JanaSena Party Telangana
ShareChat
click to see wallet page
@politicals
politicals
JanaSena Party Telangana
@politicals
Pawan Kalyan
ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి * రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి ముందుకు వెళ్తున్నాం * నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో అలసత్వం వద్దు * క్షేత్ర స్థాయిలో ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి * ఉదాసీనత వీడండి.. పారదర్శకతే మా విధానం * మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘కూటమి ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిబద్ధతతో పని చేస్తోంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి అనుభవం మార్గదర్శకాలుగా ముందుకు వెళ్తున్నాం. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాల్సిన అవసరం ఉంద’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. నాలుగు గోడల మధ్య మంత్రులు, ఉన్నతాధికారులు తీసుకునే ప్రజోపయోగ నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అర్ధవంతంగా అందాలంటే అంతా సమష్టిగా పనిచేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, శాఖల కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడటం లేదు. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసే ప్రతి రూపాయి విలువైనదే. పెట్టే ఖర్చు, దానివల్ల అందే ప్రయోజనం ప్రజలకు ఉపయోగపడేలా క్షేత్రస్థాయి సిబ్బంది పని చేయాలి. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. •రూ.వేల కోట్ల పనులను మొదలుపెట్టాం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన మీద దృష్టిపెట్టాం. దీనిలో భాగంగా మొదటి విడత పల్లె పండుగ కార్యక్రమం కింద రూ.2,500 కోట్లు, పల్లె పండుగ 2.0 కింద రూ.5,700 కోట్లు ఖర్చు చేశాం. గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపర్చే కార్యక్రమం ‘అడవి తల్లి బాట’ పథకం కింద రూ.1005 కోట్లను వెచ్చించాం. దీంతోపాటు సాస్కీ నిధులు రూ.2,123 వేల కోట్లతో నియోజక వర్గాల్లో ప్రాధాన్యతను బట్టి పనులు చేస్తున్నాం. మొత్తంగా రూ.11,328 కోట్లతో చేస్తున్న పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ పథకం కింద రూ.28 వేల కోట్ల పనులకు అనుమతులు లభిస్తే, దానిలో రూ.10 వేల కోట్ల పనులను ప్రారంభించాం. ఇక అటవీ శాఖ పరిధిలో రూ.200 కోట్లతో నగరవనాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా అనేక పనులను పారదర్శకంగా క్రమపద్ధతిలో, ప్రాధాన్యతలను అనసరించి చేస్తున్నాం. •నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలి అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతో పనులను క్రమపద్ధతిలో చేస్తున్నాం. మొదలుపెట్టిన పనులను ఓ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి. నిర్దేశిత సమయంలో పనులను పూర్తి చేయడం అవసరం. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రభుత్వం అప్పగించిన పనిని నిబద్ధతతో నిజాయతీగా పూర్తి చేయండి. ప్రభుత్వ నిర్ణయాల అమలు, పనులు జరుగుతున్న తీరు విషయంలో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. దీనిని అధిగమించాలి. ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి పనుల పూర్తి విషయంలో దిశానిర్దేశం చేయాలి. నిర్ణయాలను అమలు చేసే బృహత్తర బాధ్యతలు క్షేత్రస్థాయి సిబ్బంది మీదనే ఉన్నాయి. దాన్ని సరైన రీతితో నిర్వర్తించండి. ప్రభుత్వం మీకు తగిన విధంగా సహకరిస్తుంది’’ అన్నారు. # #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟥జనసేన #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🏛️రాజకీయాలు
🟡తెలుగుదేశం పార్టీ - S5 ஒaeo {ttಯgನ 5ত= 4.3 రి, 2026 SINIMAAN S5 ஒaeo {ttಯgನ 5ত= 4.3 రి, 2026 SINIMAAN - ShareChat
https://youtube.com/watch?v=V2Mfj9VOmxk&si=-rjt5tHMAzJFVWth # #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🗞పాలిటిక్స్ టుడే #🆕Current అప్‌డేట్స్📢
youtube-preview
కృతజ్ఞతాపూర్వక హృదయాలతో, గజ్జలవారిపల్లి పాఠశాల విద్యార్థులు మరియు గ్రామస్తులు తమ విన్నపాన్ని ఆలకించి, తక్షణమే చర్య తీసుకున్నందుకు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ₹86 లక్షల వ్యయంతో 1.6 కిలోమీటర్ల రహదారి మంజూరు కావడంతో, వారి దైనందిన కష్టాలు ఆశగా మారాయి. ఈ పిల్లలకు, పాఠశాలకు వెళ్లే ప్రయాణం ఇప్పుడు మరింత సురక్షితంగా మరియు ఉజ్వలంగా మారింది. 🙏 #PawanKalyan #PawanKalyanAneNenu # #🐈బుజ్జి పిల్లులు🐱 #👬 Friends forever 🤝 #🙏Thank you😊 #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్
🐈బుజ్జి పిల్లులు🐱 - $ ಣಗಯಿ 55 MLA $ ಣಗಯಿ 55 MLA - ShareChat
ఏళ్లుగా ఇబ్బందులు, ట్రాఫిక్‌తో నడిచిన సింగరాయకొండ మెయిన్ రోడ్ ఇప్పుడు అభివృద్ధి దిశగా శరవేగంగా ముందుకు సాగుతోంది. ❤️ #PawanKalyan #AndhraPradesh #JanasenapartyTelangana #Nagababu #giritelangana # #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #🗞పాలిటిక్స్ టుడే #🏛️రాజకీయాలు #🥳Celebrations Video🎆
✡జనసేనాని పవన్ కళ్యాణ్ - ShareChat
00:42
https://youtube.com/watch?v=E7ioImFDQW8&si=rR2VR1VJV2xSiEqL # #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #👊పొలిటికల్ ఫైట్స్🎤 #✋బీజేపీ🌷 #🆕Current అప్‌డేట్స్📢
youtube-preview
https://youtube.com/watch?v=ZjnTLRmL7lY&si=wsRCWDm4KwASijj9 # #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #🟡తెలుగుదేశం పార్టీ #🗞పాలిటిక్స్ టుడే #🏛️రాజకీయాలు
youtube-preview
విద్యార్ధుల వేదన కదిలించింది •సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప ముఖ్యమంత్రి •తక్షణమే గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు •రోడ్డు కావాలని ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ను కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన గజ్జలవారిపల్లి విద్యార్ధులు పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో లో పెట్టిన వీడియో సందేశం శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరనున్నాయి. •ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో రూ. 55 కోట్లతో రోడ్లు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు సాస్కీ నిధులతో సుమారు రూ. 55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0లో రూ. 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కీ నిధులతో మరో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. సాస్కీ నుంచి మొత్తం రూ. 9 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈ రోజు గజ్జలవారిపల్లి విద్యార్థుల అభ్యర్ధనతో ఉప ముఖ్యమంత్రి ఆదేశంతో ఈ రోడ్డును అదనంగా మంజూరు చేశారు. @AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😥ఎమోషనల్ స్టేటస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🙏Thank you😊
🟥జనసేన - ShareChat
00:13
https://youtube.com/watch?v=t2sHM0y7LOk&si=dDdTH_uT8KaT2otX # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్ #✨మ్యాజిక్ జంక్షన్✨ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵
youtube-preview
జగన్ రెడ్డి పాల్పడిన తిరుమల కల్తీ లడ్డూల కుంభకోణంపై యావత్ జాతీయ మీడియా పూర్తిగా దృష్టి సారించింది... అర్నబ్ నేరుగా జగన్ రెడ్డిపై దాడి చేస్తూ, "నువ్వు ఒక క్రైస్తవుడివి, హిందువుల మనోభావాలపై దాడి చేశావు" అని అన్నాడు. #TirumalaLaddu #NoGheeInTTDLaddu #SanatanaDharmaRakshaBoard #ArnabGoswami #PawanKalyan #AndhraPradesh #JanasenapartyTelangana #BJP #TDP #📽ట్రెండింగ్ వీడియోస్📱 #✋బీజేపీ🌷 #🟡తెలుగుదేశం పార్టీ #🟥జనసేన #👊పొలిటికల్ ఫైట్స్🎤
📽ట్రెండింగ్ వీడియోస్📱 - ShareChat
01:43