#భగవత్గీత పారాయణ ఫలం 🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #సర్వ శ్రేయస్కరం విష్ణు సహస్రనామ పఠనం #శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం 🕉️🙏🙏🙏 #పాపవిమోచని ఏకాదశి / పాప నాశని ఏకాదశి 🕉️🙏
*శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం*
*ఈరోజు పాపవిమోచనీ ఏకాదశి సందర్భంగా...*
_భగవద్గీత పారాయణం మరియు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి..._
భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా గీతా పఠన మహాత్మ్యాన్ని భూదేవికి వివరించాడు. గీతా పఠనం వలన పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమ గతిని పొందుతారు.
మానవజన్మ కర్తవ్యం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థ పరచక భగవత్ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసికోవాలి. ఈ స్వల్పమైన జీవితకాలంలో మానవుడు, సత్ప్రవర్తనపరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. సృష్టికర్తయైన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది. అలాగే సృష్టిలో జన్మించిన ప్రతిజీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు. అన్ని రూపాలు అతనివే. భగవంతుని ఏ రూపంలోనైన ఆరాధించవచ్చును.
⚜️ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు పారాయణం ప్రతి రోజు చెయ్యడం వలన అద్భుతాలు జరుగుతాయి.
⚜️ మహా విష్ణు దేవతలందరి లో ఉత్తమోత్తమైన దేవుడు.. సర్వోపగతుడు. ఇందు లేడందు సందేహమ్ము వలదు..చక్రీ సర్వోపగతుండు.ఆ దేవాది దేవుడినుండే అన్ని దేవతల సాక్షాత్కారము జరుగును.
⚜️ ప్రతి రోజు విష్ణు నామ పారాయణం జపం చేసినట్టయితే.. జీవితంలో ఉన్నత స్తానానికి చేరుకోవచ్చు. అదృష్ఠం కలుగుతుంది.. రాజ యోగం కలుగుతుంది.
⚜️ పితృ దోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఇతి బాధలు కనుమరుగవుతాయి.
⚜️ జ్ఞానానికి మోక్షానికి దగ్గర దారి శ్రీ మహా విష్ణు ఆరాధన. ఏవరైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయనం గావిస్తారో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోణ్ముక్తుడిని చేస్తుంది.
⚜️ మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం.
⚜️ ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది.
⚜️ ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంత: శతృవులు నశిస్తారు.
⚜️ శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం వల్ల నవ గ్రహ దోషాలు తొలగి, వాక్షుద్ది కలుగుతుంది. జ్ఞానం వృద్ది నొందుతుంది.తద్వారా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది. ......
⚜️ జీవిత సత్యాన్ని భోధ పరుస్తుంది...
పారాయణం అనంతరం మీ పేరు, చిరునామా ఫోన్ నంబర్ మా వాట్సాప్ నెంబర్ +919700722711 కు మెసేజ్ చేయగలరు.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
#విష్ణు సహస్రనామా ఫలితం #శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం 🕉️🙏🙏🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #సర్వ శ్రేయస్కరం విష్ణు సహస్రనామ పఠనం #భగవత్గీత
*శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం*
*ఈరోజు పాపవిమోచనీ ఏకాదశి సందర్భంగా...*
_భగవద్గీత పారాయణం మరియు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి..._
భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా గీతా పఠన మహాత్మ్యాన్ని భూదేవికి వివరించాడు. గీతా పఠనం వలన పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమ గతిని పొందుతారు.
మానవజన్మ కర్తవ్యం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థ పరచక భగవత్ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసికోవాలి. ఈ స్వల్పమైన జీవితకాలంలో మానవుడు, సత్ప్రవర్తనపరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. సృష్టికర్తయైన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది. అలాగే సృష్టిలో జన్మించిన ప్రతిజీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు. అన్ని రూపాలు అతనివే. భగవంతుని ఏ రూపంలోనైన ఆరాధించవచ్చును.
⚜️ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు పారాయణం ప్రతి రోజు చెయ్యడం వలన అద్భుతాలు జరుగుతాయి.
⚜️ మహా విష్ణు దేవతలందరి లో ఉత్తమోత్తమైన దేవుడు.. సర్వోపగతుడు. ఇందు లేడందు సందేహమ్ము వలదు..చక్రీ సర్వోపగతుండు.ఆ దేవాది దేవుడినుండే అన్ని దేవతల సాక్షాత్కారము జరుగును.
