వర్షాల కోసం విద్యార్థుల వినూత్న ప్రార్థన.. సినుకమ్మ వాన జానపదం ఆకట్టుకుంది | Nyalkal24News
మెదక్ జిల్లాలోని కూకుట్లపల్లి పాఠశాల విద్యార్థులు వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ వినూత్న జానపద ప్రదర్శన చేశారు. ప్రధానోపాధ్యాయులు రామచందర్ ఆధ్వర్యంలో "సినుకమ్మ వాన సినుకమ్మ" జానపద గీతానికి విద్యార్థులు అద్భుత అభినయం ప్రదర్శించారు. రైతుల వేషధారణలో పంటలకు నీళ్లు పోస్తూ కర్షకుల కష్టాలను కళ్లకు కట్టిన ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
#న్యూస్ #Nyalkal24News