#తిరుమల లడ్డు
వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచాడు !
అసలు ఇది కనీవినీ ఎరగని దిమ్మతిరిగే మోసం .
2014 నుండి 2019 వరకూ తిరుమల దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసింది ఎవరో తెలుసా ?
చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ .. ఈ విషయం ఎక్కడా బయటకి పొక్కకుండా ఇన్ని రోజులు బ్రహాండంగా మేనేజ్ చేసారు .
హెరిటేజ్ సంస్థకి దేశవ్యాప్తంగా మొత్తం 22 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి ..
ఆ 22 లో ఒకానొక యూనిట్ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ..దీనిని మహారాష్ట్ర అడ్రస్ తో రిజిస్టర్ చేసారు .
హెరిటేజ్ వెబ్సైట్స్ ఒకసారి చూడండి .
heritagefoods.in/diary/manufact…
ఫోటోలు - 1,2,3,4 చూడండి .
ఈ ఇందాపూర్ ( హెరిటేజ్ మహారాష్ట్ర యూనిట్ ) పేరుమీద 2014 నుండి 2019 వరకూ అత్యధికంగా నెయ్యి సరఫరా చేసారు .. అది కూడా అతి తక్కువ ధరకే ..
2015 లో 306 రూపాయలకి ..
2016 లో 278 రూపాయలకే ...
ఒక్కోసారి ఒక్కోరకంగా టెండర్లు వేశారు . పోటీ దారులుంటే ఒకరకంగా .. పోటీ దారులు లేకపోతే ఇంకో రకంగా టెండర్లు వేసి 2014 నుండి 2019 వరకూ ఐదేళ్లు ఏకధాటిగా విజయవంతంగా టెండర్లు దక్కించుకున్నారు .
*** ఇదే ఇందాపూర్ ( హెరిటేజ్ ) జగనమోహనరెడ్డి సీఎం అవ్వగానే సరఫరా ఆపేసింది ***
హెరిటేజ్ షాపులో నెయ్యి ఎంతకీ అమ్ముతున్నారు ? లీటర్ 600 రూపాయలకి పైనే వాళ్ళ సొంత షాపులో అమ్ముతూ ... అదే హెరిటేజ్ వాళ్ళ మహారాష్ట్ర యూనిట్ అయిన ఇందాపూర్ నుండి 278 రూపాయలకి కొన్ని లక్షల లీటర్ల నెయ్యిని తిరుమల దేవస్థానానికి ఎలా సరఫరా చేసారు ?
అంటే వాళ్ళు సరఫరా చేసింది అసలు నెయ్యేనా కాదా ?
మోసం చేయాలనే ఉద్దేశ్యంతోనే హెరిటేజ్ పేరుతో కాకుండా ఇందాపూర్ పేరుతో తిరుమలకి సరఫరా చేసారా ?
చంద్రబాబు అంటేనే మోసం .. ఇందాపూర్ మహారాష్ట్ర అంటే ఎవ్వరికీ అనుమానం రాదనే ఉద్దేశ్యంతోనే .. ఈ టక్కుటమారా విద్యలు ప్రదర్శించి రాష్ట్రం మొత్తాన్ని మోసం చేసారు .
ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ ఎలా టెండర్లు దక్కించుకుందో మొత్తం వివరాలు చూడండి .
-------------------------------
Tender: 06.10.2014
Board Approval: 15.01.2015
Quantity: 16,50,000 Kgs
Status: L2 Rs. 325.00
Supply Order: 5,77,500Kg (35%)
Price: Rs. 306.00 (L1 price)
-------------------------------
Tender: 25.11.2015
Board Approval: 30.01.2016
Quantity: 18,00,000 Kgs
Status: L3 Rs. 312.00
Supply Order: -NIL-
Price: Rs. 285.00 (L1 price)
Govind & Subhi కూడా మన Proxy అనే అనుమానాలున్నాయి.
------------------------
Tender: 20.01.2016
Board Approval: 18.03.2016
Quantity: 2,25,000 Kgs (Tins)
Status: Disqualified
Supply Order: -NIL-
Price: Rs. 306.00 (L1) Govind
Indapur existing supplier with 278.00👍
శాంపిల్ ల్యాబ్ టెస్టులో ఫెయిల్ అవ్వడమేంటి దొరా? అయినా పర్లేదు మన Govind L1👍
------------------------
Tender: 29.03.2016
Board Approval: 26.04.2016
Quantity: 20,00,000Kgs
Status: L2
Supply Order: NIL
Price: 332 L1 Premier
-------------------------
Tender: 30.08.2016
Board Approval: 20.09.2016
Quantity: 2,25,000Kgs Tins
Status: L2 405
Supply Order: NIL
Price: L1 376 Karnal Milk, Haryana
Karnal, Haryana first time entry; ఇదికూడా Premier & Indapur syndicate అని అనుమానం.
Heritage హర్యానా బ్రాంచ్ పేరు JAI AMBE MAA AGRO
---------------------------
Tender: 23.08.2018
Board Approval: 27.11.2018
Qnty: 9,50,000Kgs
Status: L1
Supply: 65% 6,17,500Kgs
Price: Rs. 321.00
Premier & Indapur quoted same price.
--------------------------------
Tender: 22.10.2018
Board Approval: 27.11.2018
Qnty: 85,00Kgs Tins
Status: L2 (325.00)
Supply: NIL
Price: 312.00 Salem Namakkal
---------------------------
Tender: 16.12.2019
Board Approval: 29.02.2020
Qnty: 11,50,000Kgs
Status: L2 (458) RA (459)
Supply: NIL
Price: 426.10
Indapur RAలొ participate చెయ్యలేదు; Premier Agriకి total quantity order ఇచ్చారు.
అప్పటి TTD Board note mention చేసారు
----------------------
Tender: 24.08.2022
Board Approval: 31.11.2022
Qnty: 10,00,000Kgs
Status: L2 616 (RA 499.80)
Supply: NIL
Price: L1 581 (RA 496.90) Malganga
-----------------------------
Tender: 04.03.2023
Board Approval: 19.06.2023
Qnty: 90,000KGs
Status: L7 593.67 RA Nil
Supply: NIL
Price: 578 (RA 421.75) Premier
----------------------
Tender: 04.10.2023
Board Approval: 26.12.2023
Qnty: 5,00,000Kgs
Status: L5 492 (RA denied)
Supply: NIL
Price: 535.35 (RA 428.08) Vyshnavi
Bad days are running for INDAPUR dairy.
------------------------
Tender: 01.08.2024
Board Approval: 18.11.2024
Qnty: 10,00,000Kgs
Status: L3 505 (No RA)
Supply: NIL
Price: 492.51 (RA 475.20) Alpha Milk Foods, Hathras, NewDelhi.
------------------------------
Tender: 12.11.2024
Board Approval: 18.11.2024
Qnty: 10,00,000Kgs
Status: L2 521.00
Supply: Nil
Price: L1 495 (KMF)
---------------------------------
Tender: 15.10.2025
Board Approval: 16.12.2025
Qnty: 10,00,000Kgs
Status: L1 658.00
Supply: 65% + 35% KMF
Price: 658.00
Premier Agri, Alpha Milk, Smriti, Govind & Subhi ఇవన్నీ syndicate అనే అనుమానం ఉంది వాళ్ళు quote చేసిన విధానం చూస్తుంటే.
*** ఈ మిగిలిన కంపెనీలు కూడా హెరిటేజ్ కి దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్స్ తో ఏమైనా లింకులున్నాయో తేలాల్సి ఉంది . ***
ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న కుట్రని బాగా గమనించండి .. ఇందులో రెండు ప్రయోజనాలున్నాయి .
1 - నెయ్యి కల్తీ పేరుతో జగనన్న మీదకి హిందువులని రెచ్చకొట్టాలి .
2 . అదే సమయంలో మిగిలిన అందరినీ హడల్ కొట్టి తన సొంత హెరిటేజ్ సంస్థకి దేశవ్యాప్తగా ఉన్న యూనిట్ల నుండి అత్యధిక ధరకి ఎవరూ పోటీకి కూడా రాకుండా చూసుకొని హెరిటేజ్ ఒక్కటే సరఫరా చేసేలా పన్నిన కుట్ర ఇది .
3 . తక్కువ రేట్ అయితే కల్తీ ఉంటుందని ముందు ప్రజలని నమ్మించి .. అప్పుడు కేజీని 700 రూపాయలకో 1000 రూపాయలకో పెంచి దోచుకోవాలనేది వీళ్ళ ప్లాన్ .
4 . రాజకీయంగా జగనమోహనరెడ్డి గారిని దెబ్బ కొట్టటం , అదే సమయం లో అంతులేని దోపిడీకి తెరతీయటం
Source: Twitter
#కల్తీ కోవా బన్ తో ఒళ్ళు గుల్ల..
దానివైపు చూడొద్దు మల్ల
పాలతో చేసిన కోవాబన్ రూ.10కే అంటూ ఇంతపెద్ద వ్యాన్పైన భారీగా సినిమా యాక్టర్ల ఫ్లెక్సీతో మంచి ఆకర్షణీయంగా కనిపిస్తుంది కదా.. పది రూపాయలకు ఈ రోజుల్లో ఏమొస్తుందనుకుంటూ పాపం ఆత్రంగా ఆ కోవాబన్ కొనుక్కుంటున్నారు చాలామంది అమాయకులు. వీరి అమాయకత్వమే ఆ బన్ అమ్మేవారికి ఆయుధం.. ఆ కల్తీ కోవాబన్ తిని జనానికి అనారోగ్యం.. అసలేం జరిగిందో ముందు ఈ సంఘటన గురించి తెలుసుకోండి.
తెలంగాణలోని తాండూరులో కల్తీ కోవా తయారు చేస్తున్న కేంద్రాలపై ఇటీవల టాస్క్ ఫోర్స్ దాడులు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ వెల్లడించారు. తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ కోవా తయారు చేసి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు.. టాస్క్ ఫోర్స్ బృందం రంగంలోకి దిగి ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో సుమారు 120 కిలోల కల్తీ కోవాను స్వాధీనం చేసుకున్నారు. ఆహారాన్ని కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ విష్ణు అనే వ్యక్తితో పాటు హైదరాబాద్ చంద్రాయణగుట్ట నివాసి మహమ్మద్ సల్మాన్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం స్వాధీనం చేసుకున్న కల్తీ కోవాతో నిందితులను తాండూరు పోలీసులకు అప్పగించారు.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం... ఈ రకమైన కల్తీ కోవాతో బన్ తయారు చేసి విక్రయిస్తున్న కొందరు వ్యాపారుల బండారాన్ని బయటపెట్టిన ఒక మీడియా సంస్థపై కొందరు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది కల్తీ బన్ అని మీకెలా తెలుసు? అంటూ కువిమర్శలు చేస్తున్నారు. ఇక్కడొక వాస్తవాన్ని గమనించాలి. నాణ్యత గల కోవా ధర హైదరాబాదులో కిలో రూ.250తో మొదలవగా... మంచి నాణ్యత గల కోవా కిలో రూ.400 వరకూ ఉంది. రూ.10కే కోవా బన్ అమ్మేవారు కేజీ రూ.220 విలువ చేసే తక్కువ నాణ్యత గల కోవాతో బన్స్ తయారు చేసినప్పటికీ, మనం ఎన్ని రకాల లెక్కలు వేసుకున్నా కచ్చితంగా రూ.10కి కోవాబన్ అమ్మితే కనీసం దాన్ని తయారు చేసేందుకయ్యే ఖర్చులు కూడా గిట్టుబాటు కావు. అందువల్ల కల్తీ కోవా వాడకతప్పదు.. అది తిన్న జనం ఆరోగ్యం గుల్లకాక తప్పదు.
పైన తెలిపిన కేసు మాత్రమే గాకుండా.. మరొకరిని కూడా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు ఏపీలోని కర్నూలు నుంచి వచ్చి తెలంగాణలోని మేడారంలో కోవా బన్స్ అమ్ముతున్నాడు. నిందితులు రోజుకు సగటున 500 బన్స్ ఆపైన అమ్ముతూ 3 రోజుల పాటు దాదాపు 2 వేల బన్స్ అమ్మినట్లు సమాచారం రాబట్టారు. ప్రతి బన్ మీద రూ.3 లాభంతో 2 వేల బన్స్ పై రూ.6,000 వరకూ లాభం సంపాదించినట్టు వివరాలిచ్చారు. కర్నూలు నుంచి మేడారానికి రానుపోను 900 కి.మీ దూరం ఉంటుంది. ఈ ప్రయాణానికి పెట్రోల్ ఖర్చులు, టోల్ గేట్ ఖర్చులు, ఆ పైన వ్యాపారికి ఉండేందుకు, సరుకు పెట్టుకోవడానికి గొడౌన్కి వేలల్లో ఖర్చులవుతాయి. ఇన్ని ఖర్చుల మధ్య కల్తీ చెయ్యకుండా కేవలం రూ.10కే మంచి నాణ్యత గల కోవాబన్ తయారు చెయ్యడం సాధ్యమేనా? లాభాల్లేకుండా అమ్ముతారా? కేవలం కొన్ని వందల రూపాయల లాభానికి ఏపీ నుంచి ఇంతదూరం వస్తారా.. అనేది ఆలోచించాలి.
ఇదంతా ఇలా ఉంటే, ఈ వ్యవహారంలో నిందితులకు మద్దతునిస్తూ SDPI సంస్థ రంగంలోకి దిగింది. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ కల్తీ వ్యవహారాన్ని ప్రజలకు చూపించిన ఒక మీడియా సంస్థకు హెచ్చరిక కూడా జారీ చేసింది. కేరళ నుంచి దేశమంతా విషబీజాలు నాటుతున్న ప్రముఖ ఉగ్రవాద సంస్థ PFIకి మద్దతుదారు అయిన SDPIకి ఈ కల్తీ కోవాబన్ వ్యాపారులతో సంబంధమేంటి? ఒక పక్క పోలీసులే రంగంలోకి దిగి, కల్తీ కోవాను పట్టుకుని కేసులు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తుండగా మధ్యలో SDPIకి బాధేంటి? ఇదంతా చూస్తుంటే దీని వెనుక పెద్ద వ్యవహారం, కుట్ర ఉన్నట్టు కనిపిస్తోంది.
ఒక్క కోవాబన్ మాత్రమే కాదు, ఇంకా ఎన్నెన్నో రకాల ఆహారపదార్థాలను కల్తీ చేస్తూ ప్రజలను నిర్వీర్యుల్ని చేస్తున్నారు. జనులారా జాగ్రత్త..
#మల్లెం కొండ 🏞
వైఎస్ఆర్ కడప జిల్లాలోని మల్లెంకొండ (లేదా మల్లంకొండ) అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ మల్లెంకొండేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైనది మరియు మహిమాన్వితమైనది. నల్లమల, శేషాచల అభయారణ్యాల మధ్య కొలువైన ఈ క్షేత్రానికి సంబంధించిన సమగ్ర చరిత్ర మరియు విశేషాలు ఇక్కడ ఉన్నాయి:
1. క్షేత్ర పురాణం (స్థల పురాణం)
శ్రీరాముని ప్రతిష్ఠ: రావణ సంహారం తర్వాత శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి ఈ మాల్యవంత పర్వత ప్రాంతానికి వచ్చారని, ఇక్కడి ప్రకృతికి పరవశించి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది. ఈ కొండ పూలమాల ఆకృతిలో ఉండటం వల్ల దీనిని మాల్యాద్రి శిఖరం అని కూడా పిలుస్తారు.
మల్లెంకొండయ్య కథ: పూర్వం అంకమ్మ తల్లి కుమారుడైన మల్లెంకొండయ్య, తన తల్లి ఆజ్ఞ మేరకు ఈ ప్రాంతంలోని రాక్షసులను సంహరించాడట. రాక్షసులు పంది రూపంలోకి మారి తప్పించుకోవాలని చూడగా, మల్లెంకొండయ్య వారిని వేటాడి ఐదు భాగాలుగా చీల్చాడని, అవే నేడు సోమశిల సమీపంలోని పంచలింగాల కొనగా వెలిశాయని భక్తుల నమ్మకం. రాక్షస సంహారం తర్వాత శివుని ఆజ్ఞ మేరకు మల్లెంకొండయ్య ఇక్కడే ఉండి భక్తులను రక్షిస్తున్నాడని ప్రతీతి.
2. ఆలయ ప్రత్యేకతలు
పైకప్పు లేని ఆలయం: ఈ ఆలయానికి గర్భాలయం మీద పైకప్పు (గోపురం) ఉండదు. పూర్వం ఎవరైనా పైకప్పు వేయాలని ప్రయత్నిస్తే, అది రాత్రికి రాత్రే కూలిపోయేదట. స్వామివారు తనకు పైకప్పు వద్దని, ఆకాశమే తనకి నిలయమని కోరుకున్నట్లు చెబుతారు.
శాపం - కాకులు, పులుల గైర్హాజరు: స్థానిక కథనం ప్రకారం, మల్లెంకొండయ్యను బంధించే సమయంలో ఒక కాకి ఆయన కళ్లను పొడవబోయిందట. దాంతో ఆగ్రహించిన స్వామి ఆ అరణ్యంలో కాకులు ఉండకూడదని శపించారట. అలాగే గిరిజనుల గోవులను పులుల నుండి రక్షించేందుకు ఈ ప్రాంతంలో పులులు తిరగకూడదని శివుడు ఆజ్ఞాపించినట్లు చెబుతారు. అందుకే దట్టమైన అడవిలో ఉన్నప్పటికీ ఇక్కడ కాకులు, పులులు కనిపించవు.
తేజోవంతమైన కాంతి: కార్తీక మాసంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొండల మధ్య ఒక రహస్య ప్రదేశంలో అద్భుతమైన కాంతి (మకర జ్యోతి లాంటిది) కనిపిస్తుందని భక్తులు చెబుతారు.
3. ప్రధాన ఆకర్షణలు
రామసరి జలపాతం: ఆలయం నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో అందమైన 'రామసరి' జలపాతం ఉంది. శ్రీరాముడు ఇక్కడ కొంతకాలం నివసించినట్లు ఆనవాళ్లు (రాముని పాదాలు, సీతమ్మ గుండం) ఇక్కడ చూడవచ్చు.
పవిత్ర గుండాలు: ఈ క్షేత్రంలో ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది నీటి గుండాలు ఉన్నాయి. వీటిలో స్నానం చేస్తే సకల పాపాలు, రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.
https://youtube.com/shorts/3lJo3A0LH6s?si=8LnMKR15bKEG4dND #నూతన మద్యం పాలసీ 🍾 #నూతన మద్యం పాలసీ విధానం⁉️
#valentine's day
*సుబ్బారావు*:సార్..! నాకు ఫిబ్రవరి 14న సెలవు కావాలి..❗
*మేనేజర్*:లీవ్ లెటర్పై మీ ఆవిడ సంతకం తీసుకుని రండి..‼️
*🔔_ #🌅శుభోదయం🌻🌺_🔔*
*_గొడవ పడడానికి తెలివి, సంస్కారం, అనుభవం ఇవేవీ అవసరం లేదు._*
*_కానీ గొడవ రాకుండా పరిష్కరించుకోవడానికి మాత్రం తెలివి, సంస్కారం, అనుభవం ఖచ్చితంగా ఉండాలి._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞













