#✌️నేటి నా స్టేటస్ #కన్నతల్లి భాధ
ఒక ప్రైవేటు కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న నాగరాజు,
తన సొంత పల్లెలో జాతర జరుగుతుండటంతో గ్రామదేవతకు మొక్కులు తీర్చి, మిత్రులకు బంధువులందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేసాడు.
అందరితోపాటు నాగరాజు కు వరుసకు మామ అయ్యే సుబ్బరామయ్య కూడా భోజనానికి వచ్చి ,తిని వెళుతూ కాస్త దూరంలో నిలబడి ఉన్న
నాగరాజు దగ్గరికి వెళ్ళాడు.
” ఒరేయ్ ..........నాగరాజూ! మీ అమ్మ కనపడటం లేదే.......!
ఎక్కడుందిరా......! అని సుబ్బరామయ్య అడిగాడు.
“ మా అమ్మకు ఈ మధ్య చాదస్తం ఎక్కువయ్యింది,
ఆమెతో వేగలేక ఆశ్రమంలో చేర్పించాను,
అందుకే ఇప్పుడు ఇక్కడికి రాలేదు “ అని నాగరాజు తాపీగా చెప్పాడు.
ఆ మాటలు వింటూనే సుబ్బరామయ్యకు మనసు చివుక్కుమంది.
నాగరాజు భుజం మీద చేయివేసి ,
“ వంటలు బాగానే చేయించావ్.......
తినడానికి చాలా మంది వచ్చారు. అంతా బాగానే ఉంది.
కానీ కన్నతల్లికి పూటకు పిడికెడు అన్నం పెట్టడానికి,
బరువు పడి ఆశ్రమంలో చేర్పించి.......
ఇప్పుడిలా ఎంత మంది దేవతలకు ఎన్ని మ్రోక్కుబడులు తీరిస్తే
ఏం లాభం రా........!
వందల మందికి విందు భోజనాలు పెడితే నువ్వు గొప్ప పుణ్యమంతా
మూట గట్టుకుంటాననుకుంటున్నావా......?
నీ కన్నతల్లి గుండె ఎంతగా గాయపడి ఉంటుందో...............
ఒక్కసారి ఆలోచించావా.......?
జీవితంలో ఎప్పటికైనా ఒకటి గుర్తుంచుకో ..........
కన్నతల్లి కంటే ఈలోకంలో ఏ దేవతా గొప్పది కాదు.
నువ్వు ఆమెను ఆశ్రమంలో చేర్పించావని నాకు ముందే తెలిసి ఉంటే ,
ఇక్కడికి వచ్చేవాడినే కాదు, నీ ముఖం చూసేవాడిని కాదు,
"ఎందుకురా నీకా ఉద్యోగం......ఏం చేసుకుంటావురా.......
ఆ డబ్బుతో..........కన్నతల్లినే సరిగా చూసుకోలేనప్పుడు....... “
అంటూ బాధతో , కోపంతో అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు సుబ్బరామయ్య.
నాగరాజు ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని ఆలోచనలో పడిపోయాడు.
వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేసి వెళ్ళిపోయారు.
కొద్ది సేపటికి తన తల్లిని చూడాలనిపించి......, నాగరాజు ఆశ్రమం దగ్గరకు వెళ్ళాడు.
అక్కడ అందరూ ఒక మంచం చుట్టూ నిలబడి చూస్తున్నారు.
నాగరాజు మెల్లగా వెళ్ళి, చూసి ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు.
తను చివరి చూపుకు కూడా నోచుకోకుండానే,
తన కన్నతల్లి ఈ లోకాన్ని వీడటంతో.....
ఎవరో గట్టిగా చెంపదెబ్బ కొట్టినట్లనిపించి,
కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగి కుప్పకూలిపోయాడు నాగరాజు.
(Copy post)