్రి అంటే ఏమిటి? మహా శివరాత్రి అనేది భగవాన్ శివునికి అంకితమైన అత్యంత పవిత్రమైన పర్వదినం. ఇది ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి తిథినాడు జరుపుకుంటారు. ఈ రాత్రి శివుడు అత్యంత జాగృత స్థితిలో ఉంటాడని భక్తుల నమ్మకం. ⸻ 🕉️ శివరాత్రి ప్రాముఖ్యత • ఈ రోజున శివుడిని భక్తితో పూజిస్తే పాపాలు నశిస్తాయి, మోక్షం లభిస్తుంది అని శాస్త్రాలలో చెప్పబడింది. • శివుడు లింగరూపంలో ఈ రోజున అవతరించాడని ఒక కథ. • పార్వతీ దేవి శివుడిని పొందేందుకు ఈ రోజున తపస్సు చేసిందని మరో విశ్వాసం. ⸻ 📖 శివరాత్రికి సంబంధించిన పురాణ కథలు 🔱 1. శివలింగ ఆవిర్భావం బ్రహ్మ, విష్ణువుల మధ్య గొప్పదనం గురించి వాదన జరిగినప్పుడు, శివుడు అనంతమైన అగ్నిస్థంభంగా అవతరించాడు. ఆ రోజే మహా శివరాత్రిగా భావిస్తారు. 🌊 2. హాలాహలం విషం సముద్ర మథనంలో వెలువడిన హాలాహలం విషాన్ని లోక రక్షణ కోసం శివుడు త్రాగాడు. అది ఆయన కంఠంలో నిలిచిపోయి నీలకంఠుడు అయ్యాడు. ఆ త్యాగాన్ని స్మరించుకునే రోజే శివరాత్రి. ⸻ 🪔 శివరాత్రి వ్రతం ఎలా చేస్తారు? • భక్తులు ఉదయం స్నానం చేసి వ్రత సంకల్పం చేస్తారు • నిరాహారంగా లేదా ఫలాహారంగా ఉపవాసం ఉంటారు • రాత్రంతా జాగరణ చేస్తారు • శివలింగానికి అభిషేకం చేస్తారు ⸻ 🥛 అభిషేక ద్రవ్యాలు & వాటి అర్థం • పాలు – శుద్ధి • నీరు – జీవన ప్రవాహం • తేనె – మధురత్వం • పెరుగు – శాంతి • బిల్వ పత్రాలు – శివునికి అత్యంత ప్రీతికరమైనవి ⸻ 🌼 బిల్వ పత్ర ప్రాముఖ్యత బిల్వ ఆకులు మూడు దళాలు కలిగి ఉంటాయి. అవి బ్రహ్మ – విష్ణు – మహేశ్వరుల ప్రతీక అని నమ్మకం. ⸻ 🕯️ రాత్రి నాలుగు ప్రహర పూజలు శివరాత్రి రాత్రి నాలుగు భాగాలుగా పూజ చేస్తారు: 1. మొదటి ప్రహరం – పాలతో అభిషేకం 2. రెండవ ప్రహరం – పెరుగుతో 3. మూడవ ప్రహరం – నెయ్యితో 4. నాలుగవ ప్రహరం – తేనెతో ⸻ 🙏 శివరాత్రి ఉపవాస ఫలితం • మనసుకు శాంతి • ఆత్మశుద్ధి • కోరికల నెరవేర్పు • ఆధ్యాత్మిక పురోగతి ⸻ 🕉️ “ఓం నమః శివాయ” మంత్ర ప్రాముఖ్యత ఈ పంచాక్షరి మంత్రం జపించడం వల్ల మనస్సు ఏకాగ్రత పొందుతుంది, నెగటివ్ శక్తులు తొలగిపోతాయి. ⸻ 🌌 శివరాత్రి ఆధ్యాత్మిక అర్థం శివరాత్రి అంటే కేవలం పండుగ కాదు — అజ్ఞాన అంధకారాన్ని తొలగించి, జ్ఞాన వెలుగులోకి వెళ్లే రాత్రి. శివరాత్రి రోజున ఎందుకు జాగారం చేస్తారు? 🙏 శివరాత్రి జాగారం చేయడానికి ఆధ్యాత్మికం, పురాణం, శాస్త్రీయం—మూడు కారణాలు ఉన్నాయి. ⸻ 🕉️ 1. ఆధ్యాత్మిక కారణం శివరాత్రి అంటే 👉 అజ్ఞాన అంధకారాన్ని జయించి జ్ఞానాన్ని పొందే రాత్రి. • రాత్రి నిద్ర అంటే అవగాహనలేమికు ప్రతీక • జాగారం అంటే జాగృత చైతన్యం • ఈ రాత్రి జాగరణ చేస్తే మనస్సు శివ తత్వంలో లీనమవుతుందని నమ్మకం ⸻ 🔱 2. శివుడు జాగృతుడిగా ఉండే రాత్రి భక్తుల విశ్వాసం ప్రకారం 👉 ఈ రాత్రి శివుడు అత్యంత జాగృత స్థితిలో ఉంటాడు అందుకే భక్తులు కూడా జాగారం చేసి • ధ్యానం • మంత్ర జపం • శివ నామ స్మరణ చేస్తారు. ⸻ 📖 3. పురాణ కథ కారణం సముద్ర మథన సమయంలో శివుడు హాలాహల విషాన్ని త్రాగిన తర్వాత ఆ విష ప్రభావం తగ్గేందుకు దేవతలు రాత్రంతా శివుని జాగృతంగా ఉంచారు 👉 ఆ సంప్రదాయమే జాగారం అయ్యింది. ⸻ 🧘‍♂️ 4. మనసు & శరీర నియంత్రణ జాగారం వల్ల: • ఇంద్రియ నియంత్రణ • కోరికలపై నియంత్రణ • మనస్సు ఏకాగ్రత • ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది ఒకరకంగా ఆత్మ సాధన. ⸻ 🌙 5. శాస్త్రీయ దృష్టిలో శివరాత్రి రోజున: • చంద్రుని ప్రభావం మనస్సుపై ఎక్కువగా ఉంటుంది • రాత్రి జాగరణ + ధ్యానం 👉 మనస్సును ప్రశాంతంగా, స్థిరంగా చేస్తుంది ⸻ ✨ సారాంశంగా శివరాత్రి జాగారం అంటే 👉 శరీరాన్ని కాదు — మనసును మేల్కొలపడం 👉 శివుని కోసం కాదు — మనలోని శివ తత్వాన్ని గుర్తించడం #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊
✌️నేటి నా స్టేటస్ - ఆదిశంకరుని కృపని పొందడానికి శివరాత్రిని ఎలా ఆచరించాలి:.?22 ఆదిశంకరుని కృపని పొందడానికి శివరాత్రిని ఎలా ఆచరించాలి:.?22 - ShareChat