జ్యేష్ఠ పూర్ణిమా - దేవస్నాన పూర్ణిమా - పూరి శ్రీ జగన్నాథ స్వామి వారి మంగళస్నానమ్ / నెత్రోత్సవం 🛕🙏

2 Posts • 250 views
PSV APPARAO
642 views 5 days ago
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #పూరీ జగన్నాథ స్వామి వార్షిక స్నానోత్సవం 🛕🙏 #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #పూరీథామ్ - శ్రీక్షేత్రం - పూరీ జగన్నాథ్ స్వామి క్షేత్రంలో జరుగు ఉత్సవాలు (puri utsavs)🛕🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *జగన్నాథ వార్షిక స్నానం* *జూన్ 29 సోమవారం జగన్నాథ వార్షిక స్నానం సందర్భంగా...* జ్యేష్ట పౌర్ణమి తిథి సందర్భంగా పూరీ జగన్నాథునికి వార్షిక స్నానోత్సవం జరుగతుంది. రథయాత్రకు ముందు రెండురోజులపాటు జరిగే ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ మందిరం రత్న వేదిక నుంచి మూల విరాట్లు (సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాధుడు) ఒక్కోటిగా బహిరంగ స్నాన మండపానికి తరలిస్తారు. దీనినే పొహండి కార్యక్రమం అంటారు. మూల విరాట్లకు 108 కలశాలతో సుగంధ జలాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం గజానన అలంకారంతో ముస్తాబు చేస్తారు. అశేష భక్త జనానికి బహిరంగ వేదికపై దర్శనం ఇవ్వడం స్నానోత్సవ విశిష్టత. మహా రాష్ట్ర నుంచి 15వ శతాబ్దంలో విచ్చేసిన గణపతి భక్తుని అభీష్టం మేరకు ఏటా స్వామి గజానన అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నట్లు కథనం ప్రచారంలో ఉంది. అనంతరం తిరుగు పొహండి స్నాన మండపం నుంచి శ్రీ మందిరం లోనికి మూల విరాట్ల తరలింపు జరుగుతుంది. శ్రీజగన్నాథుని జరిగే సేవలను పరిశీలిస్తే కొంత ఆశ్చర్యం కలుగుతుంటుంది. స్వామివారికి జరిగే కొన్ని క్రతువులు సామాన్య మానవులకు జరిగినట్టుగానే నిర్వహిస్తుంటారు. జగన్నాథుడు యాత్ర ప్రియుడు ఈ యాత్రకు ముందు భారీగా స్నానం ఆచరించడంతో శారీరక పరిస్థితి అదుపు తప్పుతుంది. చీకటి మండపానికి తరలి వెళ్లి తెర చాటున గోప్య సేవల్ని అందుకుని నిత్య యవ్వన రూపంతో పక్షం రోజుల తర్వాత ప్రత్యక్ష మవుతాడు. ఏటా నిర్వహించే స్నానోత్సవం అందరిని ఆశ్చర్యచకితులను చేసే అంశం. శ్రీ మందిరం రత్న వేదికపై ప్రజల ఆరాధ్యదైవం జగన్నాథుని మూల విరాట్ దర్శనం పక్షం రోజులపాటు కనుమరుగవుతుంది. ప్రతినిధి దేవుళ్ల చిత్ర పటాలు భక్తులకు దర్శనమిస్తాయి. స్నానోత్సవం చేసుకున్న స్వామి చీకటి మండపానికి తరలివెళ్తాడు. పక్షం రోజులు ఈ మండపంలోనే సేవాదులు నిర్వహిస్తారు. మూలిక ఔషధాలు, తైల మర్దన, పత్యపు నైవేద్యాలు, కషాయం సేవన వంటి ఉపచారాలతో స్వామి తెర చాటున 15 రోజులపాటు భక్తులకు దూరంగా ఉంటాడు. పండ్లు, తేలికపాటి పొడి పదార్థాల్ని స్వామికి పక్షం రోజులపాటు నిరవధికంగా నివేదిస్తారు. అధిక స్నానం వలన స్వామివారికి జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు వచ్చాయని, ఈ ఉపచారాల వలన వాటినుండి స్వామివారికి ఉపసమనం కలుగుతుందని విశ్వసిస్తారు. ఈ కార్యక్రమం మానవాళిని చైతన్య పరిచేందుకే ఈ ఉత్సవం నిర్వహిస్తారని పండితులు చెబుతున్నారు. స్వామి స్నానోత్సవం తర్వాత వానా కాలం పుంజుకుంటుంది. ఈ వానల్లో తడిస్తే సామాన్య మానవుని పీడించే జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తల్ని జగన్నాథుని గోప్య సేవలు, ప్రత్యేక నైవేద్యాలు మానవాళికి సూచిస్తాయి. జ్వరంతో నలిగిన శరీరానికి పత్యపు ఆహార సేవనం కొత్త