ktr

406 Posts • 4M views
Mohan
12K views 2 months ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party #ktr #ktrtrs KCR | కేసీఆర్‌ హయాంలో అప్పు 3.17 లక్షల కోట్లు.. కాంగ్రెస్‌ దుష్ప్రచారం 7 లక్షల కోట్లు! KCR | కేసీఆర్ 3.17 లక్షలకోట్ల అప్పు చేసి తెలంగాణను పునర్నిర్మించారన్నది వాస్తవం. జీఎస్డీపీలో దేశంలోనే అగ్రభాగాన నిలిపిందీ వాస్తవం. సంపద పెంచి ప్రజలకు పంచిందీ వాస్తవం. ఇదీ రిజర్వ్‌ బ్యాంక్‌ నిగ్గు తేల్చిన నిజం రేవంత్‌.. ఆర్బీఐ నివేదికపై ఇప్పుడేమంటారు? సమైక్య పాలన వారసత్వంగా వచ్చిన రుణం 72,658 కోట్లు తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్‌ హయాంలో3 లక్షలకోట్లు అన్నీ కలిపితే 3.87 లక్షల కోట్లు కూడా దాటని మొత్తం అప్పు ఆ రుణంతో 30 లక్షల కోట్ల సంపద సృష్టించిన కేసీఆర్‌ సర్కార్‌ పదేండ్ల పాలనలో గణనీయంగా పెరిగిన తెలంగాణ ఆదాయం అన్ని రంగాలకు జవసత్వాలు.. పెరిగిన ప్రజా జీవన ప్రమాణాలు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హ్యాండ్‌బుక్‌-2024లో తేటతెల్లం ఏడాదిలోనే రూ.80 వేల కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మించలేదు.. కొత్త పథకం అమలు చేయలేదు సమైక్య పాలకుల రుణాన్ని ఏడాదిలోనే దాటేసిన రేవంత్‌ సర్కార్‌ KCR | కేసీఆర్‌ 3.17 లక్షలకోట్ల అప్పు చేసి తెలంగాణను పునర్నిర్మించారన్నది వాస్తవం. జీఎస్డీపీలో దేశంలోనే అగ్రభాగాన నిలిపిందీ వాస్తవం. సంపద పెంచి ప్రజలకు పంచిందీ వాస్తవం. కాళేశ్వరం నుంచి యాదాద్రి దాకా.. సెక్రటేరియట్‌ నుంచి కలెక్టరేట్ల దాకా.. అడుగడుగునా రుణ సద్వినియోగం కనపడుతున్నది. 3 లక్షల కోట్లతో 30 లక్షల కోట్ల సంపదను సృష్టించి, అప్పును తెలంగాణ ఆస్తిగా మార్చిన కేసీఆర్‌ కౌశలం కండ్లకు కడుతున్నది మరి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఈ పన్నెండు నెలల్లో రేవంత్‌ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాలా 80 వేల కోట్లు! ఇది 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్ర అప్పు కన్నా ఎక్కువ. మరి ఈ అప్పుతో చేపట్టిన కొత్త ప్రాజెక్టు ఏది? మొదలుపెట్టిన కొత్త పథకం ఏమున్నది? కూలగొట్టుడే తప్ప.. కొత్తగా తట్టెడు మట్టి కూడా తీయని సర్కారు.. 80 వేలకోట్లు అప్పు తెచ్చి చేసిందేంది? సాధించిందేంది? ఒక్కో విషపుచుక్క ప్రోదిచేసి కాంగ్రెస్‌ సృష్టించిన అభాండాల భాండం బద్ధలైంది. అప్పులపై తప్పుడు కూతలకుచెంపచెళ్లుమనే సమాధానం దొరికింది. పదే పదే ప్రజలపై రుద్దిన అబద్ధపు ప్రచారం ఎట్టకేలకు పటాపంచలైంది. అభివృద్ధిని చిన్నగాచూపి, అప్పును భూతద్దంలో చూపిన కుతంత్రం బట్టబయలైంది. అధికార యావలో కాంగ్రెస్‌ ఇన్నాళ్లు సాగించిన ‘అప్పుల కుప్ప’ప్రాపగాండాను రిజర్వ్‌బ్యాంక్‌ తాజా నివేదిక నిట్టనిలువునా చీల్చిపారేసింది. వాస్తవాల పునాదులపై ఆర్బీఐ ప్రకటించిన లెక్కలు.. కాంగ్రెస్‌ కత్తిగట్టి సాగించిన ‘మిత్తి’మీరిన ప్రచారాన్ని ముక్కలు ముక్కలు చేశాయి. కేసీఆర్‌ పట్టించుకోలేదని అందామంటే.. పదేండ్ల పసికూన రాష్ట్రం అన్ని సూచీల్లో దేశంలోనే అగ్రభాగానికి చేరింది. అభివృద్ధే చేయలేదని అందామంటే.. కండ్లముందు తెలంగాణ ప్రగతి ప్రదీప్తి మిరుమిట్లుగొల్పుతున్నది. సంపదకు లోటులేదు.. సంక్షేమానికి కొరత రాలేదు. దీంతో కాంగ్రెస్‌ అబద్ధాలను ప్రచారంలో పెట్టింది. రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని బురదచల్లింది. ధనిక రాష్ట్రంగా ఎదిగిన తీరును దాచి.. బాకా చానళ్లతో, భజంత్రీ పత్రికలతో తప్పుడు కథనాలను వండివార్చింది. అధికార పీఠంపై కూర్చున్నప్పటికీ కాంగ్రెస్‌ తీరు మారలేదు. పార్టీగా సాగించిన తప్పుడు ప్రచారాన్నే ప్రభుత్వ వేదికలపైనా కొనసాగించింది. పదేండ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేశారంటూ ఎవరో గాలి గన్నారావు మాటల్ని పట్టుకుని సీఎం రేవంత్‌ సైతం అధికారిక సమావేశాల్లో ఆరోపణలకు దిగారు. నిజాలే నివ్వెరపోయేలా శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలకు సున్నంవేశారు. ఇప్పుడవన్నీ పటాపంచలయ్యాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లో కాంగ్రెస్‌ ఇన్నాళ్లూ సాగించిన అబద్ధపు ప్రచారం శుద్ధ తప్పేనని తేలిపోయింది. పదేండ్లలో తెలంగాణ చేసిన అప్పు 3.17 లక్షల కోట్లేనని ఆధారాలతో, అంకెలతో ఆర్బీఐ సుస్పష్టం చేసింది. సమైక్య పాలకుల నుంచి వారసత్వంగా వచ్చిన రుణం మరో రూ.72 వేల కోట్లని వెల్లడించింది. అన్నీ కలిసినా తెలంగాణ అప్పు 3.87 లక్షల కోట్లేనని కుండబద్ధలు కొట్టింది. ఆర్బీఐ లెక్కల తర్వాత కాంగ్రెస్‌ నేతల నోట మాట పడిపోయింది. కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్‌ కొన్నేండ్లుగా తీవ్ర దుష్ప్రచారం చేసింది. కేసీఆర్‌ హయాంలో రూ.6.71 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకొని.. రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నది. కానీ.. కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3.89 లక్షల కోట్లు మాత్రమే. అందులోనూ సమైక్య పాలకుల నుంచి వారసత్వంగా వచ్చిన రుణం 72వేల కోట్లు. అంటే పదేండ్ల కాలంలో కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తీసుకున్న అప్పు 3.17 లక్షల కోట్లే!. ఇదెవరో చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే.. కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల జమాఖర్చులు చూసే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చెప్పిన మాట. పూర్తి ఆధారాలతో, అంకెలతో.. అధికారికంగా ‘హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఆన్‌ ఇండియన్‌ స్టేట్స్‌ 2023-24’లో స్పష్టంచేసింది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.72 వేల కోట్ల రుణభారం ఉంటే.. 2023 నాటికి మొత్తం అప్పు రూ.3.89 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించింది. అంటే.. కేసీఆర్‌ ప్రభుత్వం రూ.3.17 లక్షల కోట్లు మాత్రమే తెచ్చిందన్నది తేటతెల్లం. మరి ఇన్నాళ్లూ అప్పును రెట్టింపు చేసి రూ.7లక్షల కోట్లు అంటూ దుష్ప్రచారం చేసి.. ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసిందని ఆర్బీఐ నివేదిక చూస్తే స్పష్టమవుతున్నది. తెచ్చిన నిధులు స్వరాష్ట్ర నిర్మాణనికే.. ‘అప్పును భారంగా చూడకుండా.. పెట్టుబడిగా భావించాలి. సరైన మార్గంలో పెట్టుబడి పెడితే దానికి సార్థకత చేకూరుతుంది. అప్పుకు మించిన ఆదాయం, అంతకుమించిన ప్రయోజనాలు కనిపిస్తాయి’ అని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఈ నియమాన్ని పాటించింది. రుణాల రూపంలో సేకరించిన అప్పులను మూలధన వ్యయంగా రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేసింది. సంపదను సృష్టించింది. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసింది. నదులకు నడకలు నేర్పి రిజర్వాయర్లకు మళ్లించింది. ఎండిన పొలాలను నదీజలాలతో తడిపి వ్యవసాయాన్ని పండుగ చేసింది. ఆదాయాన్ని సంక్షేమ పథకాల రూపంలో పంచింది. రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపింది.
173 likes
7 comments 189 shares
Mohan
574 views 20 hours ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #ktr #ktrtrs Congress promised land ownership to the poor, but is now grabbing Dalit and tribal assigned lands in the name of development. BRS Working President KTR said that the government, hand-in-glove with local Congress leaders, is forcibly acquiring lands without consent or fair compensation, and pledged full legal and political support to every affected family. “You cannot rob poor farmers of their livelihoods and call it development. This is nothing but state-sponsored land grabbing.” Read the full story on Telangana Today : https://telanganatoday.com/kt-rama-rao-accuses-congress-of-grabbing-assigned-lands-in-telangana
9 likes
20 shares