*సరస్వతీ అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. భక్తులకు సీఎం శుభాకాంక్షలు*
భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మే 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని చెప్పారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున భక్తులు ఆరోగ్యం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ పుష్కర శుభాకాంక్షలు తెలిపారు.
భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు
పుష్కర ప్రాంతంలో భద్రత కోసం 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 100 మంది గజ ఈతగాళ్లను నియమించడంతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సేఫ్టీ బోట్లను మోహరించారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు
పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రత్యేక హారతి, తెప్పోత్సవాలకు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అదనంగా రూ.1.20 కోట్లతో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయగా, నాగేంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు. మీడియా సెంటర్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. #🆕Current అప్డేట్స్📢
*స్కూటీని దొంగలించేందుకు విఫలయత్నం*
రాత్రి వేళల్లో విచ్చలవిడిగా దొంగలు సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి చిలకలూరిపేట షరాఫ్ బజార్ లో పార్కింగ్ చేసిన స్కూటీని ఇద్దరు దొంగలు చోరీ చేసేందుకు విఫలయత్నం జరిగింది. చోరీకి గురి చేసే స్కూటీ వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇంతలో ఏదో అలికిడి వినపడగానే గమనించిన దొంగలు అక్కడ నుంచి వేగంగా పారిపోయారు. పోలీసులు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచి చోరీలు కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. #🆕Current అప్డేట్స్📢
*మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు- వారం గ్యాప్లోనే రెండోసారి*
*పెట్రోల్, డీజిల్పై లీటర్కు 90 పైసలు పెంపు*
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్కు 90 పైసల చొప్పున పెంచుతూ మంగళవారం చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.వారం రోజుల్లోనే ఇది రెండోసారి ధరల పెంపు కావడం గమనార్హం. మే 15న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచారు.
*ప్రధాన నగరాల్లో ధరలు ఇలా*
జాతీయ రాజధాని దిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.97.77 నుంచి రూ.98.64కు పెరిగింది. డీజిల్ ధర రూ.90.67 నుంచి రూ.91.58కు చేరింది. ముంబయిలో పెట్రోల్ ధర పెట్రోల్ ధర 91 పైసలు పెరిగి లీటరుకు రూ.107.59కు చేరింది. డీజిల్ ధర 94 పైసలు పెరిగి రూ.94.08గా నమోదైంది. కోల్కతాలో పెట్రోల్పై అత్యధికంగా 96 పైసల పెరుగుదల నమోదైంది. దీంతో ధర లీటరుకు రూ.109.70కు చేరింది. డీజిల్ ధర 94 పైసలు పెరిగి రూ.96.07 అయింది. ఇక చెన్నైలో పెట్రోల్ ధర 82 పైసలు పెరిగి రూ.104.49కు చేరగా, డీజిల్ ధర 86 పైసలు పెరిగి రూ.96.11గా నమోదైంది... #🆕Current అప్డేట్స్📢
బ్రేకింగ్ న్యూస్ బండి భగీరథ్ కోసం వెతుకుతున్న పోలీసులు
హైదరాబాద్లోని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ నివాసంలో సైబరాబాద్ పోలీసుల తనిఖీలు #🆕Current అప్డేట్స్📢
జైపూర్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం పై DFO వివరణ
May 15, 2026,
శుక్రవారం సాయంత్రం 6:25 గంటలకు నాంపల్లి రైల్వే స్టేషన్లో జైపూర్ ఎక్స్ప్రెస్ B1 బోగీలో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ DFO వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం, 6:40 గంటలకు సమాచారం అందిన వెంటనే అంబర్పేట్, గౌలిగూడ, అసెంబ్లీ నుంచి మూడు ఫైర్ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. రైలు బయలుదేరడానికి ముందే ఈ ఘటన జరగడంతో బోగీలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది. #🆕Current అప్డేట్స్📢
*ఫిల్టర్ ప్రేమకు ఫుల్స్టాప్..! పెళ్లి మండపంలో వరుడ్ని గుర్తించని వధువు.. దాడితో ఆసుపత్రిపాలు*
*ఇన్స్టాగ్రామ్లో ప్రేమ.. వాట్సాప్లో పెళ్లి నిర్ణయం.. నిజ రూపం చూసి షాక్కు గురైన వధువు*
లక్నో, మే 15 :
సోషల్ మీడియా పరిచయం ఓ యువకుడిని ఆసుపత్రిపాలు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ జంట ప్రేమలో పడగా, చివరకు పెళ్లి మండపం వద్ద జరిగిన పరిణామాలు ఉద్రిక్తతకు దారితీశాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. హర్దోయ్కు చెందిన ఓ యువతి సోషల్ మీడియాలో “రాహుల్ మిశ్రా” పేరుతో పరిచయమైన వ్యక్తితో సన్నిహితంగా మెలిగింది. ఫోన్ కాల్స్, వీడియో చాటింగ్ల ద్వారా ఇద్దరి మధ్య ప్రేమ పెరిగింది. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో మే 12న యువతి కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేశారు. వరుడిగా 23 ఏళ్ల దేవేంద్ర సింగ్ పరిమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే పెళ్లి మండపంలో వరుడి అసలు రూపం చూసిన వధువు ఒక్కసారిగా షాక్కు గురైంది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఇతడు కాదంటూ పెళ్లికి నిరాకరించింది.
