JYOTHI KUMAR . P
ShareChat
click to see wallet page
@pjkreddy
pjkreddy
JYOTHI KUMAR . P
@pjkreddy
🇱🇸Ysrcp సోషల్ మీడియా 🇱🇸
*దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఆశ‌యాల సాధ‌న కోసం..* *ఆయ‌న పాదాల చెంత 2011 మార్చి 12న పురుడుపోసుకున్న ప్ర‌జ‌ల పార్టీనే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ.* *16 సంవత్సరాల ఈ ప్ర‌యాణంలో అనేక పోరాటాలు అనేక విజయాలు* *పోరాటాల మధ్య పుట్టి… ప్రజల ఆశీర్వాదాలతో ఎదిగిన ప్రజా పార్టీ.* *వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంద‌ర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులందరికీ శుభాకాంక్షలు.* #👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్
👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - VEARS OE VSRB YS ICP F 0 R MATIO Nl D AY MARCH 12 #16 YearsofYSRCP VEARS OE VSRB YS ICP F 0 R MATIO Nl D AY MARCH 12 #16 YearsofYSRCP - ShareChat
చంద్రబాబు ఆర్థిక విధ్వంసం.. కాగ్‌ నివేదికే సాక్ష్యం చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి రాబడులు తగ్గాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆర్థిక విధ్వంసంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆదాయం తగ్గింది.. అప్పులు పెరిగాయి నేను చెప్పిన విషయాలనే కాగ్‌ రిపోర్టు చెప్పింది 2023-2024లో ప్రభుత్వం చేసిన ఖర్చు 2,36,486 కోట్లు 2023-2024లో రాబడులు రూ.1,70,767 కోట్లు చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,906కోట్లు చంద్రబాబు వచ్చాక రాబడులు రూ.1,68,024 కోట్లు మాత్రమే చంద్రబాబు హయాంలో రెవిన్యూ లోటు రూ.60,285కోట్లు రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. చంద్రబాబు వచ్చాక రెవిన్యూ లోటు 56శాతం పెరిగింది చంద్రబాబు వచ్చాక రాబడులు తగ్గాయి చంద్రబాబు వచ్చాక ద్రవ్య లోటు 30శాతం పెరిగింది కోవిడ్‌ ఉన్నా.. ఆదాయాలు తగ్గినా నెరవేర్చుతూ హామీలు నెరవేర్చాం. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ మారింది చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు అమాంతం పెంచారు నెట్‌ బారో సీలింగ్‌ పరిధి దాటింది రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వరకు అప్పు తీసుకోవచ్చో కేంద్ర ప్రభుత్వం విధించే పరిమితి నెట్‌ బారో సీలింగ్‌ పరిధి దాటింది చంద్రబాబు అండ్‌ కో దోచిపెట్టడమే సరిపోతుంది మట్టిని,ఇసుక,భూములు,లిక్కర్‌ దేన్ని వదలడం లేదు అన్నీంట్లో దోపిడీయే ప్రభుత్వానికి ఆదాయానికి ఎలా వస్తుంది ప్రజలకు సంక్షేమం ఎలా అందుతుంది వీళ్ల దోపిడికి వైజాగ్‌లో జరిగిన భూదోపిడీయే నిదర్శనం ఇలా చేస్తే ఆదాయాలు వస్తాయి. చంద్రబాబు పాలనకు ఆయన బిల్డప్‌కు తేడా చూపించే మరో చరిత్ర ఓవైపు మాపై తప్పుడు ప్రచారాలు చేస్తారు అప్పులు చేస్తారు ఆ అప్పులు బయట పడకుండా దాచేస్తే ప్రయత్నం చేస్తారు కాగ్‌ రిపోర్టులో అప్పులు రూ.81,082.51 కోట్లు కానీ అసెంబ్లీలో రూ.60,485.40 కోట్లు సుమారు 20వేల కోట్లు వ్యత్యాసం ఉంది 16రోజుల అసెంబ్లీ సమావేశాలతో ప్రజలు ఒరిగింది సున్నా చంద్రబాబుఅధికారంలోకి రాగానే మళ్లీ సీన్‌ రివర్స్‌: 2024-25లోనే పరిమితికి మించి రూ.17,953కోట్లు అధికంగా అప్పులు తీసుకువచ్చారు: ఇక 2025-26 ఏడాదిలో పరిస్థితి ఇంతకన్నా కూడా ఘోరంగా ఉంది. ఈ రెండేళ్లలో చంద్రబాబు తెచ్చిన మొత్తం అప్పులు రూ.3.2లక్షల కోట్లు: మా హయాంలో చేసిన అప్పుల్లో 96% అప్పులు ఈ రెండేళ్లలోనే చేశారు: మా ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు కేవలం 3.31 లక్షల కోట్లు మాత్రమే : ఎవరు జాగ్రత్తగా ఆర్థిక వ్యవస్థను నిర్వహించారు, ఎవరు ఆర్థిక వ్యవస్థను Damage చేశారన్నది కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది: రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు: విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి, దోపిడీ కారణంగా రాష్ట్రానికి ఆదాయాలు రావడంలేదు: వనరులన్నింటినీ కూడా దోచేసి సొంత జేబులు నింపుకుంటున్నారు: ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్స్‌, లెటరైట్‌, గ్రానైట్‌, లిక్కర్‌, భూములు, అధిక రేట్లకు పీపీఏలు దేన్నీ వదిలిపెట్టడంలేదు: దోపిడీ జరిగితే, ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తుంది? విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములను కారుచవకగా కట్టబెడుతూ దోపిడీకి పాల్పడుతున్నారు: రూ.5వేల కోట్ల విలువ చేసే 54 ఎకరాల ప్రభుత్వ భూములను చంద్రబాబు బంధువు కబ్జాచేస్తున్నారు: పొక్లెయిన్‌లతో లెవల్‌ చేసి, ప్రభుత్వం పెట్టిన బోర్డులను పీకేసి ఆక్రమించుకుంటున్నారు: ఇంత బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి, ఆయన బంధువు, లోక్‌సభ ఎంపీ కలిసి ప్రజల ఆస్తులను దోచేస్తున్నారు: ప్రభుత్వంతోపాటు వ్యవస్థలన్నీ చోద్యం చూస్తున్నాయి: ప్రజల ఆస్తులను రాబందుల్లా కొల్లగొడుతున్నారు ఆర్‌బీఐ అడ్వాన్స్‌లమీద ఆధారపడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో,మినిమం బ్యాలెన్స్‌ నగదు నిల్వ ఉండే రోజులు పడిపోయాయి: ఏ కష్టాలు లేనప్పటికీ 2024-25లో నగదు నిల్వలున్న సమయం కేవలం 8 రోజులకు పడిపోయింది. 365 రోజుల్లో 357 రోజులు మినిమం బ్యాలెన్స్‌ కూడా ట్రెజరీల్లో లేవు. చంద్రబాబు తాను చేస్తున్న పరిపాలనకు, ఆయన ఇస్తున్న బిల్డప్‌కు మధ్య తేడా కనిపిస్తోంది: వైయస్సార్‌సీపీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ మరోవైపు ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నారు చేస్తున్న అప్పుల్ని బయటకు రానీయకుండా దాచేసే ప్రయత్నంచేస్తున్నారు. 2024-25లో చేసిన బడ్జెట్‌ అప్పులు రూ.60,485 కోట్లని వీళ్ల ప్రభుత్వం చెప్తోంది, కాని కాగ్‌ మాత్రం ఆ ఏడాదిలో చేసిన అప్పులు రూ.81,071 కోట్లని తేల్చిచెప్పింది. దాదాపుగా రూ.20 వేల కోట్ల అప్పులను, వాస్తవంకంటే తక్కువ చేసి చూపించారు. 2024-25లో బడ్జెట్‌ వెలుపల చేసిన అప్పులపై వివరాలు ఇవ్వమని మండలిలో రాతపూర్వకంగా ప్రశ్నించాం: అలాంటి అప్పులేవీ చేయలేదంటూ ప్రభుత్వం దాటవేసే ప్రయత్నంచేసింది: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు, ప్రభుత్వ గ్యారంటీతో, పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నాయి. వీటన్నింటినీకూడా ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ అనక ఏమంటారు? కాని వాటి లెక్కలను చెప్పడం లేదు సభను తప్పుదోవ పట్టించిన అధికారులపై డీవోపీటికి ఫిర్యాదు చేస్తాం మొత్తం 16 రోజులపాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చూస్తే, తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్‌డబ్బాలు తప్ప ప్రజలకు ఒరిగింది సున్నా చంద్రబాబు తన కొడుక్కి జాకీలు పెట్టి ఎత్తితే, చంద్రబాబుకి ఆయన కొడుకు జాకీలు పెట్టి