YS Jagan Mohan Reddy
ShareChat
click to see wallet page
@ysjagan
ysjagan
YS Jagan Mohan Reddy
@ysjagan
Chief Minister, Andhra Pradesh
Hello India, People of Andhra Pradesh are dying after drinking milk and water. What should be, the most basic necessities of life, have turned into sources of fear. Under the TDP-led coalition government and Chief Minister @ncbn, repeated outbreaks of diarrhoea and food poisoning are exposing a complete breakdown of public health administration. Chandrababu Naidu has clearly lost grip on governance while remaining busy building false narratives and pushing his Red Book style politics for his own interests instead of focusing on basic public health and safety. In Kurupam Tribal Welfare Girls School, 16 students fell sick with diarrhoea and five were rushed to hospital. This is the same school where two girls earlier died due to water contamination resulting in jaundice and nearly 100 students were hospitalised. No permanent corrective steps were taken. The system failed then, and it is failing again. In the past 14 months, nearly 25 outbreaks of food poisoning, contamination, and poor sanitation across Andhra Pradesh hostels and educational institutions have left over 900 students ill in 15 districts, exposing serious lapses in hygiene, food handling, and living conditions, as reported in National Media. Over the past eighteen months, major diarrhoea outbreaks were reported in Chebrolu, Vijayawada, Guntur, Gurla, Srikakulam and Turakapalam. Hundreds fell sick. Dozens died. Most cases were linked to unsafe drinking water and poor sanitation. These are not isolated incidents. They show a repeated pattern of negligence, weak supervision and collapse of preventive systems. Last week, the situation has turned even more alarming. In Srikakulam, contaminated drinking water triggered a major diarrhoea outbreak that claimed five lives and nearly 200 people hospitalised within days. Families watched their loved ones suffer from severe dehydration and infection. The incident exposed serious gaps in water quality monitoring, infrastructure maintenance and emergency response. In the same week, Rajamahendravaram witnessed another tragedy, this time linked to adulterated milk. Seven people lost their lives and eight others are struggling for survival on ventilators and many were hospitalised after consuming contaminated milk. Milk, which should nourish families and children, became a source of death. This is not a minor lapse. It points to a dangerous failure in food safety regulation, inspection and lapses in enforcement. At the very least, the government must come out of its hibernation mode and honestly assess what is going wrong. This is not the time for political distractions or image management. It is time to fix water supply systems, strengthen food safety monitoring, ensure strict sanitation standards and take real responsibility. People are not asking for miracles. They are asking for a government that wakes up, listens and acts before more lives are lost. ఎవరైనా బ్రతకడం కోసం పాలు, నీళ్లు తాగుతారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయి. పలు చోట్ల కల్తీ పాలు, కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసరమైన ఆ రెండింటి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడు పాలనలో డయేరియా, ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ఆ ఘటనలు అద్దం పడుతున్నాయి. పరిపాలనపై చంద్రబాబు పూర్తిగా తన పట్టు కోల్పోగా, మిగిలిన వారంతా ప్రతిపక్షంపై బురద చల్లడం, నిత్యం అసత్య ప్రచారం చేయడంతో పాటు, రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడ స్వార్థ ప్రయోజనాలు ఆశించి పని చేస్తూ.. ప్రజారోగ్యం, వారి రక్షణ వంటి వాటికి పూర్తిగా మంగళం పాడుతున్నారు. కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినులు డయేరియాతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. ఇదే పాఠశాలలో గతంలో కలుషిత నీటి కారణంగా పచ్చకామెర్లతో ఇద్దరు బాలికలు మృతి చెందగా, దాదాపు 100 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. అంత దారుణంగా ఘటనలు చోటు చేసుకున్నా, సమస్య శాశ్వత పరిష్కార దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు ఆ విధంగా వ్యవస్థ దారుణంగా విఫలం కాగా, మళ్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గత 14 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు, విద్యాసంస్థల్లో ఫుడ్‌ పాయిజన్, కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రత వల్ల వ్యాధుల వంటి ఘటనలు దాదాపు 25 చోటు చేసుకున్నాయి. వాటి వల్ల 15 జిల్లాల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయాన్ని జాతీయ మీడియా సైతం ప్రముఖంగా ప్రచురించింది. పూర్తిగా కొరవడిన పరిశుభ్రత, కలుషిత నీరు, ఆహారం, హాస్టళ్లలో దారుణ పరిస్థితులను జాతీయ మీడియా కూడా