⚜️ ప్రతి రోజు విష్ణు నామ పారాయణం జపం చేసినట్టయితే.. జీవితంలో ఉన్నత స్తానానికి చేరుకోవచ్చు. అదృష్ఠం కలుగుతుంది.. రాజ యోగం కలుగుతుంది.
⚜️ పితృ దోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఇతి బాధలు కనుమరుగవుతాయి.
⚜️ జ్ఞానానికి మోక్షానికి దగ్గర దారి శ్రీ మహా విష్ణు ఆరాధన. ఏవరైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయనం గావిస్తారో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోణ్ముక్తుడిని చేస్తుంది.
⚜️ మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం.
⚜️ ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది.
⚜️ ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంత: శతృవులు నశిస్తారు.
⚜️ శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం వల్ల నవ గ్రహ దోషాలు తొలగి, వాక్షుద్ది కలుగుతుంది. జ్ఞానం వృద్ది నొందుతుంది.తద్వారా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది. ......
⚜️ జీవిత సత్యాన్ని భోధ పరుస్తుంది...
పారాయణం అనంతరం మీ పేరు, చిరునామా ఫోన్ నంబర్ మా వాట్సాప్ నెంబర్ +919700722711 కు మెసేజ్ చేయగలరు.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
#ఏకాదశి వ్రత మహత్యం / ఏకాదశి వ్రత మహిమ 🪔🔱🕉️🙏 #ఏకాదశి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #పాపవిమోచని ఏకాదశి / పాప నాశని ఏకాదశి 🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత
*పాపమోచనీ ఏకాదశి*
*ఏకాదశీ వ్రత మహిమ*
పాపమోచనీ ఏకాదశీ మహిమ శ్రీకృష్ణయుధిష్ఠిర సంవాద రూపంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది.
ఒకసారి ధర్మరాజు కృష్ణునితో పలుకుతూ “కృష్ణా! ఆమలకీ ఏకాదశీ మహిమను నీవు ఇదివరకే వివరించావు. అయితే ఇపుడు వచ్చే ఏకాదశిని గురించి వివరించవలసింది. ఆ ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని, దాని ఫలితాన్ని నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను” అని అన్నాడు. అపుడు శ్రీకృష్ణుడు దానికి ప్రత్యుత్తరంగా పలుకుతూ “రాజోత్తమా! ఆ ఏకాదశి పేరు పాపమోచనీ, దాని మహిమను ఇపుడు విను. అతిపురాతన కాలంలో ఈ ఏకాదశీ మహిమను లోమశముని మాంధాతకు వివరించాడు. ఈ ఏకాదశి సకల పాపాలను హరిస్తుంది. జీవుని పిశాచ జీవనాన్ని నశింపజేస్తుంది, అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది” అని అన్నాడు.
లోమశముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవతల కోశాధిపతియైన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథం. నిత్యవసంతఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నరులు వంటివారు అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడ అక్కడకు వచ్చి విహరించేవారు. అదే వనంలో మేధావి అనే శివభక్తుడు తపస్సు చేస్తుండేవాడు. ఒకసారి అప్సరసలు ఆయన నిష్ఠను భంగపరచడానికి ప్రయత్నించారు. వారిలో మంజుఘోష అనే అప్సరస మునిమనస్సును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తియ్యని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని అలదుకొని, మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తియ్యగా పాడుతున్న మంజుఘోషను చూసి శివవైరియైన మన్మథుడు కూడ మునిని జయించడానికి యత్నించాడు. పూర్వం ఒకసారి శివుడు మన్మథుని కాల్చి భస్మం చేశాడు. పూర్వశత్రుత్వాన్ని గుర్తు చేసికొనినవాడై మన్మథుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన మునిమనస్సులో ప్రవేశించాడు. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చ్యవనఋషి ఆశ్రమంలో వసిస్తున్న మేధావి ఋషి అపుడు రెండవ మన్మథునిగా గోచరించాడు. అపుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడ కామపీడితుడై తన దైవాన్ని మరిచాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనితాసాంగత్యంలో మునిగిపోయాడు. అనేకసంవత్సరాలు గడిచాయి.
ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొంది. అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. అపుడు మేధావి ఆమెతో "రమణీ! నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో" అని అన్నాడు. మునికి భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్సరస యాభైఏడు సంవత్సరాల తొమ్మిది నెలల మూడు రోజులు మునితో గడిపినప్పటికిని అదంతా కేవలం ఒక రాత్రిలో సగభాగం వలెనే తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. కాని ఈ సారి ముని ఆమెతో "రమణీ! నా మాటలు విను. ఇది కేవలం ప్రాతఃసమయం. నేను ప్రాతః కాలవిధులు పూర్తి చేసేంతవరకు ఇక్కడే ఉండు" అని అన్నాడు. అపుడు అప్సరస నవ్వి “మహర్షీ! మీ ప్రాతఃకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు అనేక సంవత్సరాలు గడిపారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి” అని అన్నది. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. అపుడు ఆ ఋషి “సుందరీ! యాభైఏడేళ్ళ విలువైన కాలాన్ని నేను వృథా చేశాను. నీవే నా సమస్తాన్నీ, తపస్సును నాశనం చేశావు" అని అంటూనే ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ “నీవు మంత్రకత్తె, పిశాచిలాగా ప్రవర్తించావు. కాబట్టి పిశాచిలాగా మారిపో. పాపిష్ఠిదానా! సిగ్గు సిగ్గు” అని అన్నాడు.
మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో “ఓ బ్రాహ్మణోత్తమా! దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేకసంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని. నా మీద దయ చూపించు” అని అన్నది. ఆమె మాటలను వినిన మేధావి అపుడు ఆమెతో "సౌమ్యురాలా! నేనేం చేసేది? నీవు నా తపస్సంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి నేను చెబుతాను, చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచనీ ఏకాదశి. అది సకలపాపహరం. నీవు ఆ ఏకాదశివ్రతాన్ని పాటిస్తే నీ పిశాచజీవనం పోతుంది” అని పలికాడు. తరువాత మేధావి తన తండ్రి చ్యవనఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. పతితుడైన తన పుత్రుని చూసి చ్యవనఋషి అతిదుః ఖితుడై “అయ్యో! నీవెంత పనిచేశావు! సాధారణమైన వనితకు ఆకర్షితుడవై తపస్సంపదను నష్టపరచడం నీకు తగనే తగదు" అని అన్నాడు. అపుడు మేధావి పలుకుతూ "తండ్రీ! దురదృష్టవశాత్తు నేను అప్సరససాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను. కాబట్టి నాకు పాపపరిహారాన్ని తెలియజేయండి” అని అర్థించాడు. కుమారుడి దీనాలాపన వినిన చ్యవనఋషి అపుడు మార్గోపదేశం చేస్తూ "పుత్రా! పాపమోచని ఏకాదశీ వ్రతపాలన వలన సమస్తపాపాలు నశిస్తాయి. కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు” అని అన్నాడు. తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశీ వ్రతపాలనకు సిద్ధపడ్డాడు. తరువాత ఆ ఏకాదశి వ్రతవిధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోయాయి, అతడు కూడ పరమభాగ్యవంతుడయ్యాడు. మంజుఘోష కూడ పాపమోచనీ ఏకాదశీ పాలన ద్వారా పిశాచరూపం నుండి బయటపడి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది.
మాంధాతకు ఈ కథను వివరించిన లోమశముని చివరిగా పలుకుతూ "రాజా! ఈ పాపమోచనీ ఏకాదశీ వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రతమాహాత్మ్యాన్ని చదవడం వలన, వినడం వలన సహస్ర గోదానఫలం లభిస్తుంది. ఈ వ్రతపాలన ద్వారా బ్రహ్మహత్యాపాతకం, భ్రూణహత్యాపాతకం, మదిరాపాన పాతకం, గురుపత్ని సంగమపాతకం వంటి సకలపాపాలు సమూలంగా నశిస్తాయి” అని అన్నాడు.
సారాంశమేమనగా ఈ ఏకాదశి పరమమంగళకరమైనది, సకల పాపహరమైనది కాబట్టి ప్రతియొక్కరు శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలి.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
#పాపమోచని(విమోచన)ఏకాదశి శుభాకాంక్షలు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #పాపమోచని ఏకాదశి శుభాకాంక్షలు #పాపవిమోచని ఏకాదశి / పాప నాశని ఏకాదశి 🕉️🙏
*పాపవిమోచని ఏకాదశి*
*మార్చి 15 ఆదివారం పాపవిమోచన ఏకాదశి సందర్భంగా...*
హిందూ పంచాంగ ప్రకారం ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మాసంలో శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో ఏకాదశి వస్తుంది. ఇలా సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఉగాదికి ముందు ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశినే పాపవిమోచని ఏకాదశి అంటారు. దీనినే పాప నాశని ఏకాదశి అని కూడా అంటారు. అంటే పాపాలను తొలగించే ఏకాదశి అని అర్ధం. దీని వెనక ఒక కథ ఉంది. పూర్వం మేధావి అనే మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడి ఆదేశానుసారం మంజుఘోష అనే అప్సరస తన నాట్యంతో ఆయనకు విఘ్నం కలిగించిందంట. ఆమె నాట్యానికి చలింలిచిన మేధావి తన తపస్సుకి విఘ్నం కలిగించిందన్న ఆగ్రహంతో ఆ మంజుఘోషకి రాక్షస రూపం కలుగాలని శపించారట. ఆమె రాక్షసి అయిపోయింది. తిరిగి ఆయన తపస్సులో లీనమయ్యాడు. ఆమె ఆయనకోసం ఎదురుచూస్తూ కూర్చుందట. ఆయన తపస్సు పూర్తయ్యాక ఆమె ప్రార్ధిస్తే మేధావి అనుగ్రహించి ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథినాడు ఉపాసన చేసి శ్రీమన్నారాయణమూర్తిని అర్చిస్తే రాక్షస రూపం పోయి, తిరిగి నీ అప్సరస రూపం పొందుతావు అని శాప విమోచన మార్గాన్ని చెప్పారు. ఆయన సూచన మేరకు మంజుఘోష ఏకాదశి వ్రతం ఆచరించి తన పూర్వ స్వరూపాన్ని పొందింది. చేసిన పాపాలను తొలగించినందున ఈ ఏకాదశిని పాపవిమోచని ఏకాదశి అని అన్నారు. పాపమను అంకుశమువలె మన మనస్సును నియంత్రిచేది కనక ఈ ఏకాదశిని పాపాంకుశ ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజున ఏకాదశి వ్రతం పాటిస్తే తప్పక ఫలితం లభిస్తుందని పురాణాలు సైతం చెబుతున్నాయి.
పాప మోచని ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీమహా విష్ణువు ఆలయానికి వెళ్లి ఆరాధించాలి. స్వామి వారికి ఈరోజు పసుపు రంగు దుస్తులను అర్పించాలి. దీని తర్వాత 11 పసుపు పువ్వులు, 11 రకాల తీపి పదార్థాలను స్వామికి అర్పించాలి. అనంతరం విష్ణువు నామాలను, మంత్రాలను జపించాలి. అదే విధంగా ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధిస్తే పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్పినట్టు పురాణ వచనం. అంతేకాకుండా ఈ వ్రతం ఆచరించిన వారికి మోక్షం కూడా లభిస్తుందట.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
#పూరీథామ్ - శ్రీక్షేత్రం - పూరీ జగన్నాథ్ స్వామి క్షేత్రంలో జరుగు ఉత్సవాలు (puri utsavs)🛕🙏 #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #పూరీ జగన్నాథ్ మహాప్రభు టెంపుల్ రహస్యం #పూరీ జగన్నాధ్ స్వామి ఇప్పటికీ అంతుచిక్కని ఆలయ విశేషాలు
*ଶ୍ରୀନୀଳଚକ୍ରେ ନିତ୍ୟ ନୂତନ ଅଦ୍ୟ ପତିତପାବନ ଧ୍ଵଜା ପରିବର୍ତ୍ତନ🙏* *Today the sacred Patitapabana flag was newly changed on the holy Nilachakra🙏*
#పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #పూరీ జగన్నాథ్ మహాప్రభు టెంపుల్ రహస్యం #పూరీ జగన్నాధ్ స్వామి ఇప్పటికీ అంతుచిక్కని ఆలయ విశేషాలు
*ଶ୍ରୀନୀଳଚକ୍ରେ ନିତ୍ୟ ନୂତନ ଅଦ୍ୟ ପତିତପାବନ ଧ୍ଵଜା ପରିବର୍ତ୍ତନ🙏* *Today the sacred Patitapabana flag was newly changed on the holy Nilachakra🙏*
#పూరీ జగన్నాధ్ స్వామి ఇప్పటికీ అంతుచిక్కని ఆలయ విశేషాలు #పూరీ జగన్నాథ్ మహాప్రభు టెంపుల్ రహస్యం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత
*ଶ୍ରୀନୀଳଚକ୍ରେ ନିତ୍ୟ ନୂତନ ଅଦ୍ୟ ପତିତପାବନ ଧ୍ଵଜା ପରିବର୍ତ୍ତନ🙏* *Today the sacred Patitapabana flag was newly changed on the holy Nilachakra🙏*
#ఈరోజు గ్రహం - అనుగ్రహం నేటి పంచాగం 🌞 రాశి ఫలాలు #శుభ సుముహూర్తం 🕉️ శుభ సమయం # పంచాంగం #శుభ పంచాంగం #*♎నేటి రాశి ఫలితాలు♎
నేటి పంచాంగం
ఆదివారం,మార్చి.15,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయన-శిశిరఋతువు
ఫాల్గుణమాసం-బహుళపక్షం
తిథి:ఏకాదశి ఉ7.16 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:శ్రవణం తె4.24 వ!!
యోగం:పరిఘము ఉ9.03
కరణం:బాలువ ఉ7.16 వరకు తదుపరి కౌలువ సా6.55 వరకు
వర్జ్యం:ఉ7.15 - 8.56
దుర్ముహూర్త:సా4.30-5.18
అమృతకాల:సా5.24-7.06
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యోదయం:6.13 సూర్యాస్తమయం:6.06
#ధర్మ ధ్వజం (చాణక్య నీతి) #చాణిక్య నీతి వాక్యాలు #ఆచార్య చాణిక్య నీతి #చాణిక్య నీతి #✍️చాణిక్య నీతి
*🔔 _శుభోదయం_ 🔔*
*_బంధాలను కాపాడుకోవటానికి ఒక మెట్టు దిగి ఆలోచించు._*
*_అర్ధం చేసుకున్నవారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
#🌅శుభోదయం #✍️కోట్స్ #తెలుగు కొట్స్... ✍️ #📝బెస్ట్ కోట్స్👌 #😊పాజిటివ్ కోట్స్🤗
*🔔 _శుభోదయం_ 🔔*
*_బంధాలను కాపాడుకోవటానికి ఒక మెట్టు దిగి ఆలోచించు._*
*_అర్ధం చేసుకున్నవారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞









![ధర్మ ధ్వజం (చాణక్య నీతి) - ವಾಣಣ್ಯೆ ನಖ గతానుగతికో లోకః: అందరూఒకరుఏదిచేస్తే ವೆನ್ತಾ ] ఉంటారు ಅ೦ (జనంగొల్ెలమంద) |88,880 #ధర్శధ్ృజం పోస్టెలు మీరు వ్యక్తిగతంగా పొందడానికి 9111666766 "Jai Shree Ram" అని వాట్సప్ద్ారా మెసేజీ పంపండి ವಾಣಣ್ಯೆ ನಖ గతానుగతికో లోకః: అందరూఒకరుఏదిచేస్తే ವೆನ್ತಾ ] ఉంటారు ಅ೦ (జనంగొల్ెలమంద) |88,880 #ధర్శధ్ృజం పోస్టెలు మీరు వ్యక్తిగతంగా పొందడానికి 9111666766 "Jai Shree Ram" అని వాట్సప్ద్ారా మెసేజీ పంపండి - ShareChat ధర్మ ధ్వజం (చాణక్య నీతి) - ವಾಣಣ್ಯೆ ನಖ గతానుగతికో లోకః: అందరూఒకరుఏదిచేస్తే ವೆನ್ತಾ ] ఉంటారు ಅ೦ (జనంగొల్ెలమంద) |88,880 #ధర్శధ్ృజం పోస్టెలు మీరు వ్యక్తిగతంగా పొందడానికి 9111666766 "Jai Shree Ram" అని వాట్సప్ద్ారా మెసేజీ పంపండి ವಾಣಣ್ಯೆ ನಖ గతానుగతికో లోకః: అందరూఒకరుఏదిచేస్తే ವೆನ್ತಾ ] ఉంటారు ಅ೦ (జనంగొల్ెలమంద) |88,880 #ధర్శధ్ృజం పోస్టెలు మీరు వ్యక్తిగతంగా పొందడానికి 9111666766 "Jai Shree Ram" అని వాట్సప్ద్ారా మెసేజీ పంపండి - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_241305_1ff3c199_1773553240049_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=049_sc.jpg)