ఎత్తుతాడు. వీళ్లిద్దరికీ పవన్‌కళ్యాణ్‌ మరొక జాకీ పెట్టి లేపుతాడు ఆత్మస్తుతి... పరనింద మూడు బడ్జెట్‌లు ప్రవేశ పెట్టారు సూపర్‌ సిక్స్‌,సూపర్‌ సెవన్‌లు లేవు నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు 18ఏళ్లు నిండిన 60ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధికింద రూ.1500ఇస్తామని హామీ ఇచ్చారు మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావన లేదు ప్రతి నిరుద్యోగికి రూ.1.08లక్షల బకాయి పడ్డారు ఈ బడ్జెట్‌లలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నెరవేర్చారు ఇదే విషయం గురించి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా 50ఏళ్లు నిండిన ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ మహిళలకు నెలకు రూ.4వేలు పెన్షన్‌ ఇస్తామన్నారు. హామీ అమలు చేశారా? మా హయాంలో 66,34,372 మందికి పెన్లను ఇచ్చాం 2026ఫిబ్రవరి నాటికి 60,96,108 పెన్షన్లు మాత్రమే ఇచ్చారు 2026 మార్చి నాటికి 60,69,664 పెన్షన్లు మాత్రమే ఇచ్చారు ఒక్క నెలలో 25వేల పెన్షన్లు కట్‌ చేశారు మా హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం పెన్షన్ల కోసం బడ్జెట్‌లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు బడ్జెట్‌లో పెట్టింది రూ.27,719కోట్లు మాత్రమే భవిష్యత్‌లో ఇంకా పెన్షన్లు కట్‌ చేసే అవకాశం ఉంది పెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు udisc ప్రకారం 87,41,885 మందికి అమ్మ ఒడి ఇచ్చాం తల్లికి వందనం పేరుతో 20లక్షల మంది పిల్లలను తొలగించారు ఉచిత బస్సు హామీని పూర్తిగా నెరవేర్చలేకపోయారు ఆ మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పడంలేదు: పిల్లల సంఖ్యకు తగినట్టుగా బడ్జెట్‌ కేటాయింపులు లేవని గట్టిగా ప్రశ్నించినా చంద్రబాబు నోరు మెదపలేదు ఉచిత బస్సు ప్రయాణానికి దారుణమైన షరతులు పెట్టారు 16 రకాల సర్వీసులు ఉంటే 5 రకాల సర్వీసులకే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నిస్తే… నోరుమెదపలేదు. “రైతు భరోసా’’ కింద మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే మాట్లాడలేదు. రెండేళ్లకు గాను ఇవ్వాల్సింది రూ.40వేలు, ఇచ్చింది పదివేలే: ఈ పథకానికి దూరంచేసిన 7 లక్షలమంది రైతుల పరిస్థితి ఏమిటి అని అడిగితే నోరు మెదపలేదు: కౌలు రైతులకు ఒక్కరూపాయికూడా ఇవ్వడంలేదని ప్రశ్నిస్తే దానిగురించి కూడా మాట్లాడలేదు. ప్రీమింయ కట్టకపోవడం వల్ల 2023-24, 2024-25 వ్యవసాయ సీజన్లలో రూ.3,500 కోట్లు రైతులు నష్టపోయారు: వీరికి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడిగితే.. ప్రభుత్వం వైపు నుంచి ఒక్క మాటకూడా మాట్లాడలేదు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు: ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా చెప్పారా? ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి కోసం రూ.300 కోట్లే కేటాయించ‌డం ఏంట‌ని శాస‌న‌మండ‌లిలో మా స‌భ్యులు అడిగితే మంత్రులు ఎదురుదాడి చేశారు: వైఎస్సార్‌సీపీహ‌యాంలో ఏయే పంట‌లు ఎంత ఖర్చుచేసి కొన్నామో సమగ్రమైన వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు ఛైర్మన్‌ ద్వారా ఇచ్చారు: ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి: నెలరోజుల క్రితం రూ.26వేలు ఉన్న క్వింటా మిర్చి ధర, ఇప్పుడు రూ.18వేలకు తగ్గింది శ‌న‌గ ఎంఎస్పీ రూ.5,875 అయితే రైతులు రూ.5 వేలలోపే అమ్ముకుంటున్నారు: మొక్కజొన్న ఎంఎస్పీ రూ.2,400 అయితే రైతుల‌కు రూ.1400 నుంచి రూ. 