RAJENDRAPRASAD, M.Com.
ShareChat
click to see wallet page
@raajendraprasad
raajendraprasad
RAJENDRAPRASAD, M.Com.
@raajendraprasad
"దయచేసి నమ్మక ద్రోహం చెయ్యకండి"
#ఈ రోజు 🌧️🌛🌔🌠 *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩* *వైశాఖ పురాణం - 10 వ రోజు పారాయణం* *దక్షయజ్ఞనాశము కామదహనము* రుద్రుడా వార్తను విని కాలాంతకునివలె భయంకరాకారుడై వేయి బాహువులుకల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి యడిగెను. పరమేశ్వరుడును నా భార్య వినజాలనిరీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని యానతిచ్చెను. భూతసంఘములను వీరభద్రుని వెంటపొండని పంపెను. ఇట్లు పరమేశ్వరుని యాజ్ఞనందిన వీరభద్రుడు, వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి యచటనున్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులను అందరనుకొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు నెవరు యే అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశము గావించెను. దక్షుని శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని మునిమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేక పోయెను. పరమేశ్వరుడా విషయమును గ్రహించి తానే స్వయముగ దక్షుని శిరమును ఖండించెను. ఈ విధముగ వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరచి తమ వారితో గలసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలినవారు బ్రహ్మవద్దకు వెళ్ళి శరణు వేడిరి. బ్రహ్మయు వారితో గలసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధరీతులలో నూరడించెను స్తుతించెను. శివుని సమాధానపరచి శివునితో గలసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారినందరిని శివుని ప్రార్థించి యతనిచేతనే బ్రదికింపజేసెను, శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేక ముఖము నమర్చి బ్రదికించెను, మరియు మేక గడ్డమును తెచ్చి భృగుమహర్షికి అమర్చెను. సూర్యునికి దంతముల నీయలేదు. కాని వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రమిచ్చెను. అవయవములను పోగొట్టుకొన్నవారికి ఆ అవయవముల నిచ్చెను. కొందరికీయలేదు. యజ్ఞశాల యీ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మనందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరల చేసి పూర్తి చేసిరి. యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్యా వియోగమున దుఃఖితుడై గంగాతీరమున పున్నాగ వృక్షము క్రింద తపమాచరించు కొనుచుండెను. దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనాహిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమునాచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరివలన మరణము లేకుండునట్లు వరములను పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు పుత్రుడెట్లు కలుగును? కావున నేను అవధ్యుడను నన్ను చంపువారెవరును లేరని తారకుడు తలచెను. వరగర్వితుడై సర్వలోకములను, సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను, తన గృహములునూడ్చుటకును, దేవతాస్త్రీలను దాసీలుగను నియమించెను. దేవతలను బహువిధములుగ బాధించుచుండెను. దేవతలు వాని వలని బాధలను భరింపజాలక బ్రహ్మవద్దకు బోయి తమను రక్షింపుమని బహువిధములుగ ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలను విని యిట్లు పలికెను. దేవతలారా! నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి యెవరు నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి దక్షునియజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీయను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసికొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టి