ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః
54 Posts • 18K views
MAAGHA PURANAM -- 24 24వ అధ్యాయము విశ్వామిత్రునికి వానరముఖము కలుగుట - గంధర్వ స్త్రీ వృత్తాంతము మాఘమాసమందలి నదీస్నానము మనుజులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడ పరమ పవిత్రమైనది. మాఘమాసంలో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానము చేసాడు. అతని భార్య తానుమాత్రం స్నానము ఆచరించనని చెప్పుట వలన ఆమె దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక పోయింది. ఆమెను విడిచిపెట్టి ఆ గందర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి ఆయన్ని వయ్యారంగా క్రీగంట చూసింది. ఆమె అందము, యౌవ్వనము చూసిన విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించాడు. ఇద్దరూ కామక్రీడలతో తేలియాడసాగారు. గంధర్వుడు భార్యను వెదకుకొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు, గంధర్వస్త్రీ క్రీడిస్తూ ఉన్నారు. ఆ దృశ్యమును చూచి మండిపడుచు విశ్వామిత్రుని “నువ్వు తపస్వివైయుండి కూడా కామతృష్ణ గల వాడవైతివి గాన నీకు కోతిముఖము సంభవించుగాక అని, “ఓసీ కులటా! నీవు పాషాణమై పడివుండు”మని భార్యను శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖముతో ఉండగా నారదుడు ఈవిషయం తెలుసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చి “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోనై నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు. గంగానదిలో స్నానం చేసి నీ కమండలముతో గంగాజలం తెచ్చి ఈ పాషాణముపై చల్లు అని నారదుడు చెప్పగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణము పై చల్లాడు. ఆ పాషాణము గంధర్వ స్త్రీ రూపము ధరించి నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాడు. #☸🙏సూర్యనారాయణ స్వామి #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః
28 likes
23 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
12K views 29 days ago
MAAGHA PURANAM -- 17 17వ అధ్యాయము కప్పరూపము వదలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట మునిశ్రేష్ఠా! నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ. నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థ వాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసాడు. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళాను. మరికొన్నాళ్ళకు మాఘమాసము ప్రవేశించింది. ఒకనాడు నా భర్త సఖీ! చాలా పవిత్రమైన మాఘమాసము ప్రవేశించినది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనమునుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేస్తున్నాను. నువ్వు నా భార్యవు గావున ఈ మాఘమాసమంత ఈ కావేరీ నదిలో స్నానమాచరించు. ప్రతిదినము ప్రాతఃకాలము నిద్రనుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము. నదిలో స్నానం చెయ్యి. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోను, మంచి గంధము, అగరు, ధూపదీపములను వెలిగించి, స్వామికి ఖండశర్కర పటిక బెల్లం నైవేద్యము ఇచ్చి నమస్కరించు. తరువాత తులసి తీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకొనుము. మన కుటీరమునకు వచ్చి మాఘ పురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించు. దీనివలన నీకు చాలా ఫలము కలుగుతుంది. నీ ఐదవతనము చల్లగా ఉంటుందని హితబోధ చేసాడు. నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూసాను. నా భర్త శాంత స్వరూపుడయినా నేను హద్దుమీరి మాటలాడుటచేత అతనికి కోపం వచ్చి శపించాడు. “ఓసీ మూర్ఖురాలా! నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావని అనుకున్నాను. ఇంత దైవద్వేషివని నాకు తెలియదు. నువ్వు నాతో ఉండ తగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? నీ పాపము నిన్నే శిక్షింస్తుంది. నువ్వు కృష్ణానదీ తీరమునందు ఉన్న రావిచెట్టు తొర్రలో మాండూక రూపంలో ఉందువు గాక! అని నన్ను శపించాడు. వారి సింహగర్జనకు వణికిపోయి వారి శాపమునకు భయపడి పోయాను. వారి రౌద్రాకారమును చూడలేక పోయాను. నాకు జ్ఞానోదయము కలిగింది. నాతప్పు నేను తెలుసుకున్నాను. “ ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితిని” అని పశ్చాత్తాపము కలిగి వెంటనే భర్త పాదములపై బడి రెండుపాదములు పట్టుకొని “నాకు ఈ శాపము ఎలా పోతుంది ? మళ్ళీ నిన్ను ఎలా కలుసుకొంటాను? నాకు ప్రాయశ్చిత్తము లేదా అని పరిపరివిధాల ప్రార్థించగా నా భర్త కొంతసేపు ఆలోచించి ఒక గడువు పెట్టాడు. గౌతమమహర్షి గోదావరీ నదీతీరమందున్న తన ఆశ్రమమునుండి ఉత్తరదేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘ శుద్ధ దశమినాటికి కృష్ణానదీ స్నానము చేయుటకు వస్తారు. ఆ సమయములో నీవు వారిని దర్శించిన ఆ మహర్షి ప్రభావము వలన నీకు నిజరూపము కలుగుతుంది” అని చెప్పుచుండగా నేను కప్పరూపము పొందాను. నాభర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించాడు. నేను కప్పు రూపముతో గెంతుకుంటూ కొన్ని దినములకు కృష్ణానదీ తీరమున ఉన్న ఈ రావిచెట్టు తొర్రలో నివాసమేర్పరచుకొని మీరాకకోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు” అని తన వృత్తాంతము గౌతమమునికి తెలియచేసింది. “అమ్మాయీ! భయపడకు. నీకీ శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయింది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి వెయ్యేండ్లు గడచినది. నీ భర్తయును ఏకాంతముగా చాలాకాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములో ఉన్నాడు. నువ్వు తన మాటలు విననందున ఎంత కష్టపడ్డావో తెలిసింది గదా! మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్రసంతతి ఆరోగ్యము కలుగుటయే గాక మోక్ష సాధనమైనది కూడా. దీనికి మించిన మరియొక వ్రతము లేదు. ఈ వ్రతము విష్ణుమూర్తికి ప్రియమైనది. ఇటువంటి వ్రతమాచరింపుమని నీభర్త ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నీభర్త దూరదృష్టిగల జ్ఞాని. అందరు అతని గుణగణాలకు సంతోషించే వారు. నిన్ను పెండ్లియాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననెడి ఆశతో ఉండేవాడు. కానీ నీవలన అతని ఆశలన్నీ నిరాశలై పోయాయి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చింది. నిన్ను నీళ్ళలో స్నానం చేయమన్నాడు. నీవు చేయనన్నావు. అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించినాడు. ఈ దినము నా సమక్షములో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నిజరూపము పొందగలిగావు. అందునా ఇది మాఘమాసము. కృష్ణానదీతీరము. మాఘమాస వ్రత సమయము నీకు అన్నివిధముల అనుకూలమైన రోజు. నువ్వు వెంటనే శుచివై వచ్చి వ్రతము ఆచరించు. స్త్రీలు గానీ, పురుషులు గానీ ఈ సమయంలో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. ఎవరైనా తెలిసి గానీ తెలియక గానీ మాఘ శుద్ధ సప్తమి, దశమి, పౌర్ణముల యందు, పాడ్యమి రోజున నదీ స్నానమాచరించిన యెడల వారి పాపములు నశిస్తాయి. మాఘ శుద్ధ పాడ్యమి నాడు స్నానమున, అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి, దినములలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించునట్టు వరము ఇస్తాడు. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము విన్న మోక్షప్రాప్తి కలుగునని గౌతమ ముని ఆ మునివనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పాడు. #☸🙏సూర్యనారాయణ స్వామి #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః
185 likes
482 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
654 views 16 days ago
MAAGHA PURANAM -- 29 29 అధ్యాయము మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము. మాఘమాసమునందు నదీస్నానము చేసి, మాఘమాస వ్రతము ఆచరించిన వారికి అశ్వమేథ యాగము చేసిన ఫలము కలుగుతుంది. ఈ మాఘమాసములో ఏకాదశీ వ్రతము చేసి ఉపవాసము ఉన్నవారు వైకుంఠప్రాప్తి పొందగలరు. మాఘమాసమందు ఏకాదశీ వ్రతము చేసి సత్ఫలితము పొందిన దేవతలకథలు వినండి. పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీర సాగరమును మధించి అమృతమును పొందవలెనని అభిప్రాయమ కలిగి మంధర పర్వతమును కవ్వముగా, వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరమును మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు ఉండి మధిస్తు ఉండగా మొదట పుట్టిన లక్ష్మీదేవిని విష్ణుమూర్తి భార్యగా స్వీకరించాడు. తరవాత ఉచ్చైశ్రవము అనే గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించగా వాటిని విష్ణుమూర్తి ఆదేశముపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాలసముద్రమును మధించగా లోకభీకరమై ఘనమైనతేజస్సుతో ఉండే అగ్ని తుల్యమైన హాలాహలము పుట్టింది. ఆ హాలాహల విష జ్వాలలతో సమస్త లోకములు కాలిపోతున్నాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోయి సర్వేశ్వరుని శరణుకోరగా భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషమును తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలముగా మారి ఆనాటినుండి నీలకంఠుడని పేరు వచ్చింది. మళ్ళీ దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రమును మధించగా అమృతము పుట్టింది. ఆ అమృతము కొరకు వారిరువురు తగవులాడుకొన సాగారు. శ్రీమహావిష్ణువు మాయామోహిని అవతారము ధరించి వారి తగవును పరిష్కరించాలి అనుకున్నాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని యైన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతమును ఇరువురికీ సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగవులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతము పంచుతాను మీకు ఇష్టమేనా? అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడలేదు. దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడ్డారు. జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ, మురిపిస్తూ, మైమరపిస్తూ, తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింప సాగారు. ఈవిధంగా రాక్షసులను తన వలపు వయ్యారములతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ విషయము గమనించిన రాహుకేతువులు మాయాదేవతలుగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని రూపములో ఉన్న శ్రీమహావిష్ణువు కోపించి తన చక్రాయుధంతో వారి తలను నరికివేసాడు. మిగిలిన అమృతము దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండమును భద్రపరుస్తూ ఉండగా రెండు చుక్కలు విధివశాత్తూ నేలరాలాయి. అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరుపోసి పెంచసాగాడు. కొంత కాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్యయైన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన దేవతలు కోరగా మళ్ళీ వచ్చి రహస్యముగా పువ్వులను కోయాలని తోటలో ప్రవేశించాడు. అప్పటికే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానము వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపైన, వనమంతా చల్లాడు. దేవేంద్రుడు పారజాత పువ్వును తుంచబోడగా అక్షతల ప్రభావం వల్లనో, విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈవార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయము వివరించాడు. కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. అమోఘమైన శక్తి కల సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించాడు. సత్రాజిత్తుకి చెప్పి అమృత తుల్యమగు పారిజాత వృక్షమును దానికి అర్హుడైన దేవేంద్రునికి ఇప్పించి తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పాడు. ఆనాటి నుంచి తులసి శ్రీమహావిష్ణువు సాన్నిధ్యములో ఆయనతో సమానముగా పూజలు అందుకుంటున్నది. అందుచేత తులసిని పూజించిన సకల సౌభాగ్యములు సిద్ధిస్తాయి. ఫలశ్రుతి: సూతమహర్షి శౌనకాది మునులతో మహర్షులారా! వశిష్ఠుల వారు దిలీపునకు తెలియచేసిన మాఘమాస మహత్యము, మాఘస్నాన మహిమ మీకు వివరించాను. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. అందరు మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమ నిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృప పొందగలరని దీవించాడు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా సూర్యోదయము అయిన తర్వాత నదిలో స్నానము చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం ముప్పది రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తశుద్ధితోనూ శ్రీమహావిష్ణువును మనసారా పూజించిన సకలైశ్వర్య ప్రాప్తి, పుత్రపౌత్రాభివృద్ధి, వైకుంఠప్రాప్తి పొందుతారు. సర్వేజనాః సుఖినోభవన్తు!! మాఘపురాణము సంపూర్ణమ్ !! #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః #☸🙏సూర్యనారాయణ స్వామి
11 likes
15 shares