Viral video- ఫోన్ చూసేందుకు చిన్నారి డోర్ లాక్.. తప్పెవరిది?
నిత్యం మొబైల్ ఫోన్ చూడటం పిల్లల్లోనూ పెరిగింది. ఇది క్రమంగా వ్యసనంగా మారింది. తాజాగా ఓ బాలిక ఫోన్ను నిరంతరాయంగా చూడటం కోసం రూమ్లోకి వెళ్లి లాక్ చేసుకుంది. కుటుంబసభ్యులు ఎంత ప్రయత్నించినా తెరవలేకపోయారు. దీంతో గోడను బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ వీడియో వైరలవుతోంది. పెద్దలను చూసే పిల్లలు ఫోన్కు అలవాటు పడుతున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు•• #🆕Current అప్డేట్స్📢
*చిలీ రాజధాని*
శాంటియాగోలోని రెంకా ప్రాంతంలో గురువారం (ఫిబ్రవరి 19, 2026) భీకర ప్రమాదం జరిగింది. ఓ బిజీ హైవేపై వెళ్తున్న లిక్విడ్ గ్యాస్ ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తా పడి పేలిపోవడంతో నలుగురు మృతి చెందగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భారీ పేలుడు దాటికి సుమారు 50 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 200 మీటర్ల వ్యాసార్థం వరకు మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. మృతుల్లో ట్యాంకర్ డ్రైవర్ కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. #🆕Current అప్డేట్స్📢
*_అలర్ట్..తెలంగాణలో స్కూల్స్ సమయం మార్పు, సమ్మర్ హాలీడేస్ ప్రకటన.._*
_తెలంగాణలో ఎండలు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులను ప్రారంభిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది._
*_అలాగే వేసవి సెలవుల షెడ్యూల్ను కూడా ప్రకటించింది._*
_మార్చి 16 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే పనిచేస్తాయి. 10వ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం తరగతులు మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతాయి. ఏప్రిల్ 24 నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. జూన్ 12న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి._
*_ఉర్దూ మీడియం పాఠశాలలకు ప్రత్యేక రాయితీ:_*
_పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, ఉర్దూ మీడియం స్కూల్స్ సమయాల్లో మార్పులు చేశారు. ఈ పాఠశాలలు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు పనిచేస్తాయి. సిలబస్ పూర్తి చేసేందుకు అవసరమైతే వారానికి ఒకసారి అదనపు తరగతులు నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు._
_ఎండ తీవ్రత వల్ల విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తల్లిదండ్రులు తమ ప్రయాణ ప్రణాళికలను ఈ షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చని సూచించింది._ #🆕Current అప్డేట్స్📢
లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన లైన్మన్ #🆕Current అప్డేట్స్📢
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి లైన్మన్ నక్కబోయిన నాగేంద్రబాబును పట్టుకున్నారు. చేజర్లకు చెందిన గుండాల యోహాన్ తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరగా, ఇందుకు నాగేంద్రబాబు రూ. 70 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న అతడు తన తండ్రి ద్వారా డబ్బుల లావాదేవీలు జరిపినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
డబ్బుల డిమాండ్తో విసిగిపోయిన రైతు విజయవాడలోని ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అధికారులు పక్కా ప్రణాళికతో కాపుకాసి లంచం స్వీకరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ ఎస్పీ మహేంద్ర మత్తె ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఎస్ఐలు దాడుల్లో పాల్గొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
*టీ20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్..*
టీ20 వరల్డ్ కప్లో సూపర్-8కి జింబాబ్వే.. వర్షం కారణంగా జింబాబ్వే- ఐర్లాండ్ మ్యాచ్ రద్దు.. గ్రూప్-బి నుంచి సూపర్-8కి శ్రీలంక, జింబాబ్వే.. లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన ఆస్ట్రేలియా.. #🆕Current అప్డేట్స్📢
*_Telangana: తెలంగాణలో 15 ఏళ్లు నిండిన అమ్మాయిలకు అలర్ట్.. ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ.. ప్రభుత్వం కీలక ప్రకటన_*
_తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భాశయ క్యాన్సర్ను అరికట్టేందుకు హెచ్పీవీ వ్యాక్సిన్ను పంపిణీ చేసేందుకు సిద్దమైంది. ఉచితంగా ఈ టీకాను అమ్మాయిలకు అందించనుంది._