యవ్వనం ప్రదానం చేస్తుందనే స్పృహను జగన్నాథుని స్నానోత్సవ ఘట్టం చివరి అంకం స్పష్టం చేస్తుంది. విశ్వవ్యాప్త భక్త జనం కంటిలో పడకుండా కట్టుదిట్టంగా ఆరోగ్య నియమాలను పాటించిన జగన్నాథుడు 15 రోజులయ్యేసరికి నవ యవ్వనుడుగా ప్రత్యక్షమవుతాడు. ఈ ప్రత్యక్ష దర్శనమే నవ యవ్వన ఉత్సవంగా రథయాత్ర ముందు రోజు ఈ వేడుకగా నిర్వహిస్తారు. ఆరోగ్యమే మహా భాగ్యం అనే సందేశం జగన్నాథుని స్నానోత్సవం వెళ్లడిస్తుంది. ప్రధాన దేవాలయం రత్న వేదికపై చతుర్ధాదారు (కలప) మూర్తులు నిత్యం ధూప దీపాదుల సేవలతో మసకబారుతాయి. వన్నె తగ్గుతాయి. సందర్భోచితంగా స్నానాదులు ఆచరించి నిత్యం తేజోవంతంగా వెలుగొందే విధి విధానాలు ఈ ప్రక్రియ ద్వారా తెలుసుకోవచ్చు. మహా స్నానం పురస్కరించుకుని భారీ దారు విగ్రహాలు సుభాషిత జలంతో శుభ్రమవుతాయి. శ్రీ మందిరం పరిసరాల్లో దశాబ్దాలుగా నెలకొల్పివున్న మఠాలు జగన్నాథ స్వామికి సేవలు చేయడం అదృష్టంగా భావిస్తాయి. ఆ మఠాలు స్వామివారికి ఉత్సవాల్లో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. ఆలయ సంప్రదాయాల ప్రకారం రాఘవ దాసు మఠం, గోపాల తీర్థ మఠం స్వామి స్నానోత్సవానికి అవసరమైన సరుకులను అందజేస్తాయి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩* _ఆధ్యాత్మికం ఆనందం_
10 likes
3 shares
PSV APPARAO
557 views 5 days ago
#పూరీ జగన్నాథ స్వామి వార్షిక స్నానోత్సవం 🛕🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #మీకు తెలుసా! పూరీ జగన్నాథ్ స్వామి వారి 'హోమ్ క్వారంటైన్' / స్వామి వారికి జ్వరం వచ్చింది #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ *శ్రీ జగన్నాథ స్వామివారికి మహాస్నానోత్సవం* *జగన్నాథా స్వామికి పూరీలో స్నాన పౌర్ణిమ* 🪔 *108 బంగారు కలశాలతో శ్రీజగన్నాథ స్వామివారికి మహాస్నానం* 🪔 🪔 *15 రోజుల పాటు అనారోగ్య విశ్రాంతి... జూలై 16న రథయాత్ర* 🪔 ఒడిశాలోని జగన్నాథ పూరీలో ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణిమ రోజున స్నాన పౌర్ణిమ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజున శ్రీజగన్నాథుడు, అన్నయ్య శ్రీబలభద్రుడు, చెల్లెలు దేవి సుభద్రమ్మతో కలిసి భక్తుల సమక్షంలో మహాస్నానం చేస్తారు. సంవత్సరంలో ఇదొక్కరోజే ఈ ముగ్గురు దేవతలకు ఆలయం వెలుపల 108 బంగారు కలశాల్లోని పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిస్తారు. అందుకే దీనిని స్నాన పౌర్ణిమ అని పిలుస్తారు. స్నానం అనంతరం శ్రీజగన్నాథ స్వామివారికి జ్వరమొచ్చినట్లు భావించి 15 రోజుల పాటు విశ్రాంతి కల్పిస్తారు. ఈ కాలంలో భక్తులకు స్వామివారి ప్రత్యక్ష దర్శనం ఉండదు. ఆ తరువాత రథయాత్ర సందర్భంగా భక్తులకు తిరిగి దర్శనమిస్తారు. ఈ సమయంలో భగవంతుడు అనారోగ్యంతో ఉన్నారని విశ్వసించి, భక్తులు ఆలార్నాథ ఆలయాన్ని దర్శిస్తారు. జగన్నాథ స్వామివారి దర్శనానికి సమానమైన పుణ్యం ఆలార్నాథ స్వామివారి దర్శనంతో లభిస్తుందని విశ్వాసం. ఆలార్నాథుడు శ్రీజగన్నాథుని పరమభక్తుడిగా ప్రసిద్ధి చెందాడు. జగన్నాథ ఆలయ అర్చకుల ప్రకారం, సాధారణ రోజుల్లో స్వామివారికి గర్భగృహంలోనే స్నానం చేయిస్తారు. అయితే ఇప్పుడు ప్రతిరోజూ అద్దం ద్వారా స్నానం చేయించే ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. స్వామివారి ఎదుట పెద్ద అద్దాలను ఉంచి, వాటిపై పవిత్ర జలాలను పోస్తారు. ఆ అద్దాల్లో ప్రతిబింబించిన స్వామివారికి స్నానం చేసినట్లుగా భావిస్తారు. ఇలా చేయడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. జగన్నాథుని విగ్రహాలు చెక్కతో తయారైనవి. ప్రతిరోజూ నేరుగా నీటితో స్నానం చేయిస్తే చెక్క దెబ్బతినే అవకాశం ఉంటుంది. స్వామివారు అత్యంత సుకుమారులు అనే భావనతో ప్రతిరోజూ పూర్తిస్థాయిలో స్నానం చేయించకుండా ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ కారణంగానే రథయాత్రకు 16 రోజుల ముందు వచ్చే జ్యేష్ఠ పౌర్ణిమ రోజున మాత్రమే స్వామివారిని ఆలయం వెలుపలికి తీసుకొచ్చి ప్రత్యేక స్నాన మండపంలో మహాస్నానం నిర్వహిస్తారు. 📿🛕🏮 *108 బంగారు కలశాలతో మహాస్నానం* 🏮🛕📿 స్నాన పౌర్ణిమ రోజు ఉదయం ఆలయంలోని బంగారు బావిని (స్వర్ణకూపం) తెరిచి పవిత్ర జలాలను తీస్తారు. వేద మంత్రోచ్చారణ మధ్య శ్రీజగన్నాథుడు, శ్రీబలభద్రుడు, దేవి సుభద్రమ్మ, సుదర్శన చక్రానికి 108 బంగారు కలశాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఈ కలశాల్లోని నీటిలో కస్తూరి, కుంకుమపువ్వు (కేసర్), చందనం, కర్పూరం మరియు అనేక ఔషధ మూలికలు కలుపుతారు. అనంతరం మూడు పెద్ద చెక్క సింహాసనాలపై స్వామివారిని ఆసీనులుగా ఉంచి అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా శ్రీజగన్నాథ స్వామివారికి 35 కలశాలు, శ్రీబలభద్రునికి 33 కలశాలు, దేవి సుభద్రమ్మకు 22 కలశాలు, సుదర్శన చక్రానికి 18 కలశాలు తో అభిషేకం నిర్వహిస్తారు. ఈ బంగారు బావి సుమారు 4–5 అడుగుల వెడల్పు గల చతురస్రాకార బావి. ఇది జగన్నాథ ఆలయంలో గర్భగృహం మరియు వాహనమైన సింహ విగ్రహం మధ్య భాగంలో ఉంది. ఈ బావి చుట్టూ గంగవంశ రాజు ఇంద్రద్యుమ్నుడు బంగారు ఇటుకలను అమర్చినట్లు చెబుతారు. ఈ బావిలో అనేక పవిత్ర తీర్థాల జలాలు కలిసివున్నాయని విశ్వాసం. బావి మూతను సిమెంట్, ఇనుముతో తయారు చేశారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే, స్నాన పౌర్ణిమ సందర్భంగా సుమారు 12 నుండి 15 మంది సేవకులు కలిసి మూతను తొలగిస్తారు. బావిలోకి తొంగిచూస్తే బంగారు ఇటుకలు కనిపిస్తాయని భక్తుల నమ్మకం. సంప్రదాయం ప్రకారం మహాస్నానం అనంతరం శ్రీజగన్నాథ స్వామివారు అనారోగ్యానికి గురవుతారు. అందువల్ల భక్తులకు ప్రత్యక్ష దర్శనం ఉండదు. ఈ సమయంలో స్వామివారిని ప్రధాన సింహాసనం నుంచి ప్రత్యేక గదికి తీసుకెళ్లి చెక్క మంచంపై విశ్రాంతి కల్పిస్తారు. సుమారు 56 రకాల ఔషధ మూలికలు, పాలు, పంచదార, తేనె తదితర పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు. స్వామివారి అవయవాలకు ప్రత్యేక ఆయుర్వేద తైలంతో మర్దన చేస్తారు. దీనిని ఫులురి తేల్ అంటారు. ఈ తైలంతో స్వామివారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని విశ్వాసం. దశమి నాడు స్వామివారిని రత్న సింహాసనంపై తిరిగి ప్రతిష్ఠిస్తారు, స్వామివారి శరీరానికి ప్రత్యేక ఔషధ లేపనం చేస్తారు. దీనిని ఖలి లాగి అంటారు. జూలై 14: స్వామివారి నేత్రాలకు మళ్లీ రంగులు అద్ది అందంగా అలంకరిస్తారు. జూలై 15: నవయౌవన దర్శనం నిర్వహిస్తారు. ఈ రోజున భక్తులు అనారోగ్యం నుంచి కోలుకున్న స్వామివారిని తొలిసారిగా దర్శిస్తారు. జూన్ 16: మహా వైభవంగా శ్రీజగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. భక్తులకు ఎంతోకాలంగా ఎదురుచూసే ఈ మహోత్సవం ద్వారా శ్రీజగన్నాథుడు తన అన్నయ్య, చెల్లెలుతో కలిసి రథాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩* _ఆధ్యాత్మికం ఆనందం_
14 likes
17 shares