newj today
ShareChat
click to see wallet page
@newjtoday
newjtoday
newj today
@newjtoday
ఐ లవ్ షేర్ చాట్
తమిళ సూపర్ స్టార్ ఓటు! పోలింగ్ సెంటర్‌లో సందడి! #🆕Current అప్‌డేట్స్📢 తమిళనాడు ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీవీకే పార్టీ అధినేత, తమిళ సూపర్ స్టార్ విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సమయంలో అభిమానులు భారీగా తరలివచ్చి సందడి చేశారు.
🆕Current అప్‌డేట్స్📢 - @0 60 %03 96 4357 TKL @0 60 %03 96 4357 TKL - ShareChat
*రూ. 17.40 కోట్ల డ్రగ్స్ సీజ్* హైదరాబాద్ :- బుధవారం మౌలాలిలోని ఓ కెమికల్ యూనిట్‌పై ఎన్‌సీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన, తయారు చేస్తున్న భారీ డ్రగ్ మెటీరియల్ బయటపడింది. రెండు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో దాచి ఉంచిన 69.600 కిలోల అల్ప్రజోలామ్, ఎఫెడ్రిన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.17.40 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. డ్రగ్స్ తయారీకి ఉపయోగించే రసాయనాలను, ముడి పదార్థాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. *ముగ్గురి నిందితుల అరెస్ట్* ఈ అక్రమ తయారీ కేంద్రంతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కీలక పాత్రధారులు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్ తయారీలో నైపుణ్యం కలిగిన వ్యక్తితో పాటు ముడి పదార్థాలను చేరవేసే వ్యక్తితో పాటు తయారైన డ్రగ్స్‌ను వివిధ ప్రాంతాలకు తరలించే వ్యక్తి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. *కల్లు దుకాణాలే లక్ష్యం* ఎన్‌సీబీ విచారణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వేసవి కాలంలో తెలంగాణలో కల్లుకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ సమయాన్ని ఆసరాగా చేసుకుని, కల్లులో కలిపి విక్రయించేందుకు (Adulteration) ఈ అల్ప్రజోలామ్‌ను భారీగా తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. *చట్టపరమైన చర్యలు* నిందితులపై NDPS (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో ఎన్‌సీబీ అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. భాగ్యనగర నడిబొడ్డున పారిశ్రామిక యూనిట్ల ముసుగులో జరుగుతున్న ఇలాంటి ప్రమాదకర కార్యకలాపాలపై నిఘా పెంచామని తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో కల్లు కల్తీని అరికట్టేందుకు ఈ ఆపరేషన్ ఒక కీలక ముందడుగు అని చెప్పుకొచ్చారు. అక్రమ మత్తు పదార్థాల తయారీ, సరఫరా చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఇలాంటి సమాచారం తెలిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఎన్‌సీబీ అధికారులు సూచించారు. #🆕Current అప్‌డేట్స్📢
🆕Current అప్‌డేట్స్📢 - [ద్రస కలకలం ٥٥ [ద్రస కలకలం ٥٥ - ShareChat
నిన్న జపాన్ భూకంపం లైవ్ వీడియో! భయం*కర దృశ్యాలు! నిన్న జపాన్లో సంభవించిన 7.4 తీవ్రత భూకంపం దేశాన్ని కుదిపేసింది. ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంపం తర్వాత సునామీ ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. తీరప్రాంతాల్లో 10 అడుగుల వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ప్రారంభించారు. ఇప్పుడే బయటకు వచ్చిన కొత్త వీడియోల్లో… భూకంపం సమయంలో భవనాలు ఊగిపోతూ, ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ విజువల్స్ పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుండగా… మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది. #🆕Current అప్‌డేట్స్📢