1,500 కూడా దక్కని పరిస్థితి: ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు: అర‌టి మళ్లీ టన్ను రూ.5వేలకు పడిపోయింది: మా హయాంలో అరటి టన్ను రూ.30వేలకు అమ్ముకున్నారు: వైఎస్సార్‌సీపీ హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్లం: రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు: ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు: వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడ్డం మచ్చుకైనా మాటలాడలేదు ఫీజు రియింబర్స్‌ మెంట్‌, విద్యాదీవెన పథకానికి పెట్టిన బకాయిలు, వసతి దీవెన కింద పెట్టిన బకాయిలు ఎప్పుడు ఇస్తారన్నదానిపై ఒక్క మాటకూడా ముఖ్యమంత్రికాని, మంత్రులుకాని మాట్లాడలేదు. 2024-26 రెండేళ్లకు విద్యాదీవెన, వసతి దీవెన బకాయలు రూ. 6,428కోట్లు. 26-27 ఏడాదీ కలిపితే కలిపితే మొత్తం ఈ ఏడాది ఖర్చు చేయాల్సింది రూ.10,328 కోట్లు. కాని 2026-27 బడ్జెట్లో పెట్టింది కేవలం రూ.2,766 కోట్లు మరి పిల్లల చదువులు ఎలా సాగుతాయని అడితే దానిపై ఎవ్వరూ మాట్లాడలేదు. తల్లిదండ్రులమీద తీవ్ర ఒత్తిడి ఉంది, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థి, పిల్లలు చదువులు మానుకోవాల్సిన పరిస్తి : ఉద్యోగులకు ఇస్తానన్న పీఆర్సీపైనా, ఐఆర్‌పైనా ప్రశ్నిస్తే దానిపైనా మట్లాడలేదు: ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.36వేల కోట్ల బకాయిలపైనా మాట్లాడలేదు: ఆశ వర్కర్స్, అంగన్వాడీల కు ఇచ్చిన హామీల ఊసు కూడా లేదు: సచివాలయాలు పెట్టి, రీసర్వే మొదలు పెట్టింది మేం: రీ సర్వే కోసం 40వేల మంది సిబ్బందిని పెట్టంది మేం: అన్నీ తానే చేశానన్నట్టుగా చంద్రబాబు క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు: బేసిక్‌ పే ఇస్తానన్న హామీని అమలు చేయాలని సర్వేయర్లు డిమాండ్‌ చేస్తే వారిమీద కక్షసాధింపులకు దిగుతున్నాడు: డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన, ఎగరగొట్టిన సున్నావడ్డీ గురించి మాట్లాడలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబుగారు ఒకవైపు వెన్నుపోటు పొడుస్తూ మరోవైపు వారిని మభ్యపెడుతున్నారు: మహిళా సాధికారితపై చంద్రబాబు కోతలు కోస్తున్నాడు: మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తానంటూ 2014-19లో కూడా చంద్రబాబు మాట్లాడారు: ఎంతమందిని మహిళలను పారిశ్రామిక వేత్తలను చేశాడో చంద్రబాబు చెప్పగలడా? మా ప్రభుత్వంలో మహిళా సాధికారితకోసం, స్వయం ఉపాధి పథకాలను రద్దుచేశారు: ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపునేస్తం, జగనన్నతోడు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వాహనమిత్ర, సున్నావడ్డీలను రద్దుచేశారు: ట్రిపుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తానంటూ చంద్రబాబు దొంగ మాటలు చెప్తున్నాడు. ఈ రెండేళ్లలో కొత్తగా అక్క చెల్లెమ్మలకు ఒక్క గజం స్థలం ఇవ్వలేదు. ఒక్క ఇంటిపట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక ఇంటినికూడా మంజూరుచేసి ఇవ్వలేదు. మా హయాంలో 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చి, అందులో 21 లక్షల ఇల్లు మంజూరు చేశాం: 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం: వివిధ దశల్లో ఉన్న, పూర్తయ్యే దశలో ఉన్న ఆ ఇళ్లకు డబ్బులుకూడా ఇవ్వడంలేదు. స్కూళ్లు, ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు గురించి అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క మాటకూడా మాట్లాడలేదు: ఆ 17 మెడికల్‌ కాలేజీలను ఏంచేస్తారో చెప్పడంలేదు : ఆరోగ్యశ్రీకి రూ.3,150కోట్లు బకాయిలు పెట్టారు: బకాయిలు ఇవ్వకపోతే అగ్రిమెంట్లు చేయబోమని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు అల్టిమేటం ఇస్తున్నాయి. తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ప్రతి జంట కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని చంద్రాబు కనమంటున్నాడు: చంద్రబాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చనిపోతున్నారు. స్కూళ్లలో, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం కూడా పెట్టలేకపోతున్నాడు. పరిశుభ్రమైన తాగునీరు, కలుషిత ఆహారం వల్ల పిల్లలు చనిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మంచి చదువు ఇవ్వకుండా, మంచి వైద్యం ఇవ్వకుండా, ఉద్యోగ కల్పన చేయకుండా, ఎడాపెడా పిల్లల్ని కనమంటున్నాడు. పెళ్లిచేసుకున్న ప్రతి జంటకూ చంద్రన్నపెళ్లికానుక కింద రూ. 1లక్ష ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు. ఇప్పటివరకూ ఒక్క జంటకూ ఒక్కరూపాయి ఇచ్చింది లేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ డైవర్షన్‌ పాలిటిక్స్ కాదా? మహిళల జోలికి వస్తే, తాటతీస్తానని చంద్రబాబుగారు డైలాగులు మీద డైలాగులు చెప్తున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాడు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు? KGBV మహిళా ప్రిన్సిపల్‌ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌మీద చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు? హిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్‌ చేసిన గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌మీద ఏం చర్యలు తీసుకున్నారు? టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడితే, ఈ చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు? మంత్రి సంధ్యారాణి పీఏ మీద చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు? బాధితురాలిమీదే తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపారు ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌, ఒక మహిళను మోసంచేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయారు,అయినా చంద్రబాబు ఏం చేశాడు తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖరాసింది: దేవుడిపట్ల భయం, భక్తి, నిష్ట కలిగినవారే, టీటీడీ ఛైర్మన్‌లాంటి పోస్టులో పెట్టాలని తెలిసికూడా, చంద్రబాబునాయుడు బి.ఆర్‌.నాయుడికే అప్పగించాడు. దేవుడిగురించి, పవిత్రత గురించి, ఆడవాళ్ల గురించి, వారి రక్షణ గురించి మాట్లాడేది? వీళ్లకి అసలు ఆ అర్హత ఉందా? ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్దలేదు తిరుపతి, సింహాచలం, పలాసలో భక్తులు చనిపోయినా ఏం చర్యలు తీసుకున్నారు: కదిరి రథోస్త్సవంలో భక్తులు గాయపడ్డారు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగింది చివరకు తిరుమలకు సప్లై అయిన నెయ్యి వ్యవహారంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు కూడా చెప్పలేదు. ఇందాపూర్‌ డెయిరీ - హెరిటేజ్‌ మధ్య సంబధాల గురించి నిలదీశాం. సమాధానం చెప్పలేదు. సంగం-వైష్ణవిల మధ్య సంబంధాల గురించి