om sri gurubhyo namaha

43 Posts • 53K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
709 views 2 months ago
గురువారం పరిహారం.........!! పిల్లలు భవిష్యత్తు అభివృద్ధి కోసం పిల్లల తో గణపతి సరస్వతి పూజ సూర్యనమస్కారం హయగ్రీవ స్తోత్రాలు చేయిస్తుండాలి, అదే పిల్లల భవిషత్తు బాగుండటం కోసం వారు క్రమశిక్షణ తో మంచి అలవాట్లు ఆలోచన విద్య బుద్ది కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తిని ఆరాధించాలి ముఖ్యంగా గురువారం రోజు , గురువారం రోజు శివాలయంలో పసుపు రంగు వస్త్రం పైన బియ్యం పిండి తో రెండు చిన్న ప్రమిధలు పెట్టి నేతి దీపాలు పెట్టి దక్షిణామూర్తి స్త్రోత్రం చేయాలి నానబెట్టిన పచ్చి సేనగలు దండ మూర్తికి వేయాలి 9 ప్రదర్శనలు చేయాలి ఇలా 9 గురువారాలు చేయాలి కాలేజ్ సీట్ కోసం వీసా కోసం ఉద్యోగం కోసం అలాగే పిల్లలు మొండి తనంతో ఇబ్బందులు పడే తల్లిదండ్రులు ఇలా చేస్తే వారిలో మార్పు వస్తుంది పిల్లల కోసం తల్లి ఈ పూజ చేయవచ్చు ఎవరి కోసం చేస్తారో వారి షర్ట్ భుజాన వేసుకుని చేయవచ్చు. అలాగే 9 గురువారాలు కొబ్బరిచిప్పలో దీపారాధన చేయడం నానబెట్టిన సేనగలు ఆవుకి తినిపించడం కుక్కకు చపాతీలు పెట్టడం వల్ల ఉద్యోగం లో ఆటంకాలు తొలగుతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవకాశం వస్తుంది ప్రమోషన్ ఆటంకాలు తొలగి పోతుంది, రాబోయే గండం తప్పుతుంది పిల్లలు యొక్క మానసిక పరివర్తన లో మార్పువస్తుంది ఇది వ్యాపార సమస్యలు కూడా తీరుతుంది. ఇది చేయడం ఖర్చు లేదు శ్రమ లేదు నమ్మకంతో భక్తితో చేయాలి ఎంతో మందికి గొప్ప ఫలితం ఇచ్చింది. దత్త పారాయణ చేయడం దత్త ప్రదర్శన దత్తాత్రేయ స్తోత్రం పాలు నైవేద్యం పెట్టి చేయడం వల్ల అనేక కుటుంబ సమస్యలు ఆర్ధిక ఇబ్బందులు తొలిగిపోతుంది.. గురువారానికి లక్ష్మీ వారం అని పేరు గురువు అనుగ్రహంవల్ల ఆరాధన వల్ల లక్షి కటాక్షం కలుగుతుంది. గురువారం గో పూజ విశేష ఫలితం ఇస్తుంది. #తెలుసుకుందాం #🔯దోష పరిహారాలు🔯 #om sri gurubhyo namaha
10 likes
13 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
621 views 2 months ago
గురువు..లభించడానికి.........!! పౌర్ణమాస్యాం తథా దర్షే న రాత్రౌ భోజనం చరేత్! ఈ శ్లోక భావం ఏమిటి అంటే.. పౌర్ణిమ,అమావాస్యలలో రాత్రి పూట భోజనం చేయకూడదు. అలాగే జగద్గురువుల సాన్నిధ్యం లభించడానికి పౌర్ణమి రోజున చేసే ధ్యానం అత్యుత్తమమైంది. ఎందుకంటే, "పౌర్ణమి రోజు చంద్రుడు గురు శిష్యుల ముఖ్య ముఖద్వారంగా వుంటాడు" అని వేదాలు ఉద్భోధిస్తున్నాయి. భూలోకంలో జీవించే జీవరాశులకు సూక్ష్మశరీరం లోనూ, మనోమయ శరీరంలోనూ, ఆనందమయ శరీరంలోనూ పౌర్ణమి రోజులలో విశ్వశక్తి అత్యంత అధిక పాళ్ళలో నిబిడీకృతం అవుతుంది. పౌర్ణమి రోజున మనస్సు ధ్యానానికి అనుకూలంగా వుంటుంది. అధిక సంఖ్యలో ధ్యానులు సామూహిక ధ్యానం చేస్తే ఊర్ధ్వలోకాలలోని పరమగురువులు సమాయత్తమయి ధ్యానసాధకులకు దివ్యశక్తినీ, దివ్యజ్ఞానాన్నీ అందిస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే పౌర్ణమిరోజు ధ్యానం చేయడం వల్ల పూర్ణాత్మతో అనుసంధానం లభిస్తుంది. (ఈ విషయంపై ప్రతీ ధ్యానసాధకుడు దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది). పౌర్ణమి- అమావాస్య రోజులలో ధ్యానం చేయడం వలన"దివ్యశక్తులు" మరియు"దివ్యసూక్తులు" సాధకులు ఊర్థ్వలోకాల గురువుల నుంచి పొందటానికి చక్కటి సదవకాశం లభిస్తుంది. ఈ రెండురోజుల్లో భూలోకంలోని ధ్యానసాధకుల ఊర్ధ్వలోకాలలోని గురువుల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలపడతాయి. #తెలుసుకుందాం #om sri gurubhyo namaha
9 likes
15 shares