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:19
నేను నటుడినే… కానీ రాజకీయాల్లో కాదు! విజయ్. విజయ్ ఒక నటుడు… అవును, నేను నటుడినే. దాన్ని నేను ఎప్పుడూ దాచలేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం నేను స్పష్టంగా చెబుతున్నాను — నేను నటించడం లేదు. రాజకీయాల్లోకి వచ్చాక నేను ఏ వేదికపైనా డ్రామా చేయడం లేదు, నటన చూపించడం లేదు. ప్రజల కోసం నిజాయితీతోనే మాట్లాడుతున్నాను. కానీ మీరు మాత్రం రాజకీయాలను డ్రామాగా మార్చి చూపిస్తున్నారు. ప్రతి మాటను, ప్రతి కదలికను వక్రీకరించి, రాజకీయాలకు ఒక రంగు పూయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలు ప్రజల కోసం ఉండాలి… డ్రామా కోసం కాదు. #🆕Current అప్‌డేట్స్📢
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:42
*ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ మూవీ.. రిలీజ్‌ డేట్‌ ఇదే..* #🆕Current అప్‌డేట్స్📢 ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్‌ అప్‌డేట్స్‌ పంచుకున్నారు. ఈ ఏడాది మే 20న ఫస్ట్‌ గ్లింప్స్‌, వచ్చే ఏడాది జూన్‌ 11న సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టర్‌ను పోస్ట్‌ చేశారు.
🆕Current అప్‌డేట్స్📢 - BUNUUERING WURLDWIDE = Uட 27 BUNUUERING WURLDWIDE = Uட 27 - ShareChat
*_రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె_* #🆕Current అప్‌డేట్స్📢 _నేటి అర్ధరాత్రి నుంచే నిలిచిపోనున్న బస్సులు_ _ఇదే చివరి సమ్మె కావాలి: జేఏసీ_ _హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21: ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగబోతున్నారు._ _ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో సమ్మె తథ్యమని స్పష్టమవుతున్నది. ఇదే జరిగితే మంగళవారం అర్ధరాత్రి నుంచే మొదటి డ్యూటీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈలోగా సమ్మెను నిరోధించేందుకు ప్రభుత్వం ఏవైనా చర్యలు చేపడితే తప్ప ఈ నెల 22 నుంచి సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తున్నా యి. సమ్మె గడువు దగ్గరపడుతున్నా ప్రభు త్వం నుంచి చర్చల ఊసే లేకపోవడంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ తీసుకోకపోతే కచ్చితంగా సమ్మె జరుగుతుందని తేల్చిచెప్తున్నారు._ _నిరుడు మే 6న సమ్మెకు దిగనున్నట్టు ప్రకటించిన ఆర్టీసీ కార్మికులతో ప్రభు త్వం చర్చలు జరిపి, సమ్మెకు వెళ్లకుండా అడ్డుకున్నది. ఇప్పుడు ప్రభుత్వంలో ఎలాంటి చల నం లేకపోవడంతో సమ్మెకు వెళ్లడమే సరైన నిర్ణయమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భావిస్తున్నది. సమ్మెకు వెళ్తున్న కార్మికులపై పలు డిపోల్లో అధికారులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలకు వెరవకుండా సమ్మెకు తరలిరావాలని కార్మికులకు జేఏసీ పిలుపునిచ్చింది. కార్మికులు ఐక్యతతో గట్టిగా పోడాడితే ఆర్టీసీలో ఇదే చివరి సమ్మె అవుతుందని జేఏసీ నేతలు చెప్తున్నారు. తమతో ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరుపకపోతే మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు డిపోల్లో