🪷 160లింగమహాపురాణం🪷
🍀పాశుపత మంత్ర
సంస్కారం🍀
#నూటఅరవైయ్యవభాగం#
శౌనకాది మునులు సూత మహర్షిని "మహర్షీ! పాశుపత మంత్ర సంస్కారము మొదట విష్ణువుఆచరించాడు.తరువాత బ్రహ్మదేవుడు, దేవతలు ఆచరించిశివానుగ్రహంపొందారు. మహాపాపి అయిన దుంధు ముఖుడి పుత్రుడు విశాలుడు కూడా ఆచరించి తనవారితో కలసి స్వర్గము, మోక్షముపొంద గలిగాడు. పాశుపత మంత్ర సంస్కారాలతోపశుపతిఆరాధన ఏ విధంగా చేయాలిమోక్షము పొందగలగాలి? మాకు తెలియ జేయండి" అని కోరారు.
సూతమహర్షిసరేననిఈవిధంగా చెప్పసాగాడు
"పూర్వము బ్రహ్మ మానస పుత్రుడైన సనత్కుమారుడు శిలాదునిపుత్రుడైననందీశ్వరునికి నమస్కరించి మీరడిగినట్లే "నందీశ్వరా! పశుపతి స్వామి పూజ ఏ విధంగా చేయాలి? పాశుపత సంస్కారం అంటే ఏమిటి? తెలియజేయండి" అని అడుగగానందీశ్వరుడువివరించి చెప్పాడు. మా గురువు గారు అయినవ్యాసమహర్షిసనత్కుమారుడి నుంచి ఉపదేశంపొంది ఆ విషయం మాకుబోధించాడు. నేను మీకు వివరిస్తాను.
సనత్కుమారా! నీవు శివుని భక్తుడవు కావున ఉన్నది ఉన్న ట్లుగాచెబుతాను.బ్రహ్మదేవునితో సహా సకల దేవతలను, ప్రాణులను పశువులు అని అంటారు. పాశములు అనగా బంధములచేతబంధించబడినవారుకనుకపశువులు ఐనారు. పరమేశ్వరుడు సకల విశ్వానికి, సకలప్రాణులకుఅధిపతికావున ఆయనను పశుపతి అని పిలు స్తారు.అనాది,అనంతుడుఐన పరమేశ్వరుడు పశువులను మాయపాశబంధముల చేత, బంధించి ఉంచుతాడు.
పరమేశ్వరుడి ఇరవై నాలుగు తత్త్వములే పాశములు. ఈ పాశములేజీవులనుసంసారంలో బంధించి ఉంచుతాయి. అవిద్య, అజ్ఞానపు ఈ పాశ బంధముల నుండి విముక్తి, మోక్ష ప్రాప్తి కేవలం పూర్ణ జ్ఞానముతో, భక్తితో శివుని సేవించిన వారికి మాత్రమే లభిస్తుంది. ఇంతకు మించి వేరే మార్గము లేదు. అంతఃకరణ శుద్దితోపదిజ్ఞానకర్మేంద్రయాలతో తనను సేవించి, పూజించిన వారిని మాత్రమే శివుడు భూత తన్మాత్రాది పాశముల నుండి విముక్తి కలిగిస్తాడు.
భజ అనే శబ్దానికి సేవించుట అని అర్థము. సేవ యొక్క ఆలోచన కలగటాన్ని భక్తి అని పెద్దలు చెబుతారు.బ్రహ్మదేవుని మొదలుకొని సకల జీవులు మూడు గుణాల స్థంభమునకు పశువులవలెపాశబంధములతో కట్టబడి ఉంటారు. పశుపతి అయిన పరమేశ్వరుడు తనను నిశ్చల నిర్మల వినమ్ర భక్తి మార్గములో కొలిచేవారిని ఈ బంధనముల నుండి విముక్తి కలిగిస్తాడు.
మనోవాక్కాయ కర్మలతో పరమేశ్వరుని పూజించుట, ఆరాధించుట, స్మరించుటను భక్తి అంటారు. ఈ భక్తియే ఖడ్గముగా మారి పాశములను ఖండించి విముక్తి నిస్తుంది.
సర్వవ్యాప్తమైన పరమేశ్వరుని వివిధ రూపాలు ఇందుకు అవసరసాధనాలుగాఉంటాయిశివుని గుణముల చింతనను (స్మరణను) మానసిక భజన అని, ప్రణవం (ఓంకారం) తో కూడి చేసే జపమును మౌఖిక భజన అని అంటారు.సజ్జనులు ప్రాణాయామమును శారీరక (కాయక) భజన అంటారు.
మాయ యొక్క కర్మ గుణాలు ఇరవైనాలుగుతత్త్వాలుఔతున్నాయి.విషయములుఅనిపిలువబడేఈఇరవైనాలుగుతత్త్వాల నుండి శరీరధారులు శివభక్తి చేత విముక్తి పొందుతారు.
పంచాంతరములు గల పాశ బంధనాలనుక్లేశములుఅంటారు. పశువులైన ప్రాణులను ఈశ్వరుడు ఈ క్లేశములతోనే బంధించుతాడు. నిర్మల నిశ్చల భక్తి మాత్రమే ఈ క్లేశముల నుండి విముక్తి కలిగిస్తుంది. అవిద్య (అజ్ఞానము), అస్మిత (అహంకారము), రాగము (కోరిక), ద్వేషము (విరోధము), అభినివేశము(సంసారసుఖములలో మునిగిపోవుట) లను పంచక్లేశములు అంటారు.
అవిద్య తమస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము అని ఐదు రూపాలలో ఉంటుంది.తమస్సు ఎనిమిది విధాలుగా ఉంటుంది. మోహముఎనిమిది విధాలుగా ఉంటుంది. మహామోహము పది విధాలుగా ఉంటుంది. తామిశ్రము, అంధతామిశ్రము కలసి పద్దెనిమిది రకాలుగా ఉంటుంది. పరమేశ్వరునికి వీటన్నిటితోసంబంధంఉండదు. కారణముఆయనమాయాతీతుడు, మోహాతీతుడు అవ్వటమే. అలాగే జీవులు చేసే కర్మలు మంచివి కానీ చెడ్ఢవి కానీ శివునికి సంబంధం ఉండదు. శివుడు సుఖదు:ఖాతీతుడు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
https://chat.whatsapp.com/DnFG7pWG3BkH6MKxaSFRFb #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