*టీడీపీలోకి 320 మంది భారీ చేరికలు*
*గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్ 17వ వార్డులో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ మాజీ పట్టణ అధ్యక్షులు షేక్ హరుణ్ భాషా, మాజీ కౌన్సిలర్ దొంతా లక్ష్మీదేవి, మాజీ వార్డు మెంబర్లు సూరేపల్లి వెంకటరావు, బాబ్జీ, దుబాయ్ రసూల్తో పాటు వారి అనుచరులు 320 మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.*
*వారందరికీ గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన నాయకులు, కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే గారు తెలిపారు.*
*కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు.*
*కార్యక్రమంలో 17 వ వార్డు అధ్యక్షుడు పిడతల రవితేజ,పెద్ద మస్తాన్, దూదేకుల దస్తగిరి, బొర్రా రాఘవేంద్ర యాదవ్,బొంత లక్ష్మీదేవి, మల్లీశ్వరి, రంపే గంగయ్య, గిద్దలూరు మద్దిలేటి వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు*
#📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు