ఈ రోజు యావత్తు భారతదేశ ప్రజానీకానికి ఓక చిరస్మరణీయ,మరచిపోలేని రోజు! ( అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని - 23 - 3 - 2026)!
ఎందుకంటే భారతదేశ ప్రజానీకానికి బ్రిటిష్ వారి ద్రాస్య శృంఖలాల నుంచి బంధ విముక్తులు గావించేందుకు,స్వేచ్చ వాయువులు ప్రసాదించేందుకు ఒకప్పటి మేటి స్వాతంత్ర్య సమరయోధులు,అణువణువూనా,నర నరాల్లో దేశభక్తి మూర్తిభవించిన అపారదేశభక్తులు అయిన భగత్ సింగ్,సుఖ్ దేవ్,రాజ్ గురు వీరంతా ఓక విప్లవాత్మక పంథాలో ముందుకు వెళ్లి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులతో ఎదురోడ్డి నిలిచి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి,ఆతి చిన్న వయసులోనే అలుపెరుగని పోరు సల్పి మరీ వారిపై తిరుగుబాటు బావుట ఎగురవేసి,చివరకు బ్రిటిష్ వారి ఉరి కంబానికి బలి అయ్యి,మరెందరికో,అశేష కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన త్యాగమూర్తులు,అపార దేశభక్తులు ఈ త్రిమూర్తులు. ఆ ముగ్గురు గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ వారి కర్కశత్వానికి,దుర్మార్గానికి,అత్యంత కిరాతక చర్యకు బలై నేటికి 95 సంవత్సరాలు పూర్తి అయిన ఈ ప్రత్యేక సందర్భాన మన భారతదేశ ప్రజలకు బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి విముక్తి గావించేందుకు ప్రాణత్యాగాలకు సైతం వెనుకంజ వేయని దీరోదత్తులు,ధైర్య సాహసాలకు మారుపేరైనా ఈ త్రిమూర్తులు మన భరతమాత శ్రేయస్సు,సుఖ సంతోషాల కోసం,మన మాతృభూమి రక్షణ కోసం వారు చేసిన వెలకట్టలేని,మహోన్నత సేవలను ఒక్కసారి ఈ ప్రత్యేక సమయాన స్మరించుకుంటూ వారికి చాలా ఘనమైన గొప్ప రీతిలో నివాళులు అర్పించాల్సిన గురుతర బాధ్యత ప్రతి యొక్క భారతీయుని భుజస్కంధాలపై ఎంతైనా వుంది. ఇంక్విలాబ్ జిందాబాద్! మేరా హిందూస్తాన్ మహాన్!✍️✍️✍️🇮🇳🇮🇳🇮🇳
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల!
#అమరవీరుల దినోత్సవం