సోషల్ మీడియాలో ఫిల్టర్లు, ఎడిటింగ్ ఫోటోల కారణంగా తాను మోసపోయానని యువతి ఆరోపించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన వధువు బంధువులు వరుడిపై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వరుడిపై దాడి చేసిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై స్పందించిన స్థానిక ఎస్ఐ.. “సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకునే వారు నిజమైన వివరాలు తెలుసుకుని ముందుకు వెళ్లాలి. ఫిల్టర్లు, ఎడిటెడ్ ఫోటోల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దు” అని సూచించారు. #🆕Current అప్డేట్స్📢
నాకు రెండు రోజుల సమయం కావాలి!
పేట్ బషీరాబాద్ పోలీసులకు ఈ మెయిల్ మరియు లేఖ రాసిన POCSO కేసు నిందితుడు బండి భగీరథ్
రెండు రోజుల సమయమిస్తే మే 15వ తేదీన అన్ని ఆధారాలతో విచారణాధికారి ఎదుట హాజరవుతానని లేఖ #🆕Current అప్డేట్స్📢
*56 దేశాల్లో భారతీయులకు బంపర్ ఆఫర్!*
తాజా 'హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్' ప్రకారం గ్లోబల్ ర్యాంకింగ్స్లో భారత్ 78వ స్థానంలో నిలిచింది. ర్యాంకులో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ, భారతీయులు ముందస్తు వీసా లేకుండానే ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలను చుట్టిరావచ్చు. ఇందులో థాయ్లాండ్, మలేషియా వంటి 30 దేశాలు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తుండగా, మాల్దీవులు సహా 23 దేశాలు 'వీసా-ఆన్-అరైవల్' సౌకర్యం కల్పిస్తున్నాయి.వేసవి, ఈద్ సెలవుల నేపథ్యంలో అంతర్జాతీయ పర్యాటకానికి భారతీయులు సిద్ధమవుతున్నారు. #🆕Current అప్డేట్స్📢
.
_ఏపీ లో ..._
_'ట్రాన్స్జెండర్ల' సంక్షేమానికి … *ఏపీ ప్రభుత్వం* కీలక అడుగు.._ #🆕Current అప్డేట్స్📢
_*ట్రాన్స్జెండర్ల వెల్ఫేర్ బోర్డు* కు సభ్యులను ... నియమిస్తూ .. *జీవో* విడుదల._
_కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్ల సిఫార్సులతో ... సభ్యుల నియామకం._
_విశాఖ, తిరుపతి కలెక్టర్లను ... ప్రాంతీయ ప్రతినిధిలుగా నామినేట్ చేసిన ప్రభుత్వం._
19న అరకు నియోజకవర్గ
*మినీ మహానాడు* #🆕Current అప్డేట్స్📢
..............................................
తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, గ్రామ అధ్యక్షులు, జడ్పిటిసిలు, మాజీ జడ్పిటిసిలు, ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు , డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ అనుబంధ శాఖల్లో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముఖ్య విజ్ఞప్తి....
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహించే *మహానాడు* ఈ ఏడాది మే 27 నుంచి 29 వరకు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు *శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు* తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ **శ్రీ నారా లోకేష్ గారు* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ *శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు* నిర్ణయించడం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో ఈ వేడుక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో నిర్వహించనున్న *మినీ మహానాడు* అరకు నియోజకవర్గంలో మే 19న అనగా మంగళవారం అరకు వేలిలోని వాలీబాల్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అరకు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాం.
======================
ఇట్లు
*డా. సియ్యారి దొన్ను దొర* గారి క్యాంప్ కార్యాలయం - అరకువాలీ