_రాష్ట్రంలో 15 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయిలకు ఈ టీకా వేస్తారు. రాష్ట్రంలో ఈ వయస్సు ఉన్న అమ్మాయిలు దాదాపు 4 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వీరందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు రంగం సిద్దమైంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ను అందించనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా మైక్రో ప్లానింగ్ సర్వే ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతోంది. ఈ సర్వే ద్వారా 15 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయిలు ఏ స్కూళ్లల్లో ఉన్నారు..? ఎంతమంది ఉన్నారు..? బయట ఎంతమంది ఉన్నారు? అనే సమగ్ర వివరాలను సేకరిస్తోంది._
*_హెచ్పీవీ వ్యాక్సిన్ ఎందుకు..?_*
_ఈ వ్యాక్సిన్ వల్ల మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. హెచ్పీవీ అనే వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ సోకుతుంది. మహిళల్లో దాదాపు 90 శాతం వరకు ఈ వైరస్ వల్లే సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. తెలంగాణలోనూ సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదుతున్నాయి. తెలంగాణలోని మహిళల్లో రొమ్ము క్యాన్సర్ బారిన పడేవారు ఎక్కువమంది ఉండగా.. రెండో స్థానంలో సర్వైకల్ క్యాన్సర్ ఉంది. దీంతో దీనిని నివారించేందుకు హెచ్పీవీ వ్యాక్సిన్ను ఉచితంగా అందించేందుకు సిద్దమవుతోంది. దీని వల్ల మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడవచ్చని, ఆ వ్యాధిని అడ్డుకునే లక్షణాలు ఈ వ్యాక్సిన్కు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు._
*_సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది..?_*
_లైంగిక సంబంధాలు, చిన్న వయస్సులోనే మ్యారేజ్ చేసుకోవడం, ఎక్కువసార్లు ప్రసవాలు, శుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో హెచ్పీవీ వైరస్ సోకుతుంది. వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాతే దీని లక్షణాలు బయటపడతాయి. దీంతో అమ్మాయిలు యుక్త వయస్సుకు రాగానే ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ బారిన పాడకుండా కాపాడుకోవచ్చు. దీంతో తల్లిదండ్రులు తమ కూతుళ్లకు ఇది వేయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బయట ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ఒక్కో డోసుకు రూ.2 వేల నుంచి రూ.4 వేల ఖర్చు అవుతుంది. మూడు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి వేలల్లో ఖర్చు అవుతుంది. దీంతో తల్లిదండ్రులకు ఆ భారం తగ్గించేందుకు ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ల పంపిణీకి ప్రభుత్వం పూర్తి ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తోంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఒకసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది._ #🆕Current అప్డేట్స్📢
బిల్ గేట్స్కు సీఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ఆత్మీయ స్వాగతం #🆕Current అప్డేట్స్📢
*భారత్ కు శివరాత్రి , పాక్ కు కాళ రాత్రి*:- #🆕Current అప్డేట్స్📢
*చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 62 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం.*
*టీమిండియా బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్.*
*విధ్వంసకర ఇన్నింగ్స్తో భారత్కు భారీ స్కోరు అందించిన ఇషాన్ కిషన్.*
*అద్భుత ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్కు దక్కిన 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు.*
*వరల్డ్ కప్లో దాయాదిపై గెలుపుతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం.*
*తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు.. అధికారిక ప్రకటన..*
మొత్తం వార్డులు 2995
కాంగ్రెస్ - 1537, బీఆర్ఎస్ - 781, బీజేపీ - 336, ఎంఐఎం - 70, ఇతరులు - 271
పార్టీల వారీగా వచ్చిన ఓట్లు..
కాంగ్రెస్ - 11,22,260
బీఆర్ఎస్ - 8,64,209
బీజేపీ - 3,73,773 #🆕Current అప్డేట్స్📢
*పెళ్లికి మంచి ముహూర్తాలు ఇవే..* #🆕Current అప్డేట్స్📢
పెళ్లికి మంచి ముహూర్తాలు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలుకానుంది. ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియడంతో 19వ తేదీ నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయని పండితులు చెబుతున్నారు.
ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26
మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12
ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29
మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14
జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29
జులై: 1, 6, 7, 11
నవంబర్: 21, 24, 25, 26
డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12.










