#👉నా స్టేటస్✍️ #✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం #👋విషెస్ స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
#🕉️om namo viswakarma 🙏 #👋విషెస్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
*ఎపుడో చెప్పెను బ్రహ్మంగారు*
*పంది కడుపులో ఏనుగు పిల్ల*
పంది కడుపులో పందే పుడుతుందన్న వెటకారంగా చెప్పే మాటలు విన్నాం.. కానీ పంది కడుపులో అచ్చం ఏనుగు పిల్ల ఆకారంలో ఓ పంది పిల్ల పుడితే. ఇంకేముంటుంది అది ఓ వింత ఘటనే అవుతుంది. తొండం, భారీ చెవులతో ఓ పంది ఏనుగు ఆకారంలో ఉన్న పిల్లకు జన్మనివ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది
నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారంలో పిల్ల జన్మించింది. పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో ఈ సంఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య అనే వ్యక్తి పందులను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఇంటి ఆవరణలోనే ఓ చిన్న పందిరి వంటి నిర్మాణంలో పందులను పోషిస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నాడు. అయితే అందులో ఒక పంది మొదటి ఈతలో ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. మొదట సంతోషం వ్యక్తం చేసిన యజమాని తర్వాత ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఏడు పంది పిల్లల్లో ఒకటి అచ్చం ఏనుగు ఆకారాన్ని పోలి ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు అంతలోనే కుటుంబ సభ్యులు, స్థానికులకు విషయం తెలిసిపోయింది. ఆనోట ఈనోట గ్రామస్థులు తెలియడంతో ఏనుగు ఆకారంలో ఉన్న పందిపిల్లను చూసేందుకు పెద్ద ఎత్తున వెంకటయ్య ఇంటికి తరలివచ్చారు. అచ్చం ఏనుగు పిల్ల ఆకారాన్ని పందిపిల్ల పోలి ఉండడం విశేషం. తొండం ఆకారం, భారీ చెవులతో చూడగానే ఏనుగు పిల్ల అనేలా కనిపిస్తోంది. అయితే జన్మించిన కాసేపటికే ఆ పంది పిల్లతో పాటు మరో పంది పిల్ల సైతం మరణించింది. ప్రస్తుతం ఐదు పందిపిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి.
#🌹ఈరోజు బంగారం రేటు🌹 #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #📰ఈరోజు అప్డేట్స్ #👋విషెస్ స్టేటస్
#👉నా స్టేటస్✍️ #👋విషెస్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
#👉నా స్టేటస్✍️ #🌅శుభోదయం #✌️నేటి నా స్టేటస్ #👋విషెస్ స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
#✨నేడే అక్షయ తృతీయ: ఈ వస్తువులు కొన్నా బంగారం కొన్నంత శుభాలు #🌅శుభోదయం #📰ఈరోజు అప్డేట్స్ #👋విషెస్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్
జగతికి వెలుగు..💥 తెలిపే..
అక్షయ తృతీయ శుభాకాంక్షలు..!!💐శ్రీ💐
బంగారమా.. ఉప్పా..!!💐
అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదా?
ఉప్పు కొంటె మంచిదా..??
అక్షయ తృతీయకు బంగారానికి లింకేంటి?
హిందువుల సాంప్రదాయం ప్రకారం…. సంవత్సరంలోని మూడు రోజులు ఏ పని ప్రారంభించడానికైనా చాలా మంచివి.
అవి..💐
1) ఉగాది.
2) అక్షయ తృతియ
3) విజయదశమి.
అందుకే ఈ మూడు రోజులను పవిత్రదినములుగా చూస్తారు.
అయితే ఇక్కడ అక్షయ తృతీయ గురించి కాస్తంత వివరంగా చెప్పుకుందాం…
అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది..
ఇది వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజు వస్తుంది కాబట్టి…దానిని అక్షయ తృతియ అంటారు.
మన పురాణాల ప్రకారం ఈ రోజు..💐
వేద వ్యాసుడు అక్షయ తృతీయనాడే మహాభారతం ఆరంభించాడు.
విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా అక్షయ తృతీయనాడే.
అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనే నియమానికి స్టార్టింగ్ పాయింట్ గా చెప్పుకునే లాజిక్:💐
కుచేలుడు దారిద్ర్యంతో అష్టకష్టాలు పడుతూ..
ఓ రోజు తన ప్రాణ స్నేహితుడైన శ్రీ కృష్ణుడిని చూసేందుకు వెళ్తాడు.
కృష్ణుని వద్దకు వెళ్లేటప్పుడు అటుకులు తీసుకెళ్తాడు. స్నేహితుడిచ్చిన అటుకుల్లో పిడికిలి తీసుకుని తిన్న కృష్ణుడు అక్షయం ప్రాప్తించుగాక అని ఆశీర్వదించాడు.
కృష్ణుడి అనుగ్రహంతో కుచేలుడు అష్టైశ్వర్యాలను పొందుతాడు.
ఆరోజునే అక్షయ తృతీయగా పరిగణించబడుతోందని పురాణాలు చెబుతున్నాయి.
అయితే దీనిని ఆధారంగా చేసుకొని ఈరోజు కొన్న ప్రతి వస్తువు మూడింతలు అవుతుందని ఓ నమ్మకం.
వాస్తవానికి ఈ రోజు వ్రతం చేస్తే దానికి మూడు రెట్లు పుణ్యం వస్తుంది,
పేదలకు దానం చేయడం వల్ల మూడు రెట్లు పుణ్యం వస్తుంది,
కొత్త పనులు ప్రారభించడం వల్ల ఎక్కువగా సక్సెస్ అవుతాయి.
వాటిని వదిలి బంగారం కొనాలి అనే కొత్త కాన్సెప్ట్ ను మన మీద రుద్దింది మాత్రం బంగారు వ్యాపారస్థులు. మొదట అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనే విధానం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉండేది.. కాలక్రమేణ అదే భావన మన దక్షిణ భారతదేశానికి కూడా వ్యాపించింది.
వీలైతే ఈ రోజు దానం చేయండి,
అంతేకానీ డబ్బులు లేకున్నా అప్పుచేసి మరీ బంగారు షాపులకు వెళ్లకండి.
మన దేశంలోని బంగారపు షాపులలో అత్యధిక వ్యాపారం జరిగేది ఈరోజేనట...
అక్షయ తృతీయ ప్రాముఖ్యత.💐
1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.
అక్షయ తృతీయ విశిష్టత.💐
వైశాఖ శుద్ధ తదియనాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు .
కొందరు వైశాఖ శుక్లపక్ష తృతీయ (తదియ ) రోహిణియుతమైన రోజునే, అక్షయతృతీయ పర్వదినంగా జరుపుకుంటారు .
ఇది ఒక నమ్మకం మాత్రమే .
పూజలు , వ్రతాలు , నోములు , యజ్ఞాలు ,యాగాలు చేస్తే ధనము , ఐశ్వర్యము వస్తుందనేది ఎంతమాత్రము శాస్త్ర సమ్మతం కాదు . . .
కాని నమ్మకం మూలానా మానవుడు కొంతవరకు ఆదా చేసే అవకాశము ,
కనీసము ఆరోజైనా భవిష్యత్తు అవసరాలకు ఆదాచేసే అవకాశము ఉంది.
ఒక తరము నుండి మరొక తరానికి " జ్ఞాపకాల " బదలాయింపు జరుగుతూ ఉండాలి ...
ఉంటేనే మన సంస్కృతి , సంప్రదాయాలు కలకాలము నిలిచిఉంటాయి.
అటువంటి పండుగయే ఈ "అక్షయ తృతీయ
పర్వదినం. . .
అక్షయం అంటే క్షయం లేకుండుట.
జీవితంలో అన్నింటిని అక్షయం చేసే పర్వదినం కనుక దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది.
ఈ రోజున చేసిన హోమాలు, దానాలు, పితృదేవతలకూ, దేవతలకూ చేసే పూజలు,
క్షయం కాకుండా, అక్షయంగా ఉంటాయని, అందుచేతనే ఈ రోజుకు అక్షయ తృతీయ
అని పేరు వచ్చిందని శ్రీ కృష్ణుడు,
ధర్మరాజుకు చెబుతాడు.
ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని తద్వారా లక్ష్మిదేవిని తమ తమ ఇళ్లల్లో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతుంటారు.
బంగారం కొనుగోలు చేయలేనివారు..
లవణం (అంటే ఉప్పు)ను కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన
వస్తువు కనుక బంగారం కొనలేనివారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు.
ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి,
శుచిగా స్నానమాచరించి విష్ణువును ప్రార్థిస్తే
సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
ఈ రోజున బదిరీనారాయణ మందిరం ద్వారములు భక్తుల దర్శనం కోసం తెరిచే ఉంటాయని వారు చెబుతున్నారు.
ఈ రోజున దేవతలను, పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్య ఫలము సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
గోదానము, భూదానము. సువర్ణదానము, వస్త్రదానము చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.
అందుచేత అక్షయ తృతీయ రోజున స్త్రీలు
చిన్ని కృష్ణునికి, గౌరీదేవీకి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులను శనగలు వాయనమిచ్చి
సత్కరిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆగృహం సిరిసంపదలతో వెల్లివిరుస్తుందని విశ్వాసం.
శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే "అక్షయ తృతీయ"గా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ రోజున శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం.
ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం.
బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు.. ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును
ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి,
కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు.
అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని
పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి.
ఇంకా చెప్పాలంటే...ఈ రోజున గోధుమలు,శెనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి, శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.
వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసే వారికి
పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
"వైశాఖమాసస్య చ యా తృతీయా నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే
నభస్య మాసస్య తమిస్రపక్షే త్రయోదశీ పంచదశీ చ మాఘే"
కావున ఇది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణాదులు పేర్కొనుచున్నవి.
కొన్ని ప్రాంతములలో వైశాఖశుద్ధ తదియనాడు
ఈ పండుగ చేయుచుందురు.
ఈనాడే "బదరీనారాయణ" మందిర ద్వారములు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెరుతురు. అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండియుండి అగమ్య గోచరమైన ఈ హృషీకేశము భక్తులచే కిటకిటలాడుచు పూజాదికాలు ప్రారంభమగును.
ఈ పుణ్యదినమందు దేవతలను, పితృదేవతలను ఆరాధించుట, గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము, పూర్ణఘటముతో నిండియున్న ఉదక దానము మున్నగునవి, మరియు ఈ దినమందు చేయు జప, హొమ, దానాదులన్నియు "అక్షయము" పొందునుగాన! ఇది "అక్షయతృతీయ" మని కృష్ణభగవానుడు స్వయముగా ధర్మరాజుకు వివరించినాడు.
ఇందులకొక పురాణగాధకలదు..💐
పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా; సత్ప్రవర్తన వీడక జీవించుచు ఒకసారి ఒక పౌరాణికుడు "వైశాఖశుద్ధ తృతీయ నాడు చేయు స్వల్పదానమైనను అక్షయ ఫలప్రదము" అని చెప్పగా విని,
ఆ దినమందు గంగలో పుణ్యస్నానమాచరించి దేవతలకు, పితృదేవలకు తర్పణమాచరించి,
ఇంటికి వచ్చి సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాదులతో దానమిచ్చెను.
అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంటవచ్చి మరుజన్మమున అతడు కుశావతీ నగరమునకు రాజుగా జన్మించెను.
అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు, దానధర్మాలు నిర్వర్తించుచున్నను వాని సంపద అక్షయమగుటే గాని తరుగలేదుట.
"అందువల్లనే మన పౌరాణికుల మాటలు పెడచెవిని పెట్టకుండా, విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు.
"వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,
దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా"
వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైనది అని విష్ణుపురాణాదులు చెప్పుచున్నవని, పరమభాగవతోత్తముడు నారదీయవచనమును నిర్ణయామృతకారుడు ఉదహరించినాడు.
అట్టి పుణ్య ఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వులము పునీతులౌదాము.
స్వస్తి..!!💐
ఓం నమః శివాయ..!!🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..!!🙏
శ్రీరామ జయరామ జయ జయరామ..!!🙏
లోకా సమస్తా సుఖినో భవంతు..!!💐
💐శ్రీ మాత్రే నమః💐
#🏵️దేవుళ్ళు🙏🙏భక్తిలోకం🏵️ #🌅శుభోదయం #👋విషెస్ స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్
ఓం నమః శివాయ...🙏🙏🙏
#🌹ఈరోజు బంగారం రేటు🌹 #✌️నేటి నా స్టేటస్ #📰ఈరోజు అప్డేట్స్ #😴శుభరాత్రి #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
#🏵️దేవుళ్ళు🙏🙏భక్తిలోకం🏵️ #👋విషెస్ స్టేటస్ #🌅శుభోదయం #✌️నేటి నా స్టేటస్ #😇My Status
కోటి మణీద్వీప వర్ణన పారాయణము.......!!
మణిద్వీప వర్ణన చేస్తే దాని ఫలితం వర్ణించలేం.
పారాయణము నియమాలు......
🚩నిత్యం పారాయణం
🚩ప్రతి ఒక్కరూ వారికీ కుదిరిన సమయంలో వారు చేయవచ్చు
🚩అమ్మవారి ముందు పూజలో ఎవరికి వారు చేసుకోవచ్చు ఎవరి శక్తి కొద్దీ వారు పూజ నైవేద్యం సమర్పించి అమ్మవారికీ పారాయణము చేసుకోవచ్చు
🚩ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారికీ ప్రత్యేకం
మహాసంపదలిచ్చు – మణిద్వీప వర్ణన......
మహాశక్తి మణిద్వీప నివాసిని
ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములొ మంత్రరూపిణి
మన మనస్సులలొ కొలువైయింది||1||
సుగంధ పుష్పాలెన్నో వేలు
అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనో సుఖాలు
మణి ద్వీపానికి మహానిధులు ||2||
లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణి ద్వీపానికి మహానిధులు ||3||
పారిజాత వన సౌగంధాలు
సురాధినాధుల సత్సంగాలౌ
గంధర్వాధుల గాన స్వరాలు
మణి ద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం ||4||
పద్మరాగములు సువర్ణమణులు
పది ఆమడల పొడవునగలవు
మధుర మధురమగు చందన సుధలు
మణిద్వీపానికి మహానిధులు ||5||
అరువదినాలుగు కళామతల్లులు
వరాలనొసగే పదారు శక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు ||6||
అష్టసిద్ధులు నవ నవ నిధులు
అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలౌ
మణిద్వీపానికి మహానిదులు ||7||
కోటి సూర్యులు ప్రపంచ కాంతులు
కోటి చంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు
మణిద్వీపానికి మహానిదులు
||భువనేశ్వరీ|| ||8||
కంచుగోడల ప్రాకారాలు
రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు
మణిద్వీపానికి మహానిధులు ||9||
పంచామృతమయ సరోవరాలు
పంచలోహమయప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు ||10||
ఇంద్రనీలమణి ఆభరణాలు
వజ్రపుకోటలు వైఢూర్యాలు
పుష్యరాగమణి ప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు ||11||
సప్తకోటి ఘన మంత్రవిద్యలు
సర్వ శుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||12||
మిలమిలలాడే ముత్యపురాసులు
తళ తళ లాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు ||13||
కుబేర ఇంద్ర వరుణ దేవులు
శుభాలనొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు ||14||
భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు
పంచ భూతములు పంచ శక్తులు
సప్తఋషులు నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు ||15||
కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్యకాంతి శిల మహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||16||
మంత్రిణి దండిని శక్తి సేవలు
కాళి కరాళి సేనాపతులు
ముప్పది రెండు మహాశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||17||
సువర్ణ రజిత సుందరగిరులు
అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు
మణిద్వీపానికి మహానిధులు ||18||
సప్త సముద్రములనంత నిధులు
యక్ష కిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు ||19||
మానవ మాధవ దేవ గణములు
కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలాయకారణమూర్తులు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||20||
కోటి ప్రకృతుల సౌందర్యాలు
సకల వేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మ శక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||21||
దివ్య ఫలములు దివ్యాస్త్రములు
దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్య శక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||22||
శ్రీ విఘ్నేస్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంత భవనములు
మణి నిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు ||23||
