*పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీకి సూపర్ స్టార్ కానుక* #🆕Current అప్డేట్స్📢
* తనకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీని సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకోవడంతో పాటు బంగారు గొలుసును కానుకగా అందించారు. చెన్నై మహానగర పాలకసంస్థలో కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ (50) ఇటీవల తనకు రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించి పలువురు మన్ననలు అందుకున్నారు. తాజాగా ఆమెను అగ్ర కథానాయకుడు రజనీకాంత్ సన్మానించారు..£
ఐటీ రంగంలో పెను ప్రకంపనలు: ఒరాకిల్లో ఒకేసారి 30,000 మందిపై వేటు? #🆕Current అప్డేట్స్📢
ఏఐ కోసం భారీగా ఖర్చు, నిధుల కొరత
రుణాలు ఇచ్చేందుకు అమెరికా బ్యాంకుల వెనకడుగు
ఓపెన్ ఏఐ ఒప్పందంతో అంతా తలకిందులు
ఉద్యోగుల తొలగింపు ద్వారా 10 బిలియన్ డాలర్ల ఆదా!
హైదరాబాద్, బెంగళూరులోని ఉద్యోగులపైనా వేటు?
ప్రపంచ టెక్ దిగ్గజం ఒరాకిల్ తన చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్కు సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల కోసం పెట్టిన భారీ ఖర్చులు, నిధుల కొరత వెరసి దాదాపు 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ భావిస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ టీడీ కోవెన్ తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఎదగాలనే ఉద్దేశంతో ఒరాకిల్ భారీగా డేటా సెంటర్లను నిర్మిస్తోంది. ముఖ్యంగా శామ్ ఆల్ట్మన్ నేతృత్వంలోని ఓపన్ ఏఐ కోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దాదాపు 156 బిలియన్ డాలర్ల వ్యయం చేస్తోంది. అయితే, ఒరాకిల్ ఆర్థిక పరిస్థితిపై సందేహాలతో అమెరికా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనకాడుతున్నాయి. ఈ నిధుల కొరతను అధిగమించేందుకు, ఉద్యోగుల తొలగింపు ద్వారా 8 నుంచి 10 బిలియన్ డాలర్ల నగదును ఆదా చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
కేవలం ఉద్యోగులనే కాకుండా, కంపెనీ తన కస్టమర్లను కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది. కొత్తగా వచ్చే కస్టమర్లు తమ ఫీజులో 40 శాతం ముందుగానే చెల్లించాలని షరతులు విధిస్తోంది. అంతేకాకుండా "మీ చిప్స్ మీరే తెచ్చుకోండి" అనే వింత విధానాన్ని కూడా పరిశీలిస్తోంది. నిధుల సమస్య కారణంగా డేటా సెంటర్ల నిర్మాణం ఆలస్యం కావడంతో ఓపెన్ ఏఐ వంటి సంస్థలు తమ క్లౌడ్ అవసరాల కోసం మైక్రోసాఫ్ట్, అమెజాన్ వైపు చూస్తున్నాయి.
ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా 2022లో 28 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన హెల్త్కేర్ సాఫ్ట్వేర్ యూనిట్ 'సెర్నర్'ను కూడా విక్రయించే ఆలోచనలో ఒరాకిల్ ఉంది. ఇప్పటికే 2025 చివరిలో 10,000 మందిని తొలగించిన కంపెనీ, ఇప్పుడు మరో భారీ కోతకు సిద్ధమవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఒరాకిల్ తన రుణాల కోసం ఇప్పుడు ఆసియా బ్యాంకుల వైపు చూస్తోంది. అయితే అమెరికా బ్యాంకుల కంటే ఇక్కడ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం కంపెనీకి భారంగా మారింది. మరోవైపు, ఈ లేఆఫ్స్ ప్రభావం ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులపై కూడా పడే అవకాశం ఉందని సమాచారం. ఈ వారంలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
అమరావతి :
అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్. #🆕Current అప్డేట్స్📢
అంబటి భార్య హౌస్ మోషన్ పిటిషన్పై విచారణలో హైకోర్టు ఆదేశాలు.
శాంతి భద్రతలు అదుపులోకి వచ్చే వరకూ సెక్యూరిటీ ఇవ్వండి.-హైకోర్టు
వారంలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు #🆕Current అప్డేట్స్📢
# ఆంధ్రప్రదేశ్
తిరుపతికి చెందిన బయ్యాల చాందిని వారం వ్యవధిలోనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఆమె బుధవారం జుడీషియల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరారు. 2 రోజుల క్రితం గ్రూప్-2లో జాబ్ వచ్చింది. తాజాగా శుక్రవారం విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో DSP క్యాడర్ పోస్ట్కు ఎంపికయ్యారు. ఆమె తండ్రి భాస్కర్ TTD రిసెప్షన్-1 డిప్యూటీ EOగా పని చేస్తున్నారు. కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమేనని చాందిని నిరూపించారు..£
*_తెలంగాణ లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం_* #🆕Current అప్డేట్స్📢
_తెలంగాణలో స్థానిక సమరానికి నగారా మోగడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగియడంతో అభ్యర్థుల సందడి మున్సిపల్ కార్యాలయాల వద్ద పోటెత్తింది._
_గడువు ముగిసే సమయానికి కార్యాలయాల ఆవరణలో ఉన్న వారందరికీ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక అనుమతిని కల్పించారు. దీనితో చివరి నిమిషం వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా భారీ ఎత్తున పత్రాలను సమర్పించారు._
_ఈ ఎన్నికల ప్రక్రియలో తదుపరి దశగా రేపు అధికారులు నామినేషన్ల పరిశీలన (Scrutiny) చేపట్టనున్నారు. అభ్యర్థులు సమర్పించిన పత్రాల్లో ఏవైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా లేదా అని నిశితంగా పరిశీలిస్తారు. అనంతరం వచ్చే నెల 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. రాజకీయ సమీకరణాలు, బుజ్జగింపుల పర్వం ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం పోటీలో తుది అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు. దీనితో అసలు సిసలు ఎన్నికల పోరులో నిలిచేది ఎవరనేది తేలిపోనుంది._
_తెలంగాణలోని మొత్తం 116 మున్సిపాలిటీలు మరియు 7 కార్పొరేషన్ల పరిధిలో ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ ఎన్నికల ద్వారా స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. పోలింగ్ ముగిసిన రెండు రోజులకే, అంటే ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. తక్కువ కాలంలోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి, కొత్త పాలక వర్గాలను కొలువుదీర్చేందుకు యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది._
పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు #🆕Current అప్డేట్స్📢
అమృత్సర్ రూరల్ పోలీసుల మెరుపు దాడి
42,983 కిలోల హెరాయిన్, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక స్టార్ మార్క్ పిస్టల్, 46 లైవ్ బుల్లెట్లు స్వాధీనం
వివరాలు ఎక్స్ వేదికగా పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడి
పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున సాగుతున్న మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కుట్రను భగ్నం చేశారు.
విలేజ్ డిఫెన్స్ కమిటీ (వీడీసీ) నుంచి అందిన కీలక సమాచారంతో అమృత్సర్ రూరల్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి భారీ మొత్తంలో హెరాయిన్తో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు. దాడుల్లో మొత్తం 42,983 కిలోల హెరాయిన్, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక స్టార్ మార్క్ పిస్టల్, 46 లైవ్ బుల్లెట్లు, అలాగే నిందితులు వదిలివెళ్లిన ఒక మోటార్సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
విలేజ్ డిఫెన్స్ కమిటీ సభ్యుల అప్రమత్తత వల్లే ఈ భారీ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అడ్డుకోవడం సాధ్యమైందని పోలీసులు పేర్కొంటూ, వారి సహకారాన్ని ప్రశంసించారు. ఈ ఘటనకు సంబంధించి అమృత్సర్కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటి వెనుక పనిచేస్తున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్ ఏమిటి? అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి కుట్రల వెనుక ఉన్న అసలు సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని డీజీపీ గౌరవ్ యాదవ్ స్పష్టం చేశారు.
*ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు ముందుగా పంపిణీ..* #🆕Current అప్డేట్స్📢
*ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో జనవరి 31నే పింఛన్..*
ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రత పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త.
ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా, జనవరి నెలకు సంబంధించిన పింఛాలు ఒక రోజు ముందుగానే 31న పంపిణీ చేస్తూ ప్రభుత్వం ప్రకటించింది.
సామాజిక భద్రత పథకాలలో వృద్ధులు,విధవలు, దివ్యాంగులు, డబ్బులు, షీల్మండలు వంటి వర్గాల లబ్ధిదారులు ఈ ప్రయోజనం పొందనున్నారు.
ఈ నిర్ణయంతో లక్షలాది మంది పేదలకు సౌకర్యం కల్పించిన ప్రభుత్వం, పంపిణీ సమయాల్లో ఏర్పడే గందరగోళాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకుంది....
*అమల్లోకి ఎన్నికల కోడ్..*
తెలంగాణ:
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు సైతం ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు.
*మున్సిపల్ ఎన్నికల ముఖ్య తేదీల వివరాలు సంక్షిప్తంగా..*
జనవరి 28 - నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
జనవరి 30 - నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ
జనవరి 31 - నామినేషన్ల స్క్రూటినీ
ఫిబ్రవరి 03 - నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 11 - పోలింగ్
ఫిబ్రవరి 12 - అవసరమైన చోట రీపోలింగ్
ఫిబ్రవరి 13 - ఓట్ల లెక్కింపు
ఫిబ్రవరి 16 - మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక & కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
ఈ ఎన్నికల్లో 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో సుమారు 53 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.. #🆕Current అప్డేట్స్📢
రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
Jan 27, 2026,
రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
జనవరి 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. మొదటి దశ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. రెండో విడత సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. #🆕Current అప్డేట్స్📢
*డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఉద్రిక్తత: ఎస్ఐని ఢీకొట్టిన కారు* #🆕Current అప్డేట్స్📢
రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నప్పుడు సంచలన ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ నడిపిన కారు సుమారు 100 కి.మీ. వేగంతో దూసుకొచ్చి, తనిఖీలు నిర్వహిస్తున్న సబ్-ఇన్స్పెక్టర్ (SI) మధును ఢీకొట్టింది.
ఎస్ఐ మధు కారును ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ఆయనపైకి దూసుకెళ్లాడు. ఆ ప్రమాదకర స్థితిలో ఎస్ఐ కారు బోనెట్పై పడిపోగా, నిందితుడు కారును ఆపకుండా అలాగే సుమారు 400 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు.
కారు వేగం తగ్గిన వెంటనే ఎస్ఐ మధు చాకచక్యంగా కిందకు దూకి స్వల్ప గాయాలతో ప్రాణాలను కాపాడుకున్నారు. తోటి పోలీసులు వెంటనే స్పందించి ఆయనను సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారు నంబర్ను గుర్తించి, ఇబ్రహీంపట్నం సమీపంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
ప్రాథమిక విచారణలో, నిందితులు మద్యం మత్తులో ఎస్ఐపై హత్యాయత్నం చేసినట్టు తేలింది. వారిపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలతో పాటు హత్యాయత్నం వంటి కఠిన కేసులు నమోదు చేశారు.




![🆕Current అప్డేట్స్📢 - |]- |]- - ShareChat 🆕Current అప్డేట్స్📢 - |]- |]- - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_521053_276fdd48_1770181519698_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=698_sc.jpg)








