Go🐄🐮🐄🐮 pooja ## gomatha ki jai 🙏🙏🌷💐🌷
27 Posts • 29K views
భారతదేశంలో గోవు పుట్టుక సాధారణమైనది కాదు.......!! భారతీయ సంస్కృతీ, సభ్యతల్లో..., ధర్మంలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. లోక కళ్యాణం కోసం భగవంతుడు ఆవును సృష్టించాడని హిందువుల నమ్మకం..! పాడి, పంట, సమృద్ధి, శాంతి, ఆరోగ్యం, ధార్మికత అన్నింటికి గోమాతనే ఆధారం...! భారతీయ జీవన విధానానికి శ్రద్ధా కేంద్రమైన ఈ గోవును నిర్మూలించి...తద్వారా మన జాతిని నిర్వీర్యం చేసేందుకు విదేశీ శక్తులు...వారికి అండగా మార్క్స్, మేకాలే, కుహాన లౌకికవాదులు, స్వయం ప్రకటిత మేధావులు, దారితప్పిన కొన్ని విద్యార్థి సంఘాలు కుట్రలు మొదలు పెట్టారు. వేదాల్లోనే గోవధ ఉందంటూ తప్పుడు ప్రచారంతో హిందూ సంస్కృతికి పై దాడులు మొదలు పెట్టారు. భారతీయ గోవు పుట్టుక, చరిత్రయే వేరు..! దేవదానవులు అమృతం కొరకు సముద్ర మథనం చేశారు. మొదట హాలాహలం అనే భయంకరమైన విషం సముద్రగర్భం నుంచి ఉద్భవించింది. దీంతో లోక క్షేమం కోసం శివుడు హాలాహలాన్ని సేవించాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి, ఐరావతము, ఉచ్చైశ్రవము, చంద్రుడు సముద్రగర్భం నుంచి ఉద్భవించారు. అటు పిమ్మట కల్పవృక్షము, కామధేనువు ఉద్భవించాయి. అనంతరం అమృతాన్ని తీసుకుని భగవాన్ శ్రీ ధన్వంతరి ఆవిర్భవించాడు. మోహిని రూపంలో శ్రీమహావిష్ణువు అమృతాన్ని దేవతలకు యుక్తిగా పంచాడు. దేవతలంతా అమరులయ్యారు. దేవతలకు అమృతం పంచిన భగవంతుడు... మానవుల సమస్త యోగక్షేమాలను చూడటం కోసం అమృతం యొక్క నాభి కలిగియున్న కామధేనువును ఇచ్చాడు. మానవుల సమస్త కోరికలనూ తీర్చేది గోవు అయిన కామధేనువే...! దేవతలకు మరణం లేదు..., మానవులకు మరణం తప్పదు..! అయితే వీరికి వందేళ్ల ఆయుర్ధాయాన్ని కలిగి ఉండేట్లు దేవుడు ఏర్పాటు చేశాడు. ఐతే ఇది ఆయుర్వేదంలో చెప్పటిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తేనే సాధ్యం...! గోవు నుంచే లభించే పంచగవ్యములు... పాలు, పెరుగు, నెయ్యి,గోమూత్రము, గోమయంతో చేసే ఎన్నో ఔషధాలను చెప్పారు. అప్పుడే మానవుడు శతమానం భవతి అనే ఆశీస్సులకు యోగ్యుడవుతాడు...! ఆవు ను...వేదాల్లో అఘన్య, అహీ...అని వర్ణించారు. అంటే...గోవును చంపరాదని అర్థం. అదితి అని కూడా చెప్పారు. అంటే ముక్కలు చేయరానిది అని అర్థం..! పుణ్యభూమి భారత దేశంలో ప్రాచీన కాలం నుంచి గోవధ జరగలేదు. గోవు ప్రాముఖ్యం, ప్రధాన్యాలను తెలిపే అనేక శాసనాలు, అయోధ్య, కోశాంభి, ఉజ్జయిని, శాతావాహన, పల్లవ రాజ్యాధిపతులు ఏర్పాటు చేశారు. నాణాలపై కూడా గో ముద్రలు వేయించారు. కొంతమంది ముస్లిం పాలకులు సైతం హిందువుల సెంటిమెంటును గౌరవిస్తూ గోవధను నిషేధించారు. అయితే బ్రిటిష్ దేశంలో తమ పాలనను సుస్థిరం చేసుకునే కుట్రలో గోవధను ప్రొత్సహించారు. కొంతమంది విదేశీ చరిత్రకారులతోపాటు తప్పుడు ప్రచారాన్ని అసత్య సిద్ధాంతాలను, అభూత కల్పనలు తెరపైకి తెచ్చారు..! గో హత్యను బ్రహ్మహత్యతో సమానమని రుగ్వేదం, యజుర్వేదం ఖండించాయి. అంతేకాదు గోవధ చేసినవారికి