ఆగిపోతాయని, బుధవారం ఉద యం నుంచే సమ్మె పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుందని చెప్తున్నారు._ _ముఖ్యమంత్రిపైనే భారం_ _ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుపై యాజమాన్యం పూర్తిగా చేతులెత్తేసే దిశ గా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా సమ్మె డిమాండ్లతో తమకు ఎలాంటి సం బంధం లేదని లేబర్‌ కమిషన్‌కు పంపిన లేఖలో స్పష్టం చేసింది. దీంతో సీఎం నేరుగా రంగంలోకి దిగితే తప్ప తమ సమస్యలకు పరిష్కారం లభించదని కార్మికులు భావిస్తున్నా రు._ _మంగళవారం సాయంత్రంలోగా తమ నాయకులను ప్రభుత్వం చర్చలకు పిలువకపోతే సమ్మె తథ్యమని స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు కార్మిక సంఘాలపై నిషేధం ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాన డిమాండ్లు మినహా మిగతా డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తున్నది. కానీ, ప్రధాన డిమాండ్లను పరిష్కరించకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిరోధించడం ఎలాగన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతున్నది._ *_సమ్మెకు కలిసి వస్తామన్న ఇతర సంఘాలు_* _దీర్ఘకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఎన్నో వినతులు సమర్పించినా స్పందన లేకపోవడంతో తాము సైతం సమ్మెకు కలిసి వస్తామని జేఏసీలో లేని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం మీడియా సమావేశం నిర్వహించి, తమ కార్యాచరణ ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు యూనియన్ల పునరుద్ధరించాలని, 2021, 2025 వేతన సవరణ, 2017 పీఆర్సీ బకాయిలు, రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సహా అన్ని సమస్యలను మంగళవారం మధ్యాహ్నంలోగా పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేనిపక్షంలో 22 నుంచి జరిగే సమ్మెకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు._
🆕Current అప్‌డేట్స్📢 - 8 ّ ಶ నేస్తం . ప్రజల' 8 ّ ಶ నేస్తం . ప్రజల' - ShareChat
విశాఖ.....గాజువాక.... గాజువాక శ్రీకన్య థియేటర్ ఎదురగా సోనోవిజన్ రెండువ అంతస్తులో పెద్ద ఎత్తున పొగలు, మంటలు ఫైర్ సిబ్బంది అదుపుచేస్తున్న తగ్గిని పొగలు #🆕Current అప్‌డేట్స్📢
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:24
ఇది సినిమా కాదు..! ప్రళయ అగ్నిప్రమాదం!. ఉత్తరప్రదేశ్‌లోని వికాస్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఇది సినిమా సీన్ కాదు… నిజంగా జరిగిన ఘోర ఘటన. ఒక్కసారిగా చెలరేగిన మంటలు వందల ఇండ్లను కాలి బూడిద చేశాయి. ఈ ప్రమాదంలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సుమారు 50 గ్యాస్ సిలిండర్లు వరుసగా పేలడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. పేలుళ్ల శబ్దాలతో ప్రాంతం మొత్తం కంపించింది. ప్రళయాన్ని తలపించేలా చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితులకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. #🆕Current అప్‌డేట్స్📢
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:38
🙏ఓం నమః శివాయ🙏 #😇శివ లీలలు✨
😇శివ లీలలు✨ - ShareChat
00:15
