🪷190లింగ మహాపురాణం🪷
🍀సూక్ష్మ పర్వత దానము స్వర్ణమేదిని దానము కల్పపాదప దానము గణేశ దానము🍀
#నూట తొంభైయ్యవ భాగం#
సనత్కుమారుడుశివపూజలలో ఇచ్చే వివిధ ప్రత్యేక దానాల గురించి చెబుతున్నారు :
సూక్ష్మ తిల పర్వత దానము :
ఈ దానములో ఉపయోగించు వస్తు సామాగ్రి స్వల్పమైనా లభించే పుణ్యఫలం అధికం. గోమయము చేత భూమిని అలికి శుద్ది చేయాలి. కొత్త వస్త్రమును భూమి పై పరవాలి.
మూడు మణుగుల తిలలను తెచ్చి వస్త్రము మీద పోయాలి.
తిలలపై అష్టదళ పద్మాన్ని కర్ణికలు, కేసరములతో పది సువర్ణ నిష్కములు లేదా అందులో సగం బంగారంతో ఏర్పాటు చేయాలి. తిలలు మధ్యగల పద్మములో మహేశ్వరుని విగ్రహం స్థాపించాలి. విధి పూర్వకంగా మహేశ్వరుని పూజ చేయాలి. తరువాత వామదేవుని ఇతర దేవతలను పూజించాలి.
మహేశ్వరునికి తోడుగామూడు బంగారు నిష్కములతో 'శక్తి' దేవి విగ్రహము చేయించాలి. న్యాస కృత్యములు చేసిన తరువాత నాలుగు దిశలలో మూడు నిష్కములతో చేయించిన విఘ్నేశ్వరుని విగ్రహములు స్థాపించి పూజలు విధిపూర్వకంగాగంధపుష్పాదులతో చేయాలి. పూజ పూర్తి అయిన తరువాత సూక్ష్మ తిల పర్వతమును వేదపండితుడైన సద్బ్రాహ్మణుడికి దానము ఇవ్వాలి.
స్వర్ణమేదిని దానము :
ముందుగా వేయి సువర్ణ నిష్కములతో (బంగారం నాణెములతో) భూమి (మేదిని) ఆకారమును వేదిక మీద మండలములో తయారు చేయించి ఉంచాలి. భూమి సప్తద్వీపములు,సముద్రములు, పర్వతముల చేత చుట్టబడి ఉండాలి. మధ్యలో మేరు పర్వతము ఉండాలి. పరమేశ్వరునికి జప, హోమ, పూజ, అభిషేకాలనుశ్రాస్తోక్తంగా మునులు, బ్రాహ్మణులతో జరిపించాలి.సహస్రకలశములతో శివుని అర్చించాలి.
మండలము పై పర్వతముల మధ్యగల సువర్ణ మేదినిని (భూమిని) శివభక్తునికి దక్షిణగా విధి పూర్వకంగాసమర్పించాలి. ఈ సువర్ణ మేదిని దానము సర్వోత్తమ దానము అని అంటారు.
కల్పపాదప (కల్పవృక్ష) దానము :కల్పవృక్షాన్ని వేయి సువర్ణ నిష్కములతో తయారు చేయించాలి. కల్పవృక్ష శాఖలు, భాగములు ముత్యాలతో చేయబడి ఉండాలి. పైన అంకురముల చివరలు మరకతములతోఅలంకరించ
బడి ఉండాలి. వృక్షపు చిగుళ్లు పగడములతో, ఫలములు పద్మరాగములతో చేయించాలి. ఊడలు గోమేధికముతో, అగ్ర భాగము వైడూర్యములతో, చెట్టుమూలమునీలరత్నములతో చేయించాలి.
వృక్షము నిలచి ఉండే పీఠము సూర్యకాంత మణి చేతగాని, స్ఫటికముచేతగానిచేయించ
బడాలి. వృక్షపు ఎత్తు బారెడు ఉండాలి. వృక్షపు ఎనిమిది శాఖల విస్తారముసమానముగా ఉండాలి. కల్పవృక్షపు(పాదపు) మూలములో శివలింగము ప్రతిష్టించాలి. లింగము చుట్టూ దిక్పాలురను స్థాపించాలి.
శివలింగమునకు అర్చన పూజ అభిషేకంచేయాలి.తులాభారంలో చెప్పినట్టు హోమాలు నిర్వ హించాలి. పూజలు, హోమాలు పూర్తి అయిన తరువాత కల్ప వృక్షాన్ని శివభక్తునికి లేదా శివయోగికి లేది భస్మధారుడికి దానముచేయాలి.ఈకల్పపాదప దానము చేసిన వ్యక్తి చక్రవర్తి అవుతాడు.
గణేశ దాన విధి :మొదట పది సువర్ణ నిష్కములతో విఘ్నేశ్వరుని ప్రతిమ తయారు చేయించాలి. దిక్పాలుర చేత పరివేష్టితుడైన పరమేశ్వరుని శాస్త్రోక్తంగా పూజించాలి. వినాయకుని విగ్రహమును ఆభరణములు వస్త్రములతో అలంకరించి పూజించాలి.
అష్టదిక్కులలో గల ఎనిమిది హోమకుండలాలలో హోమాలు చేయాలి.పంచావరణమార్గములో సంప్రదాయాన్నిఅనుసరించి హోమము చేయాలి. ఏడుగురు బ్రాహ్మణులను, ఒక కన్యను ఉత్తర దిశలో కూర్చుండబెట్టి పూజచేయాలి.వేదమంత్రములు పఠిస్తూ శాస్త్రోక్తంగా గణేశుని దానము చేయాలి.
https://chat.whatsapp.com/B3u5aJ9QEKC6nJ9VznswZM?mode=gi_t #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ
*తరువాతకధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺













