#🌅శుభోదయం #💪పాజిటీవ్ స్టోరీస్
10-12-2025... బుధవారం
ఎంత సంపాదించిన శాశ్వతంగా నిలిచేది, చేసిన మంచి మాత్రమే...
పుట్టినరోజు నాడు నిచ్చనమెట్లరాజేంద్రప్రసాద్
...................
ఎన్నో సంవత్సరాలనుండి తన పుట్టినరోజును హంగు అర్బటాలకు పోకుండా ఒక క్రమపద్దతిలో చేసుకుంటున్న పాలమూరు క్రిష్టియన్ కాలనీ ( రాజేంద్రనగర్ ) నివాసి సేవాభూషణ్ / సేవాజ్యోతి అవార్డు గ్రహీత నిచ్చనమెట్లరాజేంద్రప్రసాద్.
పుట్టిన ప్రతిఒక్కరికి పుట్టినరోజుతో పాటు మరణం అనేది తప్పదు. మనము ఎంత సంపాదించిన, ఆ ధనముతో మన మరణాన్ని అసలు ఆపలేము. ఈ మధ్యకాలములో జరిగేదంతా మనము సమాజములో ఒక గుర్తింపుకు చేసే ప్రయత్నం మాత్రమే.మనము ఈ లోకం నుంచి వెళ్ళిపోయాక మంచి చేస్తే కొన్నిరోజులు తల్చుకుంటారు లేదా మర్చిపోతారు."ఏది శాశ్వతంగా ఉండదు ". ఎపుడైనా సరే ఎవరి వద్ద మనము ఏది ఆశించకుండా, వీలైతే కొందరికి సహాయం చేస్తూ వెళ్తుండాలి. ఎన్ని సమస్యలు వచ్చిన ఎదుర్కొని ముందుకు నడిచే మానసిక ధైర్యం అనేది ఎప్పటికి కోల్పోరాదని, దాదాపుగా 1997 సంవత్సరము సాయంత్రం బడులతో "అక్షరకిరణం వాలంటీర్" గా ఎంతోమంది నిరక్ష రాస్యులకు చుదువు చెప్పడం జరిగింది. మహబూబ్ నగర్ అప్పటి కలెక్టర్ పి.కృష్ణయ్య గారు మెడల్ మరియు ప్రశంసాపత్రముతో నన్ను సత్కరించడం జరిగింది.
అలా మొదలైన నా సేవా కార్యక్రమంలు ఇప్పటికీ నిరంతరాయంగా మాకు వున్న దానిలో ఏదోఒక రూపకంగా పేదవారికి సహాయం అందిస్తూ ఉన్నామని చెప్పారు. ఇప్పటికి ఎన్నో అవార్డులను,మెడల్స్ ను మరియు ప్రశంసా పత్రాలను అందుకోవడం జరిగింది. ఎన్నో సేవ కార్యక్రమం లను చేస్తున్నావాటిలో పుట్టినరోజు నాడు
2024 లో సేవాభూషణ్ అవార్డును మా అమ్మగారితో కలసి హ్యూమన్ రైట్స్ కాకినాడ వారి ఆధ్వర్యంలో
డి స్ పి మరియు జడ్జి గారి చేతుల మీదుగా పుట్టినరోజు నాడు తీసుకోవడం జరిగింది. అదేరోజు సాయంత్రం అక్కడ బస్ స్టాండ్ పరిసరప్రాంతములో వున్నవారికి దుప్పట్లు అందించడం జరిగింది.
2023 లో మా నాన్నగారి పేరు మీద తెలుగు హిందీ ఇంగ్లీష్ అక్షరమాల పఠాలను పాలమూరు ఎం ఎల్ ఎ గారి చేతులమీదుగా నా పుట్టినరోజు నాడు ఆవిష్కరించి దాదాపుగా 1200 మంది పిల్లలకు అందించడం జరిగింది.అదేవిదంగా ఆకలితో వున్నవారికి అన్నప్రసాదం అందించడం జరిగింది.
2022 లో అవాస కేంద్రములో విద్యార్థిని విద్యార్థులకు మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో వున్నవారికి అల్పాహారం తో పాటు పండ్లు బిస్కెట్ ప్యాకెట్ అందించడం జరిగింది.
2021 వృద్దులకు కొందరికి బట్టలు మరియు అన్నప్రసాదము, పండ్లు అందించడం జరిగింది.
2020 నిత్యావసర వస్తువులను అందించడం తో పాటు ఆహారం ను అందించాము.
2011 లో టచ్ ఆర్గనై్సేషన్ లోని పిల్లలకు స్వీట్ కార పండ్లను అందించడం జరిగింది.
సమాజములోని కొన్ని సంఘటలను చూసాక ఏది శాశ్వతం కాదని గమనించాను.
అంతేగాక మేము చిన్నపిల్లలుగా వున్నపుడు ఎక్కడికి వెళ్లిన ఏదోఒక వస్తు లేదా ధన రూపములో మా నాన్నగారు లేనివారికి ఇచ్చేవారు.
నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు,చదువు నేర్పిన గురువులకు హృదయపూర్వక పాదాభివందనంలు తెలుపుకుంటూ,బంధుమిత్రులకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.
ఇప్పటికి 75 సం. లు వున్న మా అమ్మగారు "వాసవి స్త్రీ శక్తి "అవార్డు గ్రహీత నిచ్చనమెట్లవరలక్ష్మి గారు స్వయంగా ఆహారమును వండడము జరుగుతున్నదని, మా ఇంటి మా అమ్మచేతి వంటతో కొందరి ఆకలి తీరుస్తున్నాము అని చెప్పారు.
నేను చివరగా ప్రతిఒక్కరికి ఒక విషయం చెబుతున్నాను, మనము నిత్యము ఎంతోమందిని మానసికభాదకు లోనై రహదారుల వెంబడి చూస్తువుంటాము. అలాంటి వారికి మన ఆర్ధికస్థోమతని బట్టి అలాంటివారికి బట్టలు ఇప్పించడం, ఆహారం అందించడం లేదా చివరకు కనీసం పండ్లు, బిస్కెట్ పాకెట్ తో వారికి కాసింత ఆకలిని తీర్చగలరు. నిత్యజీవితములో ప్రతిఒక్కరు శాశ్వతనిద్రలోకి వెళ్లాల్సినవారమే, ఏదోఒక రూపములో లేనివారికి సహాయం అందించండి అంటూ నిచ్చనమెట్లరాజేంద్రప్రసాద్ గారు అన్నారు.
అంతేగాక ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమం లు అనగా కరోనా సమయములో 13 రకాల నిత్యావసర వస్తువులను అందించడం, ప్రతినిత్యం సాయంత్రం వేళలో ఆహారం, నీటిని ప్రభుత్వ ఆసుపత్రి పరిసరప్రాంతములో వున్నవారికి అందించడం, ఇప్పటికి రాత్రిసమయంలో రహదారుల వెంబడి మరియు రైల్వేస్టేషన్ పరిసరప్రాంతములో వున్న వారికి ఆహరము, పండ్లు అందించడం.రక్తదానము చేయడం, అపుడపుడు కొత్తవి మరియు పాతవి బట్టలు ఇవ్వడం.పిల్లలకు పరీక్షప్యాడ్స్ పెన్నులు, పుస్తకాలను అందించడం. గోశాలలోని గోవులకోసం అపుడపుడు గోగ్రాసాము అందించడం జరుగుతున్నదని రాజేంద్రప్రసాద్ గారు అన్నారు.