పురాణాలు
37 Posts • 280K views
#పురాణ గాథలు/కథలు #హిందూ పురాణ కథలు *అచ్యుతమ్.!* *నైమిశారణ్యములో ‘ద్వాదశ వార్షిక బ్రహ్మసత్రము’ అను దీర్ఘ సత్రయాగము జరుగుతోంది. ఆ యాగం జరుపుతున్న మహామునులు యాగ విరామ కాలంలో, ఏకాంతముగా ఏకాగ్ర మనస్సుతో కూర్చుని వున్న సూతుని సన్నిధి కి వెళ్లి* *"అనఘా! మీరు మా కింతవరకు కొన్ని పురాణములు ప్రవచించారు. అవి అమృతోపమాయమైనవి. ఇంకా వినాలని మాకు వేడుకగ వుంది. భగవానుడు ఏ విధముగ ఏ కారణమున మత్స్యరూపమును ధరించి సృష్టి చేసాడు? ఇది అంతా మాకు చెప్ప వేడుచున్నాము" అని పలికారు.* *ఆ మాటలు విన్న సూతుడిలా చెప్ప నారంభించాడు* *“శౌనకాది మహామునులారా! బ్రాహ్మణోత్తములారా! సాక్షాత్‌ శ్రీ మహా విష్ణువే చెప్పిన మత్స్యపురాణము మీకు ఇప్పుడు చెప్పుచున్నాను వినుడు. ఇది బహు పుణ్యకరము. పవిత్రమైనది. ఆయువును వృద్ధి చేయునది. కనుక శ్రద్ధతో వినండి" అని మొదలు పెట్టాడు.* *"పూర్వము మనువు అను రాజుండెడివాడు. ఇతడు సూర్యుని కుమారుడు. ఆయనకు ఆత్మ సంస్కారమునకు కావలసిన గుణములన్నియు కలవాడు. క్షమాగుణము కలవాడు. అతడు తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి మలయ పర్వతం మీద ఒక ప్రదేశంలో బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేసాడు.* *వేల ఏండ్లు గడచిన తరువాత బ్రహ్మ ప్రత్యక్షమై వరము కోరుకొమ్మని మనువుతో పలికాడు.* *మనువు బ్రహ్మకు నమస్కరించి...* *''అన్నిటికంటె ఉత్తమ మయిన ఒకే ఒక వరం నేను మిమ్ము వేడుచున్నాను. ప్రళయము సంభవించినప్పుడు స్థిరములు చరములునగు ప్రాణులను రక్షించుటకు నేను శక్తిగలవాడను కావలయును" అని అడిగాడు.* *విశ్వమునకు ఆత్మరూపుడు అగు బ్రహ్మ ‘అట్లే కానిమ్మని’ పలికి అక్కడే అంతర్ధానం అయ్యాడు. దేవతలు పూలవాన కురిపించారు.* *ఒకానొక రోజు మనువు తన ఆశ్రమంలో పితృతర్పణము చేస్తుండగా ఒక ఆడ చేప నీళ్లతో పాటు అతని రెండు చేతులలో పడింది. ఆ రాజుకు ఆ చేప రూపమును చూచి దయ కలిగి దానిని రక్షించాలని తన కమండలము లోని జలములలో వేసాడు.* *ఆ మత్స్యము ఒక రాత్రిలో పన్నెండు అంగుళముల పొడవు పెరిగి తల పైకెత్తి మనువును చూచి...* *"రక్షించుము రక్షించుము" అని పలికింది.* *మనువు ఆ చేపను బయటకు తీసి వెడల్పైన మూతిగల మట్టిపాత్రలో వేసాడు. అక్కడ అది ఒక రాత్రిలో మూడు మూరలంతగా పెరిగింది. మరల ఆ చేప సహస్ర కిరణాత్మజుడగు మనువుతో అర్తనాదముతో* *"నేను నిన్ను శరణు పొందితిని. రక్షించు రక్షించు" అంది.* *ఆ రవినందనుడు దానిని బావిలో పడేసాడు. మర్నాటికి అది అక్కడ రెండు యోజనములంత (1600 మూరలు) పెద్దది అయ్యింది. మరల అది దీనముగా* *"రక్షించు రక్షించు” అని ఆ రాజుతో పలికింది.* *అతడు దానిని బావినుండి తీసి గంగా నదిలో వేయగా అది అచ్చటను అట్లే ఆ నది నిండుగా సరిపోవునంతగా పెరిగింది. అప్పుడా రాజు దానిని సముద్రములో పడేసాడు. వెంటనే అది సముద్రమంతటా వ్యాపించి కనబడింది. అది చూచి మనువు భయపడి* *"ఎవరు నీవు? రాక్షస రాజువా? లేక వాసుదేవుడవా? అట్లు కానిచో నీవు ఈ విధముగా అతి తక్కువ కాలములోనే ఎట్లు నీ పరిమాణమును పెంచుకొనుచున్నావు? రెండు లక్షల యోజనములంత శరీరము ఎవ్వనికుండును? కేశవా! నీవు మత్స్యరూపుడవై నన్ను శ్రమపెట్టుచున్నావు. హృషీకేశా! జగన్నాథా! జగద్దమా! నీకు నమస్కారము” అన్నాడు.* *మనువు ఇలా పలుకగానే మత్స్యరూపుడు అగు ఆభగవానుడు జనార్దనుడు* *"బాగుబాగు! అనఘా! నీవు సత్యము గ్రహంచితివి. అచిరకాలముననే ఈ భూమి పర్వతములతోటి, మహా వనముల తోటి నీట మునుగును. ఇదిగో! ఈ నౌకను జీవ సమూహములను రక్షించుటకై నేను దేవతల సమూహము చేత నిర్మింపజేసితిని.* *స్వేదజములు (చెమటనుండి పుట్టునవి), అండజములు, ఉద్భిజ్జములు, జరాయు జములు, ఉష్ణమునుండి పుట్టు దోమలు, గ్రుడ్ల నుండి పుట్టు పక్ష్యాదులు - నేలను చీల్చుకొని పుట్టు మొక్కలు చెట్లు, మావినుండి పుట్టు మనుష్యులు మొదలగు ప్రాణులు అన్నింటికి ఏ కీడును గలుగకుండ కాపాడుము.* *ఈ ప్రళయ కాలము ముగిసిన తరువాత స్థిర చర రూపమయిన ఈ జగత్తున కంతటికి నీవు ప్రజాపతి వై కృతయుగారంభమున సర్వజ్ఞుడు భగవానుడు ఋషి మన్వంతరమునకు అధిపతి అయి నీవు దేవతలచేతను పూజింపబడెదవు" అన్నాడు.* *"భగవాన్! ఎన్ని సంవత్సరముల తరువాత ప్రళయము సంభవించును? నేను ఆ ప్రాణులను ఎటుల రక్షింపగలను? తిరిగి నేను ఏవిధముగా నిన్ను కలియగలను?" అని మనువు భగవానుని ప్రశ్నించెను.* *"ఇప్పటినుండి నూరుసంవత్సరముల వరకు కరువు ఏర్పడుతుంది. సూర్యుని కిరణాలు నిప్పులు ప్రసరిస్తాయి. బడబాగ్ని విజృంభిస్తుంది. మేఘాలు వర్షపు నీటితో భూమిని ముంచి వేస్తాయి. ఆసమయంలో నీవు ఈ నావను తీసుకొని, నా మత్స్యరూపుడనైన నా కొమ్ముకు కట్టినట్లయితే, నా ప్రభావం వలన ఈ నావలో ఉండే మునులు, మహర్షులు, సాధుజనులు, తదితర ప్రాణికోటి అంశములతో బాటు నీవు కూడా జీవించి ఉంటావు" అని చెప్పి భగవానుడు అంతర్ధానం అయ్యాడు.* *ఆ విధంగా కృత యుగ ప్రారంభానికి ముందు జరిగే జల ప్రళయం నుండి మనువును సప్త ఋషులను పునః సృష్టికి కావలసిన అన్నింటిని మత్స్యరూపంలో భగవానుడు కాపాడాడు.* *ఈ పోస్ట్ నచ్చితే షేర్ చేయండి.* *┈┉━•❀꧁హరేకృష్ణ꧂❀•━┉┈* *ఆధ్యాత్మిక అన్వేషకులు* 🍁🚩🍁 🙏🕉️🙏 🍁🚩🍁
9 likes
10 shares
#శరీరం – రథం: ఇది జీవన ప్రయాణానికి ఒక సాధనం మాత్రమే. దానంతట అది సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. #పంచేంద్రియాలు – గుర్రాలు: ఇవి ఎప్పుడూ ప్రాపంచిక సుఖాల వైపు పరుగులు తీస్తుంటాయి. కాబట్టి వీటిపై నియంత్రణ చాలా అవసరం. #మనస్సు – కళ్ళెం: ఇది ఆ ఇంద్రియాలనే గుర్రాలను అదుపులో ఉంచే సాధనం. #బుద్ధి – సారథి: మంచి-చెడుల మధ్య విచక్షణ చూపి, సరైన నిర్ణయం తీసుకుని రథాన్ని నడిపేది బుద్ధే. #ఆత్మ – రథ యజమాని: అంతిమ గమ్యాన్ని, జీవిత పరమార్థాన్ని తెలిసిన చైతన్యమే ఆత్మ. ఎప్పుడైతే ఆత్మ జాగృతం అవుతుందో, బుద్ధి వివేకంతో ఆలోచిస్తుందో, మనస్సు అదుపులో ఉంటుందో, మరియు ఇంద్రియాలు క్రమశిక్షణతో ఉంటాయో — అప్పుడే జీవితం సరైన దిశలో సాగుతుంది. (కఠోపనిషత్తు - 1.3.3-4) "ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు | బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ || ఇంద్రియాణి హయాన్ ఆహుః విషయాం స్తేషు గోచరాన్ |" ఆత్మ: రథంలో ప్రయాణించే యజమాని. శరీరం: రథం. బుద్ధి: రథాన్ని నడిపే సారథి. మనస్సు: గుర్రాలను నియంత్రించే కళ్ళెం. ఇంద్రియాలు: రథాన్ని లాగే గుర్రాలు. (భగవద్గీత - 3వ అధ్యాయం, 42వ శ్లోకం) శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతలో, ఈ భాగాల మధ్య ఉండాల్సిన క్రమాన్ని వివరిస్తుంది. "ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః | మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ||" స్థూల శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి; ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది; మనస్సు కంటే బుద్ధి గొప్పది; ఆ బుద్ధి కంటే కూడా పరమైనది (గొప్పది) ఆత్మ. (ఈ చిత్రంలో చూపినట్లు బుద్ధి సారథిగా ఉండి మనస్సును, ఇంద్రియాలను నియంత్రించాలి). మనస్సు అనే కళ్ళెం ఎంత ముఖ్యమైనదో చెప్పే ప్రసిద్ధ నీతి వాక్యం ఇది. రథం గమ్యానికి చేరాలన్నా, ప్రమాదంలో పడాలన్నా అది మనస్సు చేతిలోనే ఉంటుంది. "మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః |" మనిషి యొక్క బంధాలకు (కష్టాలకు) గానీ, మోక్షానికి (విముక్తికి) గానీ ప్రధాన కారణం మనస్సే #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు
10 likes
17 shares