PSV APPARAO
523 views •
#హిందూ పురాణాల్లో స్వచ్ఛమైన ప్రేమ 🙏 #స్వచ్ఛమైన ప్రేమ
*పురాణాల్లో స్వచ్ఛమైన ప్రేమ*
పురాణాలు మానవ మనుగడకు ప్రతి రూపాలు. ఇందులో కనిపించే పాత్రలు సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, తత్వ బోధకాలు. సత్యనిష్టుడిగా హరిశ్చంద్రుడు, ధర్మ నిరతికి ధర్మరాజు, శాంతికి వశిష్ఠుడు, అహింసకు బుధుడు, ప్రేమానురాగాలకు రాధామాధవులు, శివపార్వతులు, రాముడుసీత, రుక్మిణీ కృష్ణులు, సత్యభామకృష్ణులు, రతీమన్మదులు, అరుంధతీవశిష్టులు, చ్యవనసుకన్యలు, నలదమయంతులు.. ఇలా ఎంతో మంది వివాహానికి పూర్వం, తర్వాత ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ.. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ.. తమని తాము నొప్పించుకున్నా వేరేవరిని నొప్పించలేదు(చావలేదు, చంపలేదు) ఎంతో సహనంతో, అమితమైన ప్రేమతో మెప్పించి సాధించుకున్నారు. అందుకే వీరు ఆదర్శనీయులు అయ్యారు.
ధర్మం సృష్టికి ఆధారం అయితే.. ప్రేమ' జీవుల ఏకీకరణకు "నేస్తం. ప్రేమ ఉన్నచోట అశాంతి, హింసలకు తావులేదు. అందుకు నిదర్శనగా రతీమన్మధులు, రాధామాధవులు, శివపార్వతులు.. మన పూర్వీకులు.
పెద్దలకేం తెలుసు ప్రేమ అంటే.. ఈ పెద్దోళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో పిల్లలను.. అనే మాటలను పక్కన పెట్టి చూస్తే, మనస్సు పరవశమయ్యే గీతాలు, సన్నివేశాలు, గాధలు ఎన్నో ఎన్నెన్నో..
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా..
రాధకు నీవేర ప్రాణం.. రాధా హృదయం మాధవ నిలయం..
ప్రేమ యాత్రలకు బృందావనము ఏలనో.. కులుకులోలకు చెలి
చెంతనుండగా వేరే స్వర్గం ఏలనో..
రాధనురా నీ రాధనురా.. రాధనురా నీ దాననురా..
అని పాడుకుంటూ ఉంటే మనసు పరవశించిపోతుంది. వారి ప్రేమలో అంతటి మహత్యం ఉంది. కృష్ణుడి కంటే రాధ పెద్దది అంటారు. రాధామాధవుల ప్రేమ ఆద్వీతీయం, ప్రణయానికి పర్యాయపదం అంటారు. రాధకు ఆరాధనే తెలుసు. గోదాదేవిదీ అవ్యాజమైన ప్రేమ. కృష్ణునిది ఎనలేని అనురాగం. పద్మావతీ శ్రీనివాసుల మధ్య అంతస్తుల అంతర్యాలు ఉన్నా వారిది ప్రేమవివాహమే. పార్వతీపరమేశ్వరులదీ జన్మజన్మల ప్రేమబంధం. అది వీడక ఉండేందుకు పరమేశ్వరుడు తన శరీరంలో అర్ధభాగాన్ని పార్వతికిచ్చాడు. నటేశ్వరీనటేశ్వరులదీ ముగ్ధమనోహర ప్రేమ. ఒకనాడు అమ్మవారైన పార్వతీదేవి తూర్పువైపు ముఖంగా కూర్చోని ఉండగ, పరమేశ్వరుడు ఆమెకు అభిముఖంగా నృత్యం చేయడం ఆరంభించాడు. ఆ నృత్యాన్ని చూసిన పార్వతీ పరమానందాన్ని అనుభవిస్తుండగా ఆమె ముఖ తేజస్సును చూసిన శివుడు ఆమె ఆనందాన్ని రెట్టింపు చేయటానికి ఆమెను చూస్తూ పరవశుడై నాట్యం చేసాడని కాళిదాసు కుమార సంబవంలో వివరించారు. రతీమన్మధులు కూడా అంతే శివుడి తపస్సును భగ్నం చేసిన మనమ్మధుడిని, శివుడు తన కోపాగ్నితో భస్మం చేస్తాడు. అందుకు రతీదేవి తన ప్రియుడైన మన్మధుడికై విలపిస్తుండగా వారివురి ప్రేమను అర్థం చేసుకున్న శివుడు శాంతించి రతికి మాత్రమే మన్మధుడు కనపడే విధంగా వరం ఇచ్చాడు. ప్రేమకు అంతటి శక్తి కలదు కదా!. అలాగే సుకన్య ప్రేమతో ముసలివాడైన చ్యవనుడు తిరిగి యవ్వనవంతుడు అయ్యాడు. అరుంధతీ వశిష్టులకు కులాల మధ్య ఆంతర్యం ఉన్నా వారిదీ ప్రేమవివాహమే. పవిత్రప్రేమకు చిహ్నంగా పెళ్లైన వారికి వీరిని చూపి వీరిలా మసలుకోమని కదా పెద్దల అభిప్రాయం వీరే కదా మనకు ఆదర్శం. ప్రేమ మనస్సు నుంచి పుడుతుంది. మనస్సు అరిషడ్వర్గాలను చేతన పరుస్తుంది. అరిషడ్వర్గాలు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సరాలు. వీటిని అదుపులో పెట్టేది ప్రేమ ఒక్కటే. ప్రేమతో ఏదైనా సాధించ వచ్చు అని చెప్పటానికి కొద్దిపాటి నిరీక్షణతో మనస్సుకు ప్రేమ అనే బలాన్ని ఇస్తే ఏదైనా సాధించవచ్చు. కోపం అనే బలహీనతతో కూడిన మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తే ఏం లాభం.
*ప్రేమకు నిదర్శనం మన పౌరాణికులు*
#namashivaya777
https://whatsapp.com/channel/0029Va4YUC6DeONFF8EDwQ2V
11 likes
9 shares