మరణదండన విధించాలని చెప్పాయి. ఇంత స్పష్టంగా గోవధను వేదాల్లో ఖండిస్తే..., కనీసం సంస్కృత భాషా పరిజ్ఞానం లేని మార్క్స్, మేకాలే వాదులు వేదాల అర్థాలకే పెడార్థాలు తీస్తూ సమాజంలో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. తప్పుడు రాతలతో, ప్రచారంతో అయోమయం సృష్టిస్తున్నారు. ఈ జాతి వ్యతిరేక శక్తుల పట్ల హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలి. గో రక్షణ కోసం ఉద్యమానికి సిద్ధం కావాలి. #Jai gomatha🕉️🚩🙏 #gomatha #save gomatha #gomatha #తెలుసుకుందాం
20 likes
37 shares
గోమహిమ అపారమైన విజ్ఞానంతో వేదములు మొదలుకొని, వేదాధారమైన అన్ని గ్రంథాలలోనూ కనపడుతున్నది. ఇటు వైద్యగ్రంథాలలోను, అటు ధర్మశాస్త్ర గ్రంథాలలో కూడా గోప్రశస్తి గోచరిస్తోంది. “యూయం గావో మేదయథ కృశం చిదశ్రీరం చిత్కృణుథా సుప్రతీకమ్ |భద్రం గృహం కృణుథ భద్రవాచో” – ఈ వేదమంత్రమునందు చెప్తున్న అంశము కృశించిన శరీరము గల వారికి నీవల్లనే హృష్ట, పుష్ట శక్తి వస్తున్నది అని. హృష్ట అంటే మనస్సుకు సంబంధించిన ఆనందం, పుష్ట అంటే శరీరానికి కావలసిన ఇంద్రియ పటుత్వం. ఈ రెండూ కూడా నీవల్లనే వచ్చాయమ్మా అని గోవును కీర్తించారు ఇక్కడ. అంటే గోక్షీరాది గవ్యముల వల్ల లభిస్తున్నది శారీరక పుష్ఠి, మానసిక తుష్టి. ఈ రెండూ ఇవ్వగలిగే శక్తి గోక్షీరానికి కానీ ఆ క్షీరం నుంచి కలిగే ద్రవ్యానికి కానీ ఉన్నది. దీనికి సంబంధించి అనేక పరిశోధనలు కూడా తేట తెల్లం చేస్తున్నాయి. అందుకే ప్రతి తల్లీదండ్రీ కూడా వారి పిల్లలకి ఆవుపాలు పట్టడం అనేది ప్రధానంగా అలవాటు చేసుకోవాలి. దేశవాళీ గోవుల క్షీరాన్ని పుచ్చుకున్నట్లయితే తప్పకుండా పిల్లలకు మేధస్సు వృద్ధిచెందుతుంది. ఇంద్రియ పుష్ఠి కూడా కలుగుతుంది. ఇది ప్రతి తల్లిదండ్రీ నిర్ణయించుకుంటే తప్పకుండా ఆవు రక్షింపబడుతుంది. ఆవుయొక్క అవసరాన్ని మనం ఎక్కువగా తెలుసుకోగలిగితే ఆవును రక్షించుకోగలం. ఆవిధంగా రైతులకు కూడా విజ్ఞానం కలిగించాలి. కేవలం పాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఎక్కువ సొమ్ముల కోసం ఆవులను అమ్ముకుంటున్నారు. కానీ పాలు ఇవ్వకపోయినా సరే ఆవును మనతో పాటు ఉంచుకుంటే అది ఇచ్చే సంపద ఎంతో అధికము. ఈ పరిజ్ఞానం వాళ్ళకు కలిగించాలి. ఎందుకంటే ఆవు యొక్క పేడ కానీ, గోజలం గానీ వీటికి కూడా ఔషధీగుణములు ఉన్నాయి. పంచగవ్యముల ద్వారా తయారుచేసిన ఔషధములు మొండియైన దీర్ఘకాలిక వ్యాధులను కూడా తొలగిస్తున్నాయి అని వైద్యశాస్త్రంలో ఋజువు అవుతున్న సత్యాలు. అందుకే పంచగవ్య చికిత్సలు కూడా ఎక్కువగా వ్యాప్తి చేయాలి. దీనికి ముందుకు రావలసినవి ధార్మిక సంస్థలు, దేవాలయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మానవుల సంక్షేమాన్ని కోరుకునే సాంస్కృతిక సంస్థలు కూడా ముందుకు రావాలి. వీటి అవసరాన్ని వ్యాప్తి చేయాలి. ఇప్పుడు జాగృతి కలుగుతూ మన భారతదేశంలో అనేక రాష్ట్రాలలో కొంతమంది పంచగవ్య ఉత్పత్తులను తీసుకొస్తున్నారు. అదేవిధంగా గోవును పూజించి ప్రయోజనం ఏమున్నది? ఎటువంటి