*19 ఏళ్ల వయసులో 180 మంది బాలికలను ట్రాప్ చేసి లైంగికంగా వేధించిన మహారాష్ట్ర యువకుడు మహ్మద్ అయాజ్ ఇంటిని అధికారులు బుల్డోజర్తో కూల్చేశారు...* #🆕Current అప్‌డేట్స్📢 అమ్మాయిలను ట్రాప్ చేసి అనుభవిస్తూ..వారికి తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన అయాజ్ ఇంటి మీదకు బుల్డోజర్లు వెళ్లాయి. ఈ సమయంలో ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇంటిని కూల్చేశారు. మహారాష్ట్రలోని *అమరావతి పరిధిలోని పరాట్వాడా పట్టణానికి చెందిన అయాజ్ లైంగిక వేధింపుల కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది.* *180 మంది అమ్మాయిలను లైంగికంగా వేధించడమే కాకుండా.. 350 వీడియోలను రహస్యంగా చిత్రీకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.* వాట్సాప్, స్నాప్ చాట్ గ్రూపులను వాడుకుని అమ్మాయిలను టార్గెట్ చేసేవాడు. టీనేజ్ అమ్మాయిలే టార్గెట్గా ఈ 19 ఏళ్ల యువకుడి ఉన్మాద చర్యలు కొనసాగాయి. *అమ్మాయిలను ట్రాప్ చేసి ముంబై, పుణె నగరాలకు తీసుకెళ్లేవాడు. అక్కడ సిటీ తిప్పి చూపించి హోటల్ గదికి తీసుకెళ్లి తన లైంగిక వాంఛ తీర్చుకునేవాడు.* ఆ..అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసేవాడు. ఆ వీడియోలు చూపించి వాళ్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా తను పిలిచినప్పుడు వచ్చి తన కోరిక తీర్చాలని అయాజ్ డిమాండ్ చేశాడు. *అందంగా ఉన్న అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపి సొమ్ము చేసుకునే వాడు.* ఇళ్లలో తెలిస్తే పరువు పోతుందని అయాజ్ గురించి బాధిత టీనేజ్ అమ్మాయిలు ఎవరికీ చెప్పలేదు. మహ్మద్ అయాజ్ చేసిన గలీజ్ దందా ఇది. కొందరు అమ్మాయిలతో అయాజ్ ఉన్న వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ కావడంతో బీజేపీ ఎంపీ అనిల్ బోండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తీగ లాగడంతో అయాజ్ డొంకంతా కదిలింది. *మహారాష్ట్రలోని అమరావతి జిల్లా అధికారులు అతని ఇంటిని జేసీబీలతో కూల్చేయడం గమనార్హం.* పరాట్వాడా పట్టణంలోని అచల్‌పూర్ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు చేపట్టిన ఆపరేషన్‌లో అయాజ్ ఇల్లు కూల్చేశారు. అక్రమ నిర్మాణంగా తేలడంతో ఇంటిని కూల్చేసినట్లు అధికారులు తెలిపారు. పై అంతస్తుకు వెళ్లేందుకు ఇంటి బయట నిర్మించిన ఇనుప మెట్లను ఒక జేసీబీ యంత్రం కూల్చివేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ కావడం గమనార్హం. ఈ అక్రమ నిర్మాణం గురించి నిందితుడి కుటుంబానికి నోటీసు జారీ చేసిన తర్వాతనే కూల్చివేతలు మొదలుపెట్టినట్లు అధికారులు తెలిపారు. తన్వీర్ అని కూడా పిలువబడే అయాజ్‌పై లైంగిక దాడి, వేధింపులు, అశ్లీల వీడియోలు రికార్డ్ చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదు చేశారు. 19 ఏళ్ల ఇతను సోషల్ మీడియా వేదికల ద్వారా మైనర్ బాలికలను ప్రలోభపెట్టి, వారిని మానసికంగా బంధించి, ఆ తర్వాత వారిని లైంగికంగా దోపిడీ చేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా *ఈ లైంగిక వేధింపుల కేసులో.. పోలీసులు ఇప్పటివరకు అయాజ్, అతని ఫ్రెండ్ ఉజర్ ఖాన్‌తో సహా పలువురు నిందితులను అరెస్టు చేశారు.* విచారణలో ఇద్దరూ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. *అయాజ్‌ను కోర్టులో హాజరుపరచగా, అతనికి ఏడు రోజుల పోలీసు కస్టడీ విధించారు.*
🆕Current అప్‌డేట్స్📢 - 19 ఏళ్లకుర్రాడు. 180 మంది అమ్యాయిలను ఆగం చేశాడు ఇంటిమీదకు దూసుకెళ్లిన బుల్డోజర్లు! 19 ఏళ్లకుర్రాడు. 180 మంది అమ్యాయిలను ఆగం చేశాడు ఇంటిమీదకు దూసుకెళ్లిన బుల్డోజర్లు! - ShareChat