ప్రశ్నించాం. కాని నోరుమెదపలేదు. నెయ్యిపై దుమారం రేపుతూ మరోవైపు భయంకరమైన స్కాంకు పాల్పడుతున్నారు. తిరుమలకు సప్లై అవుతున్న నెయ్యి టెండర్ల డాక్యుమెంట్లు చూస్తే ఇప్పటివరకూ రూ.200 కోట్ల స్కాం బయటపడుతోంది. ఉద్దేశ పూర్వకంగానే ఏడాది కాలంలో కేజీ నెయ్యిరేటు రూ.351 నుంచి రూ.716కు పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్లారు: తిరుమల హుండీ డబ్బు లెక్కించే పరకామణి నుంచి ఏకంగా కోటి రూపాయలు విలువైన బంగారాన్ని చోరీ అయ్యింది: చంద్రబాబుగారి హయాంలో ఘోరమైన తప్పు జరిగింది: దొంగకు దగ్గరుండి బెయిల్‌ ఇప్పించి, మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మా హయాంలో రూ.75వేల విలువ చేసే డాలర్‌ నోట్లు దొంగతనం జరిగితే, రూ.15కోట్ల విలువైన ఆస్తులు టీటీడీకి రాయించారు. కాని, కోటి రూపాయల విలువైన బంగారం చోరీచేస్తూ పట్టుబడితే ఆ కేసును బయటకు రానీయకుండా గూడుపుఠాణీ చేసి, తొక్కిపెట్టారు. జనవరి, 2025లో పరకామణిలో బంగారం దొంగతనాన్ని దాచిపెట్టిట్టారు: ఉద్దేశ పూర్వకంగా 2023లో జరిగిన వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారు: రూ.75వేల విలువైన అమెరికన్‌ డాలర్ల చోరీ జరిగితే, మా హాయంలో గుడికి రూ.15కోట్లు విలువైన ఆస్తులు రాయించాం: 2025 జనవరి నాటి భారీ దొంగతనాన్ని, మహాపచారాన్ని దాచిపెట్టేందుకు 2023 నాటి వ్యవహారాన్ని 2025 సెప్టెంబరు నుంచి తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు: నెయ్యి వ్యవహారంలో కూడా అంతే : టెండర్లు ఖరారైందీ, సప్లై జరిగిందీ, టెస్టుల్లో ట్యాంకర్లు ఫెయిల్‌ అయ్యిందీ, వాటిని రిజెక్ట్‌ చేసిందీ, రిజెక్ట్‌ చేసిన ట్యాంకర్లు మళ్లీ లడ్డూ ప్రసాదంలోకి వెళ్లిందీ చంద్రబాబు హయాంలోనే: ఇది తెలిసికూడా, తప్పు తానుచేసి సెప్టెంబరు18, 2024న వైయస్సార్‌సీపీ మీదకు చంద్రబాబు నెట్టేశాడు: చంద్రబాబుగారు కుట్రలుమీద కుట్రలు చేశారు #👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్
👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - " ಐಎಸ ಜ೧ನ మీట్: హైలైట్స్ ప్రెస్ 00 ಐಎಸ ಜ೧ನ మీట్: హైలైట్స్ ప్రెస్ 00 - ShareChat
#👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్
👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - ShareChat
00:34
#👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్
👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - ShareChat
00:28
#👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్
👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - ShareChat
01:05
#👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్
👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - ShareChat
00:45
#👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్
👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - ShareChat
00:48
#👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్
👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - ShareChat
00:49
#👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్
👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - ShareChat
00:34
#👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్
👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - ShareChat
00:48