Balaji Rayol
ShareChat
click to see wallet page
@vijayalaxmi980
vijayalaxmi980
Balaji Rayol
@vijayalaxmi980
ఐ లవ్ షేర్ చాట్ follow @meenumidhus
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ☘️పంచాంగం☘️ శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 13 - 04 - 2026, వారం ... ఇందువాసరే ( సోమవారం ) శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం, తిథి : *ఏకాదశి* రా9.32 వరకు, నక్షత్రం : *ధనిష్ఠ* మ12.48 వరకు, యోగం : *శుభం* మ2.24 వరకు, కరణం : *బవ* ఉ9.27 వరకు, తదుపరి *బాలువ* రా9.32 వరకు, వర్జ్యం : *రా8.09 - 9.47* దుర్ముహూర్తము : *మ12.24 - 1.14* మరల *మ2.53 - 3.42* అమృతకాలం : *లేదు* రాహుకాలం : *ఉ7.30 - 9.00* యమగండం : *ఉ10.30 - 12.00* సూర్యరాశి : *మీనం* చంద్రరాశి : *కుంభం* సూర్యోదయం : 5.49, సూర్యాస్తమయం : 6.10, *_నేటి విశేషం_* *వరూధిని ఏకాదశి* పురాణాల ప్రకారం మన తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున అత్యంత నియమ నిష్టలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మరియు ఉపవాసం వంటివి చేస్తే మీకు దురదృష్టం పోయి అదృష్టం వచ్చే అవకాశంతో పాటు మీరు ఇంతవరకు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంత ముఖ్యమైన వరూధిని ఏకాదశి ఈ నెల అంటే ఏప్రిల్ 18వ తేదీన వచ్చింది. ఈ సందర్భంగా వరూధిని ఏకాదశి వ్రతం కథ మరియు పూజా విధానాల గురించి తెలుసుకుందాం... పద్మపురాణ ప్రకారం... పద్మపురాణం ప్రకారం, ఒకప్పుడు మంధత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండేలా పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు, ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణు మూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడట. ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు. అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యే సరికే రాజు గారి కాలును ఆ ఎలుగుబంటి తినేసిందట. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన రెండు చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు. ‘ఓ ప్రభూ, ఇది నాకు ఎందుకు జరిగింది, అప్పుడు రాజు పూర్వ జన్మల పనుల ఫలాలకు ఇదంతా కారణమని చెప్పాడట. అయితే అదే సమయంలో అదే శ్రీవిష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడట. అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరూధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఈరోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్లీ మీకు తిరిగి లభిస్తాయని చెప్పాడు. ఆ దేవ దేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందుతాడట. అప్పటి నుండి వరూధిని ఏకాదశిని హిందువులలో చాలా మంది పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పర్వదినాన ఎంతో నిష్టతో ఉంటూ ప్రార్థనలు చేస్తారు. అలాగే భజనలు మరియు కీర్తనలు కూడా చేస్తారు. ఈ పవిత్రమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి, బ్రాహ్మణులకు మరియు పేదలకు ఈరోజు విరాళాలు ఇవ్వాలి. ఆ తర్వాతే మీ ఉపవాసాన్ని ముగించాలి. శ్రీక్రిష్ణుడు యుధిష్టర రాజుకు వరూధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పాడని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దీని ప్రకారం ఉపవాసం చేసేవారు ఎవరైనా జంతువుల పుట్టుక మరియు మరణ చక్రం నుండి స్వేచ్ఛ పొందుతారు. వరూధిని ఏకాదశి నాడు పేదలకు విరాళం ఇవ్వడం మానవ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాడు. ✔ చేయవలసినవి :- 🔵 దగ్గరలోనున్న వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే విశేషంగా విష్ణు భగవానుడి అనుగ్రహం పొందుతారు. (వీలు ఉంటే) 🔵 రోజంతా కృష్ణ, మాధవ, గోవింద అని హరినామాన్ని జపించండి. 🔵 ఏకాదశి రోజున ధాన్యంతో(బియ్యం, గోధుమ, బార్లే వంటివి) చేసిన ఆహారం నిషిద్ధము కావున పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం స్వీకరించవచ్చు. 🔵 శ్రీ మహా విష్ణువు చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసి హారం అర్పించాలి. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి 🔵 పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువులను అందుబాటులో ఉంచాలి, దక్షిణ ముఖంగా ఉన్న శంఖంలో గంగా జలం నింపి విష్ణువు అభిషేకం చేయాలి. *_☘️శుభమస్తు☘️_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏 #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు
🪷 160లింగమహాపురాణం🪷 🍀పాశుపత మంత్ర సంస్కారం🍀 #నూటఅరవైయ్యవభాగం# శౌనకాది మునులు సూత మహర్షిని "మహర్షీ! పాశుపత మంత్ర సంస్కారము మొదట విష్ణువుఆచరించాడు.తరువాత బ్రహ్మదేవుడు, దేవతలు ఆచరించిశివానుగ్రహంపొందారు. మహాపాపి అయిన దుంధు ముఖుడి పుత్రుడు విశాలుడు కూడా ఆచరించి తనవారితో కలసి స్వర్గము, మోక్షముపొంద గలిగాడు. పాశుపత మంత్ర సంస్కారాలతోపశుపతిఆరాధన ఏ విధంగా చేయాలిమోక్షము పొందగలగాలి? మాకు తెలియ జేయండి" అని కోరారు. సూతమహర్షిసరేననిఈవిధంగా చెప్పసాగాడు "పూర్వము బ్రహ్మ మానస పుత్రుడైన సనత్కుమారుడు శిలాదునిపుత్రుడైననందీశ్వరునికి నమస్కరించి మీరడిగినట్లే "నందీశ్వరా! పశుపతి స్వామి పూజ ఏ విధంగా చేయాలి? పాశుపత సంస్కారం అంటే ఏమిటి? తెలియజేయండి" అని అడుగగానందీశ్వరుడువివరించి చెప్పాడు. మా గురువు గారు అయినవ్యాసమహర్షిసనత్కుమారుడి నుంచి ఉపదేశంపొంది ఆ విషయం మాకుబోధించాడు. నేను మీకు వివరిస్తాను. సనత్కుమారా! నీవు శివుని భక్తుడవు కావున ఉన్నది ఉన్న ట్లుగాచెబుతాను.బ్రహ్మదేవునితో సహా సకల దేవతలను, ప్రాణులను పశువులు అని అంటారు. పాశములు అనగా బంధములచేతబంధించబడినవారుకనుకపశువులు ఐనారు. పరమేశ్వరుడు సకల విశ్వానికి, సకలప్రాణులకుఅధిపతికావున ఆయనను పశుపతి అని పిలు స్తారు.అనాది,అనంతుడుఐన పరమేశ్వరుడు పశువులను మాయపాశబంధముల చేత,   బంధించి ఉంచుతాడు. పరమేశ్వరుడి ఇరవై నాలుగు తత్త్వములే పాశములు. ఈ పాశములేజీవులనుసంసారంలో బంధించి ఉంచుతాయి. అవిద్య, అజ్ఞానపు ఈ పాశ బంధముల నుండి విముక్తి, మోక్ష ప్రాప్తి కేవలం పూర్ణ జ్ఞానముతో, భక్తితో శివుని సేవించిన వారికి మాత్రమే లభిస్తుంది. ఇంతకు మించి వేరే మార్గము లేదు. అంతఃకరణ శుద్దితోపదిజ్ఞానకర్మేంద్రయాలతో తనను సేవించి, పూజించిన వారిని మాత్రమే శివుడు భూత తన్మాత్రాది పాశముల నుండి విముక్తి కలిగిస్తాడు. భజ అనే శబ్దానికి సేవించుట అని అర్థము. సేవ యొక్క ఆలోచన కలగటాన్ని భక్తి అని పెద్దలు చెబుతారు.బ్రహ్మదేవుని మొదలుకొని సకల జీవులు మూడు గుణాల స్థంభమునకు పశువులవలెపాశబంధములతో కట్టబడి ఉంటారు. పశుపతి అయిన పరమేశ్వరుడు తనను నిశ్చల నిర్మల వినమ్ర భక్తి మార్గములో కొలిచేవారిని ఈ బంధనముల నుండి విముక్తి కలిగిస్తాడు. మనోవాక్కాయ కర్మలతో పరమేశ్వరుని పూజించుట, ఆరాధించుట, స్మరించుటను భక్తి అంటారు. ఈ భక్తియే ఖడ్గముగా మారి పాశములను ఖండించి విముక్తి నిస్తుంది. సర్వవ్యాప్తమైన పరమేశ్వరుని వివిధ రూపాలు ఇందుకు అవసరసాధనాలుగాఉంటాయిశివుని గుణముల చింతనను (స్మరణను) మానసిక భజన అని, ప్రణవం (ఓంకారం) తో కూడి చేసే జపమును మౌఖిక భజన అని అంటారు.సజ్జనులు ప్రాణాయామమును శారీరక (కాయక) భజన అంటారు. మాయ యొక్క కర్మ గుణాలు ఇరవైనాలుగుతత్త్వాలుఔతున్నాయి.విషయములుఅనిపిలువబడేఈఇరవైనాలుగుతత్త్వాల నుండి శరీరధారులు శివభక్తి చేత విముక్తి పొందుతారు. పంచాంతరములు గల పాశ బంధనాలనుక్లేశములుఅంటారు. పశువులైన ప్రాణులను ఈశ్వరుడు ఈ క్లేశములతోనే బంధించుతాడు. నిర్మల నిశ్చల భక్తి మాత్రమే ఈ క్లేశముల నుండి విముక్తి కలిగిస్తుంది.  అవిద్య (అజ్ఞానము), అస్మిత (అహంకారము), రాగము (కోరిక), ద్వేషము (విరోధము), అభినివేశము(సంసారసుఖములలో మునిగిపోవుట) లను పంచక్లేశములు అంటారు. అవిద్య తమస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము అని ఐదు రూపాలలో ఉంటుంది.తమస్సు ఎనిమిది విధాలుగా ఉంటుంది.  మోహముఎనిమిది విధాలుగా ఉంటుంది. మహామోహము పది విధాలుగా ఉంటుంది. తామిశ్రము, అంధతామిశ్రము కలసి పద్దెనిమిది రకాలుగా ఉంటుంది. పరమేశ్వరునికి వీటన్నిటితోసంబంధంఉండదు. కారణముఆయనమాయాతీతుడు, మోహాతీతుడు అవ్వటమే. అలాగే జీవులు చేసే కర్మలు మంచివి కానీ చెడ్ఢవి కానీ శివునికి సంబంధం ఉండదు. శివుడు సుఖదు:ఖాతీతుడు. *తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*. https://chat.whatsapp.com/DnFG7pWG3BkH6MKxaSFRFb #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ 🌹శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో🌹 💜   ఓం శ్రీఉమా మహేశ్వరాయ నమ:💜 🙏లోకా:సమస్తాః సుఖినోభవన్తు🙏 రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*      (సర్వం శ్రీశివార్పణమస్తు)                 🌷🙏🌷 శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి. 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
#🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు
🌅శుభోదయం - Good Morning Good Morning - ShareChat
#🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు
🌅శుభోదయం - Always do It comes 800d. back to you in unexpected ways: Eelieve ! Good morning Always do It comes 800d. back to you in unexpected ways: Eelieve ! Good morning - ShareChat
#🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు
🌅శుభోదయం - -000 _oulu -000 _oulu - ShareChat
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌻పంచాంగం🌻 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 12 - 04 - 2026, వారం ... భానువాసరే ( ఆదివారం ) శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం, తిథి : *దశమి* రా9.22 వరకు, నక్షత్రం : *శ్రవణం* ఉ11.48 వరకు, యోగం : *సాధ్యం* మ3.12 వరకు, కరణం : *వణిజ* ఉ9.02 వరకు తదుపరి *భద్ర* రా9.22 వరకు, వర్జ్యం : *మ3.58 - 5.38* దుర్ముహూర్తము : *సా4.31 - 5.20* అమృతకాలం : *రా1.58 - 3.38* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండం : *మ12.00 - 1.30* సూర్యరాశి : *మీనం* చంద్రరాశి : *మకరం* సూర్యోదయం : 5.49, సూర్యాస్తమయం : 6.10, *_నేటి మాట_* *భక్తి ఎలా వుండాలి???* భగవంతుడు భావ ప్రియుడు మాత్రమే, బాహ్య ప్రియుడు కాదు... ఈరోజు మన భక్తి అంతా బాహ్యమైనదే, ఎంత అలంకరించామా, ఎన్ని వంటలు చేసామా, ఎంతమంది మనలను పోగిడారా అనే ఆలోచనే ... ఇదంతా అహంకార భక్తి ... శ్రీకృష్ణుడి వద్దకు ఒకనాడు సత్యభామ బంగారుతట్టలో కొన్ని ఫలములు తెచ్చి కృష్ణుని ముందుంచింది... " ఇవి నా తోటలో పండిన పండ్లు, ఈ జాతి మరి ఎక్కడనూ లేదు" అని వాటిని గూర్చి గొప్ప గా వర్ణించినది... కృష్ణుడు ఒక తేలిక నవ్వు నవ్వి, ఒక పండును రుచి చూచి, ఇవి సారహీనములని చప్పరించి పడవేసెను... ఇంతలో "గుబ్బి" అనుఒక గొల్లపిల్ల దోసిటలో కొన్ని పండ్లు తెచ్చి "స్వామీ!! ఇవి అల్ల నేరేడుపండ్లు, స్వామి వలె శ్యామసుందరములు, అందువలన నాకు మిక్కిలి ప్రియములు"!!.. "దయతో గైకొని అనుగ్రహింపవలెను. " అనుచూ పాదముల మ్రోల వ్రాలినది... కృష్ణుడు వాటి రుచిని అడుగడుగునా మెచ్చుకొనుచూ, అన్నియూ తిని వేసెను. నిజానికి సత్యభామ ఇచ్చిన ఫలములు విలువ కలవి, రుచి కలవి... ఐన నేమి?! ఆమె అహంభావము స్వాతిశయము మూలమున భగవానుని దృష్టి లో అవి రసహీనము లైనవి... గోపిక స్వచ్ఛమైన ప్రేమ, అమాయకత్వము, అణుకువ మూలమున అవి భగవంతునికి అత్యంత ప్రియంకరములైనవి... అందుకు వాటినే స్వీకరించాడు, ఈరోజు భగవంతుడు మనము చేసే పూజలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు ఎన్ని స్వీకరిస్తున్నారో మనకే అర్థం కావాలి... స్వస్తి🙏... *_🌻శుభమస్తు🌻_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏 #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు
#🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు
🌅శుభోదయం - HAPPSUDV Ihe Sun S alone too but i-still shines GOOD Mo HAPPSUDV Ihe Sun S alone too but i-still shines GOOD Mo - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢
🆕Current అప్‌డేట్స్📢 - భోస్లేకు ప్రముఖ గాయని ఆశా గుండెపోటు. ముంబైబ్రీచ్ క్యాండీ ఐసీయూలో ఆశా ఆస్పత్రికి తరలింపు చికిత్స: భోస్లేకు అత్యవసర భోస్లే @9ন9 ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న ನದ್ಯಲು. 9:22 pm భోస్లేకు ప్రముఖ గాయని ఆశా గుండెపోటు. ముంబైబ్రీచ్ క్యాండీ ఐసీయూలో ఆశా ఆస్పత్రికి తరలింపు చికిత్స: భోస్లేకు అత్యవసర భోస్లే @9ন9 ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న ನದ್ಯಲು. 9:22 pm - ShareChat