🔹కాంగ్రెస్

• 58M views
ఓటరు జాబితా ప్రక్షాళనలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యతగా పనిచేయాలి – *ఎమ్మెల్యే జారె ఆదినారాయణ* 26-06-2026 | శుక్రవారం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) కీలక పాత్ర పోషించాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే శ్రీ జారె ఆదినారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దమ్మపేట, అశ్వారావుపేట, వినాయకపురం, కొత్త మామిళ్లవారిగూడెం, తిరుమలకుంట, లంకాలపల్లి (అంకంపాలెం), జగ్గారం, నాగుపల్లి, నాచారం, మొద్దులగూడెం గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన అవగాహన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాను పూర్తిగా పారదర్శకంగా, లోపరహితంగా రూపొందించడమే ఈ ప్రత్యేక ప్రక్షాళన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు, బోగస్ మరియు అనర్హ ఓట్లను తొలగించడం ఈ ప్రక్రియలో ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఓటర్ల పేర్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారనే అపోహలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని 120 మంది BLOలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారమ్‌లను అందజేస్తున్నారని తెలిపారు. ప్రతి కుటుంబం ఫారమ్‌ను పూర్తిగా నింపి, అవసరమైన వివరాలు, ఫోటో జతచేసి సంబంధిత BLOకు తిరిగి అందించాలని కోరారు. పూర్తి చేసిన ఫారమ్‌లు సమర్పించిన వారి వివరాలే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో నమోదు చేయబడతాయని వివరించారు. అనంతరం కూడా పేరు లేకపోతే సంబంధిత ధ్రువపత్రాలతో కొత్తగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ BLAs, కార్యకర్తలు ప్రతి పోలింగ్ బూత్‌లో అప్రమత్తంగా ఉంటూ BLOలతో సమన్వయం చేసుకోవాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సూచించారు. లోపరహితమైన ఓటరు జాబితా రూపకల్పనలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయులు, ప్రజలు అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, BLAs, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ
13 likes
11 shares
chaitu
3K views 15 days ago
53 likes
53 shares