పంచ భూతములు యజమాన్యాలు
వ్రాళసాలం అనేక శక్తులు
సంతాన వృక్షసముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||24||
చింతామణులు నవరాత్రులు
నూరామడల వజ్రరాసులు
వసంత వనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు ||25||
దఃఖము తెలియని దేవీ సేవలు
నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్థాలు
మణిద్వీపానికి మహానిధులు ||26||
పదునాల్గు లోకాలన్నిటిపైన
సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వత స్థానం ||27||
చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల పంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములొ
||భువనేశ్వరీ|| ||28||
మణిగణ ఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములొ ||29||
పరదేవతను నిత్యము కొలిచి
మనసర్పించి అర్పించినచో
అపారధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది ||2 సార్లు|| ||30||
నూతన గృహములు కట్టినవారు
మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే
అష్ట సంపదల తులతూగేరు ||2 సార్లు|| ||31||
శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి
మణిద్వీప వర్ణన ఛదివినచోట
టిష్ట వేసుకొని కూర్చొనునంటా
కోటి శుభాలను సమకూర్చుకొనుటకై
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం ||2 సార్లు|| ||32||
ఫలశృతి: 14 లోకాలకూ పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని, పరమేశ్వరిని, తొమ్మిది విధాలుగా కీర్తిస్తూ తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టం కనుక మణిద్వీపాన్ని రోజుకు తొమ్మిది సార్లు చదివిన వారికి విశేష ఫలితాలు అందుతాయి. మణిద్వీపాన్ని శుక్రవారం రోజున తొమ్మిది సార్లు చదివిన వారికి ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలుగుతాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్య,
#🏵️దేవుళ్ళు🙏🙏భక్తిలోకం🏵️ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #👋విషెస్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #😇My Status
🕉️సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం🙏
🕉️ ఈ స్తోత్రం ప్రత్యేకత:
“కరావలంబం” అంటే చేయి పట్టుకుని కాపాడమని ప్రార్థించడం
🕉️ఈ స్తోత్రంలో భక్తుడు తన కష్టాల్లో నుండి బయటపడేందుకు స్వామిని వేడుకుంటాడు
🕉️ప్రతి శ్లోకంలో “వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్” అని మళ్లీ మళ్లీ కోరడం ఎంతో భావోద్వేగంగా ఉంటుంది
🕉️ పఠించడం వల్ల లాభాలు:
మనసుకు శాంతి, ధైర్యం వస్తాయి
భయాలు, కష్టాలు తగ్గుతాయి
ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది
స్వామి కటాక్షం వల్ల పాపాలు నశిస్తాయి (చివరి శ్లోకంలో చెప్పినట్లుగా)
🕉️ఎప్పుడు చదవాలి:?
ఉదయం స్నానం తర్వాత చదవడం చాలా మంచిది
ముఖ్యంగా మంగళవారం మరియు శష్ఠి తిథి రోజుల్లో చదివితే మరింత ఫలితం
🙏స్కంద షష్ఠి రోజున చదివితే ప్రత్యేక ఫలితం ఉంటుంది
🙏 చిన్న సలహా:
🙏పఠించే ముందు
👉 “ఓం శరవణభవాయ నమః” 11 లేదా 21 సార్లు జపించండి
అప్పుడు మరింత శక్తి వస్తుంది
హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో ।
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥
దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద ।
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 2 ॥
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ ।
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే ।
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 4 ॥
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ ।
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 5 ॥
హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ ।
హే వీర తారక జయాఽమరబృందవంద్య,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 6 ॥
పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః ।
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 7 ॥
శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ ।
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 8 ॥
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః ।
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ।
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి ॥
🙏“ఓం శరవణభవాయ నమః”🙏













