#🗓చరిత్రలో నేడు #📖ఎడ్యుకేషన్✍
🌺 *చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ 24 న* 🌺
🌊 *సంఘటనలు* 🌊
*1970* : మొదటిసారి చైనా "డాంగ్ ఫాంగ్ హాంగ్ 1" అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది.
*1973* : కేశవానంద భారతి తీర్పు.
*1993* : పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది.
*2005* : దక్షిణ కొరియా లో మొదటిసారి క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించిన కుక్క స్నప్పీ.
*1993*: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది. 110 సంవత్సరాల క్రితం 1882 లో రిపన్ ప్రవేశపెట్టిన "స్థానిక ప్రభుత్వము" అనే ఆలోచన, 84 సంవత్సరాల తరువాత మహాత్మా గాంధీ కలలు కన్న 'గ్రామ స్వరాజ్యము' వాస్తవంగా అమలు లోకి వచ్చిన రోజు.
*1967* : వ్లాదిమిర్ కొమరోవ్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త పారాచూట్ తెరుచుకోకపోవటం వల్ల సూయజ్-1 లో మరణించాడు. ఇతడు అంతరిక్ష నౌకలో మరణించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.
🌕 *జననాలు* 🌕
*1884*: విస్సా అప్పారావు, మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో ఒకరు.
*1927*: నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (మ.2011)
*1929*: రాజ్కుమార్, భారత చలనచిత్ర నటుడు, గాయకుడు. (మ.2006)
*1934*: ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (మ.2015)
*1938*: కోవెలమూడి బాపయ్య , తెలుగు, హిందీ, చిత్ర దర్శకుడు
*1941*: షరాఫ్ తులసీ రామాచారి , పేరెన్నికగని, వేల కార్టూన్లను పత్రికలలోనూ ప్రచురించాడు.
*1945*: లారీ టెస్లర్, న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త. (మ.2020)
*1952*: చిలుకూరి దేవపుత్ర, ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల రచయిత. (మ.2016) )
*1956*: తీజన్ బాయి, ఫోక్ సింగర్
*1969*: శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, సుప్రసిద్ధ ఖగోళ, జ్యోతిష శాస్త్ర పండితుడు, జ్యోతిష శాస్త్రవేత్తగా, పండితునిగా, పురోహితునిగా ప్రసిద్ధుడు.
*1973*: సచిన్ టెండుల్కర్, భారత క్రికెట్ ఆటగాడు.
*1985*: గజాల , తెలుగు, తమిళ , మళయాళ సినీనటి.
💥 *మరణాలు* 💥
*1974* : హిందీ కవి రామ్ధారీ సింగ్ దినకర్ మరణం (జననం1908).
*1999*: ఎమ్.వి.రాజమ్మ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలసినిమా నటి, నిర్మాత (జ.1923)
*2000*: రామినేని అయ్యన్న చౌదరి, సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు, విద్యావేత్త.
*2004*: జె.వి.సోమయాజులు , సినిమా నటుడు, రంగస్థల నటుడు (జ.1928)
*2011*: సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (జ.1926)
*2015*: పందిళ్ళ శేఖర్బాబు, రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు, నిర్వాహకులైన తెలుగు నాటకరంగంలో పేరొందిన వ్యక్తి. (జ. 1961)
*2021*: ముక్తి ప్రసాద్ గొగోయ్, అస్సాంకు చెందిన ప్రసూతి వైద్యుడు, రచయిత. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1931)
*2023*: గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి: సాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు. (జ. 1966)
🪴 *పండుగలు , జాతీయ దినాలు* 🪴
*జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం*