
Sekhar Digitals & Reporter 9603197203
@sekhar9603197203
Reporter & Digital's Studio
#🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు
*ఎమ్మెల్యే గారూ..! కాట్రేనికోన గ్రంథాలయం పట్టించుకోరూ..!*
శిధిలభవనంలో పాఠకులకు భయం భయం.
గ్రామాల్లో ప్రజలకు విజ్ఞానాన్ని అందించే గ్రంధాలయాలు నిర్వహణ ఎవరికి పట్టడం లేదు. గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మండల కేంద్రంలోని కాట్రేనికోన గ్రంథాలయం రోడ్డున పడింది. సొంత భవనం లేక పాడుపడిన గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయంలో కొన్నేళ్లుగా శాఖా గ్రంధాలయం ను నెట్టుకొస్తున్నారు. విజ్ఞానం దేవుడెరుగు ఇక్కడ పాఠకులకు ప్రమాదం పొంచి ఉంది. అయినా ప్రజా ప్రతినిధులు,అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని పాఠకులు వాపోతున్నారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అయినా గ్రంథాలయం భవనం నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు. గత వైసిపి పాలనలో ఉన్న గ్రంథాలయ భవనాన్ని కూల్చి కొత్త భవనం నిర్మించలేదని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని మండల వ్యవస్థ ఆవిర్భావంతో అప్పట్లో కాట్రేనికోనలో తెలుగువిజ్ఞానసమాచారకేంద్రం ( గ్రంథాలయం )ప్రారంభమైంది. తర్వాత కాలంలో జిల్లా గ్రంధాల సంస్థ ఆధ్వర్యంలో శాఖా గ్రంధాలయంగా రూపుదిద్దుకుంది. అప్పట్లో కాట్రేనికోన సర్పంచ్ స్వర్గీ య కొవ్వూరి శ్రీరామరాజు హయాంలో గ్రామపంచాయతీ ఆవరణలో నిర్మించిన గ్రంథాలయం భవనాన్ని స్వర్గీయ ముమ్మిడివరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు చేతుల మీదుగా ప్రారంభించారు. అందరికీ అందుబాటులో సౌకర్యంగా ఉన్న ఈ గ్రంథాలయ భవనాన్ని వైసీపీ ప్రభుత్వపాలన లో కొత్త సచివాలయం నిర్మాణం కొరకు కూల్చేశారు. దాని స్థానంలో కొత్త భవనం నిర్మించి ఇవ్వలేదు.అయితే నాలుగేళ్లు కావస్తున్నా నాయకులకు గ్రంథాలయం ఊసే లేదు. రైతు భరోసా, సబ్ సెంటర్, గ్రామ సచివాలయాలకు భవనాలంటూ కోట్లు ఖర్చుపెట్టి అర్థం తరంగా, వృధాగా వదిలేసిన గత పాలకులకు గ్రంథాలయ భవనం గుర్తుకు రాలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ లైబ్రరీ డిజిటల్ లైబ్రరీగా అభివృద్ధి చెందాల్సి ఉంది. నిరుద్యోగులు, విద్యార్థులు పోటీ పరీక్షలు కు వెళ్లేందుకు పుస్తకాలు లేక నష్టపోతున్నారు. పాడుబడిన గ్రంథాలయ భవనంలో కనీసం విద్యుత్ సౌకర్యం లేదు. చీకట్లోనే చదువుకోవాలి. చిన్నపాటి వర్షం వచ్చినా తల దాచుకోవడానికి జాగా లేక అనేక ఇకట్లు పడుతూ ప్రమాదం బారిన అసౌకర్యం పాలవుతున్నామని పాఠకులు ఆవేదన చెందుతున్నారు. సరైన భవనం లేక జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు ఇక్కడ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయకుండా చివరకు విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు సరఫరాను కూడా నిలిపివేశారు. ఇటీవల కొత్తగా నిర్మించిన కాట్రేనికోన సెంటర్లోని సచివాలయ భవనం వెనుకనే ఉన్న ఖాళీ స్థలంలో గ్రంథాలయ భవనాన్ని నిర్మించాలని మండల గ్రంథాలయ పాఠకులు కోరుతున్నారు. ఇక్కడ గ్రంథాలయ భవనం నిర్మిస్తే అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండి సౌకర్యంగా ఉంటుందని పాఠకులు పేర్కొంటున్నారు. ఇకనైనా ప్రస్తుతం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అయినా చొరవ చూపించి కాట్రేనికోన లో గ్రంథాలయ భవనం నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు..
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#🆕Current అప్డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్డేట్స్
జగ్గయ్యపేట మండలం
జయంతిపురం గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ అశోక్ గుండె పోటుతో మృతి
ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో కుప్పకూలిన అశోక్
అశోక్ ది భీమవరం స్వగ్రామం....
గత కొద్దికాలం క్రితం వివాహం జరిగిన్నట్లు సమాచారం
తీవ్ర విషాదంలో తోటి ఉద్యోగులు
#🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్డేట్స్📢
*రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించడం జరిగింది..* బట్నవిల్లి అంగన్వాడి కేంద్రం జరిగింది పలు నోటుపాట్లను గుర్తించడం జరిగింది . చేయడం జరిగింది అనంతరం . రేషన్ షాపులు దుకాణాలు తనిఖీ చేయగా పడిపోయిన నాశరకం బియ్యం ఉండటం గుర్తించడం జరిగింది . దీనిపైన సదరు రేషన్ అడగగా మండల్ లెవెల్ స్టాగ్ పైనుంచి ఇవే వస్తున్నాయని ఇవే ఇస్తున్నామని సమాధానం చెప్పారు దీనిమీద మండల్ స్టాక్ పాయింట్ కి వెళ్ళటానికి చేయగా వివరణ అడగ్గా బియ్యం బస్తాల్లో వెంటనే మారు మారుస్తామని అన్నారు ముమ్మిడివరం లో ఉన్న మండల స్టాక్ పాయింట్ తనిఖీ చేయడం జరిగింది . డీలర్స్ కు సక్రమంగా కరెక్ట్ గా ఇవ్వాలని లేదంటే చర్యలు ఉంటాయని కిరణ్ అన్నారు.. తనిఖీ చేయడం జరిగింది అన్నారు అలాగే పోలవరం జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల నుంచి భోజనం సదుపాయాల నుంచి అడగంగా ఉడకడం లేదని కూరలు కూడా ఏమాత్రం తినడానికి బాగోట్లేదని అన్నారు దీని మీద విచారణ చేయమని ఎంఈఓ గారిని ఆదేశాలు జారీ చేశారు.... దీనిపై జిల్లా అధికారులకు సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.. సాంఘిక సంక్షేమ హాస్టల్ తనిఖీ చేయడం జరిగింది బిసి హాస్టల్ అలాగేతనిఖీలో భాగంగా సివిల్ సప్లై విద్యాశాఖ అధికారులు అంగన్వాడి అలాగే ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రోలజీ సాంఘి సంక్షేమ అధికారులు బీసీ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్డేట్స్
*వ్యాపారానికి రాయితీ సిలిండర్లు..*
గృహ అవసరాలకు విని యోగించాల్సిన రాయితీ గ్యాస్ సిలిండర్లను హోటళ్లకు మళ్లిస్తున్నారు..
జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా వినియోగం..
*ఓ హోటల్లో దర్శనమిస్తున్న నాలుగు రాయితీ సిలిండర్లు..*
*జిల్లాలోని వివరాలు గ్యాస్ ఏజెన్సీలు : 32*
*మొత్తం గ్యాస్ కనెక్షన్లు :5,40,000*
పెద్ద పెద్ద హోటళ్ల నుంచి రోడ్డు పక్కన రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లలో ఇవే విరివిగా కనిపిస్తున్నాయి.
*కొందరు వ్యాపారులు గ్యాస్ సరఫరా చేసే సిబ్బంది నుంచి వీటిని పొందుతున్నారు..*
ఈ వ్యవహారమంతా బహిరంగంగానే జరుగుతున్నా..
సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
*హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు,టీ స్టాళ్లు ఇలా ప్రతిచోటా నిర్వాహకులు నిబంధనల ప్రకారం 19 కేజీల వాణిజ్య సిలిండర్లు మాత్రమే వాడాల్సి ఉంది.*
పట్టణంతోపాటు సమీప గ్రామాల్లోని రెస్టారెంట్,ఇతర ఆహారశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంది..
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
*స్త్రీనిధికి డిజిటల్ హంగులు*
ఇక బ్యాంకులకు ధీటుగా మహిళా సంఘాలకు సేవలు..
👉 పుస్తకాల లెక్కలకు స్వస్తి – పూర్తిగా డిజిటల్ లావాదేవీలు..
👉 AI ఆధారిత స్త్రీనిధి యాప్ ప్రారంభం..
👉 రుణ దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే డబ్బులు...
👉 బయోమెట్రిక్ – పేపర్లెస్ విధానం..
👉 యాప్ ద్వారానే రుణ చెల్లింపు..
💰 ఒక్కో SHGకి రుణ పరిమితి..
➡️ రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంపు..
*2026–27 లక్ష్యం:*
*➡️ రూ.12,000 కోట్ల రుణాలు..*
___________________________
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు
*కన్నాతండ్రి లేకపోవటం రోడ్డుపై పడ్డ కుటుంబ*
*అమ్మ నాన్న ఎక్కడ ??? అంటూ ముగ్గురు చిన్న చిన్న ఆడపిల్లలు కన్నీరుపర్వతం తల్లికి ఏం చెప్పాలో తెలియని దుస్థితి*
*దయచేసి మానవ దృక్పథం తో సహాయం చెయ్యండి*
*ముమ్మిడివరంలో రెండు రోజులు క్రితం జరిగిన ఘటన*
అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొమనపల్లి గ్రామానికి చెందిన అబ్బాదాసుల నాగబాబు ఆయనకు ఒక భార్య ముగ్గురు ఆడపిల్లలు కుటుంబ పోషణ కోసం చిరు ఉద్యగం చేసుకుంటూ అద్దె నివాసంలో ఉంటున్నాడు.. తన తల్లికి అనారోగ్యంతో ఉండటం వైద్యం చేస్తూ తల్లి దగ్గరే నివాసం ఉంటున్నాడు...... అబ్బాదాసు నాగబాబు..... ఒక్కసారిగా ఆయనకు గుండెపోటు రావటంతో అక్కడిక్కడే మృతి చెందాడు ......
తల్లి తండ్రులు చూసే దిక్కులేదు...భార్య పిల్లలను అదుకునే దేవుడు లేరు......ఏం చెయ్యాలో.....ఎవరికి చెప్పాలో..... దేవుడు ఏ రూపంలో అయ్యిన వచ్చి కనికరిస్తాడో అనే భావంతో ఎదురుచూపులు...
ప్రతి రోజు మీరు ఎన్నో విధాలుగా ఖర్చు పెడతారు కొంచెం ఆలోచించి ఆ కుటుంబంనికి అండగా నిలుస్తారు అని ముగ్గురు ఆడపిల్లలకు దారి చూపుతారు వేడుకుంటున్నాం..........
ఎవరైనా దోచిన విధంగా చెయ్యాలి అనుకుంటే వారికి సంబంధించిన ఎకౌంట్ నంబర్...ఫోన్పే నంబర్....స్వయంగా వారికి ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకుని సహాయం చెయ్యాలి అని వేడుకుంటున్నాం.....అబ్బాదాసుల నాగబాబు .
STATE BANK.OF INDIA.MUMMIDIVARAM BRANCH..
ACCOUNT NAMBER..11543384475
IFSC...SBIN..0001462
సంప్రదించవలసిన నంబర్.భార్య పద్మ.....ఫోన్పే...google pay....9502504543
#📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు #🆕Current అప్డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
*కాట్రేనికోన లో ఆగని అక్రమ తాబేళ్ల రవాణా..*
*తాబేళ్ల అక్రమ రవాణా కేంద్రంగా కాట్రేనికోన గ్రామానికి పేరు ఉంది..*
ఈ ప్రాంతంలో చెంచుల జాతి వారు వేటాడిన తాబేళ్ల ను అక్రమ వ్యాపారులు కొనుగోలు చేసి దూర ప్రాంతాలకు రవాణా చేస్తూ ఉంటారు. ఈ అక్రమ వ్యాపారం ద్వారా లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో పలుసార్లు తాబేళ్లను పోలీసులు పట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. రెండేళ్లుగా నిలిచిపోయిన తాబేళ్ల రవాణా మళ్లీ ప్రారంభమైంది. తాబేళ్ల అక్రమ రవాణా ఆగడం లేదు. ఎవరికి అనుమానం రాకుండా వ్యాపారులు గతంలో మాదిరిగా ఆటోలు ,వ్యానులు, కార్ల పై కాకుండా మోటారు సైకిళ్లపై రవాణా మొదలుపెట్టారు. మండల కేంద్రమైన కాట్రేనికోనలో గురువారం ఒక వ్యక్తి తాబేళ్ల తో కూడిన బ్యాగులను మోటార్ సైకిల్ కు కట్టుకొని ఒక షాపు వద్ద ఆగాడు.స్థానికుడు ఒకరు దానిని గమనించి అనుమానంతో ఏమున్నాయి అని నిలదీశాడు. దీంతో అక్రమ రవాణా వ్యక్తి అక్కడినుండి ఉడాయించిట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనతో కాట్రేనికోన మండలంలో మళ్ళీ తాబేళ్ల అక్రమ వేట, రవాణా ప్రారంభమైందని అంటున్నారు. ఇంత జరుగుతున్నా తాబేళ్ల వేటను నిరోధించాల్సిన స్థానిక అటవీశాఖ అధికారులు ఎప్పుడూ పట్టించుకోరని ప్రజలు ఆరోపిస్తున్నారు. అసలు అటవీశాఖ అధికారులు ఇక్కడ పనిచేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాబేళ్ల వ్యాపారం లాభసాటి కావడంతో అక్రమ వ్యాపారులు పక డ్బందీగా చేస్తున్నారు. రవాణా మార్గంలో పోలీసులు పట్టుకున్న తాబేళ్ల ను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని మొక్కుబడి కేసులు పెట్టడం తప్ప అక్రమ వ్యాపారులను పట్టుకుని శిక్షించడం లేదని, తాబేళ్ల వేటను అరికట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా వేటాడిన తాబేళ్ల ను రాజమండ్రి,భీమవరం, కాకినాడ తదితర రైల్వే స్టేషన్లకు తీసుకువెళ్లి అక్కడనుండి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్లు తెలిసింది..
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం
*వంతెన.. ప్రమాదం అంచున*
ముమ్మిడివరం - నగర పంచాయతీ
పరిధిలోని మార్కెట్ నుంచి చింతలమెరక ప్రాంతానికి వెళ్లే వంతెన శిథిల స్థితికి చేరి ప్రయాణం..ప్రమాదభరితంగా మారింది..
*మెరక ప్రాంతానికి వెళ్లేందుకు వృద్ధ గౌతమి డ్రెయిన్పై ఉన్న వంతెనకు రంధ్రాలు పడటంతోపాటు రెయిలింగ్ విరిగిపోయింది..*
మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు..
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్డేట్స్
*మున్సిపల్ వాటర్ లో మురుకు నీళ్లు ఎన్నో..ఆర్డబ్ల్యూఎస్ వాటర్ లో అన్ని ఆపసోపాలే...*
ఏది త్రాగాలి ఏది త్రాగకూడదు.
*పంట కాలువల పారుదల పై సర్వత్ర చర్చనీయాంశం..*
త్రాగునీరు,సాగునీరుపై కోనసీమలో కొరవడిన అధికారుల పర్యవేక్షణ..
*ముమ్మిడివరం - ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, పై ప్రత్యేక కథనం త్వరలో...*
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
*ఉప్పు నీరు తో పంట చేలకు తీవ్ర నష్టం...*
అమలాపురం సమీపంలోని ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువు ఓల్డ్ సమనస నుండి కిత్తన చెరువు బోనులు వరుకు గల డ్రైనేజీ కి గండ్లు పడి గల్లు ద్వారా చేపల చెరువులు లోనుండి తోడిన ఉప్పు నీరు చేలు చుట్టూ చేరి వరిచేలు పాడై పోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఊడ్చి నచేలో నీరు దిగక దిగే మార్గం లేకపోవుట వలన తూటు గుర్రపు డెక్క పెరిగి పోవడం వల్ల సర్వే నెంబర్ 510, 500-2బి ,501,502 ,501-3బి,501-3ఎ 501-2 , 501-4,502-1 నెంబర్లు గల వరిచేలు నష్టపోయాయని ఆ ఏరియా రైతులు ఆవేదన వ్యక్తం చేసారు..ఎన్నో రూపాయలు ఖర్చు చేసి వరి పంట సాగు చేశా మని ఆక్వా చెరువు ల నీరు కారణంగా వరి చేలు పాడై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వారు పేర్కొన్నారు.
తొలకరిలో ఆకుమడులు వేసిన మురికి కాలువ నుండి ఆకుమడులు ములుగుట వలన తొలకరి సాగు చేయ లేక పోయామన్నారు. మురికి కాలువ గురించి పట్టించుకున్ననాధుడే లేడని వాపోయారు.నీటి సంఘం అధ్యక్షులు గాని రెవెన్యూ అధికారులు కానీ డ్రైనేజీ అధికారులు కానీ పట్టించుకోవడంలేదన్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి స్వయంగా పరిశీలన చేసి రైతులను కౌలు రైతులను ఆదు కోవాలని కోరుతున్నారు..
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼












