అంతర్జాతీయ న్యూస్

6 Posts • 15K views
Mahbubnagar Police
493 views 10 hours ago
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – బాలానగర్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన బాలానగర్ SI నరేందర్ రెడ్డి జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నిర్వహిస్తున్న సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా, బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలానగర్ గ్రామంలో గ్రామస్థులకు సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలానగర్ ఎస్‌ఐ నరేందర్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది పాల్గొని, ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న వివిధ మోసపూరిత పద్ధతుల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపే ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, లోన్ యాప్‌ల ద్వారా జరిగే మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీలు, కేవైసీ అప్‌డేట్ పేరుతో జరిగే మోసాలు, సోషల్ మీడియా మరియు వాట్సాప్ ద్వారా వచ్చే నకిలీ సందేశాలు, డిజిటల్ అరెస్ట్ వంటి కొత్త తరహా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే సైబర్ మోసానికి గురైన వెంటనే గోల్డెన్ అవర్ ఎంతో కీలకమని, మొదటి గంటలోనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పాటు www.cybercrime.gov.in పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఇలా వెంటనే స్పందించడం ద్వారా మోసపోయిన నగదు తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు లేదా పెట్టుబడి ఆఫర్లను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
18 likes
8 shares
Mahbubnagar Police
449 views 4 days ago
వారం రోజుల ప్రత్యేక మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో భారీగా ఎంవీ యాక్ట్ కేసులు నమోదు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలి – ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 19 జూలై 2026 నుండి 25 జూలై 2026 వరకు వారం రోజుల పాటు ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటారు వాహనాల చట్టం (MV Act) ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. వారం రోజులలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి: 1. సీట్ బెల్ట్ ధరించకపోవడం – 44 కేసులు – ₹8,800/- 2. మైనర్ డ్రైవింగ్ – 11 కేసులు – ₹5,500/- 3. డ్రంక్ అండ్ డ్రైవ్ (DD) – 29 కేసులు – ₹75,000/- 4. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగం – 61 కేసులు – ₹61,000/- 5. సౌండ్ పొల్యూషన్ / సైలెన్సర్ మార్పు – 9 కేసులు – ₹11,000/- 6. ట్రిపుల్ రైడింగ్ – 130 కేసులు – ₹1,56,000/- 7. హెల్మెట్ ధరించకపోవడం – 185 కేసులు – ₹31,700/- 8. రాంగ్ రూట్ డ్రైవింగ్ – 50 కేసులు – ₹60,000/- 9. అదేవిధంగా ట్రాఫిక్ నియమాలపై 6 అవగాహన కార్యక్రమాలు కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, "ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలి. మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించరాదు. రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి. ట్రాఫిక్ నియమాలు మీ భద్రత కోసమే. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షితంగా ప్రయాణించాలి." అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. #MahabubnagarPolice #📰 వార్తలు
19 likes
8 shares