నిజంగా ఈ రోజు భారతీయులందరికి ఓక గొప్ప, చిరస్మరణీయమైన రోజు,ఓ ప్రత్యేక సుదినం ! ( 27 - 7 - 2026)!
లేదా
మిస్సైల్ మ్యాన్ ఏ.పి.జె.అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి నేడు !
ఎందుకంటే ఓక శాస్ర్రవేత్తగా,రాష్ట్రపతిగా,మిస్సైల్. మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన దివంగత ఏ.పి.జె.అబ్దుల్ కలాం గారు భారతదేశానికి అందించిన సేవలు నిరుపమానమైనవి,అజరామమైనవి.ఓక విధంగా చెప్పాలంటే నభూతో న భవిష్యత్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.ముఖ్యంగా ఆయన యువతకు ఇచ్చిన సందేశం ' కలలు కనండి,కాని ఆ కలల సాకారానికి మీ శక్తి వంచన లేకుండా కృషి చేయండి' అనేది మన దేశ యువతపై ఎంతగానో ప్రభావం చూపింది అనేది జగ మెరిగిన సత్యం.అలాగే ముఖ్యంగా ఆయన చిన్నారులపై చూపే శ్రద్ధాసక్తులు ఎంతో ఆసక్తికరం,'నేటి చిన్నారులే రేపటి భారత పౌరులు,భవిష్యత్ తారలు,భారతదేశ అభివృద్ధికి బాటలు వేసేవారు ' అని బలంగా విశ్వసించి మరీ వారిని అన్ని విధాలా ప్రోత్సహం అందించిన మహోన్నతుడు.అదేవిధంగా ' ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండాలనే ' ఆయన ఉన్నత వ్యక్తిత్వం ఎందరికో స్ఫూర్తిదాయకం,ఇక ఆయన నిరాడంబరత గురించి ఎంత చెప్పిన తక్కువే.ముఖ్యంగా ఈ సందర్బంగా ఓక ముఖ్యమైన విషయాన్నీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి,అదేమంటే ఆయన రాష్ట్రపతిగా వున్నప్పుడు ఇఫ్తార్ విందుకు అయ్యే 10 లక్షల ఖర్చు అనవసరమైనదిగా భావించి ఆ మొత్తాన్ని అనాధ ఆశ్రమానికి ఇచ్చి వెయ్యండి అని హుకుం జారీచేయడం ఆయన ఉదార స్వభావానికి, మానవత్వానికి,విశాల హృదయానికి నిలువెత్తు నిదర్శనం.ఇంకా చెప్పుకుంటూ పొతే ఆయన రాష్ట్రపతి గా పదవిని అలంకరించిన తరువాత తన ఊరు వారందరిని ఢిల్లీకి పిలిపించి వారికి ఓక వాహనము ఏర్పాటు చేసి ఆ ఖర్చు ప్రభుత్వానికి భారం అని భావించి తానే ఆ ఖర్చును భరించడం ఆయన గొప్పతనానికి ఓక మచ్చు తునక వంటిది.అలాగే అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆ మూలాలు అనేవి ఏ మాత్రం మర్చిపోకుండా కేవలం రాష్ట్రపతి హోదాలో వుంటూ కూడ కేవలం మూడు కోట్ (సూట్ )లు,ఆరు షర్టులు,మూడు ప్యాంట్లలతో అత్యంత సాదా సీదాగా జీవించడం ఆయన నీతి,నిజాయితీకి,అత్యంత నిరాడంబర జీవన శైలికి ఓ ప్రబల నిదర్శనం.మచ్చు తునక.
ఏదిఏమైనా చివరకు తను రాష్ట్రపతిగా పదవి విరమణ చేసినప్పుడు,రాష్ట్రపతి భవన్ నుంచి పూచిక పుల్ల కూడా తీసుకెళ్లకపోవడం వెరసి ఆయన ఎంతగా తన పవిత్ర,ఉన్నతమైన వృత్తిలో బాధ్యతాయుతంగా వ్యవహరించారో,మసలుకున్నారో మనం ఇట్టే ఊహించవచ్చు ఏమైనా కోట్లాది మంది భారతదేశ ప్రజానీకం దృష్టిలో దివంగత డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం గారు ఎప్పటికి అమరుడే,చిరంజీవే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.అన్నింటికి మించి ఈ ప్రత్యేక సందర్భంగా అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి కాబట్టి ప్రతిఒక్క భారతీయుడు ఆయన మన భారత దేశానికీ అందించిన స్ఫూర్తిదాయక,అమూల్యమైన సేవలను స్మరించుకోవాల్సిన గురుతర భాద్యత మనందరిపై భుజస్కంధాలపై ఎంతైనా వుంది.జయ జయహో!అమర్ రహే! జోహార్ దివంగత మాజీ భారతరాష్ట్రపతి,శాస్ర్రవేత్త ఏ.పి.జె.అబ్దుల్ కలాం గారు! మేరా హిందూస్తాన్ మహాన్!🇮🇳🇮🇳🇮🇳✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
#అబ్దుల్ కలాం