🪷105లింగమహాపురాణం🪷
🍀 స్త్రీలు ఆచరించే ప్రత్యేక ఉమామహేశ్వర వ్రతాలు🍀
#నూట ఐదవ భాగం#
శౌనకాది మునులారా! ఇప్పుడు మీకు శివ భక్తులైన స్త్రీలు మార్గశిర మాసము నుండి కార్తీక మాసము చివరి వరకు చేసే ప్రత్యేక మాస వ్రతముల గురించి చెబుతాను. నందీశ్వరుడు ఈ వ్రతముల గురించి స్వయముగా వివరించాడు.
మార్గశిర మాసంలో స్త్రీ భక్తురాలు ధృడంగా, పుష్టిగా ఉన్న వృషభాన్ని చక్కగా అలకరించి శివునికి సమర్పించాలి. ఆమె ఉమాదేవి సన్నిధిలో నివసించి అన్ని సుఖసంతోషాలు పొందుతుంది. పుష్యమాసంలో విధి విధానాలతో ఉమామహేశ్వరుల పూజ చేసి పరమశివునికి త్రిశూలం సమర్పించాలి. ఆమె భవానీదేవి సానిధ్యం పొందుతుంది.
మాఘమాసంలో భక్తురాలు సర్వలక్షణములు గల రథము తయారు చేయించి, అలంకరించి, పూజించిన తరువాత శివునికి సమర్పించాలి. అనంతరం బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఆమె ఉమాదేవి సాన్నిధ్యంలో సకల సుఖాలు అనుభవిస్తుంది. ఫాల్గుణ మాసంలో బంగారంతో గానీ, వెండితో గానీ, రాగితో గానీ విగ్రహం తయారు చేసి, విధి పూర్వకంగా ప్రతిష్టింప చేసి, పూజలు చేసి విగ్రహాన్ని శివాలయంలో సమర్పించాలి. ఇలా చేసిన భక్తురాలు మహదేవుని సన్నిధి శివలోకంలో పొందగలదు.
చైత్రమాసంలో భక్తురాలు రాగి చేత గానీ ఇతర పదార్థములతో గానీ ఉమా మహేశ్వరులు, కుమారస్వామి విగ్రహాలు తయారు చేయించి వైదిక విధులతో ప్రతిష్టించి పూజించాలి. పిమ్మట శివునికి శివాలయంలో సమర్పించాలి. భక్తురాలు ఉమామహేశ్వరుల సానిధ్యంలో నివసించి సుఖాలు అనుభవిస్తుంది.
వైశాఖ మాసంలో భక్తురాలు శోభన కైలస వ్రతము చేయాలి. కైలాస పర్వతం నిర్మాణం చేసి దాని పై కుబేరుని ఆవాసము ఏర్పాటు చేయాలి. ఆ ఆవాసములో శివుడు , పార్వతీదేవి, గణేశుని వెండి విగ్రహములు చేయించి విధి పూర్వకంగా ప్రతిష్ఠించాలి. తరువాత ఆ విగ్రహాలను శివాలయంలో స్థాపించాలి.
జేష్ఠ మాసంలో ఉమాపతి అయిన పరమేశ్వరుని విగ్రహము రాగి లేదా ఇతర లోహములతో లింగ స్వరూపంలో తయారు చేయించాలి. ఆ లింగానికి హంస వాహనం పై ఉన్న బ్రహ్మదేవుడు, వరాహ వాహనం పై ఉన్న విష్ణువు నమస్కరిస్తున్నట్టు, లింగ మధ్యంలో శివ స్వరూపము విగ్రహములో ఉండాలి. ఆ విగ్రహాన్ని భక్తురాలు విధి పూర్వకంగా ప్రతిష్ట చేసి పూజలు చేయాలి. బ్రాహ్మణ స్త్రీలకు భోజనం ఏర్పాటు చేయాలి. తరువాత బ్రాహ్మణుల వెంట విగ్రహము శివాలయము తీసుకు వెళ్ళి స్థాపించాలి. దేవీ సాయిజ్యం ప్రాప్తమవుతుంది.
ఆషాడ మాసంలో భక్తురాలు తన శక్తానుసారం కాల్చిన ఇటుకల చేత గృహము నిర్మించాలి. ఆ గృహములో అన్ని విత్తనములు, రసములు, రోకలి మొదలైన గృహోపయోగ వస్తువులు, మంచములు, వస్త్రములు, వంట పాత్రలు మరియు అన్ని రకాల అన్నములు ఉంచి పరిపూర్ణం చేయాలి. ఉంచిన వాటి నన్నింటిని ఒక వస్త్రము చేత కప్పి ఉంచాలి.
శివునికి అభిషేకం, అర్చన, పూజ చేయాలి. వేద పండితుడు, బ్రహ్మచారి అయిన బ్రాహ్మణునకు ఆహ్వానించి పూజించాలి. పరిపూర్ణం చేసిన గృహమును గోవు, వృషభంతో కలిపి ఆ బ్రాహ్మణునకు దానము చేయాలి. ఈవిధంగా దానం చేసిన భక్తురాలు గోలోక నివాసం, భవానీదేవి సానిధ్యం పొందుతుంది.
శ్రావణ మాసంలో భక్తురాలు తిలాపర్వతమును, వివిధ ధాతు యుక్తములైన ధ్వజ పతాకములను పరమేశ్వరునికి సమర్పించాలి. బ్రాహ్మణులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేయాలి. శివసాయిజ్యం తప్పక లభిస్తుంది. భాద్రపద మాసంలో భక్తురాలైన స్త్రీ శాలిధాన్య పర్వతమును, లోహములను ధ్వజ పతాక వస్త్ర సహితంగా ఉమామహేశ్వరులకు సమర్పించాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టి వాటిని దానమివ్వాలి. భవానీదేవి సానిధ్యం పొంది సకల సుఖములు పొందుతుంది.
అశ్వయుజ మాసంలో భక్తురాలు శివపూజ చేసిన తరువాత ధాన్యముల చేత విశాలమైన పర్వతము ఏర్పాటు చేయాలి. , చక్కటి వర్ణముల గల వస్త్రములతో పాటు ఆ పర్వతమును శివునికి సమర్పించాలి. బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. ఉమామహేశ్వర సానిధ్యం లభిస్తుంది.
కార్తీక మాసంలో స్త్రీ భక్తురాలు మహేశ్వరుడు, ఉమాదేవి ప్రతిమలను బంగారంతో గానీ, వెండితో గానీ, తామ్రముతో గాని చేయించి, చక్కటి వస్త్రములు, ఆభరణాలతో అలంకరించి విధి పూర్వకంగా ప్రతిష్టించాలి. ఉమామహేశ్వరుల విగ్రహాల సుముఖాన అగ్నిదేవుని స్థాపించి, బ్రహ్మను ప్రతిష్టించాలి. అలాగే దిక్పాలులతో, సిద్దులతో పరివేష్టితుడైన విష్ణువుని కూడా ప్రతిష్ఠించాలి. ఈ వ్రతమును శివాలయంలో ఆచరించాలి. ఇలా చేసిన భక్తురాలు భవానీదేవి దేహము ప్రాప్తింప చేసుకుని శివుని చేరగలదు.
ప్రతి దినము ఒకసారి మాత్రమే భోజనం చేసి స్త్రీలు ఈ ప్రత్యేక మాస వ్రతములు మార్గశిర మాసము నుండి కార్తీక మాసం వరకు ఆచరించాలి. ఈ వ్రతము ఆచరించిన భక్తురాలికి ఉమాదేవి సాయిజ్యం లభిస్తుంది.
https://chat.whatsapp.com/DnFG7pWG3BkH6MKxaSFRFb #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ
*మిగతా కథ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