ఎండగట్టింది. రాష్ట్రంలో గడచిన 18 నెలల్లో చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో పెద్దఎత్తున డయేరియా ప్రబలింది. ఫలితంగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. ముఖ్యంగా కలుషిత నీరు, అపరిశుభ్రత అందుకు ప్రధాన కారణాలు. అయితే ఇదేమీ ఆషామాషీ వ్యవహారం, లెక్కలు కావు. ప్రభుత్వ నిర్లక్ష్యం, హాస్టళ్లపై పూర్తిగా కొరవడిన పర్యవేక్షణ, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టవలసిన చర్యల్లో వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. గత వారం పరిస్థితి మరింత దారుణంగా మారింది. శ్రీకాకుళంలో కలుషిత నీటి కారణంగా తీవ్ర డయేరియా వ్యాప్తి చెందింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది ఆస్పత్రుల పాలయ్యారు. అతిసారం, ఇన్ఫెక్షన్లతో పలు కుటుంబాలు తల్లడిల్లాయి. ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్ష, సురక్షిత నీటి సరఫరా కోసం తగిన మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వేగంగా స్పందించి, నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో.. వైఫల్యాన్ని స్పష్టంగా చూపాయి. అదే వారం రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాల కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో వివిధ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. ఇంకా మరెందరో అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. పోషణ ఇవ్వాల్సిన పాలు చివరకు మరణానికి కారణమయ్యాయి. ఇది ఏదో ఒక చిన్నపాటి లోపం కాదు. ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం, దానికి సంబంధించిన యంత్రాంగాల వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర లేచి నిజాయితీగా పరిస్థితిని సమీక్షించాలి. ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించాలి. వాటన్నింటినీ సరి చేయాలి. వాటి ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచన వీడాలి. సురక్షిత నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రత పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలి. వీటన్నింటిపై చిత్తశుద్ధితో పని చేయాలి. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏవో అద్భుతాలు కోరుకోవడం లేదు. ఇంకా మరిన్ని ప్రాణాలు పోకముందే ప్రభుత్వం మేల్కొని, తగిన చర్యలు చేపట్టాలని మాత్రమే ప్రజలంతా ఆశిస్తున్నారు. #🗞పాలిటిక్స్ టుడే #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #📰ఈరోజు అప్‌డేట్స్
🗞పాలిటిక్స్ టుడే - ShareChat
00:53
పులివెందులలో అనారోగ్యంతో బాధపడుతున్న వైయస్ రాజారెడ్డి గారి సోదరి కమలమ్మ గారిని పరామర్శించడం జరిగింది. #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🟢వై.యస్.జగన్ - ShareChat
00:30
చంద్రబాబు గారూ.. మీలాంటి అబద్ధాలకోరు ఈ భూమ్మీద ఎవరూ ఉండరు. శ్రీవారికి ఏడు కొండలు ఉండాలంటూ అప్పట్లో వైయస్‌ఆర్‌ గారు ఇచ్చిన జీవోలు 746, 747 రద్దు చేస్తానని మీరు చెప్పలేదా? సాక్ష్యాలు బయటికి వచ్చినా ఇంకా బుకాయింపులా? #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🗞పాలిటిక్స్ టుడే
🏛️రాజకీయాలు - ShareChat
00:52
I will always cherish the fond memories of our friendship and camaraderie, dear Goutham. A friend and brother, you will always be remembered. #📅 చరిత్రలో ఈ రోజు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🟢వై.యస్.జగన్
📅 చరిత్రలో ఈ రోజు - Reddy REDDY Reddy REDDY - ShareChat
భోలే బాబానే హర్ష్ ఫ్రెష్ డెయిరీ అని ఆధారాలు చెప్తున్నాయి. చంద్రబాబు హయాంలో 2018, జూన్ 26న భోలే బాబాకు టెక్నికల్ క్వాలిఫికేషన్‌ను టీటీడీ ఇచ్చింది. భోలే బాబా ప్లాంట్‌ను స్వయంగా వెళ్లి పరిశీలించినట్లు కూడా అప్పట్లో టీటీడీ బోర్డు తీర్మానంలో చెప్పింది. #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
🏛️రాజకీయాలు - ShareChat
00:47
ఇందాపూర్ డెయిరీని టీటీడీ నెయ్యి వ్యవహారంలోకి తీసుకొచ్చింది చంద్రబాబు సంస్థ. 2016లో ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ ఫెయిలై, డిస్‌క్వాలిఫై అయ్యింది. అంటే కల్తీ జరిగిందనేగా అర్థం? కానీ ఆ తర్వాత మూడు నెలల్లోనే మళ్లీ ఇందాపూర్‌కు చంద్రబాబు అర్హత కల్పించాడు.ఇందాపూర్ డెయిరీని టీటీడీ నెయ్యి వ్యవహారంలోకి తీసుకొచ్చింది చంద్రబాబు సంస్థ. 2016లో ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ ఫెయిలై, డిస్‌క్వాలిఫై అయ్యింది. అంటే కల్తీ జరిగిందనేగా అర్థం? కానీ ఆ తర్వాత మూడు నెలల్లోనే మళ్లీ ఇందాపూర్‌కు చంద్రబాబు అర్హత కల్పించాడు. #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
🏛️రాజకీయాలు - ShareChat
01:29
రాష్ట్ర ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరడం లేదు. అది పక్కదారి పట్టి చంద్రబాబు జేబుల్లోకి, కూటమి ఎమ్మెల్యేలకు, బినామీలకు వెళ్తోంది. దీనికి తోడు ప్రజాధనంతో చంద్రబాబు, నారా లోకేష్‌, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు. #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🟢వై.యస్.జగన్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🏛️రాజకీయాలు - ShareChat
01:29
మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు అన్న ఈరోజు ఉదయం తాడేపల్లిలో నన్ను కలిశారు. కూటమి ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులపై ఆందోళన చెందొద్దని, చట్టపరంగా ఎదుర్కుందామని భరోసా ఇచ్చాను. #🏛️రాజకీయాలు #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🏛️రాజకీయాలు - ShareChat
00:26