🪔సోమావతి అమావాస్య...🌑

8 Posts • 432 views
Mohan
989 views 3 days ago
#🪔సోమావతి అమావాస్య...🌑 #సోమావతి అమావాస్య శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ #📙ఆధ్యాత్మిక మాటలు #అధిక శ్రావణ మాసం💐🎂 🔱🎪🕉️♈🚩ఓం నమః శివాయ 💐🙏💐సోమవతి అమావాస్య శుభాకాంక్షలు:అధిక మాసంలో వచ్చిన ఈ పవిత్రమైన సోమవతి అమావాస్య నాడు.. పరమేశ్వరుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న సమస్త దోషాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సోమవతి అమావాస్య శుభాకాంక్షలు!ఈ పవిత్రమైన అమావాస్య రోజున శివయ్యను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మీ ఇంట ఆనందం, ఆరోగ్యం మరియు సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ సోమవతి అమావాస్య శుభాకాంక్షలు.చంద్రుని అనుగ్రహం.. సోమవారం యొక్క శక్తి కలగలిసిన ఈ అద్భుతమైన రోజున మీ పితృదేవతల ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. శుభ సోమవతి అమావాస్య!ఓం నమః శివాయ! 💐🙏💐 ఈ శుభదినాన పరమేశ్వరుని కృపతో మీరు తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని, మీ జీవితం కాంతివంతంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఈ రోజున భక్తిశ్రద్ధలతో శివారాధన చేయడం మరియు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ పర్వదిన విశిష్టతలను గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి సోమవతి అమావాస్య ప్రాముఖ్యత వివరాలను పరిశీలించవచ్చు,💐🙏💐
10 likes
5 shares
PSV APPARAO
1K views 22 days ago
#వైశాఖ అమావాస్య #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #అమావాస్య #వైశాఖ మాసం విశిష్టత *వైశాఖ అమావాస్య ప్రాముఖ్యత* హిందూ పంచాంగం ప్రకారం, హంసంవత్సరంలో రెండవ నెల అయిన వైశాఖ మాసానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలోని అమావాస్య తిథి చాలా పవిత్ర మైనదిగా పరిగణిస్తారు. శాస్త్ర ప్రకారం పౌర్ణమికే కాదు అమావాస్యకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య రోజున పితృదేవతలను ఆరాధిస్తే వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. గ్రహబాధలు తొలగిపోతాయని విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం, అమావాస్య రోజున సూర్యుడిలో జాబిల్లి పూర్తిగా కలిసిపోతాడు. దీంతో ఈ రోజంతా చీకటిమయం అవతుంది. అందుకే ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేపట్టరు. ఏ కొత్త పనిని ప్రారంభించినా అవి విజయవంతంగా పూర్తి కావని చాలా మంది నమ్ముతారు. వైశాఖమాసం కృష్ణ పక్షం అమావాస్య తిథి కలిగిన 30వ రోజు వైశాఖ బహుళ అమావాస్య. హిందూ పంచాంగం ఖగోళ సానం ప్రకారం, చంద్రుడు 28 రోజులలో భూమి చుట్టూ ఒక పరిక్రమణ పూర్తి చేస్తాడు. 15 రోజుల తరువాత, చంద్రుడు భూమికి ఒక చివరన ఉంటాడు. చంద్రుడు భారతదేశానికి మరొక చివరన ఉన్నప్పుడు, అది కనిపించదు. వైశాఖ అమావాస్య రోజున రావి చెట్టును పూజించి, నీరు అర్పించడం వల్ల త్రిదేవతల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. పవిత్ర వైశాఖ మాసంలో లక్ష్మీ దేవిని పూజించడం కూడా చాలా పవిత్రంగా పరిగణిస్తారు. అలాగే ఈ రోజు పూర్వీకుల శాపాన్ని వదిలించు కోవడానికి తగినదిగా భావిస్తారు. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. వైశాఖ అమావాస్య నాడు శ్రీమద్భాగవత కథను వినడం ద్వారా, ఎప్పటికీ అంతం కాని సద్గుణ ఫలితాలు పొందుతారు. ఈ రోజున ఉదయాన్నే నదిలో స్నానం ఆచరించి, ఇంట్లో పూజా గదిలో ఉన్న దేవుడి ఎదుట దీపం వెలిగించాలి. ఆ తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి. ఈ రోజున గంగాజలాన్ని, నువ్వులను రావి చెట్టుకు సమర్పించాలి. శని దేవుడిని ఆరాధించాలి. శని భగవానుడికి నువ్వులు, ఆవ నూనె సమర్పించాలి. _దానం ప్రాముఖ్యత_ వైశాఖ అమావాస్య నాడు ఆహారం. నీటిని దానం చేయడం శ్రేష్ఠం. ఆహారం, నీటిని దానం చేయడం వలన తీర్థయాత్రకు వెళ్లినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఇలా చేయడం వలన భగవంతుని దయ భక్తులపై ఉంటుంది. పూర్వీకుల ఆత్మలు శాంతిని పొందుతాయి. _ఉపవాసంతో కలిగే లాభాలు_ వైశాఖ అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ఈరోజున ఉపవాసం ఉండటం వల్ల మన పూర్వీకుల కష్టాలను తీర్చడమే కాదు.. రాహువు దోషాలనుంచి ఉపశమనం పొందవచ్చని పండితులు చెబుతారు _వైశాఖ అమావాస్య కథ_ మత గ్రంథాలలో వైశాఖ అమావాస్యకు సంబంధించిన ఒక కథ ఉంది. దాని ప్రకారం, పూర్వకాలంలో ధర్మవర్ణ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా ధార్మిక వ్యక్తి. ఋషులను బాగా గౌరవించేవాడు. ఒకసారి అతను ఒక ఋషి నుండి, కలియుగంలో విష్ణు నామాన్ని జపించడం కంటే పుణ్యఫలం ఇచ్చేది. పుణ్యకార్యం మరొకటి లేదని విన్నాడు. అతను ఆ జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని, లౌకిక జీవితాన్ని విడిచిపెట్టి సన్యాసం స్వీకరించి ప్రయాణం ప్రారంభించాడు. ఒకరోజు ప్రయాణంలో అతను పితృలోకానికి చేరుకున్నాడు. అక్కడ ధర్మవర్ణ పూర్వీకులు ఎన్నో కష్టాల్లో ఉన్నారు. వారు అతనితో మీ సన్యాసం వలనే ఈ దుస్థితికి లోనయ్యాము. ఇప్పుడు మాకు పిండదానం చేసేవారు ఎవరూ లేరు. కానీ మీరు తిరిగి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రారంభించి, సంతానాన్ని కనగలిగితే, అప్పుడు మేము ఉపశమనం పొందగలం. అలాగే వైశాఖ అమావాస్య రోజున మాకు ఆచారబద్ధంగా పిండదానం చేయమని చెప్పారు. ధర్మవర్ల వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తానని వారికి వాగ్దానం చేశాడు. అందువల్ల, అతను మరొకసారి లౌకిక జీవితాన్ని స్వీకరించాడు. వైశాఖ అమావాస్య రోజున అతను పిండ దానానికి సంబంధించిన అన్ని క్రతువులను నిర్వహించి, తద్వారా తన పితృదేవతలకు ముక్తిని కలిగించాడు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
13 likes
13 shares