విధానము నాలోచింపుడని వారికి దగిన ఉపాయమును సూచించెను. వారిని యూరడించి పంపెను. దేవతలందరును యింద్రుని యింట సమావేశమైరి బృహస్పతితో నాలోచించిన ఇంద్రుడును, నారదుని మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును, మన్మధుడు యింద్రుని వద్దకు వచ్చిరి. ఇంద్రుడు - నారదుని జూచి నారదమహర్షీ! నీవు హిమవంతుని కడకు పోయి దక్షయజ్ఞమున శరీరత్యాగమొనర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడగు శివుడును నీ హిమాలయశృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యయై ప్రస్తుతము నీ కుమార్తెగానున్న పార్వతిని శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు. శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందలి భర్తయగు శివునికి భార్య చేయమని భోదింపుమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను. నారదుడు యింద్రుడు చెప్పినట్లుగ హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించునట్లుగ హిమవంతుని ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను. నారదుని పంపిన తరువాత నింద్రుడు మన్మధుని జూచి తారకాసుర పీడితులగు దేవతల హితము కొరకు భార్యా వియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములగు వసంతరుతుశోభలను ప్రవర్తింపజేయుము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికిని సమాగమమేర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసురవధ జరుగును. దేవతలకు పరపీడనముపోవును. ఈ ప్రకారము చేయుమని వానిని పంపెను. మన్మధుడును యింద్రుని యాజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితోను, భార్యయగు రతీదేవితోను, మలయానిలాది పరివారముతోను శివుడున్న తపోభూమికి పోయెను. అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్పసమృద్దము, మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగువానిని సమర్పింప వచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడును శివపార్వతుల సమాగమమునకిదియే తగిన సమయమని తలచెను. శివుని వెనుక భాగమున చెట్టుచాటున నిలుచుండి యొక బాణమును ప్రయోగించెను. మరలనింకొక బాణమును ప్రయోగింప సిద్దముగనుండెను. శివుడు తన మనస్సు చలించుటను గుర్తించెను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనసిట్లు చంచలమగుటయేమి నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరిని విచారించి నలువైపుల పరిశీలించెను. బాణప్రయోగమొనర్పబోవు మన్మధుని జూచెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరచెను. లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణములతో దహించెను. తమ కార్యమేమగునోయని చూచుచున్నదేవతలు భయపడి కకావికలై పారిపోయిరి. వసంతుడు, మన్మధుని భార్య రతి - శివుడు తమను కూడ శిక్షించునేమో? ఆ శిక్షయెట్లుండునోయని భయపడి కనులను మూసికొని దూరముగ పోయెను. స్త్రీ సన్నిధానము యుక్తముగాదని పరమశివుడు అంతర్ధాన మయ్యెను. మన్మధుడు చేసినపని దేవతలకు, శివునకు యిష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో నింక నెంతటి ఆపద మన్మధునకు కలుగునో యెవరు చెప్పగలరు? కావున శ్రుతకీర్తి మహారాజు! యిక్ష్వాకు వంశమువాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడేయగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని, అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసినదానికి శునకాది హీనజన్మలనెత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్యకర్తవ్యము. అనాధలయెడ దయజాలి మితిమీరరాదు. ఈ విషయము గమనింపవలయునని శ్రుతదేవుడు వివరించెను. పరమశివునికనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మయందును బాధలుపడెను. పరమపుణ్యప్రదమైన యీ కధను, రాత్రిగాని, పగలుగాని యెవరు విన్నను, జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగు భయములనుండి విడువబడుదురు. అనగా వారికి జన్మాదులవలన భయము నుండదు. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను... *వైశాఖ పురాణం 10వ అధ్యాయం సమాప్తం...* *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*
#🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌
🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌 - ShareChat
00:07
#ఈ రోజు 🌧️🌛🌔🌠 *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩* *వైశాఖ పురాణం - 9 వ రోజు పారాయణం* *సతీదేహ త్యాగము..* అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శ్రుతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శ్రుతకీర్తి మహారాజిట్లు పలికెను. శ్రుతదేవ మహామునీ! యిక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చేయకపోవుటవలన ముమ్మారు చాతకముగను, జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా! పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపక పోవుట వలన గ్రద్దగను, పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగ నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు. కావున వానికి పుణ్యలాభము కలుగక పోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా. అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి శునకాది జన్మలెందులకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను. అని అడిగిన శ్రుతకీర్తిని మెచ్చి శ్రుతదేవుడిట్లు పలికెను. రాజా! వినుము, ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడీ లోకములన్నిటిని సృష్టించెను. వాని స్థితిని యిహలోక సంబందము, పరలోక సంబందము అని రెండు విధములుగ నేర్పరచెను. ఇహలోక సంబందములుగ జలసేవ, అన్నసేవ, ఔషధసేవయని యిహలోకస్థితికి మూడు హేతువులు నేర్పరచెను. ఇవి మూడును యిహలోకస్థితికి సర్వలోకములకును ముఖ్యహేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ, విష్ణుసేవ, ధర్మమార్గసేవయను మూడును ముఖ్యహేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరచిన విధానములని వేదములయందు చెప్పబడినది. ఇంటియందుండి సంపాదించుకున్న ఆహారపదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగ యిహలోకమున మనము పరలోకస్థితికై సంపాదించుకొన్న సాధు, విష్ణు, ధర్మమార్గసేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైనకార్యము మన మనస్సునకు యిష్టమైనను దాని వలన నేదో యొక అనర్ధము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైనదానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన యితివృత్తమును వినుము. పార్వతీ! యీ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును, ఆనందమును కలిగించును. పూర్వము దక్షప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునకిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్షప్రజాపతిని జూచి "నేను దేవతలందరికిని గురువును. వేదములు వివరించు త్రికాలాబాధితమైన వాడను, చంద్రుడు, యింద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు. అనగా సేవకప్రాయులు, ప్రజాపతులలో నొకడైన దక్షప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయై గౌరవార్హుడైనను,  పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో నొకనిని జూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని జూచి లేవరాదు. భర్తభార్యను జూచి లేవరాదు. గురువు శిష్యుని జూచి లేవరాదు అని పండితుల మాటకదా! దక్షప్రజాపతి పిల్లనిచ్చిన మామ యగుటచే పూజ్యుడే. కాని యిచటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదగుటచే సర్వోన్నతుడు, సర్వోత్తముడు, దేవదేవుడునగు తాను(శివుడు) లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని జూచి గురువు లేచినట్లుగ, భార్యను జూచి భర్త లేచినట్లుగ, సేవకుని జూచి యజమాని లేచినట్లుగ ధర్మవిరుద్దముగ నుండును. కావున తాను లేచినిలుచుండి గౌరవించుట దక్షప్రజాపతికి శ్రేయస్కరము గాదు. లేచినచో యజమానులు మున్నగువారు లేచి సేవకాదుల గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి సంతతి మున్నగు వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయగు దక్షప్రజాపతి వచ్చినను, మామగారుగా పూజ్యుడైనను, దక్షుని శ్రేయస్సును కోరిలేవలేదు. కాని పరమేశ్వరునంతటి వాని యాలోచనాశక్తిని,  ఔన్నత్యమును గమనింపజాలని దక్షప్రజాపతి ధర్మసూక్షమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని యతడు శివుని యెదుటనే యిట్లనెను. ఓహో! ఎంతగర్వము ఓహోహో యేమి యీ గర్వము! దరిద్రుడు. తనను తాను తెలిసికొనజాలని అవివేకి యీ శివుడు. ఇతనికి తనకంటె మామమాన్యుడను వివేకములేని అవివేకి యీ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా! ఈశ్వరుడను పదమున నైశ్వర్యమును కలిగియున్నాడు. ఇతని యైశ్వర్యమెంత గొప్పదో కదా! వయస్సెంతయో తెలియదు. శుష్కించిన ఒక్క యెద్దు వీని యైశ్వర్యము. పాపము కపాలమును, యెముకలను ధరించి వేదబాహ్యులగు పాషండులచేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టివాడిచ్చు మంగళమేమియుండును? లోకములు, శాస్త్రములు లోకములు చర్మధారణము నంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుచు నితడు అపవిత్రమగు గజచర్మమును ధరించును. నివాసము శ్మశానము అలంకారమాసర్పము. ఇది యితని యైశ్వర్యము. ఇట్టి యీతడీశ్వరుడు పేరు . శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలును జూచి పారిపోవును. 'శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞడను పేరు కలదు. కాని మామను చూచి నమస్కరింప వలయునను జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచములు వీని పరివారము. ఆ పరివారము నెప్పుడును విడువడు. వీని కులమేమియో తెలియదు మరియు నితడు పరమేశ్వరుడు. సజ్జనులితనిని దైవముగ నంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగావిని నేనతనికి నా కుమార్తెయగు సతీదేవినిచ్చి మోసపోతిని. ధర్మవ్యతి రిక్తమైన ప్రవర్తన గల యితనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీనియింటనే యుండి యీ సుఖముల ననుభవించుచుండుగాక. ఇట్టి యితడు, వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగినవారు కారు. నీచ కులము వానియొద్దనున్న పవిత్ర కలశము విడువదగినదైనట్లుగ వీరు నాకు విడువ దగినవారు" అని బహువిధములుగ పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని, అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన యింటికి మరలి పోయెను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో గలసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే యుండెను. బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరును దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారుణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు వారు వీరననేల అందరును వచ్చిరి. పుణ్యాత్మురాలగు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును జూడవచ్చిన బంధువులను చూడవలెనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావము ననుసరించి యజ్ఞమునకు వెళ్లదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరీ నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా! ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థధర్మము ననుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించియుండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు. అచట శుభము జరుగదు. నిశ్చయము అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగనైన తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యెను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభరూపమున వచ్చి అమ్మని నెక్కించుకొని యజ్ఞశాలకు తీసికొని వెళ్లెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెననుసరించి వెళ్లినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్లి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్లెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరును పలకరింపలేదు. దానిని సతిదేవిని గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి యచట నున్న సభ్యులు ఆమెను జూచియు పలుకరింపక మౌనముగ నుండి దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను నుద్దేశించి ఆహుతుల నిచ్చెను. తండ్రి చేసిన ఆకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి యిట్లు పలికెను. తండ్రీ! ఉత్తముల నవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త-లోకభర్త. అందరికిని ప్రభువు. అతడు నాశరహితుడు ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగ నీయకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ది నీకే కలిగినదా? ఇట్టి దుర్బరబుద్దినిచటివారు కలిగించారా? ఇచటి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పక పోవుటయేమి? విధివిధానము వీరికి విముఖమైయున్నదా? అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగుమహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చరచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి. మరికొందరు పాదములను, తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగ సభలోనివారు దక్షుని సమర్థించుచు, సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధి వ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను, శివుని బహువిధముల నిందించెను. రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగ  యజ్ఞశాలలోని వారందరును చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును జూచిన వారందరును హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమధులు పరుగునపోయి పరమేశ్వరునకా విషయమును దెలిపిరి. *వైశాఖ పురాణం 9వ అధ్యాయం సమాప్తం...* *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*
#😴శుభరాత్రి _రాబోయే కాలం బ్రహ్మచర్య యుగం అవుతుంది_ ఒక ఇటీవలి అంతర్జాతీయ సర్వే ప్రకారం, రాబోయే ఆరు సంవత్సరాలలో ప్రపంచంలోని దాదాపు 45% మంది అమ్మాయిలు అవివాహితులుగానే ఉండిపోతారు. ఈ నివేదిక 1 ఫిబ్రవరి, 2025న లోక్‌మత్ వార్తాపత్రికలో ప్రచురితమైంది, మరియు ఇది మోర్గాన్ స్టాన్లీ సంస్థ చేసిన వివరణాత్మక అధ్యయనంపై ఆధారపడింది. _సర్వేలో కనుగొన్న ప్రధాన కారణాలు:_ 1. నేటి అమ్మాయిలు ఉన్నత విద్యను పొందుతూ తమ కెరీర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. 2. వారు ఆర్థికంగా స్వతంత్రులు మరియు ఎవరిపైనా ఆధారపడాలని కోరుకోవడం లేదు. 3. వారు స్వేచ్ఛను ప్రేమిస్తారు మరియు తమ జీవిత నిర్ణయాలను తామే తీసుకోవాలనుకుంటున్నారు. 4. వారు వివాహం, మాతృత్వం మరియు కుటుంబ బాధ్యతలను తమ పురోగతికి అడ్డంకులుగా చూడటం ప్రారంభించారు. 5. ఈ ధోరణి కొనసాగితే, సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ మరియు సామాజిక నిర్మాణం కూలిపోవచ్చు. 6. జనాభా తగ్గుదల, అవివాహిత పురుషుల సంఖ్య పెరగడం, మరియు వృద్ధాప్యంలో ఒంటరితనం సమస్యలు తలెత్తవచ్చు. 7. ప్రశ్న కూడా తలెత్తుతుంది: జీవితం చివరిలో తోడుగా ఉండటానికి ఎవరూ లేకపోతే, పురోగతి, హోదా, డబ్బు వల్ల ఏమి ప్రయోజనం? _చాలా మంది తల్లిదండ్రులు తమ కూతుళ్లకు సంబంధాలు చూస్తున్నారు, కానీ అమ్మాయిలకు మాత్రం వివాహంపై ఆసక్తి లేదు. ఫలితంగా, ప్రతి ప్రతిపాదన తిరస్కరించబడుతోంది._ _సమాజంలోని ఒక పెద్ద వర్గం ఇప్పటికీ ఈ మార్పు యొక్క తీవ్రత గురించి తెలియకుండా ఉంది, కాబట్టి మనం సమయానికి అప్రమత్తం కావడం అవసరం._ _అమ్మాయిల వివాహానికి తగిన వయస్సు 23 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి, లేదా సాధ్యమైతే అంతకంటే ముందుగానే. దీని కోసం, సామూహిక స్థాయిలో అవగాహన మరియు చొరవ అవసరం._ _ఈ అంశం ఎవరికీ వ్యతిరేకంగా లేవనెత్తలేదు, కానీ భవిష్యత్తు స్థిరత్వం మరియు సమతుల్యత పట్ల ఆందోళనతో లేవనెత్తబడింది. సమాజం, కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడమే నిజమైన పురోగతి._ _ధన్యవాదాలు!_ 🙏 🌼🏵️💮🌸🪷🌷🍁🌺🥀🌹💐 : _మనమందరం దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి_ _భవిష్యత్తు యొక్క మండుతున్న సమస్య_ 👉🏿 పిల్లలు 20 ఏళ్లకు పెళ్లి చేసుకునేటప్పుడు, ఒక శతాబ్దంలో 5 తరాలు ఉండేవి. 👉🏿 పిల్లలు 25 ఏళ్లకు పెళ్లి చేసుకున్నప్పుడు, ఒక శతాబ్దంలో 4 తరాలు ఉండేవి. 👉🏿 ఇప్పుడు పిల్లలు 30 ఏళ్లకు పెళ్లి చేసుకుంటున్నప్పుడు, ఒక శతాబ్దంలో 3 తరాలు ఉన్నాయి. 👉🏿 ఆలోచించదగిన విషయం: మన సమాజం తదుపరి శతాబ్దం వరకు మనుగడ సాగిస్తుందా? ఈ రోజు ఒక వింత చీకటి వ్యాపిస్తున్నట్లు కనిపిస్తోంది. 🏚️ వీధులు మరియు పరిసరాలు నిర్మానుష్యంగా ఉన్నాయి, సమీపంలోని ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఈ రోజు, ఇళ్లలో పిల్లల శబ్దం తక్కువ, భార్యాభర్తల గొంతులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ★ అమ్మాయిలు 30–35 ఏళ్ల వరకు అవివాహితులుగా ఉంటున్నారు. ★ అబ్బాయిలు 35 తర్వాత కూడా అవివాహితులుగా ఉంటున్నారు. ★ ఆలస్య వివాహాలు... ఆపై విడాకులు (విడాకులు) విరిగిన కుటుంబాలు... అసంతృప్త తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఒంటరిగా... మొత్తం తరం శూన్యతను అనుభవిస్తోంది. 🤷🏻‍♀️ దీనిని మనం "విద్యావంతమైన సమాజం" అని పిలవాలా లేక "స్వీయ-వినాశక సమాజం" అని పిలవాలా? 💁🏻‍♂️ ఇది జనాభాను తగ్గించడానికి ఒక నిశ్శబ్ద కుట్రలా కనిపిస్తోంది. ★ 50 జంటలలో ఒక్కొక్కరికి ఒక్క పిల్లవాడు మాత్రమే ఉంటే, తరువాతి తరంలో పిల్లల సంఖ్య నామమాత్రంగా ఉంటుంది. 👉 ఇది కొనసాగితే, మూడవ తరం దాదాపు కనుమరుగైపోతుంది. 👉 పరిసరాలు మరియు వీధులు ఖాళీగా ఉన్నాయి. అందరూ రోడ్లపైనే ఉన్నారు. జీవితంలో సగం రోడ్లపైనే గడుస్తోంది. ★ మొత్తం గ్రామాలు కనుమరుగవుతున్నాయి. ★ నగరాల్లో ఎత్తైన భవనాలు ఉన్నాయి, కానీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ముగిసింది. 👉 కొత్త కోడళ్లు “ఒక్క పిల్లవాడు మాత్రమే” కావాలనుకుంటున్నారు. 🤷🏻‍♀️ ఇదేనా సమాజం? ❓ ఇదేనా మన పూర్వీకుల వారసత్వం? 👉 నిజం ఏమిటంటే... పిల్లలు ఇక ప్రేమకు చిహ్నం కాదు. బదులుగా, పిల్లలను కనడం ఒక బలవంతం లాగా అనిపిస్తోంది. ⚖️ అతిపెద్ద తప్పు— అమ్మాయి తండ్రిది, అదే తండ్రి 20–22 లో పెళ్లి చేసుకొని కుటుంబాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు అదే తండ్రి 30 వరకు కూతురికి పెళ్లి చేయకుండా ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. 👉 ఫలితం???? అబ్బాయిలు మరియు అమ్మాయిలు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. 👉 ఈ రోజు, పిల్లలకు సరైన సమయంలో పెళ్లి కానీ, సరైన సమయంలో ఉద్యోగం కానీ రావడం లేదు. 👉 సమాజం క్రమంగా క్షీణిస్తోంది. 👉 అందుకే పిల్లలు సమాజంతో కలిసి ఉండటం కంటే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అంటే, అణు కుటుంబాలు— పిల్లలను కూడా కోరుకోవడం లేదు. ★ ఆలస్యంగా పెళ్లి ★ ఆలస్యంగా పిల్లలు, ఆపై ఒక పిల్లవాడి తర్వాత వైద్య మరియు పెంపకం సమస్యల గురించి సాకులు 💁🏻‍♀️ ఇది సాధారణమైపోయింది. వయస్సు కారణంగా వేలాది మంది యువతీ యువకులు అవివాహితులుగా తిరుగుతున్నారు. సమాజంలోని విజ్ఞులు మౌనంగా ఉన్నారు. ★ వివాహం, కుటుంబం, పిల్లలు— అన్నీ భారంగా చూడబడుతున్నాయి. 🎈 వివాహం ప్రాపంచిక బంధం కాదు, ఇది ఇల్లు, కుటుంబం మరియు సమాజం యొక్క స్తంభం. 🎈 ఇది జాతి, నాగరికత మరియు సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే మార్గం. 💥 ఇప్పుడు మనమందరం అర్థం చేసుకోవాల్సిన సమయం. 🫵 పిల్లలకు “చాలా ఎక్కువ” స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా, మనం వారి వివేచనను తీసేసాము. ★ వివాహం ఆలస్యం అవుతూ వచ్చింది, మరియు అది జరిగే సమయానికి అప్పటికే ఆలస్యం అయిపోయింది. మళ్ళీ, అదే ఒంటరితనం. 🫵 వివాహానికి సరైన వయస్సు: 🔹 అబ్బాయిలకు: 25 లోపు 🔸 అమ్మాయిలకు: 20 లోపు 🚩 లేకపోతే చరిత్ర రాస్తుంది… “ఆ సమాజం నిశ్శబ్దంగా తనను తాను నాశనం చేసుకుంది.” ఆలోచించి తెలివిగా వ్యవహరించండి. మీ పిల్లలకు సమయానికి పెళ్లి చేయండి. 🙏 ఎందుకంటే... కుటుంబం సంరక్షించబడకపోతే, సమాజం కూడా కూలిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అందుకే డేవిడ్ సెల్బోర్న్ మరియు బిల్ వార్నర్ వంటి రచయితలు ఇస్లాం యొక్క బలమైన కుటుంబ వ్యవస్థ కారణంగా, ఆలస్యంగా అయినా సరే, చాలా దేశాలలో… భారతదేశంలో కూడా, కుటుంబ సంప్రదాయం యొక్క క్షీణత ప్రారంభమైంది. ఐదు రక్త సంబంధాలు అంతరించిపోయే అంచున ఉన్నాయి: పెదనాన్న, చిన్నాన్న, అత్త, మామ, పిన్ని— అలాంటి బంధాలు భవిష్యత్తులో కనిపించకపోవచ్చు లేదా వినిపించకపోవచ్చు. దీనిని ఇలా అర్థం చేసుకోవచ్చు: కొడుకు కూతురు 2 1 (పిన్ని X) 1 2 (పెదనాన్న/చిన్నాన్న X) 1 1 (పెదనాన్న/చిన్నాన్న, పిన్ని X) 1 0 X 0 1 X ఫలితం 0 0 ★ ఒకే పిల్లవాడు ఉన్న కుటుంబాల నిర్ణయం మూడవ తరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది— మీరు తాత/నానమ్మ/అమ్మమ్మ అయ్యే తరం. అసలు కంటే వడ్డీని ఎక్కువగా ప్రేమించే తాత— అసలును కూడా కోల్పోతాడు. దానికి అతనే బాధ్యుడు అవుతాడు. అందువల్ల, జంటలు ఒకే పిల్లవాడు అనే నిర్ణయం గురించి తీవ్రంగా ఆలోచించాలి. ఈ తగ్గుతున్న జనాభా గణాంకాలు మాట్లాడుతున్నాయి. ఈ విశ్లేషణ ప్రభుత్వ డేటాను అధ్యయనం చేయడం ద్వారా వచ్చింది. మీ మనవడు లేదా మునిమనవడు ఈ ప్రపంచంలో ఒంటరిగా నిలబడతాడు. అతనికి రక్త సంబంధాలు అవసరమైతే, ఈ మొత్తం విశ్వంలో అతనికి చెందినవారు ఎవరూ ఉండరు. ఇది లోతైన ఆందోళన కలిగించే విషయం. ఇది మన పిల్లలను ఒంటరి జీవితాలను జీవించమని బలవంతం చేయడమే కాకుండా మన కుటుంబ నాగరికతను కూడా నాశనం చేస్తుంది. మనం ఐక్యత గురించి మాట్లాడతాము— కానీ నాగరికతే కనుమరుగైపోతుంది. మరియు ఇవన్నింటికీ ప్రస్తుత తరం బాధ్యత వహిస్తుంది. ★ మీరు ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తే, అప్పుడు ఈ సమస్య గురించి ఆలోచించండి. ఇంట్లో, భార్యాభర్తల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, మరియు వివిధ సమావేశాలు మరియు కార్యక్రమాలలో దీని గురించి చర్చించండి. మీ నాగరికత, విలువలు మరియు భవిష్యత్ తరాలను కాపాడండి.
#🙏దేవుళ్ళ స్టేటస్ సీతజయంతి శుభాకాంక్షలు 25-04-2026
🙏దేవుళ్ళ స్టేటస్ - ShareChat
00:30
#మా ఇంటివంటలు ☕☕🏠 #🌅శుభోదయం
🌅శుభోదయం - ShareChat
#మా ఇంటివంటలు ☕☕🏠
మా ఇంటివంటలు ☕☕🏠 - ShareChat
#మా ఇంటివంటలు ☕☕🏠
మా ఇంటివంటలు ☕☕🏠 - ShareChat