విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో
విశాఖపట్నం (వేపగుంట),
కుమారుడి కోరిక మేరకు ఆ తండ్రి బైక్ కొనిచ్చారు. దాన్ని ఆ కుమారుడు రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తుండడంతో ట్రాఫిక్ చలానాలు వస్తున్నాయి. దీంతో విసిగిపోయిన తండ్రి.. చివరకు వాహనాన్ని తగలబెట్టారు. విశాఖలోని పెందుర్తి జరిగిన ఈ ఘటనపై పోలీసుల కథనం.. వేపగుంట సమీప బంటాకాలనీకి చెందిన ఓ వ్యక్తి ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో ఓ కుమారుడు కళాశాలకు వెళ్లొచ్చేందుకు బైక్ కావాలని పట్టుబట్టాడు. తప్పనిసరి పరిస్థితిలో తండ్రి ఏడాది కిందట వాహనం కొనుగోలు చేశారు. అది చేతికందిన తర్వాత ఆ అబ్బాయి తన స్నేహితులతో ఎక్కువగా తిరగడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన నడిపాడు. గతేడాది ఓ ప్రమాదం జరగ్గా.. ఆసుపత్రి ఖర్చుల కోసం తండ్రి రూ. లక్ష వరకు ఖర్చు చేశారు. తాజాగా మరోమారు ట్రిపుల్ రైడింగ్ కారణంగా జరిమానా పడడంతో తండ్రి అసహనం చెందారు. బైకు కొనివ్వడం వల్లే తన కుమారుడు ఇలా తయారయ్యాడని ఆగ్రహించి కాలనీకి దూరంగా వాహనాన్ని తీసుకెళ్లి తగలబెట్టారు. #🆕Current అప్డేట్స్📢
✒️- వెండి గౌనులో మలైకా తళతళలాడుతోంది!
బాలీవుడ్ నటి మలైకా అరోరా 50 ఏళ్ల వయసులో కూడా తన అందంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల జరిగిన గ్లోబల్ స్పా అవార్డ్స్ వేడుకలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ₹1.20 లక్షల విలువైన వెండి రంగు బాడీకాన్ గౌను ధరించి తళతళలాడింది. పొడవాటి చెవిపోగులు, లోహపు గాజులతో ఆమె అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ 52 ఏళ్ల అందాల భామ తన ఫిట్నెస్ రహస్యాలు క్రమం తప్పని యోగా, జిమ్ మరియు కఠినమైన ఆహార నియమాలేనని గతంలో పేర్కొంది.. #🆕Current అప్డేట్స్📢
*తాడేపల్లిలో భారీ కారు తాకట్టు మోసం!*
*నూజివీడుకు చెందిన బానోత్ భవాని, కనకమేడల భాస్కర్ అనే వ్యక్తులు ఉండవల్లికి చెందిన ఒక వ్యక్తి దగ్గర కారు అద్దెకు తీసుకున్నారు.*
*ఆ కారును గురజాలకు చెందిన వెంకట రమణయ్య వద్ద 3 లక్షలకు తాకట్టు పెట్టారు.*
*ఇదే తరహాలో నిందితులు సుమారు 7 కార్లను వెంకట రమణయ్య వద్ద తాకట్టు పెట్టినట్లు సమాచారం*
*కార్ల యజమానులు అడగడానికి వెళ్తే.. GPSలు పీకేసి, కార్లను గుర్తుతెలియని చోట దాచేశారు.*
*"నా డబ్బులు నాకు ఇస్తేనే కార్లు ఇస్తా" అంటూ వెంకట రమణయ్య బాధితులను బెదిరిస్తున్నట్లు సమాచారం.*
*నిందితులు భవాని, భాస్కర్లపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో FIR నమోదు.*
*పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు.* #🆕Current అప్డేట్స్📢
కడప జిల్లాలో డీజిల్ కష్టాలు (VIDEO)
కడప జిల్లాలో డీజిల్ కష్టాలు పెరిగాయని స్థానికులు వాపోతున్నారు. చాపాడు మండలం అల్లాడుపల్లె గ్రామ పరిధిలో ఉన్న పెట్రోల్ బంక్కు డీజిల్ స్టాక్ రావడంతో శనివారం ఉదయం క్యాన్లు పట్టుకొని ప్రజలు బారులు తీరారు. ఇంధన కొరత ఉందన్న ప్రచారం.. ఇక దొరకదేమోనన్న భయంతో కొందరు అవసరానికి మించి డీజిల్, పెట్రోలు కొనుగోలుచేస్తున్నారు. కాగా ఈ డీజిల్ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. #🆕Current అప్డేట్స్📢
*నేడు ఉత్తరాంధ్రలో మరో భారీ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు* #🆕Current అప్డేట్స్📢
అమరావతి:
నేడు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జడ్. చింతువ గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన
రెన్యువబుల్ సోలార్ కంపెనీ 4,200 కోట్లతో 6 గిగా వాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యం కలిగిన క్లీన్ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపనలో పాల్గొననున్న సీఎం
2,100 మందికి ఉపాధి కల్పించనున్న ప్లాంట్....
ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు..
టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకుల అత్యుత్సాహం....
పులివెందులకు వెళ్లి.. మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్కు వేద ఆశీర్వచనంతో పాటు, శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేసిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు.
మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ సేవలో తరించిన ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఎ.శ్రావణ్కుమార్, వీణా మనోజ్కుమార్, కె.పార్థసారథికి, ఉప కార్యనిర్వహణాధికారి ఎ.ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేసి.. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు..... #🆕Current అప్డేట్స్📢
తమిళ సూపర్ స్టార్ ఓటు!
పోలింగ్ సెంటర్లో సందడి! #🆕Current అప్డేట్స్📢
తమిళనాడు ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీవీకే పార్టీ అధినేత, తమిళ సూపర్ స్టార్ విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సమయంలో అభిమానులు భారీగా తరలివచ్చి సందడి చేశారు.
*రూ. 17.40 కోట్ల డ్రగ్స్ సీజ్*
హైదరాబాద్ :- బుధవారం మౌలాలిలోని ఓ కెమికల్ యూనిట్పై ఎన్సీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన, తయారు చేస్తున్న భారీ డ్రగ్ మెటీరియల్ బయటపడింది. రెండు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో దాచి ఉంచిన 69.600 కిలోల అల్ప్రజోలామ్, ఎఫెడ్రిన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.17.40 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. డ్రగ్స్ తయారీకి ఉపయోగించే రసాయనాలను, ముడి పదార్థాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
*ముగ్గురి నిందితుల అరెస్ట్*
ఈ అక్రమ తయారీ కేంద్రంతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కీలక పాత్రధారులు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్ తయారీలో నైపుణ్యం కలిగిన వ్యక్తితో పాటు ముడి పదార్థాలను చేరవేసే వ్యక్తితో పాటు తయారైన డ్రగ్స్ను వివిధ ప్రాంతాలకు తరలించే వ్యక్తి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
*కల్లు దుకాణాలే లక్ష్యం*
ఎన్సీబీ విచారణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వేసవి కాలంలో తెలంగాణలో కల్లుకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ సమయాన్ని ఆసరాగా చేసుకుని, కల్లులో కలిపి విక్రయించేందుకు (Adulteration) ఈ అల్ప్రజోలామ్ను భారీగా తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు.
*చట్టపరమైన చర్యలు*
నిందితులపై NDPS (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్) యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో ఎన్సీబీ అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. భాగ్యనగర నడిబొడ్డున పారిశ్రామిక యూనిట్ల ముసుగులో జరుగుతున్న ఇలాంటి ప్రమాదకర కార్యకలాపాలపై నిఘా పెంచామని తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో కల్లు కల్తీని అరికట్టేందుకు ఈ ఆపరేషన్ ఒక కీలక ముందడుగు అని చెప్పుకొచ్చారు. అక్రమ మత్తు పదార్థాల తయారీ, సరఫరా చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఇలాంటి సమాచారం తెలిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఎన్సీబీ అధికారులు సూచించారు. #🆕Current అప్డేట్స్📢
నిన్న జపాన్ భూకంపం లైవ్ వీడియో!
భయం*కర దృశ్యాలు!
నిన్న జపాన్లో సంభవించిన 7.4 తీవ్రత భూకంపం దేశాన్ని కుదిపేసింది. ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఈ భూకంపం తర్వాత సునామీ ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. తీరప్రాంతాల్లో 10 అడుగుల వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ప్రారంభించారు.
ఇప్పుడే బయటకు వచ్చిన కొత్త వీడియోల్లో… భూకంపం సమయంలో భవనాలు ఊగిపోతూ, ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ విజువల్స్ పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి.
అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుండగా… మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది. #🆕Current అప్డేట్స్📢
నేను నటుడినే… కానీ రాజకీయాల్లో కాదు! విజయ్.
విజయ్ ఒక నటుడు… అవును, నేను నటుడినే. దాన్ని నేను ఎప్పుడూ దాచలేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం నేను స్పష్టంగా చెబుతున్నాను — నేను నటించడం లేదు. రాజకీయాల్లోకి వచ్చాక నేను ఏ వేదికపైనా డ్రామా చేయడం లేదు, నటన చూపించడం లేదు. ప్రజల కోసం నిజాయితీతోనే మాట్లాడుతున్నాను.
కానీ మీరు మాత్రం రాజకీయాలను డ్రామాగా మార్చి చూపిస్తున్నారు. ప్రతి మాటను, ప్రతి కదలికను వక్రీకరించి, రాజకీయాలకు ఒక రంగు పూయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలు ప్రజల కోసం ఉండాలి… డ్రామా కోసం కాదు. #🆕Current అప్డేట్స్📢








