P.Venkateswara Rao
ShareChat
click to see wallet page
@prasad831
prasad831
P.Venkateswara Rao
@prasad831
ప్రేమించు కానీ నటించకు
నెతిన గంగ ఉండి కూడా.. కాసిన్ని నీళ్లకి సంతోషపడిపోతాడు. అడవుల్లోనూ ఉంటాడు కానీ కాస్త మారేడుకే మురిసిపోతాడు.. రుద్రభూమిలోనే తిరుగుతాడు కానీ చిటికెడు భస్మానికే పులకించిపోతాడు.. పూలన్నీ తనవే అయినా తుమ్మి పూలకే తన్మయిస్తాడు.. ఇవేవీ చేయకపోయినా.. శివ శివ అన్నాచాలు మన చేయి వదలడు..❗ *🕉️ #🙏ఓం నమ శివాయు🙏 🔱*
🙏ఓం నమ శివాయు🙏 - a a - ShareChat
#🏏క్రికెట్ 🏏 #🏏అభిషేక్ శర్మ *తెలుగింటి అల్లుడి విధ్వంసం.. అభిషేక్ శర్మ ఎందుకు స్పెషలో తెలుసా❓* 08.02.2026🏏 టీ20 ప్రపంచ కప్‌ 2026లో భారత్ విజయానికి ఎక్స్ ఫ్యాక్టర్ అభిషేక్ శర్మ. ఎందుకు యంగ్ స్టార్ కీలకం? ప్రపంచ నంబర్ 1 బ్యాటర్ విధ్వంసకర గణాంకాలు, రికార్డుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్న 2026 టీ20 ప్రపంచ కప్ సమరం మొదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన మెన్ ఇన్ బ్లూ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మెగా టోర్నీని విజయంతో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్ లో యూఎస్ఏ పై విజయం సాధించింది. జట్టులో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి సూపర్ స్టార్లు ఉన్నప్పటికీ, ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం ఒకే ఒక్కడిపై ఉంది. అతనే టీ20 ఓపెనింగ్ నిర్వచనాన్ని మార్చేసిన యువ సంచలనం అభిషేక్ శర్మ. ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ నంబర్ 1 టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్న అభిషేక్ శర్మ.. కేవలం ఒక సాధారణ ఓపెనర్ మాత్రమే కాదు. టీ20 క్రికెట్‌లో భారత్ అనుసరిస్తున్న సరికొత్త దూకుడుకు నిలువుటద్దం. ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు భారత్ సిద్ధం చేసుకున్న అణు ఆయుధం అభిషేక్ శర్మ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2026 ప్రపంచ కప్‌లో భారత్‌కు అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా అభిషేక్ శర్మ ఎందుకు మారబోతున్నాడంటే.. చరిత్రను గమనిస్తే.. అతిగా దూకుడు ప్రదర్శించే ఓపెనర్లు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. వారి నుండి అభిమానులు త్వరగా వచ్చే 20 పరుగులు లేదా మొదటి బంతికే డకౌట్‌ను ఆశిస్తారు. కానీ, అభిషేక్ శర్మ ఈ పాత పద్ధతిని పూర్తిగా మార్చేశాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో అడుగుపెడుతున్న అభిషేక్ గణాంకాలు చూస్తుంటే.. అవి నిజమైన క్రికెట్ గణాంకాలా లేక ఏదైనా వీడియో గేమ్‌లోవా? అనిపించకమానదు. ఈ మెగా టోర్నీకి ముందు అతని కెరీర్ స్ట్రైక్ రేట్ ఏకంగా 194.74గా నమోదైంది. టీ20 చరిత్రలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడిన ఏ ఆటగాడికైనా ఇదే అత్యధిక స్ట్రైక్ రేట్ కావడం విశేషం. ఇంత భారీ స్ట్రైక్ రేట్‌తో పాటు అతను 37.05 సగటును కలిగి ఉండటం అతని అద్భుతమైన ఫామ్‌కు నిదర్శనం. కేవలం 38 మ్యాచ్‌లలోనే రెండు అంతర్జాతీయ సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు సాధించిన అభిషేక్.. ఇంత వేగంగా ఆడుతూనే నిలకడను ప్రదర్శించడం అసాధారణం. మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఇటీవల అభిషేక్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రిస్ గేల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు కూడా కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకుంటారు. కానీ అభిషేక్ శర్మకు సెటిల్ అవ్వడానికి అస్సలు సమయం అవసరం లేదు. ఇన్నింగ్స్ మొదటి బంతిని కూడా అతను డెత్ ఓవర్లలో వచ్చే ఫుల్ టాస్‌లాగా ట్రీట్ చేస్తాడని కైఫ్ పేర్కొన్నారు. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ: ఇటీవల న్యూజిలాండ్‌పై అభిషేక్ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది ఒక భారతీయ ఆటగాడు సాధించిన రెండో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ. పవర్ ప్లే స్పెషలిస్ట్: టీ20ల్లో పవర్ ప్లే (మొదటి 6 ఓవర్లు) లోపే మూడుసార్లు 50కి పైగా స్కోరు సాధించిన ఏకైక ఫుల్ మెంబర్ దేశ ఆటగాడిగా అభిషేక్ రికార్డు సృష్టించాడు. అతని ఈ అతి దూకుడు విధానం వల్ల.. పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ స్కోరు బోర్డుపై 70 లేదా 80 పరుగులు ఉంటాయి. ఇది ప్రత్యర్థి జట్టులోని ప్రధాన బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. కెరీర్ ఆరంభంలో అభిషేక్‌ను కేవలం స్పిన్ స్పెషలిస్ట్ గా ముద్ర వేశారు. కానీ 2025-26 సీజన్‌లో అభిషేక్ శర్మ ప్రదర్శన అతను ఎలాంటి బౌలింగ్‌నైనా ధీటుగా ఎదుర్కోగలడని నిరూపించింది. ఇంగ్లండ్ పై విధ్వంసం: 2025లో ఇంగ్లండ్ పై జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 54 బంతుల్లోనే 135 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 సిక్సర్లు బాదాడు. ఒక టీ20 ఇన్నింగ్స్‌లో భారతీయ ఆటగాడు కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే. 145 కి.మీ వేగంతో వచ్చే పేస్ బౌలింగ్ అయినా, మెల్లగా వేసే స్పిన్ అయినా.. అభిషేక్ హై బ్యాక్ లిఫ్ట్.. టెక్నికల్ అడ్జస్ట్‌మెంట్ అతనికి భారీ షాట్లు కొట్టేందుకు సహాయపడుతుంది. భారత దిగ్గజం యువరాజ్ సింగ్ శిష్యరికంలో రాటుదేలిన అభిషేక్.. తన గురువు నుండి కేవలం హై బ్యాక్ లిఫ్ట్, సిక్సర్లు కొట్టే నేర్పును మాత్రమే తీసుకోలేదు. పెద్ద మ్యాచ్‌లలో ఒత్తిడిని తట్టుకునే మనస్తత్వాన్ని కూడా అలవర్చుకున్నాడు. 200 స్ట్రైక్ రేట్‌తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన 2025 ఆసియా కప్ ప్రదర్శన.. అతను మెగా టోర్నీలకు సిద్ధంగా ఉన్నాడని నిరూపించింది. బ్యాటింగ్‌తో పాటు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేతిలో అభిషేక్ ఒక ముఖ్యమైన బౌలింగ్ అస్త్రం కూడా. అతని లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ జట్టుకు చాలా కీలకం. 2026 వరల్డ్ కప్ మ్యాచ్‌లు స్పిన్‌కు అనుకూలించే భారత్, శ్రీలంక పిచ్‌లపై జరుగుతుండటంతో.. అభిషేక్ వేసే 1-2 ఎకానమికల్ ఓవర్లు, వికెట్లు తీయగల సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడనుంది. దీనివల్ల అదనపు స్పెషలిస్ట్ ప్లేయర్‌ను తీసుకునే వెసులుబాటు భారత్‌కు లభిస్తుంది. 2026 టీ20 ప్రపంచ కప్ సొంతగడ్డపై జరుగుతుండటం, 931 ఐసీసీ రేటింగ్ పాయింట్స్ (టీ20 చరిత్రలో అత్యధికం) కలిగి ఉండటం అభిషేక్‌కు మానసికంగా ఎంతో బలాన్ని ఇస్తున్నాయి. 7వ ఓవర్‌లో ప్రత్యర్థి జట్టు బౌలింగ్ మార్పు చేసే సమయానికే.. అభిషేక్ మ్యాచ్‌ను వారి నుండి పూర్తిగా లాగేసుకుంటాడు. టీ20 క్రికెట్‌లో మొమెంటం చాలా ముఖ్యం. అభిషేక్ శర్మ కేవలం మొమెంటం సృష్టించడు, ప్రత్యర్థులు కోలుకోకముందే వారి నుండి గెలుపును లాగేసుకుంటాడు. సొంతగడ్డపై భారత్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే.. అభిషేక్ బ్యాట్ నుండి వచ్చే పరుగుల వరద కీలకం కానుంది. ఐసీసీ టీ20 ర్యాంకొగ్ : నెంబర్ 1 బ్యాటర్ పరుగులు : 1297 యావరేజ్ : 37.05 స్ట్రైక్ రేట్ : 194.74 సెంచరీలు : 2 హాఫ్ సెంచరీలు : 8 సిక్సర్లు : ప్రపంచ క్రికెట్‌లో అత్యధికం కొట్టిన ప్లేయర్ (2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత)
🏏క్రికెట్ 🏏 - oJaH' 7 [7 oJaH' 7 [7 - ShareChat
#😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ *🗼బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. ఇది దాదాపు 2700 అడుగుల ఎత్తు ఉండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంది.నిన్న, ఆ భవనం వెనుక బృహస్పతి గ్రహం కదులుతూ కనిపించింది. వారు దానిని దూరం నుండి చూశారు, మీరు కూడా దానిని చూడవచ్చు..*🎥
😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ - ShareChat
01:29
#🌅శుభోదయం🌻🌺
🌅శుభోదయం🌻🌺 - ನಮಾಜಂಲ್ రెందు రకాల మనుషులుంటారు మనం సంపాదిస్తే ఓర్వలేనివారు మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు మనం మంచిగా బతికితే అబా వాఠ కేంది అని అంటారు ೪ అదేమీ లేకుంటే చూసతూ' చులకనగా ஒலசல் ! గగరండ ా ನಮಾಜಂಲ್ రెందు రకాల మనుషులుంటారు మనం సంపాదిస్తే ఓర్వలేనివారు మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు మనం మంచిగా బతికితే అబా వాఠ కేంది అని అంటారు ೪ అదేమీ లేకుంటే చూసతూ' చులకనగా ஒலசல் ! గగరండ ా - ShareChat
#తిరుమల లడ్డు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *దేవుడంటే భయభక్తులెవరికి❓* FEBRUARY 7, 2026🎯 కలికాలంలో అధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందని పెద్దలు చెబుతుంటే, ఊత్తుత్తి కథలు చెప్పేవాళ్లు అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. స్వార్థ రాజకీయాలకని చెప్పడం చాలా తక్కువ చేసి చెప్పినట్టు అవుతుంది. అత్యంత నీచ, నికృష్ణ రాజకీయాల్ని ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. చివరికి దేవున్ని కూడా అధికారం కోసం అడ్డగోలుగా వాడుకుంటున్న దుర్మార్గ కాలం. దీన్ని ఏమనాలో కూడా ఎవరికీ అంతుచిక్కడం లేదు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రపంచంలో ప్రతి హిందువు అత్యంత శక్తిమంతుడైన దైవంగా విశ్వసించి, పూజిస్తారు. స్వామిని దర్శించుకుని, తమ కష్టాలు చెప్పుకుంటే పరిష్కరిస్తారనే విశ్వాసం. కలియుగం దైవం తమ మొర ఆలకించి, కష్టనష్టాల నుంచి బయటపడేశారని, మళ్లీ మొక్కులు తీర్చుకోవడం తెలిసిందే. సర్వ మానవులకు రక్షకుడైన ఆ దేవదేవునికి కష్టాలు తీసుకొచ్చారంటే, కలికాలంలో పాపాత్ముల పడగ నీడలో బతకడం ఎంత భయంకరమో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాజకీయంగానే కాదు, దేవుడి పేరుతో రెండుగా పాలక ప్రతిపక్షాలు చీలిపోయాయి. నిత్యం తిరుమల శ్రీవారి ప్రసాదంగా రాజకీయ ప్రయోజనాల పొందేందుకు వికృత క్రీడకు పాల్పడుతుండడాన్ని సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది. దీనంతటికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. కలియుగ దైవం తమ ఇంటి దేవుడిగా చెబుతూనే, లడ్డూ ప్రసాదాన్ని పంది కొవ్వు, ఆవు కొవ్వుతో తయారు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తనయుడు లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కూడా అవే ఆరోపణలకు చేపనూనె జత చేసి మరింత వేడి రగిల్చారు. ఇదేమంటే ఎన్టీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఈ వాస్తవాలు చెప్పామని దబాయింపు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆధారాలు లేకుండా పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై ఏంటీ మాటలని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది.ఆ తర్వాత సీబీఐ ఏర్పాటు, ఇటీవల విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించడం.. అన్నీ జరిగిపోయాయి. సీబీఐ నేతృత్వంలోని సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత లడ్డూ ప్రసాదం కేంద్రంగా, వివాదానికి ముగింపు పలుకుతారని అంతా భావించారు. అయితే ఆ తర్వాత మరింత వికృతరూపందాల్చింది. తమ ఆరోపణలే నమ్మాలన్నట్టు సిట్ ఇచ్చిన నివేదికను పాలకులు పక్కన పెట్టారు. ఇప్పుడు కొత్తగా బాత్రూమ్లలో ఉపయోగించే రసాయనాలతో లడ్డూ ప్రసాదం తయారు చేశారని ఆరోపించే వరకూ వెళ్లడం హిందువుల మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. లడ్డూ ప్రసాదంలో పాలకులు ఆరోపించినట్టు జంతువుల కొవ్వులు, చేప నూనె, రసాయనాల కలయిక కంటే, పాలకుల ఆరోపణలే తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని శ్రీవారి భక్తులు వాపోతున్నారు. శ్రీవారి ప్రసాదంపై పాలకుల ఆరోపణలే తీవ్రంగా కలచివేస్తున్నాయనే కోణంలో దేశ వ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీసింది. అసలు అత్యున్నత స్థానంలో ఉన్నోళ్లు, నిజంగా శ్రీవారి ప్రతిష్టను కాపాడే మాటలేనా ఇవి? అంటూ ప్రతి ఒక్కరూ ప్రశ్నించే పరిస్థితి. వైఎస్ జగన్ ను దైవ ద్రోహంగా చిత్రీకరించడానికి పాలకులు……… అంతిమంగా శ్రీవారిని బజారుకీడ్చడం అత్యంత దుర్మార్గం, క్షమించరాని నేరంగా ప్రజానీకం చెబుతోంది. శ్రీవారికి నిజమైన భక్తులెవరైనా స్వామి ప్రతిష్టను కాపాడేందుకు, ఎవరైనా నిరాధార ఆరోపణలు చేస్తే, చీల్చి చెండాడుతారు. అయితే కంటికి రెప్పలా కాపాడాల్సిన పాలకులే, కలియుగ దైవంపై అవాకులు చెవాకులు పేలుతుంటే, భక్తులు మౌనంగా రోదిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు దేవుడంటే భయం, భక్తి లేవని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో సినిమా డైలాగ్ కొట్టారు. ఇదే పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో ఏమన్నారో, ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. దేవుని ముందు వెలిగించిన దీపానికి తన తండ్రి సిగరెట్ వెలిగించే వాడని, ఆ తర్వాత మారిపోయాడని పవన్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ చీవాట్లు పెట్టడంతో వైఎస్ జగన్ను హిందూ ద్రోహిగా తిడుతూ నాగబాబు అత్యుత్సాహంతో వీడియో విడుదల చేశారు. ఇదే నాగబాబు తాను నాస్తికుడిని అని, దైవం అంటే విశ్వాసం లేదని చెప్పిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఒకవైపు తమకు దైవం అంటే నమ్మకం లేనోళ్లు, మరొకరి మత విశ్వాసాలను ప్రశ్నించడం, అవహేళన చేయడాన్ని నెటిజన్లు, రాజకీయ ప్రత్యర్థులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇక వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయానికి వెళ్లాం. ప్రతి మీటింగ్లోనూ వైఎస్ జగన్ నోటి నుంచి పదేపదే వచ్చే మాట………పైన దేవుడున్నాడు, కింద మీరు (ప్రజలు) ఉన్నారని… దుర్మార్గంగా వ్యవహరించే ప్రత్యర్థుల కథేంటో చూసుకుంటారని చెబుతుంటారు. దేవుడు.. దేవుడు అని జగన్ నిత్యం నామస్మరణ చేస్తుంటారు. క్రిస్టియన్ మతంలో పుట్టడం జగన్ ఆప్షన్ కాదు. ఇదే విషయాన్ని ఆయన గతంలో చెప్పారు. ఇతర మతాల విషయంలోనూ ఆయన అంతే భక్తిశ్రద్ధలతో వ్యవహరిస్తుంటారు. వైఎస్ జగన్ మతాన్ని అడ్డుపెట్టుకుని, హిందువుల ద్వేషిగా చిత్రీకరించే వారి చేష్టల్ని మెజార్టీ ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి. ముఖ్యంగా వైఎస్ జగన్ను మతం అడ్డుపెట్టుకుని నెగెటివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న వారి తీరును జాగ్రత్తగా గమనించాలి. తాము హిందువులం కావడంతో, ఆ మత విశ్వాసాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే నిర్లక్ష్య, అహంకారాన్ని చూడొచ్చు. గతంలో హిందూమతానికి మచ్చ తెచ్చేలా, ఆ మతం వారే వ్యవహరిస్తున్నారనే పవన్కల్యాణ్ అభిప్రాయం ముమ్మాటికీ నిజం. కాకపోతే, ఇప్పుడా జాబితాలో ఆరోపించిన వారినే అనుమానించే పరిస్థితి రావడం దురదృష్టకరం. ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని వేదాలు చెప్పాయి. ధర్మాన్ని రక్షిస్తున్నామా? భక్షిస్తున్నామా? అని ఒక్కసారి రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే, కలియుగ దైవంపై అత్యంత దుర్మార్గమైన ఆరోపణలకు దిగనుగాక దిగరు. ఇప్పటికైనా స్వామివారికి చేసిన ద్రోహం చాలని, తప్పుల్ని సరిదిద్దుకుందామనే ఆలోచన పాపుల్లో వస్తే అందరికీ మంచిది.
తిరుమల లడ్డు - ShareChat
https://youtube.com/watch?v=7i_4MkSs2Qs&si=xsUacnY8cmyt6QSl #తిరుమల లడ్డు
youtube-preview
#✍️కోట్స్
✍️కోట్స్ - ಸಲಿರ చేయి చాచినంత మాత్రాన చేతకాని వారు కాదు సాయం కోరినంత మాత్రాన | అసమర్థులు కారు !  8 రేపు పరిస్థితి ఏంటో: ఎవరి ( ( ఎవరికీ తెలియదు: 3 ఎవరినీ చులకనగా చూడకు [ ಸಲಿರ చేయి చాచినంత మాత్రాన చేతకాని వారు కాదు సాయం కోరినంత మాత్రాన | అసమర్థులు కారు !  8 రేపు పరిస్థితి ఏంటో: ఎవరి ( ( ఎవరికీ తెలియదు: 3 ఎవరినీ చులకనగా చూడకు [ - ShareChat
#🍲తెలుగింటి రుచులు #🥧తెలుగింటి గుమగుమలు🥧 *తక్కువ టైమ్.. ఎక్కువ ప్రోటీన్.. అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ టిఫిన్‌❗* ఉదయం నిద్రలేవగానే ఇల్లాలికి వచ్చే మొదటి ప్రశ్న.. ఈరోజు టిఫిన్ ఏం చేయాలి? అని. ప్రతిరోజూ తినే ఇడ్లీ, దోశలు బోర్ కొడితే.. అప్పటికప్పుడు ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ‘మూంగ్‌లెట్’ ప్రయత్నించండి. పెసరపప్పుతో చేసే ఈ వంటకం అటు ఆరోగ్యానికి, ఇటు రుచికి పెట్టింది పేరు. తక్కువ సమయంలోనే తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు.. పెసరపప్పు (పొట్టు ఉన్నది లేదా లేనిది) – 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు టమాటా, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు తగినంత అల్లం, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర, కొత్తిమీర పావు టీస్పూన్ వంట సోడా కాల్చడానికి సరిపడా బటర్ లేదా ఆయిల్ తయారీ విధానం.. ముందుగా ఒక కప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగి కనీసం 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే చేయాలనుకుంటే ముందు రోజు రాత్రే నానబెట్టుకోవడం ఉత్తమం. నానిన పప్పును మిక్సీ జార్‌లోకి తీసుకుని.. అందులో అల్లం ముక్క, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయలు, టమాటా, క్యారెట్, క్యాప్సికం, కొత్తిమీర ముక్కలను కలిపి బాగా మిక్స్ చేయాలి. చివరగా పిండి ఫ్లఫీగా రావడానికి కొద్దిగా వంట సోడా కలపాలి. స్టవ్ మీద పాన్ పెట్టి కాస్త బటర్ లేదా ఆయిల్ వేసి వేడి చేయాలి. పిండిని అర ఇంచ్ మందంలో అట్టులా పరచాలి. పైన మరిన్ని వెజిటబుల్స్ కూడా చల్లుకోవచ్చు. మంటను తక్కువలో పెట్టి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టి వేయించాలి. హోటల్ స్టైల్ రుచి కావాలంటే మధ్యలో చిన్న గాట్లు పెట్టి మరికొంచెం బటర్ వేసి రోస్ట్ చేయాలి. ఈ మూంగ్‌లెట్‌లోకి కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, నిమ్మరసంతో చేసిన గ్రీన్ చట్నీ కలిపి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఇది ఎందుకు తినాలి అంటే.. పెసరపప్పులో అధిక ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఉంటాయి. ఇది వెజిటేరియన్లకు ఒక ‘సూపర్ ఫుడ్’. పిల్లలకు లంచ్ బాక్స్‌లో ఇచ్చేందుకు లేదా సాయంత్రం స్నాక్స్‌లా తినేందుకు కూడా ఇది ఒక సూపర్ ఛాయిస్.
🍲తెలుగింటి రుచులు - ShareChat
#✍️కోట్స్ ఇక్కడ స్నేహితుడు.. శత్రువు అని రెండు రకాల మనుషులు లేరు.. ఉన్నది ఒకటే రకం.. మన అవసరం ఉంటే స్నేహితులు అవ్వటం.. ఆ అవసరం అయిపోయాక శత్రువులు అవ్వటం.. నువ్వు నేను ఎవరు కాదన్నా ఇదే ముమ్మాటికీ నిజం..❗
✍️కోట్స్ - ShareChat
https://youtube.com/watch?v=O7ooWOOoXkc&si=SimgF9mrMzxOb_V6 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
youtube-preview