7. వడియాలు - వేద విద్యార్థులు
నిరుపేద అయిన ఒక పాట్టియమ్మ ( బామ్మ) పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చి స్వామికి నమస్కారం చేసింది. పాట్టి స్వామివారితో తను మకాం మద్రాసుకు మార్చానని, ఇంటో తయారుచేసిన వడియాలు, అప్పడాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నానని చెప్పింది.
మహాస్వామి వారు పార్టీని ఆశీర్వదించి రెండు చీరలు, ఒక కంబళి, చెన్నై వెళ్ళడానికి కొద్ది పైకము ఇచ్చారు.
పార్టీ సంతోషంతో వాటిని స్వీకరించి కొద్దిగా తటపటాయిస్తూ, “నాకు ఒక మడిసంచి(మడి వస్తువులు ఉంచుకోవడానికి ఉన్నితో గాని గడ్డితో గాని అల్లిన ఒక సంచి)ని కూడా ఇప్పిస్తే బావుంటుంది స్వామీ” అని అడిగింది.
ఆ దయాళువు శిష్యునికి చెప్పి ఒక మడిసంచిని వెతికి తీసుకురావల్సిందిగా ఆజ్ఞాపించారు. శిష్యుడు దాన్ని తీసుకురాగానే స్వామివారు దాన్ని పార్టీకి ఇచ్చారు
పాట్టి ఇంకా ఏదో అడగాలి అన్నట్టుగా కొద్దిగా మొహమాటపడుతూ, మాటల్ని సాగదీసూ "మహాస్వామి వారి చేతుల మీదుగా ఒక రుద్రాక్షమాలు కూడా..." అని అడిగింది. చిన్నగా నవ్వి స్వామివారు ఒక రుద్రాక్షమాల తెమ్మని సేవకుణ్ణి ఆజ్ఞాపించారు. అది రాగానే స్వామివారు అరుణగిరినాథర్ పాడిన తిరుప్పుగళ్ లోని "జపమాలై తంత సద్గురునాథా” (జపమాలను ఇచ్చిన సద్గురువా) ఈ వాక్యాలు చెప్పి పాట్టికి అందించారు.
పొట్టి స్వామివారి నుండి సెలవు తీసుకుని తెరిగి వెళ్ళింది. అంతటి అనుగ్రహం పొందినా పొట్టి ముఖంలో ఇంకా ఏదో కోరిక తీరలేదు అనే భావనతో వెళ్ళిపోయింది.
పొట్టి కొద్దిదూరం వెళ్ళి మరలా తిరిగి వచ్చింది. కొద్దిగా సంకోచిస్తూ అభ్యర్ధనపూర్వకంగా స్వామివారితో. “స్వామీ నాకు ఒకకోరిక మిగిలిపోయింది. మహాస్వామి కోసమని చాలా జాగ్రత్తగా మడితో అప్పడాలు, వడియాలు తీసుకుని వచ్చాను. మీరు వాటిని తీసుకోవాలి” అని చెప్పింది.
కావల్సినవి అడిగి తీసుకోవడంలో పాట్టికి సంతోషం కలగలేదు. అందుకే పాట్టి మొహంలో ఆనందం కనబడలేదు. మహాస్వామి వారు భోజనం విషయంలో కఠినమైన నియమాలను పాటిస్తూ వారి కడుపుపై పూర్తి నియంత్రణ కలవారని తెలిసినా, తను ఉండే చోట అందరికీ అమ్ముతున్న ఈ అప్పడాలు వడియాలు ఆ పవిత్రమైన ఉదరంలోకి కూడా వెళ్ళాలని అనుకుంది. అందరికీ అన్నీ ఇచ్చే మహాస్వామి వారికి తను ఈ చిరు కానుకని ఇవ్వాలని అనుకుంది. ఇచ్చి సంతోషపడాలని ఆశిస్తోంది.
కరుణాసముద్రులైన మహాస్వామి వారు పాట్టితో "లోకం క్షేమంగా ఉండాలంటే ఇక్కడ వేదం ఎప్పటికీ బ్రతికి ఉండాలి. దానికోసమే నేను చేయగలిగినదంతా చేస్తున్నాను. వేద పాఠశాలలు కనుమరుగవకుండా చాలా కష్టంతో వాటిని కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఈ రోజుల్లో కూడా ఏదో ఒకటి చదువుకుని చేతినిండా సంపాయించుకునే ఉద్యోగం వచ్చే అవకాశం ఉండి కూడా నా మాటలకు విలువిచ్చి ఎంతోమంది తల్లితండ్రులు వారి అబ్బాయిలని వేదపాఠశాలకు పంపుతున్నారు. నామీద ఉన్న భరోసాతో వారి పిల్లల్ని నాకు అప్పగించారు. ఆ పిల్లలే కొద్దో గొప్పో ఇంకొద్దికాలంపాటు వేదం కనుమరుగవకుండా కాపాడగలరు. అటువంటి పిల్లలు నాకు ప్రాణంతో సమానం
కనుక, ఏమిచేస్తావంటే శ్రీమఠం నడుపుతున్న వేద పాఠశాల చిన్న కాంచీపురంలో ఉంది. ఆ పాఠశాల వంటవార్పు అంతా సుందరం అనే అతను చూసుకుంటాడు. నువ్వు తెచ్చిన అప్పడాలు, వడియాలు అతనికిచ్చి, నూనెలో వేయించి పిల్లలకు పెట్టమని చెప్పు. నేను చెప్పానని అతనికి చెప్పు. తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వల్ల ఆ పిల్లలు అప్పడాలు వడియాలు తిని చాలా కాలం అయ్యుంటుంది. వారు వాటిని తిని సంతోషంగా ఉంటారు. అదే నాకు సంతోషం. మనల్ని నమ్మిపంపించారు కాబట్టి మనం వారికి కొంచం సంతోషం కలిగించామన్న తృప్తి ఉంటుంది.
పాట్టీయమ్మ తెచ్చిన ఆ తినుబండారాలు స్వామివారికి ఇష్టమైన ప్రాణమైన వేదపాఠశాల విద్యార్థులు తినడం ఆమెకూ సంతోషమే. స్వామివారి ఆజ్ఞను పాటించడానికి పాట్టి వెళ్తూ ఉంది.
రా. గణపతి, "మైత్రీం భజత" పుస్తకం నుండి
#🙏శ్రీశ్రీశ్రీ పరమాచార్య చంద్రశేఖరేంద్ర మహాస్వామి ప్రాతస్మరనీయులు 🙏 #శ్రీ పరమాచార్య స్వామి #పరమాచార్య #కంచి పరమాచార్య స్వామి లిలలు #🙏🏻🌺కంచి పరమాచార్య స్వామి వారి వైభవం 🙏🏻🌺