ప్రయోజనమూ లేదు. మనం పూజిస్తే అది భయపడి ప్రక్కకు పోతుంది కదా! అటువంటి దానిని పూజించడం ఏమిటి? అనే వాళ్ళు ఉంటూ ఉంటారు. వారికి విన్నపం ఏమిటంటే గోవు భయపడవచ్చు, గోవును పూజిస్తున్నాం అని గోవుకు తెలియకపోవచ్చు, గోవుకు ప్రదక్షిణ చేస్తున్నాం అని గోవుకు తెలియకపోవచ్చు, ఎందుకంటే గోవులో ఉన్న జ్ఞానము, గోవులో ఉన్న జీవుడు వేరు. కానీ గోవు శరీరం మాత్రం భగవంతుడి ద్వారా ప్రసాదింపబడింది. ఆ శరీరంలో దేవతా శక్తులు ఉంటాయి. ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. గోవు శరీరంలో ఏ దేవతాశక్తులు ఉన్నాయో గోవుకు తెలియకపోవచ్చు. దానికి ప్రదక్షిణ చేసినట్లయితే దానిలో ఉన్న దేవతల అనుగ్రహం లభిస్తున్నది. ఒక ఔషధం వాడితే జబ్బు పోతుంది అనే విషయం ఔషధానికి తెలియదు. వాడుతున్న మనకి తెలుస్తుంది. అదేవిధంగా గోవు గురించి గోవుకు తెలియదు కదా అని కుతర్కాలు చేయడం కాదు. అంతేకాదు, తల్లి, తండ్రి, గురువు, గోవు ఇవి మనకు ప్రత్యక్షంగా కనపడుతున్న దేవతలు. సూర్య చంద్రుల తరువాత భూమి మీద కనపడుతున్న దేవతలు. తల్లిదండ్రులకు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి కష్టం కలిగితే బాధ పడుతూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళే తీర్చుకోలేనప్పుడు వాళ్ళకు నమస్కరిస్తే మన బాధలు ఎక్కడ పోతాయి అని కొడుకులు అనుకోకూడదు. తల్లిదండ్రులను పోషించాలి, నమస్కరించాలి. తల్లిదండ్రి అనేది మానవ ఉపాధి యైనప్పటికీ కూడా తల్లి అనే భావంలో, తండ్రి అనే భావంలో ఒక దివ్యత్వం ఉంటుంది. ఈ ఆరాధించే పుత్రుడు తల్లిదండ్రులపై భక్తి చూపిస్తే అందులో ఉన్న దైవత్వం ఆ పిల్లలను కాపాడుతుంది. తల్లిదండ్రీ కాపాడలేకపోవచ్చు. ఇది ఒక రహస్యం. అందుకే మాతృదేవోభవ! పితృదేవోభవ!’ అని చెప్పిన వాక్యాలలో తల్లిని, తండ్రిని దేవుడిగా చూడు అని చెప్పడంలో ఒక ఆంతర్యం ఉన్నది. అంతేకాదు కొన్ని రకాల గ్రహబాధలు పోవాలంటే తల్లిదండ్రుల కాళ్ళు కడిగి నీళ్ళు జల్లుకుంటే గ్రహబాధలు పోతాయి. ఏమిటి విశేషం అంటే మాతాపితరులనే భావంలోనే ఒక దైవత్వం ఉన్నది. అది భౌతికమైనటువంటి అంశాలకి దొరకనిది. దివ్యాంశాలని భౌతికంగా సమర్థించాలి అనుకోకూడదు. దివ్యత్వాన్ని గౌరవించవలసినదే. తల్లిదండ్రి, గురువు ఎలాగో గోవు కూడా అలాగే. గోవుల ఉనికి చాలా గొప్పది అని చెప్తూ ‘భద్రం గృహం కృణుథ భద్రవాచో’ – మా ఇంట్లో నీ అంబారావాలు మారుమ్రోగాలి తల్లీ అన్నారు. ఒక ఘంటానాదం, శంఖారావం అమంగళశక్తులను తొలగించి మంగళ శక్తులను ఆపాదిస్తాయి అంటారు. అందుకు ఏమీ తీసిపోదు ఆవు యొక్క అంబారావం. ఆవు కాలిక్రింది దుమ్ము గొప్ప విభూతి. ఆ గోధూళి నుదుట పెట్టుకుంటే అనేక దుష్టశక్తులు తొలగిపోతాయి. కృష్ణపరమాత్మ గోధూళితో నిండిన శరీరంతోనే ఉన్నాడు అంటాడు లీలాశుకుడు. “గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలశతకైః అనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్ధం గచ్ఛంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం!!” #తెలుసుకుందాం #Jai gomatha🕉️🚩🙏
17 likes
8 shares